అన్వేషించండి

Rythu Bharosa Scheme: రైతు రుణమాఫీ డేట్ ఫిక్స్, రైతు భరోసా ఇప్పట్లో ఇవ్వలేం- మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక ప్రకటన

Rythu Bharosa Scheme for Farmers | తెలంగాణలో రైతులకు రైతు భరోసా ఇప్పట్లో ఇవ్వడం కష్టమేనని, అయితే రైతు బంధు ఆగస్టు 14న పూర్తి చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు స్పష్టం చేశారు.

Thummala Nageswara Rao about Rythu Bharosa Scheme: హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతు రుణమాఫీని అమలు చేస్తోంది. సచివాలయంలో రైతు రుణమాఫీ అంశంపై అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. చెప్పిన సమయానికే రైతులకు రూ.2 లక్షల రుణాలు మాఫీ చేస్తామన్నారు. అయితే రైతు భరోసా ఇప్పట్లో ఇవ్వడం కష్టమే అన్నారు. దీనిపై మొదటగా రైతులతో మాట్లాడి వివరాలు సేకరిస్తామని, అందుకే రైతు భరోసాకు మరింత టైమ్ పడుతుందని స్పష్టం చేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల హామీల్లో ప్రకటించినట్లుగా రూ.2 లక్షల వరకు రైతు రుణాలను మాఫీ ప్రక్రియను కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టింది. తొలి విడతగా రూ.1 లక్ష వరకు రుణాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేసి రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఆపై రూ.1.5 లక్షల వరకు రుణాలను రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేసింది. రాష్ట్ర రైతులకు ఆగస్టు 15లోపు రూ2 లక్షల రుణమాఫీని పూర్తిచేస్తామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆగస్టు 14న రుణమాఫీ హామీని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. తొలి విడతగా దాదాపు 11.50 లక్షల మంది రైతులకు రూ.6 వేల కోట్ల నిధులను ప్రభుత్వం జమ చేసింది. రెండో విడతలో రూ.1.5 లక్షల రుణాలను 6.40 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6190 కోట్లు అసెంబ్లీ వేదికగా విడుదల చేశారు.

బీఆర్ఎస్ రుణమాఫీతో ఏ ప్రయోజనం లేదు

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడుతూ.. ‘బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కేవలం రూ.25 వేల చొప్పున రైతుల ఖాతాల్లో రుణమాపీ నగదు జమచేసేది. ఏడాదికి కొంత మొత్తం చొప్పున రుణమాఫీ చేశారు. కానీ ఆ రుణ మాఫీతో రైతులకు ఏ ప్రయోజనం లేకపోయింది. దేశంలో ఇప్పటివరకూ ఏ రాష్ట్రం ఈ స్థాయిలో రైతులకు రుణ మాఫీ చేయలేదు. ఆ ఘనత తెలంగాణ ప్రభుత్వం (కాంగ్రెస్ పార్టీ)కే దక్కనుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి నిండా ముంచింది. కానీ మేం ఎన్నికల హామీల్లో భాగంగా రూ.2 లక్షల వరకు ఉన్న రైతుల రుణాలు మాఫీ చేస్తున్నాం. ఎవరికైనా ఆరోజు రుణమాఫీ అవకపోతే, వారి వివరాలు సంబంధిత అధికారులకు సమర్పించాలి. బ్యాంకు ఖాతాల్లో జమ కాని వారు, టెక్నికల్ ఇబ్బందులు ఎదురైనా వారికి సాధ్యమైనంత త్వరగా సమస్య క్లియర్ చేస్తాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలాగ రైతుల విషయంలో మేం రాజకీయాలు చేయడం లేదు. బీఆర్ఎస్ నేతలు మాత్రం రైతు రుణమాఫీపై సైతం పొలిటికల్ డ్రామాలు ఆడుతున్నారు. 

టెక్నికల్ సమస్యలు పరిష్కరిస్తాం.. 
గత ప్రభుత్వం హైదారబాద్ ఓఆర్ఆర్‌ పనులను తమకు అనుకూలంగా ఉన్న సంస్థకు రూ.7 వేల కోట్లకు అప్పనంగా కట్టబెట్టిందని, ఆ డబ్బుతోనే ఎన్నికల ముందు రుణమాఫీ అంటూ రూ.1 లక్ష జమ చేశారని తుమ్మల చెప్పారు. రూ.1,400 కోట్లు ఇంకా రైతుల ఖాతాల్లో జమకాలేదని, వెరిఫై చేస్తుంటే తిరిగి నగదును బ్యాంకులు ప్రభుత్వానికి పంపాయన్నారు. కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న రుణమాఫీలో సాంకేతిక ఇబ్బందులతోనే 30 వేల మంది ఖాతాల్లో నగదు జమ కాలేదన్నారు. అయితే వీటిని త్వరలోనే పరిష్కరించి అందరు రైతులకు రుణాలు మాఫీ చేసి హామీ నిలబెట్టుకుంటామని తుమ్మల స్పష్టం చేశారు.

Also Read: కవిత డీఫాల్ట్ బెయిల్ పిటిషన్ ఉపసంహరణ - జైల్లోనే ఉండాలనుకుంటున్నారా ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: హైదరాబాద్ శివార్లలో గ్రీన్ ఫార్మా సిటీ - రేవంత్ రెడ్డి ఆదేశాలు
హైదరాబాద్ శివార్లలో గ్రీన్ ఫార్మా సిటీ - రేవంత్ రెడ్డి ఆదేశాలు
VRO Beats Flood Victim: విజయవాడలో వరద బాధితుడిపై చెయ్యి చేసుకున్న వీఆర్వో, చర్యలు తీసుకున్న ప్రభుత్వం
విజయవాడలో వరద బాధితుడిపై చెయ్యి చేసుకున్న వీఆర్వో, చర్యలు తీసుకున్న ప్రభుత్వం
Duleep Trophy 2024: 'అనంత'కు చేరుకున్న ఇండియా ఏ, ఇండియా బీ ఆటగాళ్లకు ఘన స్వాగతం
'అనంత'కు చేరుకున్న ఇండియా ఏ, ఇండియా బీ ఆటగాళ్లకు ఘన స్వాగతం
Mpox Case India: దేశంలో అలర్ట్! తొలి మంకీపాక్స్ కేసు నమోదు
దేశంలో అలర్ట్! తొలి మంకీపాక్స్ కేసు నమోదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బుడమేరు గండ్లు పూడ్చివేత పూర్తి, లీకేజ్‌ తగ్గించేందుకు అధికారుల యత్నంవరద బాధితులకు చిన్నారుల సాయం, వీడియో పోస్ట్ చేసిన సీఎం చంద్రబాబువినాయక నిమజ్జనం వేడుకల్లో అంబానీ ఫ్యామిలీముంబైలో సందీప్ రెడ్డి వంగాను కలిసిన జూనియర్ ఎన్టీఆర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: హైదరాబాద్ శివార్లలో గ్రీన్ ఫార్మా సిటీ - రేవంత్ రెడ్డి ఆదేశాలు
హైదరాబాద్ శివార్లలో గ్రీన్ ఫార్మా సిటీ - రేవంత్ రెడ్డి ఆదేశాలు
VRO Beats Flood Victim: విజయవాడలో వరద బాధితుడిపై చెయ్యి చేసుకున్న వీఆర్వో, చర్యలు తీసుకున్న ప్రభుత్వం
విజయవాడలో వరద బాధితుడిపై చెయ్యి చేసుకున్న వీఆర్వో, చర్యలు తీసుకున్న ప్రభుత్వం
Duleep Trophy 2024: 'అనంత'కు చేరుకున్న ఇండియా ఏ, ఇండియా బీ ఆటగాళ్లకు ఘన స్వాగతం
'అనంత'కు చేరుకున్న ఇండియా ఏ, ఇండియా బీ ఆటగాళ్లకు ఘన స్వాగతం
Mpox Case India: దేశంలో అలర్ట్! తొలి మంకీపాక్స్ కేసు నమోదు
దేశంలో అలర్ట్! తొలి మంకీపాక్స్ కేసు నమోదు
Hyundai Alcazar Facelift: హ్యుందాయ్‌ అల్కాజర్‌ ఫేస్‌లిఫ్ట్‌ విడుదల- రెండు ఫ్యామిలీలు దర్జాగా వెళ్లవచ్చు!
హ్యుందాయ్‌ అల్కాజర్‌ ఫేస్‌లిఫ్ట్‌ విడుదల- రెండు ఫ్యామిలీలు దర్జాగా వెళ్లవచ్చు!
Pawan Kalyan: బుడమేరులో అక్రమ నిర్మాణాలపై, హైడ్రాపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
బుడమేరులో అక్రమ నిర్మాణాలపై, హైడ్రాపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
CM Chandrababu: వరద బాధితులకు చిన్నారుల గొప్ప సాయం - పాకెట్ మనీని ఇచ్చిన విద్యార్థులు, వీడియో షేర్ చేసిన సీఎం చంద్రబాబు
వరద బాధితులకు చిన్నారుల గొప్ప సాయం - పాకెట్ మనీని ఇచ్చిన విద్యార్థులు, వీడియో షేర్ చేసిన సీఎం చంద్రబాబు
Bengaluru Rameshwaram Cafe Blast :  వాళ్లది చాలా పెద్ద ప్లాన్ - బెంగళూరు రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్‌ టెర్రరిస్టులపై NIA చార్జిషీటు
వాళ్లది చాలా పెద్ద ప్లాన్ - బెంగళూరు రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్‌ టెర్రరిస్టులపై NIA చార్జిషీటు
Embed widget