అన్వేషించండి

తెలంగాణలో తగ్గిన ఓటర్లు, శేరిలింగంపల్లి టాప్, అశ్వరావుపేట లాస్ట్

సవరణలు, మార్పులు చేర్పులు తరువాత తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తాజా ఓటర్ల జాబితాను విడుదల చేిసింది ఎన్నికల కమిషన్.

 ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన తాజా జాబితాలో తెలంగాణ వ్యాప్తంగా గత ఏడాదితో పోల్చితే ఓటర్ల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 2కోట్ల 99 లక్షల 77వేల 659 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మార్పులు చేర్పులతో పూర్తి సవరణ తరువాత తాజాగా రాష్ట్రంలో ఓటర్ల సంఖ్యను జిల్లాల వారీగా విడుదల చేసింది. మొత్తం ఓటర్లలో 1 కోటి యాభై లక్షల 48 వేల 250 మంది పురుష ఓటర్లు ఉండగా, మహిళా ఓటర్లు కోటి 49 లక్షల 24 వేల 718 ఉన్నారు. ఎన్ఆర్ఐ ఓట్లు 2740 నమోదు కాగా, థర్డ్ జెండర్ ఓటర్లు వెయ్యి తొమ్మిది వందల యాభై ఒక్కటిగా లెక్కతేలింది. జిల్లాల వారీగా పరిశీలించినప్పుడు హైదరాబాద్ జిల్లా ఓటర్ల సంఖ్య 42 లక్షల 15 వేల 456కు చేరగా, రంగారెడ్డి జిల్లాలో ఓటర్ల సంఖ్య 31 లక్షల 8వేల 68గా తేలింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 25 లక్షల 24 వేల 951ఉన్నట్లు ఈసీ ప్రకటించింది. 

నియోజకవర్గాల వారీగా తాజాగా ఓటర్ల సంఖ్య పెరుగుదల పరిశీలించినప్పుడు అత్యధికంగా శేరిలింగంపల్లి 64,4,072 మంది ఓటర్లుండగా, ఆ తరువాతి స్దానంలో కుద్బుల్లాపూర్ చేరింది. కుద్బుల్లాపూర్ (మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా) లో 61,2,700 లక్షమంది ఓటర్లు నమోదైయ్యారు. కుద్బుల్లా పూర్ తర్వాత స్దానంలో మేడ్చల్ నియోకవర్గం నిలిచింది. మేడ్చల్ నియోజకవర్గంలో 55,30,785మంది ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా ఓటర్లున్న నియోజకవర్గంగా భద్రాచలం జిల్లాలోని అశ్వరావుపేట నియోజకవర్గం నిలిచింది. అశ్వరావు పేటలో కేవలం 14,90,322మంది ఓటర్లున్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. 

తాజాగా 2023 ఓటర్ల జాబితా సిద్దం చేసేందుకు ఎన్నికల కమీషన్ తీవ్ర కసరత్తులే చేసింది. ఎక్కడా ఎటువంటి ఆరోపణలు లేకుండా పారదర్శకంగా ఓటర్ల లెక్కింపు ప్రక్రియ పూర్తిచేసేందుక అన్ని చర్యలు తీసుకుంది. వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఓటర్ల సంఖ్యను లెక్కించారు.తెలంగాణా వ్యాప్తంగా దాదాపు 1700 కాలేజీలలో ఎలక్షన్ లెర్నింగ్ కబ్స్ ఏర్పాటు చేసి 18 నుంచి 19సంవత్సరాల వయస్సున్న యువతీ ,యువకులను గుర్తించి ఓటు హక్కును నమోదు చేసుకునే విధంగా అవగాహాన కల్పించారు. ప్రతీ క్యాంపస్ లలో నిర్ణీత వయుస్సుగల విద్యార్దులకు నేరుగా సంబంధిత కాలేజీల సహకారంతో ఎస్ ఎమ్ ఎస్ లు పంపడం ద్వారా ఓటు హక్కు నమోదుపై ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. గత ఏడాది ఓటర్ల సంఖ్య మూడు కోట్ల మూడు లక్షలు  దాటితే ఈసారి విడుదల చేసిన జాబితాలో ఆ సంఖ్య రెండు కోట్ల తొంభై తొమ్మిది లక్షలకే పరిమితమ్వడం విశేషం. అంటే దాదాపు మూడు లక్షలకు పైగా ఓటర్లు గత ఏడాదితో పోల్చినప్పడు తగ్గారని ఎన్నికల కమీషన్ విడుదల చేసిన నివేదిక ఆధారంగా స్పష్టమవుతోంది. 

ఈ ఏడాది ఇంకా ఓటు హక్కుల నమోదు చేసుకోనివారు ,లేదా సవరణలు కోరుకునే వారు వెంటనే NVSP వెబ్ సైట్ ద్వారా లేదా హెల్ప్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఓటర్లు జాబితాలో సవరణలు నిరంతర ప్రక్రియగా ఎన్నికల కమిషనర్ తెలపండంతో పాటు రాబోయే రోజుల్లో మార్పులు చేర్పులు ఉంటాయని తెలిపింది. ఫారం 8ను ఉపయోగించి చిరునామా మార్పులుంటే మొబైల్ యాప్ లేదా నేరుగా వెబ్ సైట్ ద్వారా సంవరణలు చేసుకోవాలని సూచిస్తోంది ఎన్నికల కమిషన్.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vizag Ganja Lady Don: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
New Year 2026: శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
NTR Bharosa Pensions: ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
PPP Kims: ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !

వీడియోలు

Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam
World Cup 2026 Squad BCCI Selectors | బీసీసీఐపై మాజీ కెప్టెన్ ఫైర్
Trolls on Gambhir about Rohit Form | గంభీర్ ను టార్గెట్ చేసిన హిట్ మ్యాన్ ఫ్యాన్స్
Ashwin about Shubman Gill T20 Career | మాజీ ప్లేయర్ అశ్విన్ సంచలన కామెంట్స్
India vs Sri Lanka 3rd T20 | నేడు భారత్‌, శ్రీలంక మూడో టీ20

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Ganja Lady Don: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
New Year 2026: శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
NTR Bharosa Pensions: ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
PPP Kims: ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
India vs Sri Lanka Highlights: మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం- శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ ముందంజ
మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం- శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ ముందంజ
Rajasthan: ఉద్యోగినిపై గ్యాంగ్‌రేప్‌ కు పాల్పడిన ఐటీ కంపెనీ ఓనర్ - రాజస్థాన్‌లో కలకలం !
ఉద్యోగినిపై గ్యాంగ్‌రేప్‌ కు పాల్పడిన ఐటీ కంపెనీ ఓనర్ - రాజస్థాన్‌లో కలకలం !
Amaravathiki Aahwanam: హారర్ థ్రిల్లర్‌లో సురేఖ కుమార్తె... వీఎఫ్ఎక్స్ పనుల్లో 'అమరావతికి ఆహ్వానం'
హారర్ థ్రిల్లర్‌లో సురేఖ కుమార్తె... వీఎఫ్ఎక్స్ పనుల్లో 'అమరావతికి ఆహ్వానం'
APSRTC employees: ఆర్టీసీ మెడికల్ అన్‌ఫిట్‌గా మారిన ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ - వేరే శాఖల్లో ఉద్యోగాలివ్వాలని నిర్ణయం
ఆర్టీసీ మెడికల్ అన్‌ఫిట్‌గా మారిన ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ - వేరే శాఖల్లో ఉద్యోగాలివ్వాలని నిర్ణయం
Embed widget