అన్వేషించండి

Telangana News: వర్షాకాలంలోనూ వేసవి స్థాయిలో కరెంటు వినియోగం, ఎక్చేంజీల్లో విద్యుత్ కొంటున్న డిస్కంలు

Telangana News: రోజురోజుకూ విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా వర్షాకాలంలోనూ వేసవి కాలంలో జరిగినంత విద్యుత్ వినియోగం జరుగుతోంది.

Telangana News: వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తెలంగాణలో విద్యుత్ డిమండ్ తో పాటు వినియోగం పపెద్ద ఎత్తున పెరిగిపోయాయి. సాధారణంగా ఎండాకాలం ముఖ్యంగా మార్చి, ఏప్రిల్ నెలలో విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉండేది. కానీ వర్షాకాలం సమయంలో ఎక్కువగా విద్యుత్ డిమాండ్ ఉండడం గమనార్హం. వర్షాకాలంలోనూ ఉష్ణోగ్రతలు ఎక్కువవడంతో విపరీతమైన ఉక్కపోత పోస్తోంది. దీంతో ఎక్కువ మంది విద్యుత్ ను విపరీతంగా వాడేస్తున్నారు. బుధవారం ఉదయం 9.59 గంటలకు రోజువారీ విద్యుత్ డిమాండ్ అత్యధికంగా 15,370 మెగావాట్లుగా నమోదు అయింది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అత్యధిక రోజువారీ డిమాండ్ మార్చి 30వ తేదీ 2023న 15 వేల 490 మెగావాట్లుగా నమోదు అయింది. ప్రస్తుతం వర్షాలు కురవకపోతే రాబోయే వారం రోజుల్లో ఈ రికార్డును బ్రేక్ చేసే మరో రికార్డు నమోదు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే గతేడాది సెప్టెంబర్ 20వ తేదీన నమోదు అయిన అత్యధిక డిమాండ్ 11,144 మెగావాట్లు మాత్రమే. ఏడాది క్రితంతో పోలిస్తే.. ఏకంగా 3,999 మెగావాట్లు అదనంగా డిమాండ్ పెరగడంతో 24 గంటల నిరంతర సరఫరాకు విద్యుత్ పంపిణీ సంస్థలు తెగ ఇబ్బంది పడుతున్నాయి. అదపు వినియోగం పెరుగుతుండడంతో డిస్కంలు ఏరోజుకు ఆ రోజు భారత ఇంధన ఎక్చేంజీ కరెంటును కొనుగోలు చేస్తున్నాయి. 

వ్యవసాయ బావుల వద్ద నిరంతరాయంగా బోర్లు నడుపుతున్న రైతులు

ఒక రోజంతా అంటే 24 గంటల పాటు రాష్ట్రంలో అన్ని వర్గాలకు కలిపి కరెంటు వినియోగం ఈనెల 19వ తేదీ అత్యధికంగా 28.41 కోట్ల యూనిట్లు ఉంది. ఈనెల 6వ తేదీన ఈ వినియోగం 16.90 కోట్ల యూనిట్లే. అయితే 15 రోజుల్లోనే వినియోగం ఏకంగా దాదాపు 12 కోట్ల యూనిట్లు పెరగడంతో ఐఈఎక్స్ లో కొనుగోలు చేయక తప్పడం లేదు. దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరగడంతో ఎక్స్ఛేంజీలో ఒక్కో యూనిట్ కు గరిష్ఠ విక్రయ ధర పది రూపాయలు పలుకుతోంది. కొన్ని రాష్ట్రాల డిస్కంలు ఇంత ధరకు కొనలేక అనధికారిక కరెంట్ కోతలను విధిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కొన్ని రోజులుగా... వర్షాలు లేకపోవడం, ఉష్ణోగ్రతలు పెరగడంతో పంటలకు నీరు అందించడానికి రైతులు నిరంతరాయంగా వ్యవసాయ బోర్లు నడుపుతున్నారు. ఈ కారణంగా కూడా కరెంటు వినియోగం మరింత పెరుగుతోందని అధికారులు వివరిస్తున్నారు. అందువల్లs వ్యవసాయానికి పగటి వేళల్లో మాత్రమే విద్యుత్ సరఫరా చేయాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. రాత్రివేళల్లో అస్సలే పంట సాగు కోసం కరెంటు ఇవ్వకూడదని వివరించింది. పగటి వేళల్లో డిమాండ్ మరీ ఎక్కువ అయితే సౌర, పవన విద్యుత్ తో తీర్చవచ్చని స్పష్టం చేసింది. ఈనెల ఒకటవ తేదీన పగటి పూట విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో 241 గిగావాట్లకు పెరిగిపోయినా తీర్చడం సాధ్యం అయిందని పేర్కొంది. దేశంలో కేవలం 0.1 శాతమే విద్యుత్ కొరత ఉందని తెలిపింది. కొంతకాలం నుంచి సూర్యాస్తమయం తర్వాతి వేళల్లోనూ భారీగా విద్యుత్ డిమాండ్ ఉంటోందని.. ఈనెల ఒకటవ తేదీన ఈ సమయంలో రికార్డు స్థాయిలో 218.4 గిగావాట్ల డిమాండ్ నమోదు అయిందని వెల్లడించింది. సౌర విద్యుత్ లభ్యత లేకపోవడంతో రాత్రిపూట కొరత ఏర్పడుతోందని అందువల్లే విద్యుత్ సరఫరాను పగటి వేళకే పరిమితం చేయాలని సూచించింది. ఈ మేరకు భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్ ను తీర్చడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తూ... కేంద్ర విద్యుత్ శాఖ ఈనెల 5వ తేదీన అన్ని రాష్ట్రాలకు లేఖ రాసంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget