అన్వేషించండి

Revanth Reddy Tweet: 'అంతకు మించిన తృప్తి ఏముంటుంది.?' - ప్రజాదర్బార్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్

CM Revanth Reddy Tweet: సీఎంగా రేవంత్ రెడ్డి రెండో రోజు ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలిచ్చారు.

Revanth Reddy Tweet on Praja Darbar: తెలంగాణ సీఎంగా గురువారం పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. అందులో ప్రధానమైనది 'ప్రజాదర్బార్' (Praja Darabar). ప్రగతి భవన్ పేరును 'జ్యోతిబాపూలే ప్రజా భవన్'గా (Praja Bhawan) మార్చి తమ సమస్యలను తెలపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగానే ప్రజా దర్బార్ నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం జ్యోతిబాపూలే ప్రజా భవన్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అర్జీదారుల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ నేపథ్యంలో 'ప్రజాదర్బార్' జరిగిన తీరుపై సీఎం ఆసక్తికర ట్వీట్ చేశారు.

'జనం కష్టాలు వింటూ.. కన్నీళ్లు తుడుస్తూ తొలి ప్రజా దర్బార్ సాగింది. జనం నుంచి ఎదిగి.. ఆ జనం గుండె చప్పుడు విని, వాళ్ల సేవకుడిగా సహాయం చేసే అవకాశం రావడానికి మించిన తృప్తి ఏముంటుంది.' అని ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. దీంతో పాటు ప్రజాదర్బార్ లో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తోన్న వీడియోను షేర్ చేశారు.

తొలి రోజు పోటెత్తిన జనం

తెలంగాణ ప్రజా భవన్(Jyotiraopule Prajabhavan)కు తొలి రోజు ఉదయం నుంచే జనం పోటెత్తారు. ఈ క్రమంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 'ప్రజా భవన్'లో మీకోసం గేట్లు తెరిచే ఉంటాయి. మీ అర్జీలతో రండి. నేను పరిష్కరిస్తాను' సీఎం రేవంత్ రెడ్డి పిలుపుతో జనం తరలివచ్చారు. ఆయనకు తమ సమస్యలు విన్నవించారు. ఎక్కువగా భూమికి సంబంధించిన సమస్యలే వచ్చినట్లుగా తెలుస్తోంది. కొందరు పింఛన్లు కావాలని, ఇంకొందరు రెవెన్యూ సమస్యలను సీఎంకు విన్నవించారు. కాగా, సీఎం ప్రజా దర్బార్ పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేరుగా సీఎంనే కలిసి అర్జీలు సమర్పించే అవకాశం రావడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతకు ముందు ఎన్టీఆర్, చంద్రబాబు ఇలా ప్రజాదర్బార్ నిర్వహించే వారని గుర్తు చేసుకున్నారు. 

ప్రతి శుక్రవారం 'ప్రజాదర్బార్'

ప్రజా భవన్ లో వారానికోసారి ప్రజా దర్బార్ నిర్వహించే అవకాశముంది. ప్రతి శుక్రవారం ప్రజల కోసం ప్రజా భవన్ తెరిచే ఉంటుంది. ఆ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వారి అర్జీలను స్వీకరిస్తారని తెలుస్తోంది. మిగతా రోజుల్లో అధికారులు వాటిని స్వీకరించి పరిష్కారం సూచించే అవకాశముంటుంది. రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో అందుబాటులో లేని రోజుల్లో సీఎస్, లేదా ఇతర అధికారులు ఈ కార్యక్రమాన్ని కొనసాగించే అవకాశముంది.

ఇదీ చూడండి: BRSLP Meeting : బీఆర్ఎస్ ఎల్పీ నేతగా కేసీఆరే - కాంగ్రెస్ సర్కార్ పై పోరాటానికి రెడీ !

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Janasena : 23న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్ కళ్యాణ్ సమావేశం - సంచలన నిర్ణయాలుంటాయా ?
23న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్ కళ్యాణ్ సమావేశం - సంచలన నిర్ణయాలుంటాయా ?
Telangana Caste census: తెలంగాణలో మరోసారి కులగణన - గత సర్వేలో నమోదు చేయించుకోని వారికే !
తెలంగాణలో మరోసారి కులగణన - గత సర్వేలో నమోదు చేయించుకోని వారికే !
Pawan Chandrababu:  చంద్రబాబు ఫోన్లకూ పవన్ స్పందించడం లేదా ? - అసలేం జరిగిందో తెలుసా
చంద్రబాబు ఫోన్లకూ పవన్ స్పందించడం లేదా ? - అసలేం జరిగిందో తెలుసా
Telangana News:తెలంగాణలో శివరాత్రి రోజున ఉపవాసం ఉండే భక్తులకు ఫలహారం పంపిణీ- మంత్రి కీలక ఆదేశాలు
తెలంగాణలో శివరాత్రి రోజున ఉపవాసం ఉండే భక్తులకు ఫలహారం పంపిణీ- మంత్రి కీలక ఆదేశాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Toyaguda Villagers Meet After 40 Years | నాలుగు దశాబ్దాల నాటి జ్ఞాపకాల ఊరిలో | ABP DesamDwarapudi Adiyogi Statue | కోయంబత్తూరు వెళ్లలేని వాళ్లకోసం ద్వారపూడికే ఆదియోగి | ABP DesamKarthi Visits Tirumala | పవన్ తో వివాదం తర్వాత తొలిసారి తిరుమలకు కార్తీ | ABP DesamRam Mohan Naidu Yashas Jet Flight Journey | జెట్ ఫ్లైట్ నడిపిన రామ్మోహన్ నాయుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janasena : 23న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్ కళ్యాణ్ సమావేశం - సంచలన నిర్ణయాలుంటాయా ?
23న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్ కళ్యాణ్ సమావేశం - సంచలన నిర్ణయాలుంటాయా ?
Telangana Caste census: తెలంగాణలో మరోసారి కులగణన - గత సర్వేలో నమోదు చేయించుకోని వారికే !
తెలంగాణలో మరోసారి కులగణన - గత సర్వేలో నమోదు చేయించుకోని వారికే !
Pawan Chandrababu:  చంద్రబాబు ఫోన్లకూ పవన్ స్పందించడం లేదా ? - అసలేం జరిగిందో తెలుసా
చంద్రబాబు ఫోన్లకూ పవన్ స్పందించడం లేదా ? - అసలేం జరిగిందో తెలుసా
Telangana News:తెలంగాణలో శివరాత్రి రోజున ఉపవాసం ఉండే భక్తులకు ఫలహారం పంపిణీ- మంత్రి కీలక ఆదేశాలు
తెలంగాణలో శివరాత్రి రోజున ఉపవాసం ఉండే భక్తులకు ఫలహారం పంపిణీ- మంత్రి కీలక ఆదేశాలు
Ind vs Eng 3rd Odi Live Score: టీమిండియా భారీ స్కోరు.. గిల్ సెంచ‌రీ.. కోహ్లీ, శ్రేయ‌స్ ఫిఫ్టీలు, ర‌షీద్ కు 4 వికెట్లు
టీమిండియా భారీ స్కోరు.. గిల్ సెంచ‌రీ.. కోహ్లీ, శ్రేయ‌స్ ఫిఫ్టీలు, ర‌షీద్ కు 4 వికెట్లు
Viral: తాగినంత లిక్కర్ ఫ్రీ - హ్యాంగోవర్ వస్తే లీవ్ కూడా - ఈ జపాన్ కంపెనీని దేవుడే పెట్టించి ఉంటాడు!
తాగినంత లిక్కర్ ఫ్రీ - హ్యాంగోవర్ వస్తే లీవ్ కూడా - ఈ జపాన్ కంపెనీని దేవుడే పెట్టించి ఉంటాడు!
Rajasthan News:  ప్రభుత్వ ఉద్యోగం రాగానే భర్తను వదిలేసింది - ఆ భర్త ఉద్యోగం పోయేలా చేశాడు - టిట్ ఫర్ టాట్ !
ప్రభుత్వ ఉద్యోగం రాగానే భర్తను వదిలేసింది - ఆ భర్త ఉద్యోగం పోయేలా చేశాడు - టిట్ ఫర్ టాట్ !
Kingdom Teaser: విజయ్ దేవరకొండ మాస్ సంభవం... కింగ్‌డమ్ టీజర్ వచ్చిందోచ్, మామూలుగా లేదంతే
విజయ్ దేవరకొండ మాస్ సంభవం... కింగ్‌డమ్ టీజర్ వచ్చిందోచ్, మామూలుగా లేదంతే
Embed widget