అన్వేషించండి

Harish Rao Comments: 'మేము ఎల్లప్పుడూ ప్రజల పక్షమే' - రైతుబంధు ఎప్పుడు జమ చేస్తారని ప్రభుత్వానికి హరీష్ రావు ప్రశ్న

Harish Rao: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతు బంధు నిధులిస్తామని చెప్పారని అవి ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఆ నిర్ణయం కోసం రైతులు వేచి చూస్తున్నారన్నారు.

Harishrao Comments at Assembly Point: తాము అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పటికీ ప్రజల పక్షానే నిలబడతామని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) అన్నారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద శనివారం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రమాణస్వీకారం చేసిన నేతలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం రైతు బంధు ఎప్పుడు ఇస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 9న రైతు బంధు (Rythu Bandhu) కింద రూ.15 వేలు ఇస్తామని చెప్పారని, అది ఎప్పుడిస్తారో చెప్పాలని అన్నారు. రాష్ట్రంలో రైతాంగం అంతా ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తోందని తెలిపారు. 'రైతులు వడ్లు అమ్ముకోకండి. తాము అధికారంలోకి వచ్చాక కొనుగోలు చేస్తామని కాంగ్రెస్ నేతలు ఎన్నికల ప్రచారంలో చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. రూ.500 బోనస్ తో వడ్లు ఎప్పుడు కొంటారో చెప్పాలి.' అని హరీష్ రావు డిమాండ్ చేశారు. అలాగే, మిగ్ జాం తుపాను కారణంగా కొన్నిచోట్ల వడ్లు తడిశాయని, అలాంటి రైతులను ఆదుకోవాలని కోరారు.

బీఆర్ఎస్ ఎల్పీ నేతగా కేసీఆర్

మరోవైపు, బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా కేసీఆర్ ఎన్నికయ్యారు. శనివారం ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సమక్షంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమై ఈ మేరకు తీర్మానం చేశారు. కాగా, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాల్లో విజయం సాధించి బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదాలో నిలిచిన సంగతి తెలిసిందే. కేసీఆర్ ఎన్నిక అనంతరం ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి హాజరై ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు గన్ పార్కు వద్ద అమర వీరుల స్థూపానికి నివాళులర్పించారు. శస్త్ర చికిత్స కారణంగా కేసీఆర్, ఆయనతో పాటు ఆస్పత్రిలో ఉన్నందున కేటీఆర్ నేటి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. ఈ మేరకు తమకు మరో రోజు సమయం ఇవ్వాలని శాసన సభ సెక్రటరీని కేటీఆర్ కోరారు. అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అనంతరం ఈ నెల 14కు (గురువారం) వాయిదా పడింది. అటు బీఆర్ఎస్ నుంచి ఈసారి అసెంబ్లీకి పోటీ చేసిన ముగ్గురు ఎమ్మెల్సీలు విజయం సాధించారు. దీంతో వారు రెండిట్లో ఒక పదవికి రాజీనామా చేయాలి. ఈ రోజు అసెంబ్లీకి వచ్చే ముందు ముగ్గురు ఎమ్మెల్సీలు శాసన మండలికి వెళ్లి తమ రాజీనామాలను సమర్పించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి , కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి రాజీనామాలకు శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. ఆ తర్వాత వారు అసెంబ్లీకి వెళ్లారు. 

Also Read: KCR And KTR Absent: అసెంబ్లీకి కేసీఆర్, కేటీఆర్ గైర్హాజరు - ప్రమాణస్వీకారం చేయకముందే ముగ్గురు రాజీనామా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
Fengal Cyclone: ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
Tirumala Darshan Tickets: తిరుమల తిరుపతి స్థానికుల కళ్లల్లో ఆనందం- ఐదేళ్ల తర్వాత అమలులోకి ప్రత్యేక దర్శన భాగ్యం
తిరుమల తిరుపతి స్థానికుల కళ్లల్లో ఆనందం- ఐదేళ్ల తర్వాత అమలులోకి ప్రత్యేక దర్శన భాగ్యం
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్? - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Venkata Satyanarayana Penmetsa Mumbai Indians | IPL 2024 Auction లో దుమ్మురేపిన కాకినాడ కుర్రోడుPrime Ministers XI vs India 2Day Matches Highlights | వర్షం ఆపినా మనోళ్లు ఆగలేదు..విక్టరీ కొట్టేశారుల్యాండ్ అవుతుండగా పెనుగాలులు, విమానానికి తప్పిన ఘోర ప్రమాదంతీరం దాటిన తుపాను, కొద్దిగంటల్లో ఏపీ, తెలంగాణ‌కు బిగ్ అలర్ట్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
Fengal Cyclone: ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
Tirumala Darshan Tickets: తిరుమల తిరుపతి స్థానికుల కళ్లల్లో ఆనందం- ఐదేళ్ల తర్వాత అమలులోకి ప్రత్యేక దర్శన భాగ్యం
తిరుమల తిరుపతి స్థానికుల కళ్లల్లో ఆనందం- ఐదేళ్ల తర్వాత అమలులోకి ప్రత్యేక దర్శన భాగ్యం
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్? - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
PV Sindhu Match: పీవీ సింధు ఈజ్ బ్యాక్.. ఆ టోర్నీలో హవా అంతా మనదే..
పీవీ సింధు ఈజ్ బ్యాక్.. ఆ టోర్నీలో హవా అంతా మనదే..
Top 5 Smartphones Under 10000: రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
Egg Rates: తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చికెన్ ధరలు - పెరిగిన గుడ్ల ధరలు
తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చికెన్ ధరలు - పెరిగిన గుడ్ల ధరలు
TTD Guidelines: తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
Embed widget