అన్వేషించండి

Telangana: నేడు ఢిల్లీకి తెలంగాణ మంత్రులు, అధికారుల బృందం.. ధాన్యం సేకరణపై కేంద్రంతో తేల్చుకుంటారా!

ధాన్యం సేకరణపై కేంద్రం ఓమాట, రాష్ట్రం ఓ మాట చెబుతున్నాయంటూ అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ నేతలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. నేడు తెలంగాణ సర్కార్ టీమ్ ఢిల్లీకి వెళ్తోంది.

కేంద్రంలోనూ, తెలంగాణలోనూ రైతుల అంశం గత కొన్నిరోజులుగా హాట్ టాపిక్ అవుతోంది. ముఖ్యంగా ధాన్యం సేకరణపై కేంద్రం ఓమాట, రాష్ట్రం ఓ మాట చెబుతున్నాయంటూ అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ నేతలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం తీసుకొచ్చిన మూడు కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకుంది. ఇది జరిగిన తరువాత సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోయింది. ఏం తేల్చుకోకుండానే సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి రాగా.. నేడు మరోసారి తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో చర్చలకు సిద్ధమైంది. 

కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టత తీసుకొనేందుకు తెలంగాణ మంత్రులు, అధికారుల బృందం శుక్రవారం ఢిల్లీకి వెళ్తోంది. నవంబర్ 23న జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌తో భేటీలో ఏ విషయం తేలకపోవడంతో.. ధాన్యం కొనుగోళ్లు, బియ్యం సేకరణపై తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అధ్వర్యంలో మంత్రులు మహమూద్‌ అలీ,  సీహెచ్ మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌తో కూడిన బృందం నేడు ఢిల్లీలో చర్చలు జరుపుతారు. రైతులకు మద్దతు ధర, ధాన్యం కొనుగోళ్లు ప్రధాన అంశాలుగా కేంద్ర ఆహార, ప్రజా పంపిణీశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో శుక్రవారం సాయంత్రం తెలంగాణ మంత్రులు, అధికారుల టీమ్ సమావేశం అవుతుంది.

Also Read: Tomato Farmers : ఆ రైతు పంట పండించిన టమాటా .. ఒక్క సీజన్‌లో రూ. 80 లక్షలు ! 

యాసంగిలో రైతులు ఎలాంటి పంటలు వేయాలన్న దానిపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించి, రాష్ట్ర రైతులకు చెబుతామని రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కొత్త సాగు చట్టాలపై కేంద్రం ఆలోచించి చివరికి ఉపసంహరించుకున్నందున రైతులకు సానుకూల నిర్ణయం వస్తుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అయితే నాలుగు రోజులపాటు కేసీఆర్ ఢిల్లీలో పర్యటించినా ఎటూ తేల్చుకోకపోవడం రాజకీయంగా వివాదాస్పదమైంది. కనీస మద్దతు ధర, ధాన్యం కొనుగోళ్లు, ఏ పంటలు వారికి లాభదాయకం లాంటి అంశాలు, ఇతరత్రా రైతుల సమస్యలపై నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ మంత్రులు, అధికారుల టీమ్ నేటి సాయంత్రం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో చర్చించనుంది. రాష్ట్ర రైతుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, సీఎం కేసీఆర్ అందుకు తగిన నిర్ణయాలు తీసుకుంటారని నేతలు చెబుతున్నారు. 
Also Read: తెగువతో పని చేస్తే తెలంగాణలో మనదే అధికారం.. పార్టీ శ్రేణులకు బండి సంజయ్ సందేశం !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Divi Vadthya Bikini Pics: బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు

వీడియోలు

Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!
Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Divi Vadthya Bikini Pics: బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
Akhanda 2 Premiere Show Collection: 'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Alluri Road Accident: అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Embed widget