అన్వేషించండి

Telangana Liberation Day: విమోచన పోరాటంలో కరీంనగర్ వీరులు, వీరి కథ తెలుసా?

Telangana Liberation Day: బద్ధం యెల్లారెడ్డి, సీహెచ్ రాజేశ్వర్ రావు, అనభేరి ప్రభాకర రావు.. నాటి తెలంగాణ విమోచన పోరాటానికి ఎన్నో త్యాగాలు చేశారు. వారి సేవలను ఓ సారి స్మరించుకుందాం.

Telangana Liberation Day: ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం గాలి పెల్లి పోరాటానికి మారుపేరుగా మారింది. ఆంధ్ర మహాసభ నాయకుడు బద్దం ఎల్లారెడ్డి సొంతూరు ఇల్లంతకుంట. ఆయన నేతృత్వంలో ఉమ్మడి జిల్లా ఉద్యమకారులు సమీప గ్రామాలకు చెందిన ముఖ్య నేతలంతా ఇక్కడే తలదాచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న నిజాం పోలీసులు.. దాదాపు 500 మంది ఊరిని చుట్టుముట్టారు. ఈ విషయాన్నిగమనించిన ఊరి జనం గ్రామ శివారులో కందెనకుంట చెరువు దగ్గర నిజాం పోలీసులకు అడ్డుతగిలారు. నిరాయుధులైన వేలాది మంది తమ నాయకులకు రక్షణగా పోరు తెలిపారు. దీంతో ఆగ్రహానికి గురైన నిజాం పోలీసులు గ్రామస్థులపై కాల్పులు జరిపారు. పది మంది అక్కడికక్కడే చనిపోగా చాలామంది రక్త గాయాలతో తల్లడిల్లారు. అయినా ఆగకుండా గ్రామంలోకి చొరబడ్డ నిజాం పోలీసులు.. బద్దం ఎల్లారెడ్డి, మల్లుగారి బలరాం రెడ్డి ఇళ్లకు నిప్పు పెట్టారు. ఇదే వరుసలో ఉన్న పలు ఇళ్లు కాలి పోవడంతో పాటు ఆ ఊరి జనాలను చిత్ర హింసలు పెట్టారు.


Telangana Liberation Day: విమోచన పోరాటంలో కరీంనగర్ వీరులు, వీరి కథ తెలుసా?

తూటాలు తగిలిన వారిని జైల్లో బంధించిన నిజాం పోలీసులు..

తుపాకీ తూటా తగిలి గాయపడిన మల్లు గారి రాఘవరెడ్డి, బద్ధం వెంకయ్యలతోపాటు కొందరిని పోలీసులు తీసుకెళ్లి కరీంనగర్ జైల్లో పెట్టారు. ఈ గ్రామానికి చెందిన మంగలి బుర్రయ్య, బోనింగవగారి నారాయణ, పీసు బక్కయ్య, పుల్లు గారి ఎల్లయ్య, పెరంబదూరి అనంతయ్య లతోపాటు యాల్ల రామిరెడ్డి, ఏలేటి రాజిరెడ్డి, సింగిరెడ్డి రాజిరెడ్డి,అల్లె వెంకయ్యలు తుపాకి తూటాలకు మరణించారు. నిజాం పోలీసులు రజాకార్ల అరాచకాలు ఎక్కువ అవుతున్న సమయంలో జిల్లాలోని ప్రతి పల్లె పోరాట పటిమను పలు రకాలుగా చూపించింది. అప్పటికే సిరిసిల్ల కేంద్రంగా 1935లో నిర్వహించిన ఆంధ్ర మహాసభ విజయవంతం కావడంతో పోరాటాన్ని ముందుండి నడిపించేందుకు జిల్లాకు చెందిన బద్దం ఎల్లారెడ్డి, పి.వి.నరసింహారావు, సింగిరెడ్డి భూపతిరెడ్డి, సీహెచ్ రాజేశ్వర రావు, అనభేరి ప్రభాకర రావు, అమృత లాల్ శుక్లా, హనుమంతరావు ఇలా వందల సంఖ్యలో నాయకులు ముందుండి నడిపించారు.


Telangana Liberation Day: విమోచన పోరాటంలో కరీంనగర్ వీరులు, వీరి కథ తెలుసా?

కాళ్లకు సంకెలు వేసి కరీంనగర్ వీధుల్లో తిప్పారు..

1946 నుంచి 1948 సెప్టెంబర్ వరకు ఊరూరా ఉద్రిక్తత పరిస్థితి ఉండేది. సిరిసిల్ల, హుజూరాబాద్, హుస్నాబాద్, మంథని, పెద్దపల్లి, కరీంనగర్, కోనరావుపేట, ధర్మపురి, జగిత్యాల, భీమదేవర పల్లి గ్రామాలు రక్తంతో తడిసి పోయాయి. నిజాం పోలీసులు రజాకార్ల అరాచకాలు ఎక్కువవుతున్న సమయంలో ఊళ్ల మీద పడి సానుభూతి పరులను హింసించడం, దోపిడి తోపాటు అరాచకాలు చేసేవారు. వారిని ఎదుర్కొనేందుకు ఊరూరా జనం బలాన్ని చూపించారు. బద్దం ఎల్లారెడ్డిని నిజాం సైన్యం అరెస్టు చేసి నాలుగేళ్లు వరంగల్ జైల్లో నిర్బంధించింది. చేతులకు, కాళ్లకు సంకెళ్లు వేసి సిరిసిల్ల, కరీంనగర్ వీధుల్లో నడిపించారు. రాజేశ్వరరావును చంచల్ గూడా గుల్బర్గా జైల్లో నిర్బంధించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుతున్న పీవీ నరసింహారావు సహా జిల్లాకు చెందిన అప్పటి ప్రభుత్వం విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరించింది. 


Telangana Liberation Day: విమోచన పోరాటంలో కరీంనగర్ వీరులు, వీరి కథ తెలుసా?

రక్తంతో తడిసిన గాలిపెల్లి..

1947 ఆగష్టు 15న భారతదేశానికి స్వతంత్రం వచ్చిన నిజాం పాలనలో ఉన్న ప్రాంతానికి స్వేచ్చగా గాలి పీల్చుకునే అవకాశం రాలేదు. ఇక్కడ జెండాను ఎగుర వేయనివ్వలేదు. కరీంనగర్, ధర్మపురి, కోనరావుపేట లో కొందరు ఎగురవేసేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అరెస్టు చేశారు. ధర్మపురిలో కేవీ కేశవులు సంఘనపట్ల మాణిక్యశాస్త్రి వారి కట్టుబాట్లు ఎదిరించి ధైర్యంగా జెండాను ఎగురవేశాడు. 1947 ఆగస్టు 19న గాలిలో బద్దం ఎల్లారెడ్డి నేతృత్వంలో 12 వేల మంది జాతీయ జెండాను ఎగురవేసి ఎగరవేసి స్ఫూర్తిని చాటారు. ఆ మరుసటి నెలలోనే సెప్టెంబర్ 14న నిజాం పోలీసులు గాలిపెల్లి ని రక్తంతో తడిపారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ICC Champions Trophy 2025 Team India | అగార్కర్ తో డ్రెస్సింగ్ రూమ్ లో Gambhir డిష్యూం డిష్యూం | ABP DesamChhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP DesamVicky Kaushal Bollywood Super Star | Chhava తో కొత్త సూపర్ స్టార్ పుట్టాడా.? | ABP DesamMLC Candidate Aviash Jadhav Interview | పదిహేను నా లక్కీ నెంబర్ ఎందుకంటే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Hyderabad Crime News మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
First GBS Death in AP: ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
WPL Result Update: గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ బోణీ, 6 వికెట్లతో యూపీ చిత్తు
గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ బోణీ, 6 వికెట్లతో యూపీ చిత్తు
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.