News
News
వీడియోలు ఆటలు
X

Telangana News: కేంద్ర ప్రభుత్వ స్కీమ్‌ అమలుకు తెలంగాణ నో - అదానీ జోక్యమే కారణం!

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యత, సౌకర్యాలు పెంచేందుకు ప్రైవేటు సంస్థల సహకారం తీసుకోవాలన్నది కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక.

FOLLOW US: 
Share:

కేసీఆర్ - మోదీ మధ్య పెరిగిన అంతరాలు విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాన్ని దూరం చేస్తోంది. విద్యాంజలి - 2 అనే పథకాన్ని కేంద్రం అదానీ సౌజన్యంతో తీసుకురానుండగా, తెలంగాణలో అది అమలు చేయవద్దని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. మోదీ - అదానీకి లబ్ధి చేకూరుస్తున్నారనే ఆరోపణలు, దానిపై తెలంగాణ ప్రభుత్వం పోరాట ధోరణి అనుసరిస్తుండగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. విద్యాంజలి - 2 పథకాన్ని అదానీ స్పాన్సర్ చేస్తుండడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

పాఠశాలల్లో విద్యార్థులకు స్కిల్‌ డెవలప్ మెంట్‌, కెరీర్‌ గైడెన్స్‌, సెల్ఫ్‌ డిఫెన్స్‌ లాంటివాటిని నేర్పించే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం విద్యాంజలి-2 పథకం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమలు చేయాల్సి ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇచ్చిన ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం నిలిపి వేసింది. ప్రధాని మోదీ, పారిశ్రామికవేత్త అదానీ బంధంపై రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అదానీ గ్రూపు కంపెనీలపై వచ్చిన ఆరోపణలపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) విచారణ జరిపించాలని పార్లమెంటులోనూ, బయటా పోరాటం కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే విద్యాంజలి-2 కార్యక్రమాన్ని రాష్ట్రంలో అమలు చేయకూడదని భావించినట్లు తెలిసింది. 

అదానీ గ్రూపుతో కలిసి విద్యాంజలి 2.0 కార్యక్రమాన్ని అమలు చేస్తే లేని పోని విమర్శలు వచ్చే అవకాశం ఉందనే అంచనాతో ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీనిని అమలు చేస్తే భవిష్యత్తులో అదానీ గ్రూపుపై తీవ్ర విమర్శలు చేయడానికి ఈ పథకం అడ్డు వస్తుందనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అందుకే విద్యాంజలి - 2 పథకం అమలు చేయొద్దని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

విద్యాంజలి పథకం అంటే..
విద్యాంజలి పథకాన్ని ప్రధాని మోదీ 2021 సెప్టెంబరులో ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యత, సౌకర్యాలు పెంచేందుకు ప్రైవేటు సంస్థల సహకారం తీసుకోవాలన్నది కేంద్ర ప్రభుత్వ ప్రణాళి. స్వచ్ఛందంగా, వ్యక్తిగతంగా కూడా ఎవరైనా విద్యా బోధన చేసేందుకు వాలంటీర్లుగా చేరొచ్చు. పాఠాలతో పాటు యోగా, సంగీతం, క్రీడలు పిల్లలకు నేర్పవచ్చు. ఇందుకు ఎలాంటి జీతాలు చెల్లించరు. దీన్నే విద్యాంజలి 2.0 అని పిలుస్తారు. ఆ కార్యక్రమాన్ని 2022 సెప్టెంబరులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు.

ఆసక్తి ఉన్నవారు విద్యాంజలి పోర్టల్‌లో పేరు నమోదు చేసుకోవాలి. ప్రైవేట్‌ సంస్థలకు కూడా ఇది వర్తిస్తుంది. కార్యక్రమంలో భాగంగా రిటైర్డ్‌ ప్రొఫెసర్లు, సైకాలజిస్టులు, వివిధ రంగాల్లో నిపుణులు ఇందులో వలంటీర్లుగా ఉంటారు. వీరు విద్యార్థులకు చదువులో సహకరిస్తారు. యోగా, డిజిటల్‌ స్కిల్స్‌, ఆర్ట్స్‌ అండ్‌ క్రాప్ట్స్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ తదితరాల్లో ప్రత్యేక ట్రైనింగ్ ఇస్తారు. పోటీ, ఎంట్రన్స్‌ పరీక్షలకు సన్నద్ధం కావడానికి సహకరిస్తారు. ప్రతిభావంతులకు మరింత సాన పెడతారు. బాలికలకు సెల్ఫ్‌ డిఫెన్స్‌పై ప్రత్యేక శిక్షణ ఇస్తారు. 

విద్యాంజలి 2 పథకం అమలుకు అదానీకి చెందిన ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌తో పాటు ఏపీఎల్‌ హెల్త్‌కేర్‌ ఫౌండేషన్‌ తదితర ప్రైవేట్‌ సంస్థలు ముందుకు వచ్చాయి. రిటైర్డ్‌ ప్రొఫెసర్లు, రిటైర్డ్‌ డిఫెన్స్ అధికారులు, వివిధ రంగాల్లో నిపుణులు తదితరులు ఉచితంగానే వలంటీర్లుగా సేవలు అందించాల్సి ఉంటుంది. 

Published at : 19 Apr 2023 09:00 AM (IST) Tags: Adani group Telangana Govt Vidyanjali 2 scheme Adani educational foundation Govt schools in telangana

సంబంధిత కథనాలు

Hyderabad News: హైదరాబాద్‌లోని ఓ పబ్‌ వైల్డ్ ఆలోచనపై విమర్శలు- అధికారులు, నెటిజన్లు ఆగ్రహం

Hyderabad News: హైదరాబాద్‌లోని ఓ పబ్‌ వైల్డ్ ఆలోచనపై విమర్శలు- అధికారులు, నెటిజన్లు ఆగ్రహం

Khelo India: ఓయూ అమ్మాయిలు అదుర్స్‌! యూనివర్సిటీ టెన్నిస్‌లో వరుసగా మూడోసారి ఫైనల్‌కు!

Khelo India: ఓయూ అమ్మాయిలు అదుర్స్‌! యూనివర్సిటీ టెన్నిస్‌లో వరుసగా మూడోసారి ఫైనల్‌కు!

మెగాస్టార్‌ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ

మెగాస్టార్‌ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ

Rains in Telangana: మరో మూడ్రోజులు తెలంగాణలో ఎండావాన - ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

Rains in Telangana: మరో మూడ్రోజులు తెలంగాణలో ఎండావాన - ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

కాంగ్రెస్‌లోకి జూపల్లి, పొంగులేటి- సంకేతాలు ఇచ్చిన ఈటల !

కాంగ్రెస్‌లోకి జూపల్లి, పొంగులేటి- సంకేతాలు ఇచ్చిన ఈటల !

టాప్ స్టోరీస్

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ -   జాతీయ వ్యూహం మారిపోయిందా ?

ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుంది: సజ్జల

ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుంది: సజ్జల

SSMB28 Mass Strike : మహేష్ బాబు 'మాస్ స్ట్రైక్'కు ముహూర్తం ఫిక్స్ - ఏ టైంకు అంటే?

SSMB28 Mass Strike : మహేష్ బాబు 'మాస్ స్ట్రైక్'కు ముహూర్తం ఫిక్స్ - ఏ టైంకు అంటే?

Balakrishna IQ Trailer : బాలకృష్ణ విడుదల చేసిన 'ఐక్యూ' ట్రైలర్‌ - అసలు కాన్సెప్ట్ ఏమిటంటే?

Balakrishna IQ Trailer : బాలకృష్ణ విడుదల చేసిన 'ఐక్యూ' ట్రైలర్‌ - అసలు కాన్సెప్ట్ ఏమిటంటే?