అన్వేషించండి

Telangana News: కేంద్ర ప్రభుత్వ స్కీమ్‌ అమలుకు తెలంగాణ నో - అదానీ జోక్యమే కారణం!

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యత, సౌకర్యాలు పెంచేందుకు ప్రైవేటు సంస్థల సహకారం తీసుకోవాలన్నది కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక.

కేసీఆర్ - మోదీ మధ్య పెరిగిన అంతరాలు విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాన్ని దూరం చేస్తోంది. విద్యాంజలి - 2 అనే పథకాన్ని కేంద్రం అదానీ సౌజన్యంతో తీసుకురానుండగా, తెలంగాణలో అది అమలు చేయవద్దని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. మోదీ - అదానీకి లబ్ధి చేకూరుస్తున్నారనే ఆరోపణలు, దానిపై తెలంగాణ ప్రభుత్వం పోరాట ధోరణి అనుసరిస్తుండగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. విద్యాంజలి - 2 పథకాన్ని అదానీ స్పాన్సర్ చేస్తుండడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

పాఠశాలల్లో విద్యార్థులకు స్కిల్‌ డెవలప్ మెంట్‌, కెరీర్‌ గైడెన్స్‌, సెల్ఫ్‌ డిఫెన్స్‌ లాంటివాటిని నేర్పించే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం విద్యాంజలి-2 పథకం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమలు చేయాల్సి ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇచ్చిన ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం నిలిపి వేసింది. ప్రధాని మోదీ, పారిశ్రామికవేత్త అదానీ బంధంపై రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అదానీ గ్రూపు కంపెనీలపై వచ్చిన ఆరోపణలపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) విచారణ జరిపించాలని పార్లమెంటులోనూ, బయటా పోరాటం కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే విద్యాంజలి-2 కార్యక్రమాన్ని రాష్ట్రంలో అమలు చేయకూడదని భావించినట్లు తెలిసింది. 

అదానీ గ్రూపుతో కలిసి విద్యాంజలి 2.0 కార్యక్రమాన్ని అమలు చేస్తే లేని పోని విమర్శలు వచ్చే అవకాశం ఉందనే అంచనాతో ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీనిని అమలు చేస్తే భవిష్యత్తులో అదానీ గ్రూపుపై తీవ్ర విమర్శలు చేయడానికి ఈ పథకం అడ్డు వస్తుందనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అందుకే విద్యాంజలి - 2 పథకం అమలు చేయొద్దని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

విద్యాంజలి పథకం అంటే..
విద్యాంజలి పథకాన్ని ప్రధాని మోదీ 2021 సెప్టెంబరులో ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యత, సౌకర్యాలు పెంచేందుకు ప్రైవేటు సంస్థల సహకారం తీసుకోవాలన్నది కేంద్ర ప్రభుత్వ ప్రణాళి. స్వచ్ఛందంగా, వ్యక్తిగతంగా కూడా ఎవరైనా విద్యా బోధన చేసేందుకు వాలంటీర్లుగా చేరొచ్చు. పాఠాలతో పాటు యోగా, సంగీతం, క్రీడలు పిల్లలకు నేర్పవచ్చు. ఇందుకు ఎలాంటి జీతాలు చెల్లించరు. దీన్నే విద్యాంజలి 2.0 అని పిలుస్తారు. ఆ కార్యక్రమాన్ని 2022 సెప్టెంబరులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు.

ఆసక్తి ఉన్నవారు విద్యాంజలి పోర్టల్‌లో పేరు నమోదు చేసుకోవాలి. ప్రైవేట్‌ సంస్థలకు కూడా ఇది వర్తిస్తుంది. కార్యక్రమంలో భాగంగా రిటైర్డ్‌ ప్రొఫెసర్లు, సైకాలజిస్టులు, వివిధ రంగాల్లో నిపుణులు ఇందులో వలంటీర్లుగా ఉంటారు. వీరు విద్యార్థులకు చదువులో సహకరిస్తారు. యోగా, డిజిటల్‌ స్కిల్స్‌, ఆర్ట్స్‌ అండ్‌ క్రాప్ట్స్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ తదితరాల్లో ప్రత్యేక ట్రైనింగ్ ఇస్తారు. పోటీ, ఎంట్రన్స్‌ పరీక్షలకు సన్నద్ధం కావడానికి సహకరిస్తారు. ప్రతిభావంతులకు మరింత సాన పెడతారు. బాలికలకు సెల్ఫ్‌ డిఫెన్స్‌పై ప్రత్యేక శిక్షణ ఇస్తారు. 

విద్యాంజలి 2 పథకం అమలుకు అదానీకి చెందిన ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌తో పాటు ఏపీఎల్‌ హెల్త్‌కేర్‌ ఫౌండేషన్‌ తదితర ప్రైవేట్‌ సంస్థలు ముందుకు వచ్చాయి. రిటైర్డ్‌ ప్రొఫెసర్లు, రిటైర్డ్‌ డిఫెన్స్ అధికారులు, వివిధ రంగాల్లో నిపుణులు తదితరులు ఉచితంగానే వలంటీర్లుగా సేవలు అందించాల్సి ఉంటుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana private colleges strike ends:  ఇలా సీఎం వార్నింగ్ ఇచ్చారు -అలా కాలేజీలు దారికొచ్చాయి - ముగిసిన ప్రైవేటు కాలేజీల సమ్మె
ఇలా సీఎం వార్నింగ్ ఇచ్చారు -అలా కాలేజీలు దారికొచ్చాయి - ముగిసిన ప్రైవేటు కాలేజీల సమ్మె
US Visa: డయాబెటిస్ ఉన్న వాళ్లకి నో వీసా - మరో పులకేసీ ఉత్తర్వు జారీ చేసిన ట్రంప్
డయాబెటిస్ ఉన్న వాళ్లకి నో వీసా - మరో పులకేసీ ఉత్తర్వు జారీ చేసిన ట్రంప్
CM warns private colleges: విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటే తాట తీస్తా - ప్రైవేటు కాలేజీలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్ -ఇక వాళ్లదే నిర్ణయం !
విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటే తాట తీస్తా - ప్రైవేటు కాలేజీలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్ -ఇక వాళ్లదే నిర్ణయం !
India vs Australia: గబ్బాలో భారత్-ఆస్ట్రేలియా ఐదో టీ20 మ్యాచ్, టీమ్ ఇండియా ప్లేయింగ్ XI మారుతుందా? పిచ్ రిపోర్ట్‌ ఏంటీ?
గబ్బాలో భారత్-ఆస్ట్రేలియా ఐదో టీ20 మ్యాచ్, టీమ్ ఇండియా ప్లేయింగ్ XI మారుతుందా? పిచ్ రిపోర్ట్‌ ఏంటీ?
Advertisement

వీడియోలు

Harman Preet Kaur Smriti Mandhana | చిరస్మరణీయ విజయం చిరకాలం గుర్తుండాలని టాటూలు వేయించుకున్న హర్మన్, స్మృతి | ABP Desam
గంభీర్ భాయ్.. నీకో దండం! బ్యాటింగ్‌ పొజిషన్ ఇలా సెలక్ట్ చేస్తున్నావా?
చిరస్మరణీయ విజయం చిరకాలం గుర్తుండాలని టాటూలు వేయించుకున్న హర్మన్, స్మృతి
పీఎం మోదీని కలిసినప్పుడు అలా ఎందుకు చేసానంటే..!
అల్లటప్పా ఆటగాడనుకున్నారా.. రీప్లేస్ చేయాలంటే బాబులు దిగిరావాల!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana private colleges strike ends:  ఇలా సీఎం వార్నింగ్ ఇచ్చారు -అలా కాలేజీలు దారికొచ్చాయి - ముగిసిన ప్రైవేటు కాలేజీల సమ్మె
ఇలా సీఎం వార్నింగ్ ఇచ్చారు -అలా కాలేజీలు దారికొచ్చాయి - ముగిసిన ప్రైవేటు కాలేజీల సమ్మె
US Visa: డయాబెటిస్ ఉన్న వాళ్లకి నో వీసా - మరో పులకేసీ ఉత్తర్వు జారీ చేసిన ట్రంప్
డయాబెటిస్ ఉన్న వాళ్లకి నో వీసా - మరో పులకేసీ ఉత్తర్వు జారీ చేసిన ట్రంప్
CM warns private colleges: విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటే తాట తీస్తా - ప్రైవేటు కాలేజీలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్ -ఇక వాళ్లదే నిర్ణయం !
విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటే తాట తీస్తా - ప్రైవేటు కాలేజీలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్ -ఇక వాళ్లదే నిర్ణయం !
India vs Australia: గబ్బాలో భారత్-ఆస్ట్రేలియా ఐదో టీ20 మ్యాచ్, టీమ్ ఇండియా ప్లేయింగ్ XI మారుతుందా? పిచ్ రిపోర్ట్‌ ఏంటీ?
గబ్బాలో భారత్-ఆస్ట్రేలియా ఐదో టీ20 మ్యాచ్, టీమ్ ఇండియా ప్లేయింగ్ XI మారుతుందా? పిచ్ రిపోర్ట్‌ ఏంటీ?
Remove stray dogs: వీధి కుక్కలపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు - ఆ ప్రాంతాల నుంచి వెంటనే తొలగించాలని ఆదేశం
వీధి కుక్కలపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు - ఆ ప్రాంతాల నుంచి వెంటనే తొలగించాలని ఆదేశం
Hyundai Venue : హ్యుందాయ్ వెన్యూకి పోటీగా వస్తున్న 5 కొత్త SUVలు, మరింత అడ్వాన్స్డ్‌గా ఫీచర్స్‌!
హ్యుందాయ్ వెన్యూకి పోటీగా వస్తున్న 5 కొత్త SUVలు, మరింత అడ్వాన్స్డ్‌గా ఫీచర్స్‌!
Airport operations disrupt: ఢిల్లీలోనే కాదు ముంబై ఎయిర్ పోర్టులోనూ గందరగోళం - వందల విమానాల రద్దు - అసలేం జరుగుతోంది?
ఢిల్లీలోనే కాదు ముంబై ఎయిర్ పోర్టులోనూ గందరగోళం - వందల విమానాల రద్దు - అసలేం జరుగుతోంది?
Bandi Sanjay : గోపీనాథ్ ఆస్తుల పంపకంలో రేవంత్, కేటీఆర్ మధ్య తేడాలు- బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
గోపీనాథ్ ఆస్తుల పంపకంలో రేవంత్, కేటీఆర్ మధ్య తేడాలు- బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
Embed widget