అన్వేషించండి

Liquor Price Hike: తెలంగాణలో మందుబాబులకు బిగ్ షాక్! త్వరలో మద్యం ధరల పెంపు

Liquor Sales in Telangana | తెలంగాణ ప్రభుత్వం మద్యం ధరలు పెంచడానికి సిద్ధమైన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి అదనపు ఆదాయం కోసం ఎక్సైజ్ శాఖ బీరుపై రూ.20, లిక్కర్ పై రూ.20 నుంచి రూ.70 పెంచనుందని సమాచారం.

Telangana Govt planning to hike Liquor price in state soon report హైదరాబాద్: ఎక్కువ మద్యం విక్రయాలు జరిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ క్రమంలో తెలంగాణలో మందు బాబులకు భారీ షాక్ తగలనుంది. రాష్ట్రంలో త్వరలో మద్యం ధరలు పెంచడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. ఒక్కో బీరు బాటిల్ పై దాదాపు రూ.20 వరకు ధర పెరగనుంది. లిక్కర్‌ బాటిల్స్ పై రూ.20 నుంచి 70 రూపాయల వరకు పెంచేందుకు రాష్ట్ర ఆబ్కారీ శాఖ కసరత్తు చేపట్టింది. కొత్తగా పెరగనున్న మద్యం ధరలతో రాష్ట్ర ప్రభుత్వానికి నెలకు రూ.1000 కోట్ల వరకు అదనపు ఆదాయం చేకూర్చడానికి ఎక్సైజ్ శాఖ ప్లాన్ చేసింది. 

రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూర్చాలని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల మంత్రులకు, పలు శాఖల ఉన్నతాధికారులకు సూచించారు. ఈ క్రమంలో రాష్ట్రానికి అధిక ఆర్థిక వనరుగా ఉన్న మద్యంపై ఆదాయం ఆర్జించడానికి ఎక్సైజ్ శాఖ సన్నద్ధమైంది. దాంతో బీర్లు, లిక్కర్ బాటిల్ పై కనీసం రూ.20 నుంచి ధరలు పెంచడానికి ప్రయత్నాలు చేపట్టారు. ఈ ప్రతిపాదన సీఎం రేవంత్ రెడ్డి వద్దకు వెళితే ఆయన నిర్ణయం తీసుకోనున్నారు. ఆయన ఏమైనా సూచనలు చేస్తే ఎక్సైజ్ శాఖ ధరల్లో స్వల్ప మార్పులు చేర్పులు చేసిన అనంతరం తెలంగాణలో మద్యం ధరలు పెరగనున్నాయి.

మద్యం విక్రయాల్లో తెలంగాణ టాప్

దేశంలో మద్యం విక్రయాలలో తెలంగాణ అగ్ర స్థానంలో నిలిచింది. ఢిల్లీలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ పాలసీ చేపట్టిన సర్వేలో తెలంగాణలో గత ఏడాది అత్యధిక మద్యం విక్రయాలు జరిగాయి.  తెలంగాణలో గతేడాది రాష్ట్రంలో మద్యం కోసం సగటున ఒక వ్యక్తి రూ.1,623 ఖర్చు చేశారు. ఈ జాబితాలో మరో తెలుగు రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. ఏపీలో మద్యం కోసం ఒక వ్యక్తి సగటున రూ.1,306 ఖర్చు చేశారు. పంజాబ్ లో రూ.1,245 ఖర్చు పెట్టగా, ఛత్తీస్ గఢ్ లో ఒక్కో వ్యక్తి మద్యంపై రూ.1,227 ఖర్చు చేసినట్లు NIPFP సర్వేలో పేర్కొంది. 

Also Read: KTR Padayatra: తెలంగాణలో కేటీఆర్ పాదయాత్ర- కార్యకర్తల ఆకాంక్షల మేరకు కీలక నిర్ణయం 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Jana Nayagan:విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
​​US Student Visa :భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Embed widget