అన్వేషించండి

Free Electricity: తెలంగాణలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ స్కీమ్ ప్రారంభం, వారికి మాత్రమే

Gruha Jyothi scheme: తెలంగాణ ప్రభుత్వం ప్రతినెలా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ తో పాటు రూ.500 కే ఎల్పీజీ సిలిండర్ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Free Electricity in Telangana Gruha Jyothi scheme: హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. సచివాలయంలో మహాలక్ష్మి, గృహ జ్యోతి పథకాలను సీఎం రేవంత్ ప్రారంభించారు. గృహ జ్యోతి పథకం కింద ఇకనుంచి నెలకు 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తామని చెప్పారు. రేషన్‌కార్డు ఉన్నవారికి ఈ పథకం వర్తించనుంది. అయితే ప్రజా పాలన దరఖాస్తులలో అప్లై చేసుకున్న వారికి గృహ జ్యోతి పథకం ద్వారా ప్రతినెలా రెండు వందల యూనిట్ల ఉచిత్ విద్యుత్ అందించనున్నారు. విద్యుత్ సిబ్బంది మీటర్ చెక్ చేసి 200 లోపు యూనిట్లు ఉన్న వారికి జీరో బిల్లు జనరేట్ చేసి కరెంట్ బిల్లును ఇవ్వనున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ వల్ల పథకాల ప్రారంభ వేదిక మార్చినట్లు వెల్లడించారు.

Free Electricity: తెలంగాణలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ స్కీమ్ ప్రారంభం, వారికి మాత్రమే

విద్యుత్ పంపిణీ సంస్థల ద్వారా ఈ పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజా పాలనలో దరఖాస్తు చేసిన తెల్లరేషన్ కార్డుదారులకు ఈ పథకాన్ని వర్తింపచేస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మీటర్ రీడింగ్ కు వెళ్లినప్పుడు దరఖాస్తుదారుల ఆధార్, తెల్లరేషన్ కార్డులను విద్యుత్ సిబ్బంది పరిశీలించనున్నారు. ఎంపికైన లబ్ధిదారులకు మార్చిలో జీరో విద్యుత్ బిల్లు ఇవ్వనున్నారని తెలుస్తోంది.

ఉచిత విద్యుత్ అందించే పథకం గృహ జ్యోతి
తెలంగాణ రాష్ట్రంలో అర్హత ఉన్న అన్ని గృహాలకు ఉచిత విద్యుత్ అందించే ప్రభుత్వ పథకం గృహ జ్యోతి. ఈ పథకాన్ని 2023లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తాజాగా గృహ జ్యోతి పథకాన్ని అమలులోకి తెచ్చింది.
గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్‌ను వినియోగించే అన్ని ఇళ్లు ఉచిత విద్యుత్‌ను పొందేందుకు అర్హులు. ఇందులో గ్రిడ్‌కు అనుసంధానించబడిన గృహాలు, అలాగే లేనివి కూడా ఉన్నాయి.
గృహజ్యోతి పథకం తెలంగాణలోని 83 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరానికి సుమారు రూ.3,400 కోట్లు ఖర్చవుతుందని భావిస్తున్నారు.

రూ.500కే గ్యాస్ సిలిండర్ - తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ 
రాష్ట్రంలో అర్హులైన వారికి రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం అమలుకు మరో కీలక అడుగు పడింది. మహాలక్ష్మి పథకం కింద రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ హామీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పథకంపై ప్రభుత్వం మంగళవారం (ఫిబ్రవరి 27న) జీవో జారీ చేసింది. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికే ఈ పథకాన్ని వర్తింపచేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉండగా.. అందులో రేషన్ కార్డు ఉన్న కుటుంబాల సంఖ్య దాదాపు 90 లక్షలు ఉంటుంది. డిసెంబర్ నెలాఖరు నుంచి జనవరి 6వ తేదీ వరకు నిర్వహించిన ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నారు. గ్యాస్ కంపెనీలకు నెలవారీ సబ్సిడీ చెల్లిస్తామని జీవోలో ప్రభుత్వం పేర్కొంది. లబ్ధిదారులకు సబ్సిడీ డబ్బులను గ్యాస్ కంపెనీలు బదిలీ చేయనున్నాయి. మూడేళ్ల సరాసరి వినియోగం ఆధారంగా సిలిండర్లు ఇస్తారు. ఈ పథకం అమలు నిబంధనలు తక్షణం అమల్లోకి వస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: 72 జాతీయ చలనచిత్ర అవార్డులు లైవ్ వీక్షించండి
72nd నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రకటన.. ఉత్తమ నటీనటులు, డైరెక్టర్ ఎవరంటే ?
CM Revanth Reddy: ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
High Tension in Shamshabad: పోలీసులపై కారం చల్లి, కుర్చీలు విసిరి రైతులు ఆగ్రహం.. బహదూర్‌గూడలో మరోసారి ఉద్రిక్తత
పోలీసులపై కారం చల్లి, కుర్చీలు విసిరి రైతులు ఆగ్రహం.. బహదూర్‌గూడలో మరోసారి ఉద్రిక్తత
HYDRAA Hyderabad Mega Drive: హైడ్రా సంచలనం - ఒక్కరోజులోనే రూ. 30,000 కోట్ల విలువైన 840 ఎకరాల భూమి స్వాధీనం!
హైడ్రా సంచలనం - ఒక్కరోజులోనే రూ. 30,000 కోట్ల విలువైన 840 ఎకరాల భూమి స్వాధీనం!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Nara Lokesh Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
CM Revanth Reddy: ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Guntur Crime News: గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
CM Chandrababu Naidu Gudivada Tour: రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !
రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !
Embed widget