అన్వేషించండి

Telangana News: ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి- కేబినెట్ విస్తరణ సహా పలు అంశాలపై అధిష్టానంతో చర్చించే అవకాశం!

Telangana CM Revanth Reddy: తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ తో చర్చించేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు.

Telangana Cabinet Expansion : తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమవుతుంది. అందుకు సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. వచ్చే నెల మొదటి వారంలోనే కేబినెట్ విస్తరణకు ముహుర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే మంత్రివర్గ విస్తరణకు  అడుగు ముందుకు పడనుంది. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారని సమాచారం. సోమ, మంగళ వారాల్లో ఢిల్లీలోనే ఉండనున్న రేవంత్ కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీల ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్నారు.  తెలంగాణ కేబినెట్ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక పలు అంశాలపై హైకమాండ్ తో చర్చించే అవకాశముంది. దాంతో పాటు రాష్ట్రానికి సంబంధించి పార్లమెంట్‌లో ప్రస్తావించాల్సిన అంశాలపై పార్టీ ఎంపీలకు సీఎం రేవంత్ దిశా నిర్దేశం చేయనున్నారు.

నామినేటెడ్ పోస్టుల భర్తీ పై దృష్టి
అలాగే కేబినెట్ విస్తరణతో పాటు నామినేటెడ్ పోస్టుల అంశంపై అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది. గతేడాది డిసెంబరు 9న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చేపట్టింది. ఆ రోజే హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ప్రస్తుత రేవంత్ కేబినెట్ లో 11 మంది మంత్రులు ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో కలుపుకుంటే ఈ సంఖ్య 12గా ఉంది. దీంతో మరో ఆరు మంత్రి పదవులను భర్తీ చేయాల్సి ఉంది. వీటి కోసం పలువురు నేతలు కొన్నాళ్లుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు తర్వాత కీలక నేతలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఆ తర్వాత మంత్రివర్గ ఖాళీలను కూడా భర్తీ చేయాలని భావించినప్పటికీ  ఎన్నికల కోడ్ వచ్చింది. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ లోకసభ ఎన్నికల పై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఎన్నికలు పూర్తి కావడంతో  పూర్తిస్థాయి కేబినెట్ టీమ్ తో ముందుకెళ్లాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. దీంతో నామినెటేడ్ పోస్టులను త్వరగా భర్తీ చేయాలని భావిస్తున్నారు.   

కేబినెట్ లో చోటు దక్కేదెవరికి ?
కేబినెట్లో చోటు కోసం చాలా మంది ఎమ్మెల్యేలు ముమ్మర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కేబినెట్లో ఆరు స్థానాలు మాత్రమే ఖాళీగా ఉండడంతో  చాలా మంది పదవి రేసులో ఉన్నారు. వీరితో పాటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న వారు కూడా ఉన్నారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకునే ఛాన్స్  ఉన్నట్లు తెలుస్తోంది.  దీంతో ఆయా జిల్లాల్లో సమీకరణాలు మారిపోతున్నాయి. రేవంత్ తన కేబినెట్లోకి ఎవరిని తీసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.   

ఆ నాలుగు జిల్లాలకు ఛాన్స్ ?
ఇప్పుడున్న  కేబినెట్ లో నాలుగు ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించలేదు.  దీంతో తాజా విస్తరణలో ఆ నాలుగు జిల్లాలకు కచ్చితంగా చోటు కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. అలాగే  రెడ్డి సామాజిక వర్గం నుంచి నలుగురు మంత్రులు ఉన్నారు. బీసీ, ఎస్సీ సామాజికవర్గాల నుంచి ఇద్దరు, ఎస్టీ, కమ్మ, వెలమ సామాజికవర్గాల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. అయితే విస్తరణలో  సామాజిక సమీకరణాలు కీలకంగా ఉంటాయని సమాచారం. ప్రస్తుత కేబినెట్ లో ఉమ్మడి నిజామాబాద్ నుంచి ప్రాతినిధ్యం కల్పిస్తారని తెలుస్తోంది.  ఇటీవలే బీఆర్ఎస్ కు నుంచి కాంగ్రెస్ లోకి చేరిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి  కేబినెట్ రేసులో ఆయన కూడా ఉన్నారన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే జిల్లా నుంచి మదన్ మెహన్ తో పాటు సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి పోటీలో ఉన్నారు. నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మొదటి నుంచి మంత్రి పదవి కోసం తీవ్రంగా యత్నిస్తూనే ఉన్నారు.  ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి గడ్డం వివేక్, ప్రేమ్ సాగర్ రావు ఆశావాదుల జాబితాలో ఉన్నారు. వీరిలో ఒకరికి మాత్రమే పదవి దక్కే ఛాన్స్ ఉంది. 

అధినాయకత్వం ఆలోచన ఏంటీ
ఇక గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఒకరికి కేబినెట్లో చోటు ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. అయితే ఇక్కడ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు లేరు.  బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరారు. ఆయన హైదరాబాద్ నుంచి కేబినెట్ బెర్త్ ను ఆశిస్తున్నారు. కాగా మంత్రివర్గ విస్తరణలో ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇందుకు మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.  అలాగే ఎస్టీ సామాజికవర్గానికి చెందిన ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే పేరు కూడా జాబితాలో ఉంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి  మల్ రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవి కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు.  చూడాలి మంత్రి పదవిలు ఎవరి దక్కుతాయో !

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget