అన్వేషించండి

Revanth Reddy Delhi Tour: ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి, సాయంత్రం మల్లికార్జున ఖర్గేతో భేటీ!

Telangana News | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. సాయంత్రం కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ లతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Revanth Reddy Reaches Delhi - హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. రెండు రోజులపాటు సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన కొనసాగనుంది. ఆదివారం ఉదయం సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. నేటి సాయంత్రం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు కేసీ వేణుగోపాల్ లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నట్లు సమాచారం. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, హామీల అమలు జరుగుతున్న తీరుపై వివరించనున్నారు.

వరంగల్‌లో భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ ప్లాన్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీ రైతు రుణమాఫీ అమలును రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. జులై 18న రూ.1 లక్ష లోపు రుణాలు ఉన్న అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఎలక్షన్ టైంలో రాహుల్‌ గాంధీ ఇచ్చిన రూ.2 లక్షల రుణమాఫీ హామీని అమలుచేసే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడాన్ని పురస్కరించుకుని భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. వరంగల్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. రుణమాఫీ అమలుకు సంబంధించిన  కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించడంలో భాగంగా ఢిల్లీకి వెళ్లినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. పార్లమెంటు, అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు దాదాపు ఒకేసారి  జరగనున్నాయి. కనుక రాహుల్‌ గాంధీతో చర్చించి సభ తేదీని నిర్ణయించనున్నారు. 

రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి మంత్రివర్గ విస్తరణ అంశంపై చర్చ జరుగుతోంది. గతంలో రేవంత్ ఢిల్లీనప్పుడు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని ప్రచారం, ఆఖర్లో అదేమీ లేదని తేలిపోయేది. సీఎం రేవంత్ తాజా ఢిల్లీ పర్యటన సైతం రాష్ట్ర కేబినెట్ విస్తరణ, నామినేటెడ్‌ పదవులపై ఏఐసీసీ పెద్దల్ని సంప్రదించి చర్చలు జరిపే అవకాశం ఉందని వినిపిస్తోంది. పనిలోపనిగా పార్టీ పనులతో పాటు రాష్ట్రానికి సంబంధించిన నిధులు, అభివృద్ధి పనులపై కేంద్ర మంత్రులను కలిసి సహకారం కోరనున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఈ 25న అసెంబ్లీలో బడ్జెట్
ఈ నెల 23వ తేదీ నుంచి తెలంగాణay అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆరోజు ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశం కానుంది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ జారీ చేశారు. తొలిరోజు కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే (బీఆర్ఎస్) లాస్య నందితకు సంతాపం తెలపనున్నారు. జులై 25వ తేదీన తెలంగాణ ప్రభుత్వం 2024- 25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది.

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు, హామీల అమలు, రుణ మాఫీ, ఇతర పథకాలకు నిధులు సమకూర్చేలా బడ్జెట్ రూపొందించనున్నారు. దాదాపు మూడు లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్నికల ఏడాది కనుక ఏప్రిల్‌ నుంచి జూలై వరకు ప్రవేశపెట్టిన ‘ఓట్‌ ఆన్‌ అకౌంట్‌’ బడ్జెట్‌ గడువు ఈ నెలతో ముగియనుంది. దాంతో ఆగస్టు నుంచి ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేవరకు స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. దీనిపై డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క శాఖలవారీగా బడ్జెట్ ప్రతిపాదనలు సేకరించి సమీక్షించారు. హామీల అమలు కోసం అవసరమయ్యే నిధులను దృష్టిలో ఉంచుకుని భారీ బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ఛాన్స్ ఉంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Cheyutha Pensions: తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Embed widget