అన్వేషించండి

కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తేనే ప్రాజెక్టులకు జాతీయ హోదా, రాష్ట్రానికి నిధులు - చివరిరోజు ప్రచారంలో రేవంత్

Telangana: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లోక్ సభ ఎన్నికల చివరి రోజు ప్రచారంలో భాగంగా పటాన్ చెరులో మెదక్ అభ్యర్థి తరఫున, తాండూరులో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహించారు.

Congress Jana Jathara Sabha at Tandur | హైదరాబాద్: తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారం చివరిరోజు సీఎం రేవంత్ రెడ్డి పలు చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. మొదట మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా రోడ్ షోలో పాల్గొన్నారు. అనంతరం వికారాబాద్ జిల్లా తాండూరులో ప్రియాంక గాంధీతో పాటు భారీ బహిరంగ సభలో పాల్గొని చేవెళ్ల ఎంపీ అభ్యర్థిని గెలిపించి పార్లమెంట్ కు పంపించాలని కోరారు.

మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా రేవంత్ రెడ్డి శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నీలం మధుకు మద్దతుగా పటాన్ చెరులో నిర్వహించిన కార్నర్ షోలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. పటాన్ చెరు మినీ ఇండియా లాంటిదని, ఎన్నో రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి నివసిస్తున్నారని చెప్పారు. బీజేపీది విభ‌జించు, పాలించు సిద్దాంతం అని, అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ కు ఓటు వేయాలని కోరారు. హిందూ, ముస్లింల మధ్య చిచ్చు రాజేసి రాజకీయాలు చేసి, బీజేపీ సీట్లు నెగ్గే ప్రయత్నం చేస్తుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. పటాన్ చెరు ప్రాంతానికి గోదావరి జలాలు రావాలన్నా, మెట్రో రైలు రావాలన్నా కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. 

మాదిగల వర్గీకరణతో పాటు ముదిరాజులను బీసీ-డీ గ్రూప్ నుంచి బీసీ-ఏ గ్రూప్ లోకి మార్చాలన్నా కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు రేవంత్. రిజర్వేషన్లు తొలగిస్తామని బీజేపీ అగ్రనేతలు చెబుతున్నారని, రాజ్యాంగాన్ని సైతం మార్చే యోచనలో బీజేపీ ఉందని ఆరోపించారు. యువతకు ఉద్యోగాలు రావాలన్నా, ఉపాధి అవకాశాలు పెరగాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా రాష్ట్రానికి వచ్చినా కొత్త ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వకపోగా, ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం మాత్రం చేశారని విమర్శించారు. 

రైతు రుణమాఫీ చేస్తాం.. సీఎం రేవంత్ భరోసా
రైతులకు రుణమాఫీ చేసి వారి రుణం తీర్చుకుంటానని రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రం నిర్లక్ష్యంతో రంగారెడ్డి జిల్లా వెనుకబడిందని, అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ అభ్యర్థులు నెగ్గాలన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనజాతర సభలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీతో కలిసి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు రంగారెడ్డిని చేపట్టింది కాంగ్రెస్ పార్టీ అని, కానీ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును బీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఎన్నిసార్లు అడిగినా పాలమూరు ప్జాజెక్టుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ జాతీయ హోదా ఇవ్వలేదని ఆరోపించారు.

చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్ కు పంపించాలని ప్రజలను రేవంత్ రెడ్డి కోరారు. పార్లమెంట్ లో మన బలం పెరిగితే ప్రాజెక్టులకు జాతీయ హోదా, తెలంగాణ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. రైల్వే కోచ్‌, ఐటీఐఆర్‌ కారిడార్‌, బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగినా కేంద్రం ఇవ్వలేదన్నారు. రైతు భరోసా కింద రూ.7500 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం నిధులు ఇవ్వలేదు, కాలేజీలు ఇవ్వలేదు, ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వలేదని, కేంద్రం తెలంగాణకు కేవలం గాడిద గుడ్డు ఇచ్చిందంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Telangana Tourism Master Plan 2026: తెలంగాణ టూరిజానికి నయా లుక్! దుర్గం చెరువు టార్గెట్‌గా సీఎం రేవంత్ రెడ్డి మెగా మాస్టర్ ప్లాన్!
తెలంగాణ టూరిజానికి నయా లుక్! దుర్గం చెరువు టార్గెట్‌గా సీఎం రేవంత్ రెడ్డి మెగా మాస్టర్ ప్లాన్!
Adilabad Modified Silencers Road Roller: బైక్ సైలెన్సర్లు మారిస్తే రోడ్డు రోలరే! ఆదిలాబాద్‌లో 121 మోడిఫైడ్ సైలెన్సర్లను తొక్కించిన ఎస్పీ అఖిల్ మహాజన్!
బైక్ సైలెన్సర్లు మారిస్తే రోడ్డు రోలరే! ఆదిలాబాద్‌లో 121 మోడిఫైడ్ సైలెన్సర్లను తొక్కించిన ఎస్పీ అఖిల్ మహాజన్!
Breaking News: ఏపీ లిక్కర్ రవాణా స్కామ్ కేసులో రాజ్ కెసిరెడ్డి బెయిల్ పిటిషన్- విచారణ 13కి వాయిదా!
ఏపీ లిక్కర్ రవాణా స్కామ్ కేసులో రాజ్ కెసిరెడ్డి బెయిల్ పిటిషన్- విచారణ 13కి వాయిదా!
Nizamabad Crime News: నిజామాబాద్ జిల్లాలో భర్తను భవనంపై నుంచి తోసేసిన భార్య! చనిపోలేదని హార్పిక్‌ ఇంజెక్ట్ చేసి దారుణహత్య! 
నిజామాబాద్ జిల్లాలో భర్తను భవనంపై నుంచి తోసేసిన భార్య! చనిపోలేదని హార్పిక్‌ ఇంజెక్ట్ చేసి దారుణహత్య! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sugali Parvathi Devi On Pawan Kalyan: సుగాలి ప్రీతి కేసులో బిగ్ ట్విస్ట్! మోసం చేశారని పవన్ కల్యాణ్‌పై ఫిర్యాదు!
సుగాలి ప్రీతి కేసులో బిగ్ ట్విస్ట్! మోసం చేశారని పవన్ కల్యాణ్‌పై ఫిర్యాదు!
Nizamabad Crime News: నిజామాబాద్ జిల్లాలో భర్తను భవనంపై నుంచి తోసేసిన భార్య! చనిపోలేదని హార్పిక్‌ ఇంజెక్ట్ చేసి దారుణహత్య! 
నిజామాబాద్ జిల్లాలో భర్తను భవనంపై నుంచి తోసేసిన భార్య! చనిపోలేదని హార్పిక్‌ ఇంజెక్ట్ చేసి దారుణహత్య! 
Allu Arjun : సంధ్య థియేటర్ ఘటన - అల్లు అర్జున్‌కు స్వల్ప ఊరట
సంధ్య థియేటర్ ఘటన - అల్లు అర్జున్‌కు స్వల్ప ఊరట
Revamped Gold Monetization Scheme: ఇళ్లలోని ఇన్‌యాక్టివ్ గోల్డ్‌కు మోక్షం - సరికొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీతో కేంద్రం భారీ స్కెచ్!
ఇళ్లలోని ఇన్‌యాక్టివ్ గోల్డ్‌కు మోక్షం - సరికొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీతో కేంద్రం భారీ స్కెచ్!
Aha Series OTT : కమల్ హాసన్ మూవీ టైటిల్‌తో న్యూ సిరీస్ - ఈ స్టోరీ మీదే కావొచ్చు... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
కమల్ హాసన్ మూవీ టైటిల్‌తో న్యూ సిరీస్ - ఈ స్టోరీ మీదే కావొచ్చు... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Vizag Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
Warangal Crime News: భార్యకు వీడియో కాల్‌లో చూపిస్తూ రైలు కింద పడి భర్త ఆత్మహత్య.. వరంగల్ జిల్లాలో ఘటన
భార్యకు వీడియో కాల్‌లో చూపిస్తూ రైలు కింద పడి భర్త ఆత్మహత్య.. వరంగల్ జిల్లాలో ఘటన
Mavigun vs Amaravati Political Impact: అధినేత మావిగన్ నినాదం.. సొంత కేడరే లైట్ తీసుకుందా? సైలెన్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
అధినేత మావిగన్ నినాదం.. సొంత కేడరే లైట్ తీసుకుందా? సైలెన్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
Embed widget