అన్వేషించండి

Tension Situation in Nampally Fire Accident Area: నాంపల్లి అగ్ని ప్రమాద ప్రాంతంలో ఉద్రిక్తత - కాంగ్రెస్, ఎంఐఎం వర్గాల ఘర్షణ, పోలీసుల లాఠీఛార్జ్

Nampally Fire Accident: నాంపల్లి అగ్ని ప్రమాద ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఘటనా స్థలంలో ఎంఐఎం, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ జరగ్గా పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.

Tension in Nampally Fire Accident Area: నాంపల్లి అగ్ని ప్రమాద ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు నాంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ రాగా, ఎంఐఎం నేతలు, కార్యకర్తలు ఆయన్ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు వారించినా వినక పోవడంతో లాఠీలకు పని చెప్పారు. స్వల్ప లాఠీఛార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. అనంతరం ఫిరోజ్ ఖాన్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంఐఎం నేతలు తనను అడ్డుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిరోజ్ ఖాన్ ను అడ్డుకోవడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క ఖండించారు.

సమగ్ర విచారణకు డిమాండ్

మరోవైపు, ప్రమాద స్థలాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు వీహెచ్ ఫిరోజ్ ఖాన్, అజారుద్దీన్ సందర్శించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి,  సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. హైదారాబాద్ అగ్ని ప్రమాదాలకు నిలయంగా మారిందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అన్నారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. భవిష్యత్ లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఈ ప్రమాదం తనను తీవ్రంగా కలిచి వేసిందని, మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల పరిహారం అందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. వరుస ప్రమాదాలు జరుగుతున్నా, ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, ఘటనపై సమగ్ర విచారణ జరపాలని అన్నారు.

తీవ్ర విషాదం

హైదరాబాద్ నాంపల్లి బజార్ ఘాట్ లో సోమవారం ఉదయం 9:30కు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ రసాయన గోదాంలో అగ్ని ప్రమాదం జరిగి ఐదో అంతస్తు వరకు మంటలు వ్యాపించాయి. ఈ అగ్ని ప్రమాదంలో 9 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ముగ్గురు పురుషులు, ఓ చిన్నారి ఉన్నారు. కొందరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో 21 మంది అస్వస్థతకు గురైనట్లు పోలీసులు తెలిపారు. వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, ప్రమాద విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి ఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలు ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల సాయం అందిస్తామని, బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపడతామన్నారు. ప్రమాదంలో ఆస్తి నష్టపోయిన వారికి సైతం ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ లో రసాయనాలు నిల్వ ఉంచారని, వీటికి మంటలు అంటుకోవడంతో భారీ అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు చెప్పారు. ప్రమాదంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించామని, పూర్తి స్థాయి నివేదిక వచ్చిన అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Also Read: Fire Accident In Nampally: నాంపల్లి ప్రమాదంతో అంతులేని విషాదం - మృతుల్లో 4 రోజుల పసికందు, పరారీలో భవన యజమాని

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంపై పవన్ కళ్యాణ్ పోస్ట్ వైరల్.. సాయంత్రం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్!
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంపై పవన్ కళ్యాణ్ పోస్ట్ వైరల్.. సాయంత్రం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్!
Telangana Formation Day: నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. నిరుపేదలకు సొంతింటి కల సాకారంపై భరోసా
నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. నిరుపేదలకు సొంతింటి కల సాకారంపై భరోసా
Hyderabad Traffic Diversions: సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
పరేడ్‌గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
Harish Rao BRS : హరీష్ రావుపై మైండ్ గేమ్ -ప్రతీసారీ నిరూపించుకోవాల్సి రావడం.. బీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా?
హరీష్ రావుపై మైండ్ గేమ్ -ప్రతీసారీ నిరూపించుకోవాల్సి రావడం.. బీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా?

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Politics | రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?
రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?.. తమిళనాడులో రాజకీయ భూకంపానికి రంగం సిద్ధం!
Telangana Formation Day: నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. నిరుపేదలకు సొంతింటి కల సాకారంపై భరోసా
నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. నిరుపేదలకు సొంతింటి కల సాకారంపై భరోసా
Tim David Banned: ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్‌కు బిగ్ షాక్.. జరిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం
ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్‌కు బిగ్ షాక్.. జరిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం
TDP Rajya Sabha Members List History: టీడీపీకి కలసి రాని రాజ్యసభ సభ్యులు - ఎక్కువ మంది షాకిచ్చిన వాళ్లే - ఈ సారి ఈక్వేషన్స్ మారుస్తారా?
టీడీపీకి కలసి రాని రాజ్యసభ సభ్యులు - ఎక్కువ మంది షాకిచ్చిన వాళ్లే - ఈ సారి ఈక్వేషన్స్ మారుస్తారా?
Harish Rao BRS : హరీష్ రావుపై మైండ్ గేమ్ -ప్రతీసారీ నిరూపించుకోవాల్సి రావడం.. బీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా?
హరీష్ రావుపై మైండ్ గేమ్ -ప్రతీసారీ నిరూపించుకోవాల్సి రావడం.. బీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా?
Telangana Formation Day 2026: ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
YS Sharmila Rajya Sabha Seat Congress: షర్మిలకు రాజ్యసభ - కాంగ్రెస్ గేమ్‌ ప్లాన్‌ ఏంటి? జగన్‌కు చెక్ పెట్టడానికా.. లేక దోస్తీకా?
షర్మిలకు రాజ్యసభ - కాంగ్రెస్ గేమ్‌ ప్లాన్‌ ఏంటి? జగన్‌కు చెక్ పెట్టడానికా.. లేక దోస్తీకా?
కాకినాడ జిల్లాలో కల్లు రుచి చూసిన చంద్రబాబు.. కల్లుగీత కార్మికుడి కుటుంబానికి భరోసా
కాకినాడ జిల్లాలో కల్లు రుచి చూసిన చంద్రబాబు.. కల్లుగీత కార్మికుడి కుటుంబానికి భరోసా
Embed widget