అన్వేషించండి

Telangana Assembly: 'ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేలు' - సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్న మంత్రి శ్రీధర్ బాబు, అసెంబ్లీలో వాడీ వేడీ వాదనలు

Telangana News: ఆటో డ్రైవర్ల అంశం, ఉచిత బస్సు ప్రయాణం, హామీల అమలు వంటి అంశాలపై తెలంగాణ అసెంబ్లీలో శుక్రవారం వాడీ వేడీ వాదనలు సాగాయి. బీఆర్ఎస్ నేతల విమర్శలు మంత్రులు తిప్పికొట్టారు.

Serious Discussion in Telangana Assembly: ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు స్పష్టం చేశారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) సమావేశాల్లో ఉచిత బస్సు ప్రయాణం, ఆటో డ్రైవర్ల సమస్యల అంశంపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వాడీ వేడీ వాదనలు సాగాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రభుత్వంపై పలు ప్రశ్నలు సంధించారు. గవర్నర్ ప్రసంగంలో అరచేతిలో వైకుంఠం చూపించారని.. 30 మోసాలు, 60 అబద్ధాలు చెప్పించారని మండిపడ్డారు. 'ప్రజా భవన్ కు వచ్చే వారి ఫిర్యాదులు తీసుకునేందుకు ఎవరూ లేరు. ఇప్పటివరకూ ఎవరి సమస్యలైనా పరిష్కరించారా.?. ఆరోగ్య శ్రీ ద్వారా ఎవరికైనా రూ.10 లక్షలు ఇస్తున్నారా.? 13 హామీలిచ్చి రెండు పూర్తి చేశామంటూ ప్రచారం చేసుకున్నారు. ఆర్టీసీ బస్సులు సరిపడా లేక మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. 'మహాలక్ష్మి' పథకం ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలి. ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి. గత ప్రభుత్వం ఎన్నో విజయాలు సాధించింది. పదేళ్లలో 17 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం.' అని పల్లా తెలిపారు. దీనిపై మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సమాధానం ఇచ్చారు.

'వారికి ఏడాదికి రూ.12 వేలు'

ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు (Sridhar Babu) అన్నారు. చిన్న చిన్న సమస్యలు వస్తాయనే ఉద్దేశంతోనే మేనిఫెస్టోలో ఆటో కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అభయమిచ్చిందన్నారు. ఏడాదికి వారికి రూ.12 వేలు అందిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. వచ్చే బడ్జెట్ లో దీన్ని కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. 'రాష్ట్ర ఆర్థిక ప్రగతి విషయంలో మాకు ఎలాంటి భేషజాలు లేవు. అభివృద్ధి నిరంతర ప్రక్రియ. అందరికీ అవకాశం ఇవ్వాలనేది మా ప్రభుత్వ ఉద్దేశం. పెట్టుబడిదారులను రాష్ట్రానికి స్వాగతిస్తాం. రాష్ట్ర అభివృద్ధిపై సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తాం.' అని పేర్కొన్నారు.

మీరు ఎప్పుడైనా సాయం చేశారా.?

అటు, బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) మండిపడ్డారు. ఉచిత బస్సు టికెట్లకు తమ ప్రభుత్వం రూ.530 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. 'మీరు ఎప్పుడైనా ఆటో డ్రైవర్లకు సాయం చేశారా.? పదేళ్లలో నెలకు రూ.వెయ్యి అయినా ఇచ్చారా.?. సభను తప్పుదోవ పట్టించేలా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు.' అని పొన్నం మండిపడ్డారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సమర్థిస్తున్నారా.? లేదా వ్యతిరేకిస్తున్నారా.? అనేది బీఆర్ఎస్ నేతలు చెప్పాలని మంత్రి సీతక్క (Minister Seethakka) ప్రశ్నించారు. 'మహిళలు బస్సుల్లో తిరిగితే మీకేంటి సమస్య.? భావోద్వేగాలు రెచ్చగొట్టడమే మీ నైజం' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఆటోలపై అసెంబ్లీకి

అంతకు ముందు బీఆర్ఎస్ నేతలు ఆటోల్లో అసెంబ్లీకి తరలివచ్చారు. ఆటో డ్రైవర్ల విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా సమావేశాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆటోల్లో తరలివచ్చారు. ఎమ్మెల్యేలు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ తదితరులు.. హైదర్ గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆటోల్లో ఆసెంబ్లీకి వచ్చారు. ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని ఫ్లకార్డులు ప్రదర్శించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంచిదే అయినా.. ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయం చూపించాలని బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారని, వారికి నెలకు రూ.10 వేలు ఇవ్వాలని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ అన్నారు. వీరిని పోలీసులు అడ్డుకోగా ఉద్రిక్తత తలెత్తింది. 

Also Read: Balka Suman: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కోసం పోలీసుల గాలింపు - సీఎంను దూషించిన వ్యవహారంలో కేసు నమోదు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Draksharamam Temple : అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం-  ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన దుండగులు
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం-  ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన దుండగులు
Khaleda Zia Net Worth: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత... ఆమె నికర ఆస్తుల విలువ ఎంత
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత... ఆమె నికర ఆస్తుల విలువ ఎంత
Mohan lal : మోహన్ లాల్ మాతృమూర్తి కన్నుమూత - ప్రముఖుల తీవ్ర దిగ్భ్రాంతి
మోహన్ లాల్ మాతృమూర్తి కన్నుమూత - ప్రముఖుల తీవ్ర దిగ్భ్రాంతి
Priyanka Gandhi Son Marriage: లవ్ మ్యారేజ్ చేసుకోనున్న ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రాల కుమారుడు.. వధువు ఎవరంటే..
లవ్ మ్యారేజ్ చేసుకోనున్న ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రాల కుమారుడు.. వధువు ఎవరంటే..

వీడియోలు

Monty Panesar about Gautam Gambhir | గంభీర్ పై మాజీ స్పిన్నర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill Highest Scorer in Test Format | టెస్టుల్లో టాప్‌ స్కోరర్‌గా గిల్
Hardik, Bumrah out of Ind vs NZ ODI Series | న్యూజిలాండ్ సిరీస్ కు సీనియర్లు దూరం ?
Abhishek Sharma 45 Sixes in 60 Minutes | ప్రపంచ కప్‌ ముందు అభిషేక్ విధ్వంసం
The RajaSaab Trailer 2.O Reaction | Prabhas తో తాత దెయ్యం చెడుగుడు ఆడేసుకుంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Draksharamam Temple : అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం-  ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన దుండగులు
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం-  ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన దుండగులు
Khaleda Zia Net Worth: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత... ఆమె నికర ఆస్తుల విలువ ఎంత
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత... ఆమె నికర ఆస్తుల విలువ ఎంత
Mohan lal : మోహన్ లాల్ మాతృమూర్తి కన్నుమూత - ప్రముఖుల తీవ్ర దిగ్భ్రాంతి
మోహన్ లాల్ మాతృమూర్తి కన్నుమూత - ప్రముఖుల తీవ్ర దిగ్భ్రాంతి
Priyanka Gandhi Son Marriage: లవ్ మ్యారేజ్ చేసుకోనున్న ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రాల కుమారుడు.. వధువు ఎవరంటే..
లవ్ మ్యారేజ్ చేసుకోనున్న ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రాల కుమారుడు.. వధువు ఎవరంటే..
Mysore: ఇలా వచ్చారు..అలా పది కోట్ల బంగారం దోచుకెళ్లారు - మైసూరులో సినిమాటిక్ రాబరీ ! వైరల్ వీడియో
ఇలా వచ్చారు..అలా పది కోట్ల బంగారం దోచుకెళ్లారు - మైసూరులో సినిమాటిక్ రాబరీ ! వైరల్ వీడియో
New Year South OTT Releases: 'ఎకో' నుంచి 'మోగ్లీ' వరకూ... ఈ వారం ఓటీటీలో సౌత్ సినిమాల సందడి - ఎందులో ఏవి స్ట్రీమింగ్‌ అవుతాయంటే?
'ఎకో' నుంచి 'మోగ్లీ' వరకూ... ఈ వారం ఓటీటీలో సౌత్ సినిమాల సందడి - ఎందులో ఏవి స్ట్రీమింగ్‌ అవుతాయంటే?
Beauty Movie OTT : 3 నెలల తర్వాత ఓటీటీలోకి రొమాంటిక్ థ్రిల్లర్ - 'ది రాజా సాబ్' డైరెక్టర్ నిర్మించిన 'బ్యూటీ'... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
3 నెలల తర్వాత ఓటీటీలోకి రొమాంటిక్ థ్రిల్లర్ - 'ది రాజా సాబ్' డైరెక్టర్ నిర్మించిన 'బ్యూటీ'... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Hottest Place on Earth : భూమిపై అత్యంత ప్రమాదకరమైన వేడి ప్రాంతం ఇదే.. 49 డిగ్రీల వేడితో పాటు విష వాయువులు కూడా
భూమిపై అత్యంత వేడి ప్రదేశం ఇదే.. అక్కడ చలి ఎప్పుడూ ఉండదట, విషపూరితమైనది కూడా
Embed widget