అన్వేషించండి

Telangana Assembly: 'ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేలు' - సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్న మంత్రి శ్రీధర్ బాబు, అసెంబ్లీలో వాడీ వేడీ వాదనలు

Telangana News: ఆటో డ్రైవర్ల అంశం, ఉచిత బస్సు ప్రయాణం, హామీల అమలు వంటి అంశాలపై తెలంగాణ అసెంబ్లీలో శుక్రవారం వాడీ వేడీ వాదనలు సాగాయి. బీఆర్ఎస్ నేతల విమర్శలు మంత్రులు తిప్పికొట్టారు.

Serious Discussion in Telangana Assembly: ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు స్పష్టం చేశారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) సమావేశాల్లో ఉచిత బస్సు ప్రయాణం, ఆటో డ్రైవర్ల సమస్యల అంశంపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వాడీ వేడీ వాదనలు సాగాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రభుత్వంపై పలు ప్రశ్నలు సంధించారు. గవర్నర్ ప్రసంగంలో అరచేతిలో వైకుంఠం చూపించారని.. 30 మోసాలు, 60 అబద్ధాలు చెప్పించారని మండిపడ్డారు. 'ప్రజా భవన్ కు వచ్చే వారి ఫిర్యాదులు తీసుకునేందుకు ఎవరూ లేరు. ఇప్పటివరకూ ఎవరి సమస్యలైనా పరిష్కరించారా.?. ఆరోగ్య శ్రీ ద్వారా ఎవరికైనా రూ.10 లక్షలు ఇస్తున్నారా.? 13 హామీలిచ్చి రెండు పూర్తి చేశామంటూ ప్రచారం చేసుకున్నారు. ఆర్టీసీ బస్సులు సరిపడా లేక మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. 'మహాలక్ష్మి' పథకం ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలి. ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి. గత ప్రభుత్వం ఎన్నో విజయాలు సాధించింది. పదేళ్లలో 17 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం.' అని పల్లా తెలిపారు. దీనిపై మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సమాధానం ఇచ్చారు.

'వారికి ఏడాదికి రూ.12 వేలు'

ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు (Sridhar Babu) అన్నారు. చిన్న చిన్న సమస్యలు వస్తాయనే ఉద్దేశంతోనే మేనిఫెస్టోలో ఆటో కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అభయమిచ్చిందన్నారు. ఏడాదికి వారికి రూ.12 వేలు అందిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. వచ్చే బడ్జెట్ లో దీన్ని కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. 'రాష్ట్ర ఆర్థిక ప్రగతి విషయంలో మాకు ఎలాంటి భేషజాలు లేవు. అభివృద్ధి నిరంతర ప్రక్రియ. అందరికీ అవకాశం ఇవ్వాలనేది మా ప్రభుత్వ ఉద్దేశం. పెట్టుబడిదారులను రాష్ట్రానికి స్వాగతిస్తాం. రాష్ట్ర అభివృద్ధిపై సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తాం.' అని పేర్కొన్నారు.

మీరు ఎప్పుడైనా సాయం చేశారా.?

అటు, బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) మండిపడ్డారు. ఉచిత బస్సు టికెట్లకు తమ ప్రభుత్వం రూ.530 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. 'మీరు ఎప్పుడైనా ఆటో డ్రైవర్లకు సాయం చేశారా.? పదేళ్లలో నెలకు రూ.వెయ్యి అయినా ఇచ్చారా.?. సభను తప్పుదోవ పట్టించేలా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు.' అని పొన్నం మండిపడ్డారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సమర్థిస్తున్నారా.? లేదా వ్యతిరేకిస్తున్నారా.? అనేది బీఆర్ఎస్ నేతలు చెప్పాలని మంత్రి సీతక్క (Minister Seethakka) ప్రశ్నించారు. 'మహిళలు బస్సుల్లో తిరిగితే మీకేంటి సమస్య.? భావోద్వేగాలు రెచ్చగొట్టడమే మీ నైజం' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఆటోలపై అసెంబ్లీకి

అంతకు ముందు బీఆర్ఎస్ నేతలు ఆటోల్లో అసెంబ్లీకి తరలివచ్చారు. ఆటో డ్రైవర్ల విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా సమావేశాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆటోల్లో తరలివచ్చారు. ఎమ్మెల్యేలు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ తదితరులు.. హైదర్ గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆటోల్లో ఆసెంబ్లీకి వచ్చారు. ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని ఫ్లకార్డులు ప్రదర్శించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంచిదే అయినా.. ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయం చూపించాలని బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారని, వారికి నెలకు రూ.10 వేలు ఇవ్వాలని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ అన్నారు. వీరిని పోలీసులు అడ్డుకోగా ఉద్రిక్తత తలెత్తింది. 

Also Read: Balka Suman: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కోసం పోలీసుల గాలింపు - సీఎంను దూషించిన వ్యవహారంలో కేసు నమోదు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan vs Jagadish Reddy: చిచ్చు పెట్టిన దిష్టి వ్యాఖ్యలు - పవన్ కల్యాణ్‌పై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు
చిచ్చు పెట్టిన దిష్టి వ్యాఖ్యలు - పవన్ కల్యాణ్‌పై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు
Amaravati farmers: అమరావతి రైతులతో  చంద్రబాబు సమావేశం - కీలక సమస్యలపై చర్చ - 6 నెలల్లో  పరిష్కారానికి హామీ
అమరావతి రైతులతో చంద్రబాబు సమావేశం - కీలక సమస్యలపై చర్చ - 6 నెలల్లో పరిష్కారానికి హామీ
TTD Adulterated ghee case: కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్టు - మొదటి సారి టీటీడీ జీఎం అరెస్ట్
కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్టు - మొదటి సారి టీటీడీ జీఎం అరెస్ట్
Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్! SCR 42 ప్రత్యేక రైళ్లను పొడిగించింది: మీ గమ్యస్థానాలకు చేరేందుకు రెడీ అవ్వండి!
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్! SCR 42 ప్రత్యేక రైళ్లను పొడిగించింది: మీ గమ్యస్థానాలకు చేరేందుకు రెడీ అవ్వండి!
Advertisement

వీడియోలు

Hong kong Apartments Fire Updates | 60ఏళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద అగ్నిప్రమాదం | ABP Desam
Gambhir Comments on Head Coach Position | గంభీర్ సెన్సేషనల్ స్టేట్‌మెంట్
World Test Championship Points Table | టెస్టు ఛాంపియన్‌షిప్ లో భారత్ స్థానం ఇదే
Reason for Team India Failure | భారత్ ఓటమికి కారణాలు ఇవే !
Rohit Sharma First Place in ICC ODI Rankings | అగ్రస్థానంలో
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan vs Jagadish Reddy: చిచ్చు పెట్టిన దిష్టి వ్యాఖ్యలు - పవన్ కల్యాణ్‌పై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు
చిచ్చు పెట్టిన దిష్టి వ్యాఖ్యలు - పవన్ కల్యాణ్‌పై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు
Amaravati farmers: అమరావతి రైతులతో  చంద్రబాబు సమావేశం - కీలక సమస్యలపై చర్చ - 6 నెలల్లో  పరిష్కారానికి హామీ
అమరావతి రైతులతో చంద్రబాబు సమావేశం - కీలక సమస్యలపై చర్చ - 6 నెలల్లో పరిష్కారానికి హామీ
TTD Adulterated ghee case: కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్టు - మొదటి సారి టీటీడీ జీఎం అరెస్ట్
కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్టు - మొదటి సారి టీటీడీ జీఎం అరెస్ట్
Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్! SCR 42 ప్రత్యేక రైళ్లను పొడిగించింది: మీ గమ్యస్థానాలకు చేరేందుకు రెడీ అవ్వండి!
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్! SCR 42 ప్రత్యేక రైళ్లను పొడిగించింది: మీ గమ్యస్థానాలకు చేరేందుకు రెడీ అవ్వండి!
Sri charani: మహిళల ఐపీఎల్‌ ఆటగాళ్ల వేలంలో శ్రీచరణికి కోటి 30 లక్షలు - ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్న స్టార్ ప్లేయర్
మహిళల ఐపీఎల్‌ వేలంలో శ్రీచరణికి కోటి 30 లక్షలు - ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్న స్టార్ ప్లేయర్
Kalvakuntla Kavitha: ఎలా ట్రెండింగ్‌లో ఉండాలో కవితకు బాగా తెలుసా? - ఇప్పుడంతా ఆమె గురించే చర్చ
ఎలా ట్రెండింగ్‌లో ఉండాలో కవితకు బాగా తెలుసా? - ఇప్పుడంతా ఆమె గురించే చర్చ
Shiva Jyothi : శ్రీవారి దర్శనం... యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డ్ బ్లాక్ - ఆ వార్తలపై క్లారిటీ!
శ్రీవారి దర్శనం... యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డ్ బ్లాక్ - ఆ వార్తలపై క్లారిటీ!
2019 Group 2 Issue: గ్రూప్-2 2019 ర్యాంకర్లకు భారీ ఊరట.. సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసిన డివిజన్ బెంచ్
గ్రూప్-2 2019 ర్యాంకర్లకు భారీ ఊరట.. సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసిన డివిజన్ బెంచ్
Embed widget