అన్వేషించండి

Breaking News 24 September: సీఎం జగన్ దిల్లీ టూర్ రద్దు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా సెప్టెంబరు 24న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

LIVE

Key Events
Breaking News 24 September:  సీఎం జగన్ దిల్లీ టూర్ రద్దు

Background

Breaking News 24 September Live Updates: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా సెప్టెంబరు 24న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

20:51 PM (IST)  •  24 Sep 2021

దివ్యాంగురాలిపై అత్యాచారం కేసులో నిందితుడు అరెస్టు

విశాఖ జిల్లాలో దివ్యాంగురాలిపై అత్యాచారం చేసిన వైసీపీ నాయ‌కుడ్ని పోలీసులు శుక్ర‌వారం అరెస్ట్ చేశారు. సీలేరుకు చెందిన దివ్యాంగ మ‌హిళ‌పై ఈ నెల 21వ తేదీ అర్ధరాత్రి 12 గంట‌ల స‌మ‌యంలో అదే గ్రామానికి చెందిన నాళ్ల‌ వెంక‌ట‌రావు(40) అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలు ఫిర్యాదుతో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఒడిశా రాష్ట్రంలోకి త‌ప్పించుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తుండ‌గా సీలేరు జ‌లాశ‌యం వ‌ద్ద చాక‌చ‌క్యంగా ప‌ట్టుకున్నార‌ు. నాళ్లవెంకటరావును అరెస్ట్ చేసి, వైద్య ప‌రీక్ష‌ల కోసం విశాఖ‌ప‌ట్నం కేజీహెచ్‌కు త‌ర‌లించారు. న‌ర్సీప‌ట్నం కోర్టులో హాజ‌రుప‌రిచినట్లు గూడెం కొత్తవీధి సీఐ అశోక్‌ కుమార్ తెలిపారు.

22:09 PM (IST)  •  24 Sep 2021

సీఎం జగన్ దిల్లీ టూర్ రద్దు

ఏపీ సీఎం జగన్‌ దిల్లీ పర్యటన రద్దైంది. శుక్రవారం ఉదయం వ్యాయామ సమయంలో సీఎం జగన్‌ కాలు బెణికింది. సాయంత్రానికి  కూడా నొప్పి తగ్గకపోవడంతో డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో సీఎం రేపటి దిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. సీఎం జగన్‌కు బదులుగా హోంమంత్రి మేకతోటి సుచరిత దిల్లీ వెళ్లనున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నేతృత్వంలో జరిగే సమావేశంలో హోంమంత్రి పాల్గొంటారు.

 

19:06 PM (IST)  •  24 Sep 2021

యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల.. తెలుగు వాళ్లకు 100లోపు నాలుగు ర్యాంకులు

యూపీఎస్సీ సివిల్స్ 2020 ఫలితాలు విడుదల అయ్యాయి. మొత్తం 761 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరిలో 545 మంది పురుషులు, 216 మంది మహిళలు ఉన్నారు. 263 మంది జనరల్‌, 229 మంది ఓబీసీ, 122 మంది ఎస్సీ, 86 మంది ఈడబ్ల్యూఎస్‌ కేటగిరి అభ్యర్థులు అర్హత సాధించారు. సివిల్స్‌లో శుభం కుమార్‌ మొదటి ర్యాంకు, జాగ్రతి అవస్థి రెండో ర్యాకు, అంకితా జైన్‌ మూడో ర్యాంకు సాధించారు. సివిల్స్‌ తెలుగు అభ్యర్థులు సత్తా చాటారు. నలుగురు అభ్యర్థులు 100లోపు ర్యాంకులు సాధించారు. తెలుగు అభ్యర్థిని పి.శ్రీజ 20వ ర్యాంకు, మైత్రేయి నాయుడు 27వ ర్యాంకు, రవికుమార్‌ 84వ ర్యాంకు, యశ్వంత్‌ కుమార్‌రెడ్డి 93వ ర్యాంకు సాధించారు. 

18:37 PM (IST)  •  24 Sep 2021

దిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ దిల్లీకి చేరుకున్నారు. ఎంపీ నామా నాగేశ్వరరావు సీఎం కేసీఆర్ కు స్వాగతం పలికారు. 

18:00 PM (IST)  •  24 Sep 2021

ఎర్రగుంట్లలో రౌడీ షీటర్ దారుణ హత్య 

అనంతపురం జిల్లా ధర్మవరం టౌన్ ఎర్రగుంట్ల సర్కిల్ బ్రహ్మంగారి గుడి వద్ద రౌడీ షీటర్ దామోదర్ రెడ్డి(28)ని దారుణంగా హత్య చేశారు. ఎర్రగుంట్ల సర్కిల్ లో వద్ద ఉన్న దామోదర్ రెడ్డి కళ్లలో కారం కొట్టి కొడవళ్లతో నరికి హత్య చేశారు. హత్య చేసిన నిందితులు పోలీసు స్టేషన్ లో లొంగి పోయినట్టు సమాచారం. ఎర్రగుంట్లకి చెందిన కేశవ రెడ్డి కుమారుడు దామోదర్ రెడ్డి టౌన్ లో వడ్డీ వ్యాపారంచేసుకుని జీవిస్తున్నాడు. గతంలో ఇతని పైన రౌడీషీట్ ఉంది. వడ్డీ వ్యాపారస్థులు మధ్య గొడవల కారణంగా ఈ హత్య జరిగినట్టు సమాచారం.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: ఎమ్మెల్సీలుగా సి. రామచంద్రయ్య, హరి ప్రసాద్ ఏకగ్రీవం
ఎమ్మెల్సీలుగా సి. రామచంద్రయ్య, హరి ప్రసాద్ ఏకగ్రీవం
UK Elections 2024: యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తులు ఓటమి - భారత సంతతి అభ్యర్థుల పరిస్థితి ఏంటంటే?
యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తులు ఓటమి - భారత సంతతి అభ్యర్థుల పరిస్థితి ఏంటంటే?
Anasuya Bharadwaj: అనసూయకు లవ్ లెటర్ రాసేశాడు, ఎవరో తెలుసా? - ఆ ముద్దులు వద్దంటోన్న శేఖర్ మాస్టర్
అనసూయకు లవ్ లెటర్ రాసేశాడు, ఎవరో తెలుసా? - ఆ ముద్దులు వద్దంటోన్న శేఖర్ మాస్టర్
Viral News: నిద్రపోతుండగా కాటు వేసిన పాము, కసి తీరా కొరికి చంపిన బాధితుడు
నిద్రపోతుండగా కాటు వేసిన పాము, కసి తీరా కొరికి చంపిన బాధితుడు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Virat Kohli Emotional Speech About Jasprit Bumrah | బుమ్రా ఈ దేశపు ఆస్తి అంటున్న కోహ్లీ | ABP DesamVirat Kohli Emotional About Rohit Sharma |15 ఏళ్లలో రోహిత్ శర్మను అలా చూడలేదంటున్న విరాట్ కోహ్లీJagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: ఎమ్మెల్సీలుగా సి. రామచంద్రయ్య, హరి ప్రసాద్ ఏకగ్రీవం
ఎమ్మెల్సీలుగా సి. రామచంద్రయ్య, హరి ప్రసాద్ ఏకగ్రీవం
UK Elections 2024: యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తులు ఓటమి - భారత సంతతి అభ్యర్థుల పరిస్థితి ఏంటంటే?
యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తులు ఓటమి - భారత సంతతి అభ్యర్థుల పరిస్థితి ఏంటంటే?
Anasuya Bharadwaj: అనసూయకు లవ్ లెటర్ రాసేశాడు, ఎవరో తెలుసా? - ఆ ముద్దులు వద్దంటోన్న శేఖర్ మాస్టర్
అనసూయకు లవ్ లెటర్ రాసేశాడు, ఎవరో తెలుసా? - ఆ ముద్దులు వద్దంటోన్న శేఖర్ మాస్టర్
Viral News: నిద్రపోతుండగా కాటు వేసిన పాము, కసి తీరా కొరికి చంపిన బాధితుడు
నిద్రపోతుండగా కాటు వేసిన పాము, కసి తీరా కొరికి చంపిన బాధితుడు
Telangana Politics: తెలంగాణ శాసన మండలికి రద్దు ముప్పు, చంద్రబాబును రేవంత్ సాయం కోరాలన్న బీఆర్ఎస్
తెలంగాణ శాసన మండలికి రద్దు ముప్పు, చంద్రబాబును రేవంత్ సాయం కోరాలన్న బీఆర్ఎస్
Raj Tarun Comments: లావణ్యకు మరో వ్యక్తితో ఎఫైర్‌ ఉంది - ఆమె చెప్పేవన్ని అబద్ధాలు, ప్రియురాలిపై రాజ్ తరుణ్ సంచలన ఆరోపణలు
లావణ్యకు మరో వ్యక్తితో ఎఫైర్‌ ఉంది - ఆమె చెప్పేవన్ని అబద్ధాలు, ప్రియురాలిపై రాజ్ తరుణ్ సంచలన ఆరోపణలు
MP Kalishetti Appalanaidu : ఆస్తుల్లో పేదవాడే కానీ ఆశయంలో ఉన్నతుడే - అమరావతికి తొలి జీతం విరాళం ఇచ్చేసిన టీడీపీ ఎంపీ
ఆస్తుల్లో పేదవాడే కానీ ఆశయంలో ఉన్నతుడే - అమరావతికి తొలి జీతం విరాళం ఇచ్చేసిన టీడీపీ ఎంపీ
Ramya Krishnan: రాజమాత ఏంటిది? రమ్యకృష్ణ బోల్డ్ ఫొటోలు వైరల్ - ఇది కూడా AI మాయేనా? దారుణం!
రాజమాత ఏంటిది? రమ్యకృష్ణ బోల్డ్ ఫొటోలు వైరల్ - ఇది కూడా AI మాయేనా? దారుణం!
Embed widget