అన్వేషించండి

Telanagana Kaviat Petition: కృష్ణా జలాలపై సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం

కృష్ణా జలాల పంపిణీకి కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ రిటర్న్స్ పై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవయట్ పిటిషన్ దాఖలు చేసింది. తమ వాదనలు వినాలని కోరింది.

కృష్ణా జలాల పంపిణీకి కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ శుక్రవారం జారీ చేసిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (TOR)పై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సోమవారం కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ చేపట్టాలన్న తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కు అప్పగించింది. దీనికి సంబంధించిన గెజిట్ సైతం జారీ చేసింది. కాగా, దీనిపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ, సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో తమ వాదనలు వినకుండా తీర్పు వెలువరించరాదంటూ తెలంగాణ సర్కార్ కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. 

కేఆర్ఎంబీ అఫిడవిట్

కృష్ణా జలాల వాడకం విషయంలో ఏపీ ప్రభుత్వం, తెలంగాణ సర్కారు తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సాగు, తాగు నీటి అవసరాలేవీ లేకున్నా శ్రీశైలం జలాశయం నుంచి జల విద్యుత్ ఉత్పత్తి చేపట్టి కృష్ణా జలాలను దిగువకు వదిలేసిందంటూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఇచ్చిన నోటీసుల మేరకు కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ తరఫున కృష్ణా బోర్డు ప్రమాణ పత్రం సమర్పించింది. సోమవారం అఫిడవిట్ దాఖలు చేసింది.

కేటాయింపులు ఇలా

శ్రీశైలం, నాగార్జున సాగర్ ల నుంచి తెలుగు రాష్ట్రాలకు తాగునీటి కేటాయింపులకు సంబంధించిన సమావేశం మినిట్స్ ను కృష్ణా బోర్డు సోమవారం విడుదల చేసింది. ఏపీకి శ్రీశైలం నుంచి 30 టీఎంసీలు, నాగార్జున సాగర్ నుంచి 15 టీఎంసీలు, తెలంగాణకు 2 జలాశయాల నుంచి 35 టీఎంసీలను కేటాయించారు. కాగా, ఇప్పటి వరకూ ఏపీ 95 టీఎంసీలను, తెలంగాణ 48 టీఎంసీలను వినియోగించుకున్నాయి. రెండు జలాశయాల్లో కలిపి కేటాయింపులు పోగా 2.78 టీఎంసీల మిగులు ఉంది. నీటి ఎద్దడి నేపథ్యంలో నీటిని పొదుపుగా వాడుకోవాలని ఇరు రాష్ట్రాలకు బోర్డు సూచించింది.

ఏపీ సీఎం జగన్ లేఖలు

కృష్ణా జలాల విషయంలో ఏపీ ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా ముందుకు వెళ్లాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. కేంద్ర గెజిట్ విడుదలైన నేపథ్యంలో మరోసారి ప్రధాని మోదీ, హోంమంత్రులకు లేఖ రాయాలని నిర్ణయించారు. కాగా, కృష్ణా నీటి పంపకాల పునఃసమీక్ష బాధ్యతలను కేంద్రం బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కు అప్పగించడం, సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు అంశాలపై ఆయన సోమవారం అధికారులతో సమీక్షించారు. 

విభజన చట్టానికి విరుద్ధం

రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘించేలా, విభజనం చట్టం సెక్షన్ 89కు విరుద్ధంగా కేంద్ర గెజిట్ ఉందని అధికారులు సీఎం జగన్ కు వివరించారు. రాష్ట్ర విభజనకు ముందు జరిగిన కేటాయింపులకు కట్టుబడి ఉండాలని విభజన చట్టం చెబుతుండగా ఇప్పుడు దానికి విరుద్ధంగా ఈ నిర్ణయం ఉందని తెలిపారు. సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు పెండింగ్ లో ఉండగా గెజిట్ ఇవ్వకూడదని వివరించారు. గోదావరి నుంచి 214 టీఎంసీలు తెలంగాణ తరలిస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదంటూ పేర్కొన్నారు.

తెలంగాణ వాదన ఇదీ 

తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాలను అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం పంపిణీ చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ పట్టుబట్టారు. కృష్ణా, గోదావరి జలాలను ప్రాజెక్టుల వారీగా మాత్రమే పంపిణీ చేయాలని అప్పటికే ఉన్న బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ కు కేంద్రం రిఫర్ చేసింది. అలా చేస్తే తెలంగాణకు ఒరిగేదేమీ ఉండబోదని కేసీఆర్ వాదించారు. దీనిపై కేంద్రానికి లేఖలు రాస్తూ ఒత్తిడి తీసుకువచ్చారు.

టాప్ హెడ్ లైన్స్

Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Embed widget