అన్వేషించండి

SSC Paper Leak: నీచ రాజకీయాల కోసమే పేపర్ లీకులు - టెన్త్ క్లాస్ పేపర్ లీక్ పై మంత్రి వేముల ఫైర్

SSC Paper Leak: పదో తరగతి పేపర్ల లీకేజీ వ్యవహారంలో బండి సంజయ్ పై బీఆర్ఎస్ నాయకులు ఫైర్ అయ్యారు. నీచ రాజకీయాల కోసమే పేపర్ లీకేజీలకు పాల్పడుతున్నారని తెలిపారు. 

SSC Paper Leak: పదో తరగతి పేపర్ లీక్ సూత్రధారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ కేసుకు సంబంధించిన అన్ని రకాల ఆధారాలు లభించాయన్నారు. లక్షల మంది పిల్లల భవిష్యత్తును నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వారి తల్లిదండ్రులు ఎంత బాధ పడతారో కూడా పట్టించుకోకుండా.. కనీస బాధ్యత లేకుండా బండి సంజయ్ ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే బీజేపీ ప్రధాన ఉద్దేశంగా అని మంత్రి వేముల వివరించారు. అందుకోసమే కావాలని బీజేపీ నేతలు.. ప్రశాంత్ అనే వ్యక్తితో పదో తరగతి పరీక్ష పేపర్లను ఫొటో తీసి బండి సంజయ్ కి వాట్సాప్ ద్వారా పంపాడని తెలిపారు. పరీక్ష మొదలైన 15 నిమిషాల్లోనే బండి సంజయ్ కు ప్రశాంత్ ద్వారా పేపర్ వచ్చిందన్నారు. బండి సంజయ్, బీజేపీ వాళ్లతో ప్రశాంత్ 140 సార్లు ఫోన్లో మాట్లాడారని గుర్తు చేశారు. వాళ్లే ఉద్దేశపూర్వకంగా ప్రశ్నా పత్రాన్ని లీక్ చేశారన్నారు. 

కావాలని వాళ్లే మీడియాకి ప్రశ్నా పత్రాలను పంపించి లీక్ అయిందంటూ ధర్నాలు చేశారన్నారు. సోషల్ మీడియాలో పేపర్లు వైరల్ చేసి ప్రభుత్వం విఫలమైందంటూ ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. నీచరాజకీయాల కోసం పిల్లల జీవితాలతో బీజేపీ చెలగాటం ఆడుతోందని విమర్శించారు. బండి సంజయ్ పాత్ర పేపర్ల లీకేజీ వ్యవహారంలో ఉందని.. పోలీసుల వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. అలాగే చట్టం తన పని తాను చేసుకుపోతుందని... బండి అరెస్ట్ పై బీజేపీ నాయకులు కేసిఆర్ దిష్టి బొమ్మ దహనం చేయడం దారుణం అన్నారు. 

బండి సంజయ్ తీరుపై ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి ఫైర్ ....

టీఎస్ పీఎస్సీ, పదో తరగతి పేపర్ లీక్ ఓ ప్రణాళిక ప్రకారం జరుగుతున్నాయని ఆర్టీసీ ఛైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. బండి సంజయ్ విద్యార్థులను రెచ్చగొడుతున్నారని చెప్పారు. మొన్న టీఎస్ పీఎస్సీలో జరిగిన లీక్ లో రాజశేఖర్ రెడ్డి పక్కా బండి సంజయ్ మనిషే అని... వాళ్లే దొంగతనం చేసి కేటీఆర్ పైన ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. పదో తరగతి ప్రశ్న పత్రాలు లీక్ చేసిన వ్యక్తి ప్రశాంత్... ఆర్ఎస్ఎస్ మనిషన్నారు. తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ గా ఉన్న బీజేపీ ఇంచార్జ్ సునీల్ బన్సల్.. మత కల్లోలాలు సృష్టించే వ్యక్తి అని ఆరోపించారు. హిందూ, ముస్లింల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. లీకేజీ వ్యవహారంపై సిట్.. బండి సంజయ్, రేవంత్ రెడ్డికి నోటీస్ లు పంపితే పారిపోతున్నారని అన్నారు. దేశంలో సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని అది చూసి ఓర్వలేకే బీజేపీ నీచ రాజకీయాల చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువకులు బీజేపీ ఉచ్చులో పడొద్దని సూచించారు. 

సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఎన్నో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయగా.. కేంద్రం నుంచి ఒక్క కాలేజీ కూడా రాలేదని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గుర్తు చేశారు. ఇక్కడ అభివృద్ధిని అడ్డుకోవాలని బీజేపీ చూస్తోందని అన్నారు. బీజేపీ కి యువకులు, ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. రాష్ట్రంలో నలుగురు బీజేపీ ఎంపీలుగా గెలిచారని.. కానీ వారి నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు ఏమాత్రం జరగటం లేదన్నారు. బండి సంజయ్, రేవంత్ రెడ్డి టీఎస్ పీఎస్సి పేపర్ లీక్ వ్యవహారంలో తోడు దొంగలుగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇద్దరూ ఒకే మాట మాట్లాడుతున్నారని.. బీజేపీ, బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో కలిసే ప్రసక్తే లేదన్నారు. 

అవినీతి లేని రాష్ట్రం తెలంగాణ: ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త

పేపర్ లీక్ వ్యవహారంలో బీజేపీ కుట్ర కచ్చితంగా ఉందని నిజామాబాద్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తెలిపారు. ప్రశాంత్ అనే వ్యక్తి బండి సంజయ్ కి హిందీ పేపర్ వాట్సాప్ లో పెట్టారని తెలిపారు. బీజేపీ నేతలు విద్యార్థుల జీవితాలతో కూడా అడుకుంటున్నారన్నారు. సెక్రటేరియట్ ను కూల దోస్తామంటున్నారని.. విద్యార్థుల జీవితాలతో అడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క మాట అంటేనే రాహుల్ గాంధీపై కక్ష్య సాధిస్తున్నారని.. మరి బండి సంజయ్ వ్యాఖ్యలకు ఎన్ని సార్లు చర్యలు తీసుకోవాలని ప్రశ్నించారు. అధికార దాహం కోసం బీజేపీ పాపాలు చేస్తోందని ఆరోపించారు. బండి సంజయ్ అనుచరుడే పేపర్ లీక్ చేశాడని... ప్రశాంత్, రాజశేఖర్ ప్రతి పేపర్ లీక్ చేసేందుకు యత్నించారన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: మళ్లీ చెప్తున్నా! రాజీవ్ విగ్రహాన్ని సకల మర్యాదలతో తరలించి తీరతాం - కేటీఆర్
మళ్లీ చెప్తున్నా! రాజీవ్ విగ్రహాన్ని సకల మర్యాదలతో తరలించి తీరతాం - కేటీఆర్
Amara Raja Groups Donation: ఏపీ, తెలంగాణలో వరద బాధితులకు అమర రాజా సంస్థ భారీ విరాళం, సీఎంలకు చెక్కులు అందజేత
ఏపీ, తెలంగాణలో వరద బాధితులకు అమర రాజా సంస్థ భారీ విరాళం, సీఎంలకు చెక్కులు అందజేత
Bigg Boss 8 Telugu Episode 17 Day 16: మళ్లీ బయటపడ్డ సోనియా రంగు, ముద్దులతో ముంచెత్తిన పృథ్వీ
మళ్లీ బయటపడ్డ సోనియా రంగు, ముద్దులతో ముంచెత్తిన పృథ్వీ
Lebanon Pagers Blast: లెబనాన్‌లో ఒక్కసారిగా పేలిన పేజర్లతో విధ్వంసం- 8 మంది మృతి, వేలాది మందికి గాయాలు
లెబనాన్‌లో ఒక్కసారిగా పేలిన పేజర్లతో విధ్వంసం- 8 మంది మృతి, వేలాది మందికి గాయాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pawan Kalyan World Record | ఏపీ పంచాయతీరాజ్ శాఖ ప్రపంచ రికార్డు | ABP DesamOperation Polo గురించి 76 ఏళ్ల క్రితం newspapers ఏం రాశాయి | Telangana Liberation Day | ABP Desamనిజాం రాజ్యం ఇండియాలో విలీనమయ్యాక ఖాసిం రజ్వీ ఏమయ్యాడు?Operation Kagar Maoists Death Toll | ప్రాణాలు కోల్పోతున్న అడవిలో అన్నలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: మళ్లీ చెప్తున్నా! రాజీవ్ విగ్రహాన్ని సకల మర్యాదలతో తరలించి తీరతాం - కేటీఆర్
మళ్లీ చెప్తున్నా! రాజీవ్ విగ్రహాన్ని సకల మర్యాదలతో తరలించి తీరతాం - కేటీఆర్
Amara Raja Groups Donation: ఏపీ, తెలంగాణలో వరద బాధితులకు అమర రాజా సంస్థ భారీ విరాళం, సీఎంలకు చెక్కులు అందజేత
ఏపీ, తెలంగాణలో వరద బాధితులకు అమర రాజా సంస్థ భారీ విరాళం, సీఎంలకు చెక్కులు అందజేత
Bigg Boss 8 Telugu Episode 17 Day 16: మళ్లీ బయటపడ్డ సోనియా రంగు, ముద్దులతో ముంచెత్తిన పృథ్వీ
మళ్లీ బయటపడ్డ సోనియా రంగు, ముద్దులతో ముంచెత్తిన పృథ్వీ
Lebanon Pagers Blast: లెబనాన్‌లో ఒక్కసారిగా పేలిన పేజర్లతో విధ్వంసం- 8 మంది మృతి, వేలాది మందికి గాయాలు
లెబనాన్‌లో ఒక్కసారిగా పేలిన పేజర్లతో విధ్వంసం- 8 మంది మృతి, వేలాది మందికి గాయాలు
Tirumala Tickets Online: భక్తులకు గుడ్‌న్యూస్ - డిసెంబర్ నెల శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల విడుదల తేదీలు ప్రకటించిన టీటీడీ
భక్తులకు గుడ్‌న్యూస్ - డిసెంబర్ నెల శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల విడుదల తేదీలు ప్రకటించిన టీటీడీ
AP New Liquor Policy: ఏపీలో మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ - అక్టోబర్ నుంచి కొత్త పాలసీ: మంత్రులు
ఏపీలో మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ - అక్టోబర్ నుంచి కొత్త పాలసీ: మంత్రులు
Adilabad: ఆదిలాబాద్‌లో బావి మీద 52 అడుగుల గణేష్ నిమజ్జనం - ఉన్నచోటే భలే టెక్నిక్!
ఆదిలాబాద్‌లో బావి మీద 52 అడుగుల గణేష్ నిమజ్జనం - ఉన్నచోటే భలే టెక్నిక్!
CTET 2024: సీటెట్‌ డిసెంబరు-2024 నోటిఫికేషన్‌ విడుదల-దరఖాస్తు ప్రారంభం, పరీక్ష ఎప్పుడంటే?
సీటెట్‌ డిసెంబరు-2024 నోటిఫికేషన్‌ విడుదల-దరఖాస్తు ప్రారంభం, పరీక్ష ఎప్పుడంటే?
Embed widget