అన్వేషించండి

Kavitha News: కవితకు మళ్లీ నిరాశే, కస్టడీ పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు

Delhi Liquor Scam: కోర్టు ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ కస్టడీని పొడిగిస్తూ మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. అటు ఈడీ కేసులో కవిత రిమాండ్‌ను ఈ నెల 31 వరకు న్యాయస్థానం పొడిగించిన సంగతి తెలిసిందే.

BRS MLC Kalvakuntla Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత ఇప్పట్లో బయటకు వచ్చే సూచనలు కనిపించడం లేదు. తాజాగా ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ కస్టడీని పొడిగిస్తూ ఈరోజు (జూలై 26) మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. అటు ఈడీ కేసులో కవిత రిమాండ్‌ను ఈ నెల 31 వరకు న్యాయస్థానం పొడిగించింది.

మరోవైపు సీబీఐ కేసులోనూ.. గురువారం (జులై 25) రాత్రి న్యాయమూర్తి కావేరీ బవేజా వాదనలు విన్నారు. సీబీఐ కేసులో కూడా కవిత జ్యుడిషియల్ రిమాండ్‌ను ఆగస్టు 8 వరకు పొడిగించారు. తీహార్ జైలు నుంచి కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. కల్వకుంట్ల కవితతో పాటు ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే కోర్టు ముందు హాజరుపరిచారు.

సీబీఐ కేసులో డీఫాల్ట్‌ బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ కవిత వేసిన పిటిషన్ పై జులై 22న రౌస్‌ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. తదుపరి విచారణను ఆగస్టు 5కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈడీ, సీబీఐ వద్ద బలమైన సాక్ష్యాలు ఉండడంతో కవిత బెయిల్ పిటిషన్లు తిరస్కర ణకు గురవుతున్నాయని అంటున్నారు.

ఆగస్టు 5న విచారణ
ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన అడిషనల్ చార్జిషీట్‌ సరిగా లేదని బెయిల్‌ కోసం కల్వకుంట్ల కవిత దాఖలు చేసుకున్న పిటిషన్‌పై విచారణను ఆగస్టు 5కు రౌస్‌ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది. సీబీఐ అదనపు చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు వెల్లడిస్తూ.. దీనిపై ఈ నెల 26న విచారణ చేపడతామని న్యాయమూర్తి కావేరీ భవేజా వెల్లడించారు. ఆ రోజు కవితను వర్చువల్‌గా హాజరుపర్చాలని ఆదేశించగా.. కవితను నేడు వర్చువల్ గా హాజరుపర్చారు.


ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఏప్రిల్ 11న సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఈడీ మార్చి 15న ఇదే కేసులో అరెస్టు చేసింది. అయితే, ఈడీ కస్టడీలో ఉండగానే కవితను సీబీఐ కూడా అదుపులోకి తీసుకుంది. 3 రోజుల రిమాండ్ అనంతరం ఏప్రిల్ 15 నుంచి జుడీషియల్ కస్టడీలో భాగంగా కవిత తీహార్ జైలులో ఉంటున్నారు. 

ఈ మధ్య కల్వకుంట్ల కవిత అనారోగ్యానికి గురైనట్లు, ఆమెను దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌ హాస్పిటల్‌కు తరలించినట్లుగా కూడా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె జ్వరం, లో బీపీతో బాధపడుతున్నట్టు జైలు అధికారులు తెలిపారు. అంతేకాక, కవిత దాదాపు 10 కిలోల బరువు తగ్గినట్లుగా కూడా బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
Telangana Cabinet: ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
Karimnagar: బైక్ రైడింగ్ తెలుసా? - విదేశాల్లో ఉద్యోగావకాశాలు, జీతం ఎంతంటే?
బైక్ రైడింగ్ తెలుసా? - విదేశాల్లో ఉద్యోగావకాశాలు, జీతం ఎంతంటే?
Sajjala Ramakrishna Reddy: టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - ముగిసిన సజ్జల రామకృష్ణారెడ్డి  విచారణ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - ముగిసిన సజ్జల రామకృష్ణారెడ్డి విచారణ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబానీ Vs మస్క్: బిలియనీర్స్ మధ్య వార్ ఎందుకు!Adilabad Organic Tattoo: పచ్చబొట్టేసినా.. పెళ్లి గ్యారంటీ - నొప్పులు మాయంLady Justice: న్యాయ దేవతకు కళ్లు వచ్చేశాయా? కత్తి బదులు రాజ్యాంగమా?భారీ విధ్వంసానికి హెజ్బుల్లా ప్లాన్, వీడియోలు విడుదల చేసిన ఇజ్రాయేల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
Telangana Cabinet: ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
Karimnagar: బైక్ రైడింగ్ తెలుసా? - విదేశాల్లో ఉద్యోగావకాశాలు, జీతం ఎంతంటే?
బైక్ రైడింగ్ తెలుసా? - విదేశాల్లో ఉద్యోగావకాశాలు, జీతం ఎంతంటే?
Sajjala Ramakrishna Reddy: టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - ముగిసిన సజ్జల రామకృష్ణారెడ్డి  విచారణ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - ముగిసిన సజ్జల రామకృష్ణారెడ్డి విచారణ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
Revanth Reddy : మూసీ పునరుజ్జీవానికి ప్రయత్నిస్తున్నాం - ప్రజలు చెబితే ఆపేస్తాం - సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
మూసీ పునరుజ్జీవానికి ప్రయత్నిస్తున్నాం - ప్రజలు చెబితే ఆపేస్తాం - సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Haryana Rohingya Connection: రోహింగ్యాలను ఓటు బ్యాంకుగా చేసుకున్న కాంగ్రెస్ -  హర్యానా ఎన్నికల్లో బయటపడిన కీలక అంశం
రోహింగ్యాలను ఓటు బ్యాంకుగా చేసుకున్న కాంగ్రెస్ - హర్యానా ఎన్నికల్లో బయటపడిన కీలక అంశం
Nirmal News: వన్యప్రాణులను తరలిస్తోన్న లారీ బోల్తా - రహదారిపై మొసళ్లు, నిర్మల్ జిల్లాలో ఘటన
వన్యప్రాణులను తరలిస్తోన్న లారీ బోల్తా - రహదారిపై మొసళ్లు, నిర్మల్ జిల్లాలో ఘటన
Group 1 Mains Exams: కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ - గ్రూప్ - 1 అభ్యర్థులతో విడివిడిగా భేటీ, పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ
కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ - గ్రూప్ - 1 అభ్యర్థులతో విడివిడిగా భేటీ, పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ
Embed widget