అన్వేషించండి

Revanth Reddy: రచ్చబండ కార్యక్రమం కొనసాగిస్తాం.. కేసీఆర్ వడ్లు ఎవరికి అమ్ముతారు?

3 నెలల నుంచి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఉరిశిక్ష విధిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. పండించిన పంట కొనుగోలు చేయక పోవడం వల్ల రైతుల చనిపోయారన్నారు.

తెలంగాణలో చివరి గింజ వరకు పంటను కొనాల్సిందేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. రచ్చబండ కార్యక్రమానికి వెళ్తున్న ఆయనను అదుపులోకి తీసుకుని.. అంబర్ పేట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత సాయంత్రం ఆయనను విడుదల చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. వరి కొనుగోలు చేయకుంటే సీఎం కేసీఆర్ ని రైతులు ఉరేస్తారని తీవ్రంగా విమర్శించారు. పంట కొనుగోలు విషయంలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు దొందు.. దొందేనని వ్యాఖ్యానించారు. రైతులను వరి వద్దు అని కేసీఆర్ మాత్రం తన వ్యవసాయ క్షేత్రంలో 150 ఎకరాలలో వరి ఎందుకు వేసాడు? అని ప్రశ్నించారు. 

రైతులు చనిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం కనీసం ధైర్యం నింపలేకపోతుంది. రైతుల కల్లాల దగ్గరకి వెళ్ళి రైతులకు ధైర్యం చెప్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్. రైతుల సమస్యలు పక్కన పెట్టి, నిరుద్యోగ సమస్య ముందు పెట్టుకుంది రాష్ట్ర బీజేపీ నేతలు. బీజేపీ,టీఆరెస్ మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారు. ఉద్యోగాల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా నిరుద్యోగులను మోసం చేశారు. దయచేసి రైతులు అధైర్య పడి ఆత్మహత్య చేసుకోవద్దు. చావు పరిష్కారం కాదు. 
                                                                                                - రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

రైతుల వరి పంటను కొనుగోలు చేయను అని మాట్లాడిన కేసీఆర్.. తన ఫామ్ హౌస్ లో పండిన పంటను ఎవరికి అమ్ముతారు? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ వడ్లు కొన్న వాళ్లు... రైతుల వడ్లు కొనరా? అని అడిగారు. రచ్చబండ కార్యక్రమం కొనసాగిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలు టీఆరెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గర్లో ఉన్నాయని విమర్శించారు. బీజేపీ, టీఆరెస్ నేతల వైఖరి వల్లనే నేడు రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రేవంత్ ఆరోపించారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులను రాజులు చేస్తామని వ్యాఖ్యానించారు. యాసంగి లో వడ్లు పండించండి.. రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచి అయిన సరే కొనుగోలు చేయిస్తామన్నారు.

గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లి కేసీఆర్ ఫామ్ హౌస్‌లో 150 ఎకరాలలో వరి పంట సాగుచేశారని, దానిని మీడియాకు చూపిస్తానని కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఎర్రవెల్లిలో రచ్చబండకు సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు. ఇంతలో పోలీసులు రంగంలోకి దిగారు. కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. హౌస్ అరెస్టులు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఆదివారం అర్ధరాత్రి నుంచే పోలీసులు పహారా కాశారు. రచ్చబండకు వెళ్లేందుకు రేవంత్ ఇంటి నుంచి బయటికి రాగానే పోలీసులు అరెస్టు చేసి.. అంబర్ పేట్ పోలీస్ స్టేషన్ కు తరలించి.. సాయంత్రం విడుదల చేశారు.

Also Read: Congress Rachabanda: కాంగ్రెస్ రచ్చబండ కార్యక్రమం ఉద్రిక్తం... రేవంత్ రెడ్డి అరెస్టు, కీలక నేతల హౌస్ అరెస్టులు... టీఆర్ఎస్ ప్రభుత్వం హక్కులను కాలరాస్తుందని మధు యాష్కీ ఆగ్రహం

Also Read: TS BJP Deeksha : జనవరిలోగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోతే అసెంబ్లీని జరగనివ్వం.. నిరుద్యోగ దీక్షలో టీ బీజేపీ హెచ్చరిక !

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Duvvada Srinivas: నా హత్యకు కృష్ణదాస్‌ కుట్ర, దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! ఘాటుగా స్పందించిన మాజీ డిసీఎం
నా హత్యకు కృష్ణదాస్‌ కుట్ర, దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! ఘాటుగా స్పందించిన మాజీ డిసీఎం
Hyderabad Drug Case: హైదరాబాద్‌లో హైఅలర్ట్- డ్రగ్స్‌ కట్టడికి అష్టదిగ్బంధనం- హీరోయిన్ సోదరుడి కోసం గాలింపు
హైదరాబాద్‌లో హైఅలర్ట్- డ్రగ్స్‌ కట్టడికి అష్టదిగ్బంధనం- హీరోయిన్ సోదరుడి కోసం గాలింపు
Prakash Raj : వారిని మొరుగుతూనే ఉండనివ్వండి - అనసూయకు ప్రకాష్ రాజ్ సపోర్ట్
వారిని మొరుగుతూనే ఉండనివ్వండి - అనసూయకు ప్రకాష్ రాజ్ సపోర్ట్
Parvatipram Manyam District: పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో చెత్త రిక్షాలో వృద్ధురాలి మృతదేహం తరలింపు- రాష్ట్రానికి కాదా తలవంపు!
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో చెత్త రిక్షాలో వృద్ధురాలి మృతదేహం తరలింపు- రాష్ట్రానికి కాదా తలవంపు!

వీడియోలు

India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్
Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Duvvada Srinivas: నా హత్యకు కృష్ణదాస్‌ కుట్ర, దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! ఘాటుగా స్పందించిన మాజీ డిసీఎం
నా హత్యకు కృష్ణదాస్‌ కుట్ర, దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! ఘాటుగా స్పందించిన మాజీ డిసీఎం
Hyderabad Drug Case: హైదరాబాద్‌లో హైఅలర్ట్- డ్రగ్స్‌ కట్టడికి అష్టదిగ్బంధనం- హీరోయిన్ సోదరుడి కోసం గాలింపు
హైదరాబాద్‌లో హైఅలర్ట్- డ్రగ్స్‌ కట్టడికి అష్టదిగ్బంధనం- హీరోయిన్ సోదరుడి కోసం గాలింపు
Prakash Raj : వారిని మొరుగుతూనే ఉండనివ్వండి - అనసూయకు ప్రకాష్ రాజ్ సపోర్ట్
వారిని మొరుగుతూనే ఉండనివ్వండి - అనసూయకు ప్రకాష్ రాజ్ సపోర్ట్
Parvatipram Manyam District: పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో చెత్త రిక్షాలో వృద్ధురాలి మృతదేహం తరలింపు- రాష్ట్రానికి కాదా తలవంపు!
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో చెత్త రిక్షాలో వృద్ధురాలి మృతదేహం తరలింపు- రాష్ట్రానికి కాదా తలవంపు!
Medchal Crime News: ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య
ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య
Srikakulam Crime News : శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో కిలాడీ లేడీ - 8 పెళ్లిళ్లు చేసుకొని డబ్బులతో జంప్‌
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో కిలాడీ లేడీ - 8 పెళ్లిళ్లు చేసుకొని డబ్బులతో జంప్‌
Champion Box Office Collection Day 2: 'ఛాంపియన్' కలెక్షన్స్... రెండు రోజుల్లో రోషన్ సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే?
'ఛాంపియన్' కలెక్షన్స్... రెండు రోజుల్లో రోషన్ సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే?
Guntur Railway Station: గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
Embed widget