అన్వేషించండి

Revanth Reddy: రచ్చబండ కార్యక్రమం కొనసాగిస్తాం.. కేసీఆర్ వడ్లు ఎవరికి అమ్ముతారు?

3 నెలల నుంచి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఉరిశిక్ష విధిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. పండించిన పంట కొనుగోలు చేయక పోవడం వల్ల రైతుల చనిపోయారన్నారు.

తెలంగాణలో చివరి గింజ వరకు పంటను కొనాల్సిందేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. రచ్చబండ కార్యక్రమానికి వెళ్తున్న ఆయనను అదుపులోకి తీసుకుని.. అంబర్ పేట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత సాయంత్రం ఆయనను విడుదల చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. వరి కొనుగోలు చేయకుంటే సీఎం కేసీఆర్ ని రైతులు ఉరేస్తారని తీవ్రంగా విమర్శించారు. పంట కొనుగోలు విషయంలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు దొందు.. దొందేనని వ్యాఖ్యానించారు. రైతులను వరి వద్దు అని కేసీఆర్ మాత్రం తన వ్యవసాయ క్షేత్రంలో 150 ఎకరాలలో వరి ఎందుకు వేసాడు? అని ప్రశ్నించారు. 

రైతులు చనిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం కనీసం ధైర్యం నింపలేకపోతుంది. రైతుల కల్లాల దగ్గరకి వెళ్ళి రైతులకు ధైర్యం చెప్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్. రైతుల సమస్యలు పక్కన పెట్టి, నిరుద్యోగ సమస్య ముందు పెట్టుకుంది రాష్ట్ర బీజేపీ నేతలు. బీజేపీ,టీఆరెస్ మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారు. ఉద్యోగాల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా నిరుద్యోగులను మోసం చేశారు. దయచేసి రైతులు అధైర్య పడి ఆత్మహత్య చేసుకోవద్దు. చావు పరిష్కారం కాదు. 
                                                                                                - రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

రైతుల వరి పంటను కొనుగోలు చేయను అని మాట్లాడిన కేసీఆర్.. తన ఫామ్ హౌస్ లో పండిన పంటను ఎవరికి అమ్ముతారు? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ వడ్లు కొన్న వాళ్లు... రైతుల వడ్లు కొనరా? అని అడిగారు. రచ్చబండ కార్యక్రమం కొనసాగిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలు టీఆరెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గర్లో ఉన్నాయని విమర్శించారు. బీజేపీ, టీఆరెస్ నేతల వైఖరి వల్లనే నేడు రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రేవంత్ ఆరోపించారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులను రాజులు చేస్తామని వ్యాఖ్యానించారు. యాసంగి లో వడ్లు పండించండి.. రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచి అయిన సరే కొనుగోలు చేయిస్తామన్నారు.

గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లి కేసీఆర్ ఫామ్ హౌస్‌లో 150 ఎకరాలలో వరి పంట సాగుచేశారని, దానిని మీడియాకు చూపిస్తానని కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఎర్రవెల్లిలో రచ్చబండకు సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు. ఇంతలో పోలీసులు రంగంలోకి దిగారు. కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. హౌస్ అరెస్టులు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఆదివారం అర్ధరాత్రి నుంచే పోలీసులు పహారా కాశారు. రచ్చబండకు వెళ్లేందుకు రేవంత్ ఇంటి నుంచి బయటికి రాగానే పోలీసులు అరెస్టు చేసి.. అంబర్ పేట్ పోలీస్ స్టేషన్ కు తరలించి.. సాయంత్రం విడుదల చేశారు.

Also Read: Congress Rachabanda: కాంగ్రెస్ రచ్చబండ కార్యక్రమం ఉద్రిక్తం... రేవంత్ రెడ్డి అరెస్టు, కీలక నేతల హౌస్ అరెస్టులు... టీఆర్ఎస్ ప్రభుత్వం హక్కులను కాలరాస్తుందని మధు యాష్కీ ఆగ్రహం

Also Read: TS BJP Deeksha : జనవరిలోగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోతే అసెంబ్లీని జరగనివ్వం.. నిరుద్యోగ దీక్షలో టీ బీజేపీ హెచ్చరిక !

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్‌ బస్సును ఢీకొట్టిన రైలు- ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్‌ బస్సును ఢీకొట్టిన రైలు- ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
Rains In AP And Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
Asifabad Forest Officials Attack Case: సార్సాల అటవీ అధికారులపై దాడి కేసు.. మాజీ జెడ్పీ వైస్ చైర్మన్‌ సహా 8 మందికి జైలు శిక్ష
సార్సాల అటవీ అధికారులపై దాడి కేసు.. మాజీ జెడ్పీ వైస్ చైర్మన్‌ సహా 8 మందికి జైలు శిక్ష
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Rains In AP And Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Asifabad Forest Officials Attack Case: సార్సాల అటవీ అధికారులపై దాడి కేసు.. మాజీ జెడ్పీ వైస్ చైర్మన్‌ సహా 8 మందికి జైలు శిక్ష
సార్సాల అటవీ అధికారులపై దాడి కేసు.. మాజీ జెడ్పీ వైస్ చైర్మన్‌ సహా 8 మందికి జైలు శిక్ష
Rohit Sharma Retirement: రోహిత్‌శర్మ రిటైర్మెంట్‌ న్యూస్! లార్డ్స్ వన్డే తర్వాత ఆటకు వీడ్కోలు! వరల్డ్‌కప్ ప్లాన్స్‌లో లేడని తేల్చి చెప్పిన బీసీసీఐ!
రోహిత్‌శర్మ రిటైర్మెంట్‌ న్యూస్! లార్డ్స్ వన్డే తర్వాత ఆటకు వీడ్కోలు! వరల్డ్‌కప్ ప్లాన్స్‌లో లేడని తేల్చి చెప్పిన బీసీసీఐ!
Supreme Court On Third Language: 9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
Embed widget