అన్వేషించండి

Revanth Reddy: కేసీఆర్ అడిగింది లేదు, మోదీ ఇచ్చిందీ లేదు - రేవంత్ రెడ్డి

Revanth Reddy Press Meet: పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు అప్పగించామని రేవంత్ రెడ్డి అన్నారు.

Revanth Reddy on KCR: తెలంగాణ ప్రజల హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా హక్కులను కాపాడలేని అన్నారు. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు, నిధుల గురించి కేసీఆర్ ఏనాడు ప్రధాని మోదీని అడగలేదని.. అందుకే ఆయన ఇవ్వలేదని అన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు అప్పగించామని అన్నారు. అందుకోసం సెలక్షన్ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గాంధీ భవన్‌లో రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు.

నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక ఏకంగా వంద లక్షల కోట్ల అప్పులు చేశారు. మణిపూర్ లో విధ్వంసం జరిగితే కనీసం ఆ పర్యటనకు మోదీ వెళ్లలేదు. కానీ, రాహుల్ గాంధీ మాత్రం మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకూ భారత్ జోడో న్యాయ యాత్ర చేపడుతున్నారు. ఆయన అవసరం దేశానికి చాలా అవసరం ఉంది. ఆయన ప్రధాని అవ్వాలంటే.. తెలంగాణలో అన్ని పార్లమెంటు స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటు వేస్తే మూసీలో వేసినట్లే అవుతుంది. బీఆర్ఎస్ ను, బీజేపీని నిలువరించేది కాంగ్రెస్ పార్టీనే. గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. రాష్ట్రం ప్రయోజనాలను ఏనాడూ కేంద్రాన్ని అడగలేదు. అందుకే మోదీ ఇవ్వలేదు.

రాజకీయ కుట్రతో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకున్నారు. కేసీఆర్ దొడ్లో చెప్పులు మోసేవారితో ప్రొఫెసర్ కోదండరామ్ ను పోల్చుతున్నారు. కోదండరాం గొప్పదనాన్ని ప్రశ్నించడం.. బీఆర్ఎస్ పార్టీ బావదారిద్య్రాన్ని చాటుతోంది’’ అని రేవంత్ రెడ్డి అన్నారు.

‘‘అభ్యర్థులను నిర్ణయించే సర్వ అధికారాలను ఖర్గే, ఏఐసీసీకి అప్పగిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశాము. లోక్ సభలో పోటీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది కాంగ్రెస్ పార్టీ. మార్చి 3వ తేదీ వరకు లోక్ సభ సీటు కోసం దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తుల స్క్రూటినీ కోసం ప్రత్యేక కమిటీ వేయడం జరిగింది. 17 పార్లమెంట్ సెగ్మెంట్ లకు మంత్రులను, ఇంచార్జీలను నియమించాము. దేశ ప్రజలకి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో మోదీ విఫలం అయ్యారు. ప్రపంచంలో అత్యధికంగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్న దేశంగా ఇండియా అవ్వడం మోదీ ఘనతే. రైతులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చెయ్యలేదు. దేశ ప్రజల మీద వంద లక్షల కోట్ల అప్పులు చేసి మోపారు. మణిపూర్ లో అంతటి హింసా ఘటన జరిగితే మోదీ అక్కడికి వెళ్ళలేదు. దేశానికి బీజేపీ ప్రమాదకరంగా మారింది’’ అని రేవంత్ రెడ్డి అన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly Budget Session: ప్రశ్నోత్తరాలు లేకుండా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. బీఆర్ఎస్ విమర్శలు! బీజేపీ వినూత్న నిరసన
ప్రశ్నోత్తరాలు లేకుండా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. బీఆర్ఎస్ విమర్శలు! బీజేపీ వినూత్న నిరసన
Ustaad Bhagat Singh: 'రాజా సాబ్' చేసిన తప్పు 'ఉస్తాద్' చేయలేదు
'రాజా సాబ్' చేసిన తప్పు 'ఉస్తాద్' చేయలేదు
BRS On Rohit Reddy: మొయినాబాద్ డ్రగ్స్ కేసు- రోహిత్ రెడ్డికి బీఆర్‌ఎస్ షోకాజ్ నోటీసులు.. పార్టీకి దూరంగా ఉండాలని ఆదేశాలు
మొయినాబాద్ డ్రగ్స్ కేసు- రోహిత్ రెడ్డికి బీఆర్‌ఎస్ షోకాజ్ నోటీసులు.. పార్టీకి దూరంగా ఉండాలని ఆదేశాలు
Ustaad Bhagat Singh: తెలంగాణలో పెంచలేదు... నార్మల్ టికెట్ రేట్స్‌కు 'ఉస్తాద్'
తెలంగాణలో పెంచలేదు... నార్మల్ టికెట్ రేట్స్‌కు 'ఉస్తాద్'

వీడియోలు

AIMIM MLAs Walkout Vandematarm | తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఘటనపై కేంద్ర మంత్రుల ఫైర్ | ABP Desam
Jay Shah Smashes T20W C 2026 Controversies | పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు జై షా వార్నింగ్ | ABP Desam
Abhishek Sharma T20WC 2026 Secret Revealed | అభిషేక్ కు గంభీర్ సలహా | ABP Desam
Rishabh Pant Transformation IPL 2026 | యువరాజ్ సింగ్ శిక్షణలో రిషబ్ పంత్ | ABP Desam
Sanju Samson Funny Advice to Abhishek | అభిషేక్ శర్మకు సంజూ పెళ్లి సలహా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ramzan 2026: ఇమామ్‌లు, మౌజన్లకు చంద్రబాబు సర్కార్ రంజాన్ కానుక.. 10 వేల ఖాతాల్లోకి నగదు జమ
ఇమామ్‌లు, మౌజన్లకు చంద్రబాబు సర్కార్ రంజాన్ కానుక.. 10 వేల ఖాతాల్లోకి నగదు జమ
BRS On Rohit Reddy: మొయినాబాద్ డ్రగ్స్ కేసు- రోహిత్ రెడ్డికి బీఆర్‌ఎస్ షోకాజ్ నోటీసులు.. పార్టీకి దూరంగా ఉండాలని ఆదేశాలు
మొయినాబాద్ డ్రగ్స్ కేసు- రోహిత్ రెడ్డికి బీఆర్‌ఎస్ షోకాజ్ నోటీసులు.. పార్టీకి దూరంగా ఉండాలని ఆదేశాలు
Pakistan Airstrike: కాబూల్‌లో పాక్ వైమానిక దాడులు.. 400 మందికి పైగా మృతి- హాస్పిటల్స్, నివాస ప్రాంతాలే టార్గెట్
కాబూల్‌లో పాక్ వైమానిక దాడులు.. 400 మందికి పైగా మృతి- హాస్పిటల్స్, నివాస ప్రాంతాలే టార్గెట్
Akshay Kumar: నవ్వించడం కష్టమే కానీ... అవార్డులు ఇవ్వరుగా - అక్షయ్ కుమార్ కామెంట్స్‌
నవ్వించడం కష్టమే కానీ... అవార్డులు ఇవ్వరుగా - అక్షయ్ కుమార్ కామెంట్స్‌
Telangana Assembly Budget Session: ప్రశ్నోత్తరాలు లేకుండా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. బీఆర్ఎస్ విమర్శలు! బీజేపీ వినూత్న నిరసన
ప్రశ్నోత్తరాలు లేకుండా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. బీఆర్ఎస్ విమర్శలు! బీజేపీ వినూత్న నిరసన
Kerala Assembly Elections 2026: కేరళంలో కాంగ్రెస్‌కు డూ ఆర్ డై ఎన్నికలు - మూడోసారీ ఓడిపోతే బీజేపీదే ఆ స్థానం !
కేరళంలో కాంగ్రెస్‌కు డూ ఆర్ డై ఎన్నికలు - మూడోసారీ ఓడిపోతే బీజేపీదే ఆ స్థానం !
YSRCP local polls plan: లోకల్‌పోల్స్‌లో అసలు టార్గెట్ కూటమి మధ్య చిచ్చే - వైసీపీ పక్కా ప్లాన్‌తో రెడీ అవుతోందా?
లోకల్‌పోల్స్‌లో అసలు టార్గెట్ కూటమి మధ్య చిచ్చే - వైసీపీ పక్కా ప్లాన్‌తో రెడీ అవుతోందా?
Weight Loss Journey : మూడు సంవత్సరాల్లో 72 కిలోలు తగ్గిన మహిళ.. ఈ 7 సింపుల్ హ్యాబిట్స్ మిమ్మల్నీ కూడా మార్చేస్తాయి
మూడు సంవత్సరాల్లో 72 కిలోలు తగ్గిన మహిళ.. ఈ 7 సింపుల్ హ్యాబిట్స్ మిమ్మల్నీ కూడా మార్చేస్తాయి
Embed widget