అన్వేషించండి

Revanth Reddy: కల్వకుర్తికి సీఎం రేవంత్ రెడ్డి వరాలు, తాను చదువుకున్న స్కూల్‌కు సైతం రూ.5 కోట్లు ప్రకటన

Telangana News | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లలో పర్యటించారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం అభివృద్ధికి రూ.309 కోట్లు నిధులు ఇస్తామని ప్రకటించారు.

Revanth Reddy announces Rs 309 crores to development for Kalwakurthy | కల్వకుర్తి: నాగర్‌కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గం అభివృద్ధికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లులు కురిపించారు. కల్వకుర్తి అభివృద్ధికి ఏకంగా రూ. 309 కోట్లు ప్రకటించారు. తాను చదువుకున్న తాండ్ర పాఠశాలకు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి రూ.50 లక్షలు అడిగినట్లు పేర్కొన్న సీఎం రేవంత్ రెడ్డి.. రూ. 5 కోట్లు ఇచ్చి ఆ పాఠశాలను అభివృద్ది చేపిస్తా అని హామీ ఇచ్చారు. నాగర్ కర్నూల్ జిల్లా కొట్ర చౌరస్తాలో కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం కల్వకుర్తిలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. 

కల్వకుర్తిలో 50 పడకల మెటర్నిటి అండ్ చైల్డ్ (MCH) ఆసుపత్రికి రూ.22 కోట్లు ప్రభుత్వం ఇవ్వనుంది. దాంతో పాటు ఆమనగల్ లో  స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ కు రూ.10 కోట్లు నిధులు, రూ.163  కోట్ల వ్యయంతో నాలుగు R&B రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు. కల్వకుర్తి పట్టణంలో R&B గెస్ట్ హౌస్ నిర్మాణానికి రూ.5 కోట్లు, ఐదు హైలెవెల్ బ్రిడ్జిల నిర్మాణానికి రూ. 15 కోట్లు, పంచాయతీ రోడ్లకు రూ.78 కోట్లు, మాడ్గుల మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.8.3 కోట్లు కేటాయించనున్నారు. మాడ్గుల మండల కేంద్రంలో  భూగర్భ డ్రైనేజీ పనులకు రూ.7.75 కోట్ల నిధులు ఖర్చు పెట్టనుంది తెలంగాణ సర్కార్. 

ఈ నెలాఖరులోపు రూ.1.5 లక్షల రుణమాఫీ
రెండో విడత కింద జూలై 31 లోపు రూ.1.5 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాను ఆగస్ట్ 2 నుండి 14వ తేదీ వరకు విదేశీ పర్యటనకు వెళ్తున్నానని తెలిపారు. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చాక.. ఆగస్ట్ నెలలోనే హామీ ఇచ్చినట్లుగా రూ. 2 లక్షల వరకు రైతుల రుణమాఫీ చేస్తామని కల్వకుర్తి బహిరంగ సభలో  సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.

కల్వకుర్తి బహిరంగ సభలో రేవంత్ ఇంకా మాట్లాడుతూ.. ‘ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు... నేను ఎప్పటికీ మీ నల్లమల బిడ్డను. మీ సోదరుడిగానే ఉంటా. నమ్మిన సిద్ధాంతం ప్రకారం జైపాల్ రెడ్డి రాజకీయాలు చేశారు. అధికారంలో ఉన్నా లేకున్నా... చివరి శ్వాస వరకు ప్రజా జీవితంలో ఉన్నారు. జైపాల్ రెడ్డి పదవులకే గౌరవం తెచ్చేలా వ్యవహరించారు. రాజకీయాల్లో విలువలకు ప్రాధాన్యతనిచ్చిన వ్యక్తి జైపాల్ రెడ్డి. కల్వకుర్తి నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం చేజారిందని ఆనాడు జైపాల్ రెడ్డి బాధపడ్డారు. జైపాల్ రెడ్డి సూచన మేరకే ఆనాడు తలుపులు మూసి, లైవ్ కట్ చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారు. ఆనాడు సీఎం అభ్యర్థిగా జైపాల్ రెడ్డి పేరు ప్రకటించింటే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది.

కాంగ్రెస్ మాట ఇస్తే చేసి తీరుతుంది. చెప్పిన ప్రకారం రైతులకు రుణమాఫీ చేసి తీరుతాం. కల్వకుర్తిలో 100 పడకల ఆసుపత్రి, ఆర్ అండ్ బీ రోడ్లు, గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం నిధులు ఇస్తున్నాం. ముచ్చెర్ల ప్రాంతంలో ఆగస్టు 1న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకోబోతున్నాం. అధికారం కోల్పోయిన బాధ బీఆరెస్ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతిపక్షం తన బాధ్యత సరిగ్గా నిర్వహించి ఉంటే కనీసం పంచాయతీ ఎన్నికల్లోనైనా ఛాన్స్ ఉంటుంది. కానీ ప్రజలు వారికి అవకాశం ఇవ్వరు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ కార్యకర్తలు సన్నద్ధం కావాలని’ ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
CM Revanth Reddy: కిలాడీల కమిటీ ఢిల్లీ వెళ్లి ఎన్డీఎస్‌ఏను ఒప్పించాలి - కాళేశ్వరంపై హరీష్ , కేటీఆర్, ఈటలకు రేవంత్ సవాల్
కిలాడీల కమిటీ ఢిల్లీ వెళ్లి ఎన్డీఎస్‌ఏను ఒప్పించాలి - కాళేశ్వరంపై హరీష్ , కేటీఆర్, ఈటలకు రేవంత్ సవాల్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget