అన్వేషించండి

Revanth Reddy: కల్వకుర్తికి సీఎం రేవంత్ రెడ్డి వరాలు, తాను చదువుకున్న స్కూల్‌కు సైతం రూ.5 కోట్లు ప్రకటన

Telangana News | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లలో పర్యటించారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం అభివృద్ధికి రూ.309 కోట్లు నిధులు ఇస్తామని ప్రకటించారు.

Revanth Reddy announces Rs 309 crores to development for Kalwakurthy | కల్వకుర్తి: నాగర్‌కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గం అభివృద్ధికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లులు కురిపించారు. కల్వకుర్తి అభివృద్ధికి ఏకంగా రూ. 309 కోట్లు ప్రకటించారు. తాను చదువుకున్న తాండ్ర పాఠశాలకు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి రూ.50 లక్షలు అడిగినట్లు పేర్కొన్న సీఎం రేవంత్ రెడ్డి.. రూ. 5 కోట్లు ఇచ్చి ఆ పాఠశాలను అభివృద్ది చేపిస్తా అని హామీ ఇచ్చారు. నాగర్ కర్నూల్ జిల్లా కొట్ర చౌరస్తాలో కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం కల్వకుర్తిలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. 

కల్వకుర్తిలో 50 పడకల మెటర్నిటి అండ్ చైల్డ్ (MCH) ఆసుపత్రికి రూ.22 కోట్లు ప్రభుత్వం ఇవ్వనుంది. దాంతో పాటు ఆమనగల్ లో  స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ కు రూ.10 కోట్లు నిధులు, రూ.163  కోట్ల వ్యయంతో నాలుగు R&B రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు. కల్వకుర్తి పట్టణంలో R&B గెస్ట్ హౌస్ నిర్మాణానికి రూ.5 కోట్లు, ఐదు హైలెవెల్ బ్రిడ్జిల నిర్మాణానికి రూ. 15 కోట్లు, పంచాయతీ రోడ్లకు రూ.78 కోట్లు, మాడ్గుల మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.8.3 కోట్లు కేటాయించనున్నారు. మాడ్గుల మండల కేంద్రంలో  భూగర్భ డ్రైనేజీ పనులకు రూ.7.75 కోట్ల నిధులు ఖర్చు పెట్టనుంది తెలంగాణ సర్కార్. 

ఈ నెలాఖరులోపు రూ.1.5 లక్షల రుణమాఫీ
రెండో విడత కింద జూలై 31 లోపు రూ.1.5 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాను ఆగస్ట్ 2 నుండి 14వ తేదీ వరకు విదేశీ పర్యటనకు వెళ్తున్నానని తెలిపారు. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చాక.. ఆగస్ట్ నెలలోనే హామీ ఇచ్చినట్లుగా రూ. 2 లక్షల వరకు రైతుల రుణమాఫీ చేస్తామని కల్వకుర్తి బహిరంగ సభలో  సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.

కల్వకుర్తి బహిరంగ సభలో రేవంత్ ఇంకా మాట్లాడుతూ.. ‘ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు... నేను ఎప్పటికీ మీ నల్లమల బిడ్డను. మీ సోదరుడిగానే ఉంటా. నమ్మిన సిద్ధాంతం ప్రకారం జైపాల్ రెడ్డి రాజకీయాలు చేశారు. అధికారంలో ఉన్నా లేకున్నా... చివరి శ్వాస వరకు ప్రజా జీవితంలో ఉన్నారు. జైపాల్ రెడ్డి పదవులకే గౌరవం తెచ్చేలా వ్యవహరించారు. రాజకీయాల్లో విలువలకు ప్రాధాన్యతనిచ్చిన వ్యక్తి జైపాల్ రెడ్డి. కల్వకుర్తి నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం చేజారిందని ఆనాడు జైపాల్ రెడ్డి బాధపడ్డారు. జైపాల్ రెడ్డి సూచన మేరకే ఆనాడు తలుపులు మూసి, లైవ్ కట్ చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారు. ఆనాడు సీఎం అభ్యర్థిగా జైపాల్ రెడ్డి పేరు ప్రకటించింటే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది.

కాంగ్రెస్ మాట ఇస్తే చేసి తీరుతుంది. చెప్పిన ప్రకారం రైతులకు రుణమాఫీ చేసి తీరుతాం. కల్వకుర్తిలో 100 పడకల ఆసుపత్రి, ఆర్ అండ్ బీ రోడ్లు, గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం నిధులు ఇస్తున్నాం. ముచ్చెర్ల ప్రాంతంలో ఆగస్టు 1న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకోబోతున్నాం. అధికారం కోల్పోయిన బాధ బీఆరెస్ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతిపక్షం తన బాధ్యత సరిగ్గా నిర్వహించి ఉంటే కనీసం పంచాయతీ ఎన్నికల్లోనైనా ఛాన్స్ ఉంటుంది. కానీ ప్రజలు వారికి అవకాశం ఇవ్వరు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ కార్యకర్తలు సన్నద్ధం కావాలని’ ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక.. తుది తీర్పు వాయిదా వేసిన హైకోర్టు
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక.. తుది తీర్పు వాయిదా వేసిన హైకోర్టు
Ganja Seized: బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు.. వ్యక్తి లగేజీ చెక్ చేస్తే రూ. 14 కోట్ల గంజాయి
బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు.. వ్యక్తి లగేజీ చెక్ చేస్తే రూ. 14 కోట్ల గంజాయి
Congress guarantees: కారణాలు కాదు హామీల అమలు కావాలి - మాటల చాణక్యంతో ఆర్థిక నిస్సహాయతను రేవంత్ అధిగమిస్తారా?
కారణాలు కాదు హామీల అమలు కావాలి - మాటల చాణక్యంతో ఆర్థిక నిస్సహాయతను రేవంత్ అధిగమిస్తారా?
Hyderabad Biryani:బంజారాహిల్స్‌లో మూడు రోజుల బిర్యానీ విక్రయిస్తున్న హోటల్ సీజ్! ఎలుకలు తిరుగుతున్న ఫ్రిడ్జ్‌లో ఆహారం నిల్వ! 
బంజారాహిల్స్‌లో మూడు రోజుల బిర్యానీ విక్రయిస్తున్న హోటల్ సీజ్! ఎలుకలు తిరుగుతున్న ఫ్రిడ్జ్‌లో ఆహారం నిల్వ! 

వీడియోలు

Bumrah vs Vaibhav Suryavanshi IPL 2026 | బుమ్రా యార్కర్ల ముందు వైభవ్ నిలబడగలడా?
Ashwin about CSK’s Failure IPL 2026 | సీఎస్కే వైఫల్యంపై అశ్విన్ కామెంట్స్
Who Is Prashant Veer CSK IPL 2026 | ఎవరీ ప్రశాంత్ వీర్
Hardik Pandya back in Mumbai Indians Team | ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్
IPL 2026 KKR VS PBKS Cameron Green | వరుసగా విఫలమవుతున్న కామెరూన్ గ్రీన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kurnool Bus Tragedy: ఎమర్జెన్సీ డోర్ మూసేయడంతో 19 ప్రాణాలు పోయాయి. కర్నూలు బస్సు ప్రమాదంపై ASCI నివేదిక
ఎమర్జెన్సీ డోర్ మూసేయడంతో 19 ప్రాణాలు పోయాయి. కర్నూలు బస్సు ప్రమాదంపై ASCI నివేదిక
Share Market: ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లో వైల్డ్ ఫైర్.. సెన్సెక్స్ 2800, నిఫ్టీ 800 పాయింట్లు జంప్
ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లో వైల్డ్ ఫైర్.. సెన్సెక్స్ 2800, నిఫ్టీ 800 పాయింట్లు జంప్
Amaravati Gazette: అమరావతి గెజిట్‌తోనే అన్నీ అయిపోవు - ప్రభుత్వం మూడేళ్లలో చేయాల్సింది చాలా ఉంది - లేకపోతే?
అమరావతి గెజిట్‌తోనే అన్నీ అయిపోవు - ప్రభుత్వం మూడేళ్లలో చేయాల్సింది చాలా ఉంది - లేకపోతే?
Naga Vamsi : మాకు క్లాసులు పీకావ్... ప్రొడ్యూసర్ కష్టాలు తెలిశాయా! - సుప్రియపై నాగవంశీ, మైత్రీ రవి ఫన్ ర్యాగింగ్
మాకు క్లాసులు పీకావ్... ప్రొడ్యూసర్ కష్టాలు తెలిశాయా! - సుప్రియపై నాగవంశీ, మైత్రీ రవి ఫన్ ర్యాగింగ్
Congress guarantees: కారణాలు కాదు హామీల అమలు కావాలి - మాటల చాణక్యంతో ఆర్థిక నిస్సహాయతను రేవంత్ అధిగమిస్తారా?
కారణాలు కాదు హామీల అమలు కావాలి - మాటల చాణక్యంతో ఆర్థిక నిస్సహాయతను రేవంత్ అధిగమిస్తారా?
Toll Tax New Rule: టోల్ ప్లాజాల వద్ద కేవలం క్యాష్‌లెస్ పేమెంట్స్.. ఏప్రిల్ 10 నుంచి FASTAG, UPI ద్వారా చెల్లింపులు
టోల్ ప్లాజాల వద్ద కేవలం క్యాష్‌లెస్ పేమెంట్స్.. ఏప్రిల్ 10 నుంచి FASTAG, UPI ద్వారా చెల్లింపులు
IPL 2026 RR VS MI Result Update: రాజ‌స్థాన్ రాయ‌ల్స్ హ్యాట్రిక్.. ముంబైపై ఘ‌న విజ‌యం.. దుమ్మురేపిన జైస్వాల్, సూర్య‌వంశీ.. ప‌ట్టిక‌లో టాప్ ప్లేస్ కు రాయ‌ల్స్
రాజ‌స్థాన్ రాయ‌ల్స్ హ్యాట్రిక్.. ముంబైపై ఘ‌న విజ‌యం.. దుమ్మురేపిన జైస్వాల్, సూర్య‌వంశీ.. ప‌ట్టిక‌లో టాప్ ప్లేస్ కు రాయ‌ల్స్
Vaibhav Suryavanshi: డేయ్.. బుమ్రా అనుకుంటున్నావా..? లేక టుమ్రీ అనుకున్నావా ఆ కొట్టుడేంది.. బుడ్డోడా..?
డేయ్.. బుమ్రా అనుకుంటున్నావా..? లేక టుమ్రీ అనుకున్నావా ఆ కొట్టుడేంది.. బుడ్డోడా..?
Embed widget