అన్వేషించండి

Revanth Reddy Chit Chat: పదిన్నరేళ్లు నేనే సీఎం - ఢిల్లీలో రేవంత్ చిట్ చాట్ - ఈ లెక్కేంటో తెలుసా?

CM Revanth Chit Chat: పదిన్నర సంవత్సరాల తానే సీఎంగా ఉంటానని రేవంత్ నమ్మకం వ్యక్తం చేశారు. ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో పలు కీలక అంశాలపై మాట్లాడారు.

Revanth Reddy Chit Chat in Delhi: తెలంగాణ రాజకీయాల్లో తనకు ఎదురులేదని  రాష్ట్రానికి నేనే రాజు.. నేనే మంత్రిని.. నాకు ఎవరూ పోటీ కాదు అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన  జాతీయ మీడియా ప్రతినిధఉలతో  ఇష్టాగోష్టిగా మాట్లాడారు.  గంటన్నర పాటు సాగిన ఈ భేటీలో ఆయన పాలన, భవిష్యత్తు రాజకీయాలు మరియు జమిలి ఎన్నికలపై అత్యంత ధీమాతో చేసిన వ్యాఖ్యలు  హాట్ టాపిక్ అయ్యాయి.  

వచ్చే పదిన్నర ఏళ్ల పాటు ముఖ్యమంత్రి పీఠంపై తానే ఉంటానని, పాలనలో తన ముద్రను మరింత బలంగా వేస్తానని ధీమా వ్యక్తం చేశారు. పదిన్నరేళ్ల లెక్క ఏమిటంటే.. వచ్చే ఎన్నికలు 2028లో జరగబోవని 2029లో జమిలీగానే జరుగుతాయని.. అప్పటి వరకూ తానే సీఎంగా ఉంటానని చెబుతున్నారు. ప్రత్యర్థి పార్టీల విమర్శలను కొట్టిపారేస్తూ, తన నాయకత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని తేల్చి చెప్పారు. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న  జమిలి ఎన్నికలపై రేవంత్ రెడ్డి కీలక విశ్లేషణ చేశారు. 2029లో జమిలి ఎన్నికలు రావడం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, అంతకంటే ముందు దేశంలో జనగణన , నియోజకవర్గాల పునర్విభజన , పార్లమెంట్ సీట్ల పెంపు ,మహిళా రిజర్వేషన్ల అమలు వంటి కీలక ప్రక్రియలు పూర్తి కావాల్సి ఉంటుందని వివరించారు. ఈ పరిణామాలన్నీ ముగిసిన తర్వాతే దేశం ఒకే సారి ఎన్నికలకు వెళ్తుందని ఆయన విశ్లేషించారు.
 
నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని, ఇది రాజకీయ సమీకరణాలను మారుస్తుందని రేవంత్ పేర్కొన్నారు. సీట్ల పెంపు తర్వాత వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని మెజారిటీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రంతో సఖ్యతగా ఉంటూనే రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతామని, అదే సమయంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తామని చెప్పారు. తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక నందమూరి తారకరామారావుపై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  ఎన్టీఆర్ జాతి ఆస్తి, ఆయన ఎవరో ఒకరి సొత్తు కాదు.. ఆయనొక నేషనల్ లీడర్" అని అభివర్ణించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూనే, పార్లమెంటులో ఆయన విగ్రహాన్ని పెట్టింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తుచేశారు.  . కేసీఆర్ ప్రస్తుతం స్వయం ప్రకటిత గృహ నిర్బంధంలో ఉన్నారని ఎద్దేవా చేసిన రేవంత్, తాను ఎవరి ఫోన్లను ట్యాప్ చేయడం లేదని, ఇతరుల వ్యక్తిగత విషయాలు వినడం మానసిక క్షోభ అని స్పష్టం చేశారు.
 
రాష్ట్రంలోని కీలక ప్రాజెక్టులపై సీఎం రేవంత్ స్పష్టమైన టైమ్ లైన్ ప్రకటించారు. మార్చి 31 లోపు హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం టేకోవర్ చేసే ప్రక్రియను పూర్తి చేస్తామని వెల్లడించారు. అలాగే, జూన్ 2వ తేదీన ఆదిలాబాద్ మరియు వరంగల్ విమానాశ్రయాలకు శంకుస్థాపన చేస్తామని ప్రకటించడం ద్వారా ఉత్తర తెలంగాణ అభివృద్ధిపై తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. సింగరేణి సమస్యలపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఒక రోజంతా చర్చ జరిపి అన్ని విషయాలను బహిర్గతం చేస్తామని చెప్పారు. ఇక ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదంపై వస్తున్న ప్రచారాన్ని కొట్టిపారేస్తూ, అనాలసిస్ పూర్తయ్యాక అక్కడ ఆధారాలు ఉండవని సాంకేతిక అంశాన్ని వివరించారు.
 
కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీపై ఆంధ్రప్రదేశ్ వైఖరిని రేవంత్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టులకు ఇప్పుడు ఏపీ ఎందుకు అభ్యంతరం చెబుతోందని ప్రశ్నించారు.  తెలంగాణకు రావాల్సిన నీటి వాటా ఇచ్చి ఏపీ ప్రాజెక్టులు కట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు  అని చెబుతూనే, నికర జలాల లెక్కల ప్రకారం తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవద్దని సూచించారు. రెండు రాష్ట్రాల్లో ప్రాజెక్టుల నిర్మాణానికి ఒకే విధానం ఉండాలని కోరారు. అలాగే మహబూబ్ నగర్ హత్యారాజకీయాల ఆరోపణలను తోసిపుచ్చుతూ, ఒక కౌన్సిలర్ కోసం అటువంటి పనులు చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు.

ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ, ఎవరినైనా జైల్లో వేయాలనుకుంటే తాము చట్టప్రకారం, నిబంధనలకు లోబడే ముందుకు వెళ్తామని, రాజ్యాంగం ప్రకారమే తన నడక ఉంటుందని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రస్తుతం తొలి అంకానికి చేరిందని, విదేశాల నుంచి ప్రభాకర్ రావును తీసుకురావడానికి 20 నెలలు పట్టిందని, ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగానే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలపై స్పందిస్తూ, కేవలం కుంగిన మూడు గేట్లే కాకుండా మొత్తం ప్రాజెక్టును అధ్యయనం చేయాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించిందని, నిపుణుల కమిటీ నివేదిక రాకుండా కేసీఆర్, హరీష్ రావు కోరినట్లు తాము తొందరపడి నిర్ణయాలు తీసుకోమని రేవంత్ తేల్చి చెప్పారు.   ఫార్ములా రేస్ కేసులో మనీ లాండరింగ్ కోణంలో ఈడీ ఎందుకు స్పందించడం లేదని, సోనియా, రాహుల్ గాంధీలను విచారించిన ఈడీ.. కేటీఆర్ విషయంలో ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు.
 
దేశంలో ఎన్నికల సంస్కరణలపై రేవంత్ రెడ్డి కీలక విశ్లేషణ చేశారు. 2029లో జమిలి ఎన్నికలు జరగడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. దీనికి సంబంధించి ఒక కాలక్రమ పట్టికను కూడా ఆయన వివరించారు. 2027 మే లేదా జూన్ నాటికి జనాభా లెక్కలు తేలుతాయని, 2028 నాటికి మహిళా రిజర్వేషన్లు మరియు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తవుతుందని అంచనా వేశారు. ఇక పార్టీ పరంగా కేబినెట్ విస్తరణపై అధిష్టానంతో చర్చించలేదని క్లారిటీ ఇచ్చారు.  
 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Basara Temple Master Plan: రూ.225 కోట్ల‌తో బాస‌ర స‌ర‌స్వ‌తి ఆల‌యం పునర్ నిర్మాణం.. 9 అంత‌స్తుల రాజ‌గోపురం, ఈశాన్యాన కోనేరు
రూ.225 కోట్ల‌తో బాస‌ర స‌ర‌స్వ‌తి ఆల‌యం పునర్ నిర్మాణం.. 9 అంత‌స్తుల రాజ‌గోపురం, ఈశాన్యాన కోనేరు
Khanapur Municipal Chairman: కాంగ్రెస్‌కు నిరాశే.. ఖానాపూర్ మున్సిపాలిటీ దక్కించుకున్న బీజేపీ, వైస్ చైర్మన్‌గా బీఆర్ఎస్
కాంగ్రెస్‌కు నిరాశే.. ఖానాపూర్ మున్సిపాలిటీ దక్కించుకున్న బీజేపీ, వైస్ చైర్మన్‌గా బీఆర్ఎస్
Telangana High Court Zone-II: జీవితంలో ఒక్కసారి వచ్చే అరుదైన అవకాశం.. హైకోర్టు జోన్-II బిల్డింగ్ పనులకు శంకుస్థాపనలో రేవంత్ రెడ్డి
జీవితంలో ఒక్కసారి వచ్చే అవకాశం, అరుదైన గౌరవం.. హైకోర్టు జోన్-II బిల్డింగ్ పనులకు శంకుస్థాపనలో రేవంత్ రెడ్డి
Nirmal Crime News: నిర్మల్ జిల్లాలో ఫ్రిడ్జ్‌లో మంటలు చెలరేగి ఇద్దరి మృతి.. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
నిర్మల్ జిల్లాలో ఫ్రిడ్జ్‌లో మంటలు చెలరేగి ఇద్దరి మృతి.. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Advertisement

వీడియోలు

Rajasthan Royals vs Gujarat Titans IPL 2026 | రాజ‌స్థాన్ రాయల్స్ థ్రిల్లింగ్ విక్ట‌రీ
IPL 2026 Jofra Archer Death Overs RR vs GT | 19వ ఓవర్ లో జోఫ్రా ఆర్చర్ మ్యాజిక్
Siraj Catch Drop GT vs RR IPL 2026 | సిరాజ్ ఈజీ క్యాచ్‌ను సిక్సర్‌గా మార్చేశాడా
IPL 2026 Delhi Capitals vs Mumbai Indians | ఢిల్లీకి వ‌రుస‌గా రెండో విజ‌యం
Riyan Parag Credits Dhruv Jurel RR vs GT IPL 2026 | రియాన్ పరాగ్ ప్లాన్ వెనుక ఉన్నది అతనే
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains Alert: ఏపీలో 2 రోజులపాటు పలు జిల్లాల్లో పిడుగులతో వర్షాలు.. మరోవైపు నిప్పులు చెరిగే ఎండలు!
ఏపీలో 2 రోజులపాటు పలు జిల్లాల్లో పిడుగులతో వర్షాలు.. మరోవైపు నిప్పులు చెరిగే ఎండలు!
IPL 2026 SRH VS LSG Result Update: పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్.. బోణీ కొట్టిన ల‌క్నో.. బ్యాటింగ్ వైఫల్యంతో స‌న్ రైజ‌ర్స్ కు ప‌రాజ‌యం
పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్.. బోణీ కొట్టిన ల‌క్నో.. బ్యాటింగ్ వైఫల్యంతో స‌న్ రైజ‌ర్స్ కు ప‌రాజ‌యం
MAVIGUN : జగన్ MAVIGUN ట్రెండ్ - టైటిల్ రిజిస్టర్ చేయించిన ప్రొడ్యూసర్!... ఏ జానర్‌లో మూవీ తీస్తారో?
జగన్ MAVIGUN ట్రెండ్ - టైటిల్ రిజిస్టర్ చేయించిన ప్రొడ్యూసర్!... ఏ జానర్‌లో మూవీ తీస్తారో?
Khanapur Municipal Chairman: కాంగ్రెస్‌కు నిరాశే.. ఖానాపూర్ మున్సిపాలిటీ దక్కించుకున్న బీజేపీ, వైస్ చైర్మన్‌గా బీఆర్ఎస్
కాంగ్రెస్‌కు నిరాశే.. ఖానాపూర్ మున్సిపాలిటీ దక్కించుకున్న బీజేపీ, వైస్ చైర్మన్‌గా బీఆర్ఎస్
RTC Bus Catches Fire: హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి ఆర్టీసీ బస్సులో మంటలు.. కడప జిల్లాలో ప్రమాదం
హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి ఆర్టీసీ బస్సులో మంటలు.. కడప జిల్లాలో ప్రమాదం
Vignesh Shivan : హీరోగా సినిమా ఓకే చేసిన అనిరుధ్ - లాస్ట్ మూమెంట్‌లో యాక్టింగ్ ఎందుకు మానేశాడంటే?
హీరోగా సినిమా ఓకే చేసిన అనిరుధ్ - లాస్ట్ మూమెంట్‌లో యాక్టింగ్ ఎందుకు మానేశాడంటే?
ఎస్‌యూవీల‌కు గండి కొట్టిన‌ మారుతి డిజైర్.. మార్చి 2026 సేల్స్‌లో నంబర్ వన్ కారుగా రికార్డు!
ఎస్‌యూవీల‌కు గండి కొట్టిన‌ మారుతి డిజైర్.. మార్చి 2026 సేల్స్‌లో నంబర్ వన్ కారుగా రికార్డు!
Iran-US War: అమెరికా దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్లు హతం.. రెండో US పైలట్ సేఫ్: డొనాల్డ్ ట్రంప్
అమెరికా దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్లు హతం.. రెండో US పైలట్ సేఫ్: డొనాల్డ్ ట్రంప్
Embed widget