అన్వేషించండి

Revanth Reddy Chit Chat: పదిన్నరేళ్లు నేనే సీఎం - ఢిల్లీలో రేవంత్ చిట్ చాట్ - ఈ లెక్కేంటో తెలుసా?

CM Revanth Chit Chat: పదిన్నర సంవత్సరాల తానే సీఎంగా ఉంటానని రేవంత్ నమ్మకం వ్యక్తం చేశారు. ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో పలు కీలక అంశాలపై మాట్లాడారు.

Revanth Reddy Chit Chat in Delhi: తెలంగాణ రాజకీయాల్లో తనకు ఎదురులేదని  రాష్ట్రానికి నేనే రాజు.. నేనే మంత్రిని.. నాకు ఎవరూ పోటీ కాదు అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన  జాతీయ మీడియా ప్రతినిధఉలతో  ఇష్టాగోష్టిగా మాట్లాడారు.  గంటన్నర పాటు సాగిన ఈ భేటీలో ఆయన పాలన, భవిష్యత్తు రాజకీయాలు మరియు జమిలి ఎన్నికలపై అత్యంత ధీమాతో చేసిన వ్యాఖ్యలు  హాట్ టాపిక్ అయ్యాయి.  

వచ్చే పదిన్నర ఏళ్ల పాటు ముఖ్యమంత్రి పీఠంపై తానే ఉంటానని, పాలనలో తన ముద్రను మరింత బలంగా వేస్తానని ధీమా వ్యక్తం చేశారు. పదిన్నరేళ్ల లెక్క ఏమిటంటే.. వచ్చే ఎన్నికలు 2028లో జరగబోవని 2029లో జమిలీగానే జరుగుతాయని.. అప్పటి వరకూ తానే సీఎంగా ఉంటానని చెబుతున్నారు. ప్రత్యర్థి పార్టీల విమర్శలను కొట్టిపారేస్తూ, తన నాయకత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని తేల్చి చెప్పారు. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న  జమిలి ఎన్నికలపై రేవంత్ రెడ్డి కీలక విశ్లేషణ చేశారు. 2029లో జమిలి ఎన్నికలు రావడం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, అంతకంటే ముందు దేశంలో జనగణన , నియోజకవర్గాల పునర్విభజన , పార్లమెంట్ సీట్ల పెంపు ,మహిళా రిజర్వేషన్ల అమలు వంటి కీలక ప్రక్రియలు పూర్తి కావాల్సి ఉంటుందని వివరించారు. ఈ పరిణామాలన్నీ ముగిసిన తర్వాతే దేశం ఒకే సారి ఎన్నికలకు వెళ్తుందని ఆయన విశ్లేషించారు.
 
నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని, ఇది రాజకీయ సమీకరణాలను మారుస్తుందని రేవంత్ పేర్కొన్నారు. సీట్ల పెంపు తర్వాత వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని మెజారిటీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రంతో సఖ్యతగా ఉంటూనే రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతామని, అదే సమయంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తామని చెప్పారు. తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక నందమూరి తారకరామారావుపై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  ఎన్టీఆర్ జాతి ఆస్తి, ఆయన ఎవరో ఒకరి సొత్తు కాదు.. ఆయనొక నేషనల్ లీడర్" అని అభివర్ణించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూనే, పార్లమెంటులో ఆయన విగ్రహాన్ని పెట్టింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తుచేశారు.  . కేసీఆర్ ప్రస్తుతం స్వయం ప్రకటిత గృహ నిర్బంధంలో ఉన్నారని ఎద్దేవా చేసిన రేవంత్, తాను ఎవరి ఫోన్లను ట్యాప్ చేయడం లేదని, ఇతరుల వ్యక్తిగత విషయాలు వినడం మానసిక క్షోభ అని స్పష్టం చేశారు.
 
రాష్ట్రంలోని కీలక ప్రాజెక్టులపై సీఎం రేవంత్ స్పష్టమైన టైమ్ లైన్ ప్రకటించారు. మార్చి 31 లోపు హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం టేకోవర్ చేసే ప్రక్రియను పూర్తి చేస్తామని వెల్లడించారు. అలాగే, జూన్ 2వ తేదీన ఆదిలాబాద్ మరియు వరంగల్ విమానాశ్రయాలకు శంకుస్థాపన చేస్తామని ప్రకటించడం ద్వారా ఉత్తర తెలంగాణ అభివృద్ధిపై తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. సింగరేణి సమస్యలపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఒక రోజంతా చర్చ జరిపి అన్ని విషయాలను బహిర్గతం చేస్తామని చెప్పారు. ఇక ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదంపై వస్తున్న ప్రచారాన్ని కొట్టిపారేస్తూ, అనాలసిస్ పూర్తయ్యాక అక్కడ ఆధారాలు ఉండవని సాంకేతిక అంశాన్ని వివరించారు.
 
కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీపై ఆంధ్రప్రదేశ్ వైఖరిని రేవంత్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టులకు ఇప్పుడు ఏపీ ఎందుకు అభ్యంతరం చెబుతోందని ప్రశ్నించారు.  తెలంగాణకు రావాల్సిన నీటి వాటా ఇచ్చి ఏపీ ప్రాజెక్టులు కట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు  అని చెబుతూనే, నికర జలాల లెక్కల ప్రకారం తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవద్దని సూచించారు. రెండు రాష్ట్రాల్లో ప్రాజెక్టుల నిర్మాణానికి ఒకే విధానం ఉండాలని కోరారు. అలాగే మహబూబ్ నగర్ హత్యారాజకీయాల ఆరోపణలను తోసిపుచ్చుతూ, ఒక కౌన్సిలర్ కోసం అటువంటి పనులు చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు.

ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ, ఎవరినైనా జైల్లో వేయాలనుకుంటే తాము చట్టప్రకారం, నిబంధనలకు లోబడే ముందుకు వెళ్తామని, రాజ్యాంగం ప్రకారమే తన నడక ఉంటుందని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రస్తుతం తొలి అంకానికి చేరిందని, విదేశాల నుంచి ప్రభాకర్ రావును తీసుకురావడానికి 20 నెలలు పట్టిందని, ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగానే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలపై స్పందిస్తూ, కేవలం కుంగిన మూడు గేట్లే కాకుండా మొత్తం ప్రాజెక్టును అధ్యయనం చేయాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించిందని, నిపుణుల కమిటీ నివేదిక రాకుండా కేసీఆర్, హరీష్ రావు కోరినట్లు తాము తొందరపడి నిర్ణయాలు తీసుకోమని రేవంత్ తేల్చి చెప్పారు.   ఫార్ములా రేస్ కేసులో మనీ లాండరింగ్ కోణంలో ఈడీ ఎందుకు స్పందించడం లేదని, సోనియా, రాహుల్ గాంధీలను విచారించిన ఈడీ.. కేటీఆర్ విషయంలో ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు.
 
దేశంలో ఎన్నికల సంస్కరణలపై రేవంత్ రెడ్డి కీలక విశ్లేషణ చేశారు. 2029లో జమిలి ఎన్నికలు జరగడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. దీనికి సంబంధించి ఒక కాలక్రమ పట్టికను కూడా ఆయన వివరించారు. 2027 మే లేదా జూన్ నాటికి జనాభా లెక్కలు తేలుతాయని, 2028 నాటికి మహిళా రిజర్వేషన్లు మరియు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తవుతుందని అంచనా వేశారు. ఇక పార్టీ పరంగా కేబినెట్ విస్తరణపై అధిష్టానంతో చర్చించలేదని క్లారిటీ ఇచ్చారు.  
 

టాప్ హెడ్ లైన్స్

Telangana Total Debt Politics: తెలంగాణలో అప్పుల సవాళ్ల పోరు.. ప్రెస్ క్లబ్‌లో జూపల్లి, లేఖలతో హరీష్ రావు మైండ్ గేమ్!
తెలంగాణలో అప్పుల సవాళ్ల పోరు.. ప్రెస్ క్లబ్‌లో జూపల్లి, లేఖలతో హరీష్ రావు మైండ్ గేమ్!
Breaking News: మార్కపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
మార్కాపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
Hyderabad Crime News: ఘట్‌కేసర్‌లో రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య! లంగర్ హౌజ్ లాడ్జిలో యువతి మృతి
ఘట్‌కేసర్‌లో రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య! లంగర్ హౌజ్ లాడ్జిలో యువతి మృతి
Jupally Krishna Rao: ప్లేస్ ఫిక్స్, సాయంత్రం 5 గంటలకు రండి.. నిజాలేంటో తేల్చేద్దాం: బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్
ప్లేస్ ఫిక్స్, సాయంత్రం 5 గంటలకు రండి.. నిజాలేంటో తేల్చేద్దాం: బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Polavaram MLA Attacked: ​ఏలూరు జనసేన ఆఫీస్‌ వద్ద ఎమ్మెల్యేపై దాడికి యత్నం! సొంత పార్టీ నేతలపైనే చిర్రి బాలరాజు ఫైర్‌!
​ఏలూరు జనసేన ఆఫీస్‌ వద్ద ఎమ్మెల్యేపై దాడికి యత్నం! సొంత పార్టీ నేతలపైనే చిర్రి బాలరాజు ఫైర్‌!
Rushikonda Hilltop Buildings: రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
WhatsApp Business AI: వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
DMK MLA Anitha Radhakrishnan Arrest: సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
Garuda vs Lord Yama: బ్రహ్మ రాత ఎవ్వరూ మార్చలేరు! గరుత్మంతుడు - యముడు - చిలుక కథ
బ్రహ్మ రాత ఎవ్వరూ మార్చలేరు! గరుత్మంతుడు - యముడు - చిలుక కథ
Maa Inti Bangaram Deleted Scenes : మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్ చూశారా? - సమంత, ఆమె ఫ్రెండ్ అల్లరి మామూలుగా లేదు
మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్ చూశారా? - సమంత, ఆమె ఫ్రెండ్ అల్లరి మామూలుగా లేదు
Breaking News: మార్కపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
మార్కాపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
Mollywood Times OTT : సినిమాల పిచ్చి... సైకోలా మారే హీరో - రెండు ఓటీటీల్లో ప్రేమలు హీరో సైకలాజికల్ డార్క్ కామెడీ
సినిమాల పిచ్చి... సైకోలా మారే హీరో - రెండు ఓటీటీల్లో ప్రేమలు హీరో సైకలాజికల్ డార్క్ కామెడీ
Embed widget