అన్వేషించండి

Rahul Gandhi: మహిళలకు ఏడాదికి రూ.1 లక్ష, రైతులకు కనీస మద్ధతు ధర- కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసిన రాహుల్ గాంధీ

Telangana Congress Manifesto: సార్వత్రిక ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను తుక్కుగూడ జన జాతర సభలో రాహుల్ గాంధీ ఆవిష్కరించారు. ఇందులో తెలంగాణ అంశాలను పేర్కొన్నారు.

Congress Manifesto: తెలంగాణలో అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. గత ఏడాది సెప్టెంబర్ లో 6 గ్యారంటీలు ప్రకటించిన తుక్కుగూడలోనే కాంగ్రెస్ మరో సభ నిర్వహిస్తోంది. తుక్కుగూడ వేదికగా రాహుల్ గాంధీ సార్వత్రిక ఎన్నికలకు 5 గ్యారంటీ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేశారు. అంతకుముందు రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి విమానంలో శంషాబాద్ చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరి కాంగ్రెస్ తుక్కుగూడలో నిర్వహిస్తోన్న జన జాతర సభకు హాజరయ్యారు. తుక్కుగూడ వేదికగా రాహుల్ గాంధీ తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు శంఖారావం పూరించారు. 

తుక్కుగూడలో జన జాతర బహిరంగసభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ‘తెలంగాణలో కొన్ని నెలల కిందట రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం మేం 6 గ్యారంటీలను ఇక్కడే తుక్కుగూడ వేదికగా ఆవిష్కరించాం. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల కోసం న్యాయ పత్రం పేరుతో హామీల మేనిఫెస్టోను ఆవిష్కరించాం. మేం ఇక్కడ చెప్పినప్పుడు కాంగ్రెస్ గ్యారంటీలు. కానీ తరువాత అవి ప్రజల గొంతు వినిపించిన గ్యారంటీలుగా మారాయి. రూ.500కే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత్ విద్యుత్, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అయినా చెప్పినట్లుగానే అమలు చేసింది కాంగ్రెస్ ’ అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

రాహుల్ గాంధీ ఇంకా మాట్లాడుతూ.. ‘దేశ వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం 30 వేల ఉద్యోగాలను ఇచ్చింది. రాష్ట్రంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాం. ఈ మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీది కాదు, ప్రజలకు కావాల్సిన మేనిఫెస్టో. ప్రజలు కోరుకున్న మేనిఫెస్టో ఇది. మేనిఫెస్టోలో ప్రధానంగా 5 గ్యారంటీలు ఉన్నాయి. 

1) నిరుద్యోగులకు లక్ష రూపాయల జీతం వచ్చే ఉద్యోగాలను అందిస్తాం. అప్రెంటిస్ కార్యక్రమం మొదలుపెట్టాలని నిర్ణయించాం. జాతీయ ఉపాధి తరహాలో దేశ వ్యాప్తంగా ఏడాది పాటు అప్రెంటిస్ షిప్ ట్రైనింగ్ ఇస్తాం. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల్లో లక్ష రూపాయల జీతం వచ్చేలా చేస్తాం. యువలకులకు సంబంధించి ఎన్నో విషయాలు చేర్చినట్లు మేనిఫెస్టో చూస్తే మీకు అర్థమవుతుంది. 

2) ఉద్యోగం చేసే మహిళలు కుటుంబసభ్యుల బాగోగులు చూసుకుంటూ రెండు డ్యూటీలు చేస్తున్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం వచ్చాక చాలా మంది పేదలయ్యారు. వీరి కోసం నారీ న్యాయ్ స్కీ్మ్ తీసుకొస్తున్నాం. ప్రతి పేద కుటుంబంలో ఓ మహిళకు ఏడాదికి రూ.1 లక్ష రూపాయలు అందిస్తాం. ఈ మొత్తాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి.  

3) కిసాన్ న్యాయం - దేశంలో వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రతిరోజూ 30 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మోదీ సర్కార్ ధనవంతులకు రూ.16 లక్షల కోట్లు రుణమాఫీ చేసింది. రైతులకు ఏ న్యాయం చేయలేదు. మేం కేంద్రంలో అధికారంలోకి రాగానే రైతుల రుణమాఫీ చేస్తాం. పంట కనీస మద్ధతు ధరకు చట్టబద్ధత కల్పిస్తాం. ఎంఎస్ స్వామినాథన్ ఫార్ములా ప్రకారం కనీస మద్ధతు ధర కల్పించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.

4) కార్మికులకు న్యాయం  -  కార్మికులకు, కూలీలకు కనీస వేతనం తీసుకొస్తాం. జాతీయ ఉపాధి పథకంలోగానీ, ఇతర పథకాల కింద రోజువారి పనులు చేస్తే రోజూ కనీసం రూ.400 వచ్చేలా చర్యలు తీసుకుంటాం. 

5) దేశంలో 50 మంది జనాభా వెనకబడి ఉన్నారు. 15 శాతం జనాభా దళితులు ఉన్నారు. 8 శాతం జనాభా ఆదివాసీలు, గిరిజనులు ఉన్నారు. 15 శాతం మైనార్టీలు ఉన్నారు. 5 శాతం జనాభా జనరల్ కేటగిరికి చెందిన నిరుపేదలు ఉన్నారు. మొత్తంగా చూస్తే 90 శాతం జానాభా వీరే. కానీ వీళ్లు ఏ పెద్ద సంస్థలో ఉండరు. వీరికి అంతగా అవకాశాలు లేవు. మీడియా కంపెనీ ఓనర్లను గమనిస్తే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కనిపించరు. దేశంలో పెద్ద కంపెనీల జాబితా చూస్తే వీళ్లు ఒక్కరూ కనిపించరు. దేశాన్ని నడిపించే 90 మంది ఐఏఎస్ లలో ముగ్గురు బీసీలున్నారు. వీరిలో ఒక్క గిరిజనుడు, దళితులు ముగ్గురు మాత్రమే ఉన్నారని రాహుల్ గాంధీ అన్నారు. బడ్జెట్ లో ఖర్చయ్యే 100లో కేవలం 6 రూపాయలను దళితులు, ఆదివాసీలకు ఖర్చు పెడుతున్నారు. తెలంగాణలో చేసినట్లు దేశ వ్యాప్తంగా కుల గణన చేపడతాం. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Embed widget