అన్వేషించండి

తెలంగాణలో 13 రోజులపాటు రాహుల్ భారత్ జోడో యాత్ర, పూర్తి షెడ్యూల్ ఇదే

అక్టోబర్ 24న రాహుల్ పాదయాత్ర తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించనుంది. తెలంగాణలో మొత్తం 13 రోజులకు రాహుల్ గాంధీ పాదయాత్రను కుదించారు.

ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో యాత్ర ముగించుకున్న రాహుల్ గాంధీ ప్రస్తుతం కర్ణాకలో పాదయాత్ర చేస్తున్నారు. అనంతరం తెలంగాణలో రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రవేశించనుంది. అక్టోబర్ 24న తెలంగాణలో ప్రవేశించనున్న రాహుల్ పాదయాత్ర రాష్ట్రంలో 13 రోజులపాటు జరగనుంది. ఇందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసింది పీసీసీ. తెలంగాణలో 359 కిలోమీటర్లు నడవనున్నారు రాహుల్ గాంధీ. ఇందుకోసం తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు.

తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర రూట్ మ్యాప్ షెడ్యూల్..
కాంగ్రెస్ ను మరోసారి కేంద్రంలో అధికారంలోకి తీసుకురావడంలో భాగంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా తెలంగాణలో మొత్తం 13 రోజులకు రాహుల్ గాంధీ పాదయాత్రను కుదించారు. 13 రోజుల పాటు రోజు వారీగా రాహుల్ యాత్రలో పాల్గొనే నియోజకవర్గాల జాబితా కూడా సిద్ధం చేశారు. మక్తల్  నియోజకవర్గం కృష్ణా మండలం, కృష్ణా గ్రామం వద్ద తెలంగాణలోకి భారత్ జోడో యాత్ర ప్రవేశించనుంది. ఈ విషయాన్ని తెలంగాణ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇటీవల వెల్లడించారు.

1వ రోజు షెడ్యూల్..
తెలంగాణలో తొలిరోజు రాహుల్ గాంధీ మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గంలో భారత్ జోడో యాత్ర.. కొడంగల్, నారాయణ పేట, గద్వాల్, అలంపూర్ నియోజకవర్గ నేతలతోపాటు రాష్ట్ర ముఖ్య నేతలు పాల్గొంటారు. 

2వ రోజు షెడ్యూల్..
దేవరకద్ర నియోజకవర్గంలో కల్వకుర్తి, దేవరకొండ, వనపర్తి, అచ్చంపేట సెగ్మెంట్ నేతలతో కలిసి రాహుల్ పాదయాత్ర

3వ రోజు షెడ్యూల్..
మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాహుల్ పాదయాత్రలో తాండూర్, పరిగి, దేవరకొండ మినహా నల్గొండ పార్లమెంట్ లోని అసెంబ్లీ సెగ్మెంట్ నేతలు పాల్గొంటారు.

4వ రోజు షెడ్యూల్..
జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో రాహుల్ పాదయాత్ర..
నాగర్ కర్నూల్ ఖమ్మం లోక్ సభలోని అసెంబ్లీ నియోజకవర్గ నేతలు పాల్గొంటారు.

5వ రోజు షెడ్యూల్..
షాద్ నగర్ నియోజకవర్గంలో రాహుల్ పాదయాత్రలో
మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు భువనగిరి లోక్ సభ లోని అసెంబ్లీ కాంగ్రెస్ నేతలు పాల్గొంటారు.

6వ రోజు షెడ్యూల్..
శంషా బాద్ రీజియన్‌లో జరిగే యాత్రలో హైదరాబాద్ లోక్ సభలోని అసెంబ్లీ స్థానాలతోపాటు రాజేంద్రనగర్, ఎల్బీ నగర్, ఉప్పల్ నియోజకవర్గ నేతలు రాహుల్ తో కలిసి పాదయాత్రలో ఉంటారు

7వ రోజు షెడ్యూల్..
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పాదయాత్రలో చేవెళ్ల లోక్ సభలోని మహేశ్వరం, రాజేంద్ర నగర్ మినహా మిగతా అసెంబ్లీ సెగ్మెంట్లు, సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు చెందిన పార్టీ నేతలు పాల్గొంటారు.

8వ రోజు షెడ్యూల్..
బీహెచ్ఈఎల్ ప్రాంతంలో రాహుల్ భారత్ జోడో పాదయాత్ర సాగనుంది. ఈరోజు మల్కాజ్ గిరి, మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని కాంగ్రెస్ నేతలు యాత్రలో భాగస్వాములు అవుతారు.

9వ రోజు షెడ్యూల్..
సంగారెడ్డిలో రాహుల్ యాత్ర కొనసాగిస్తారు. మెదక్, వరంగల్ లోక్ సభ సెగ్మెంట్లలోని పార్టీ నేతలు వెంట ఉంటారు.

10వ రోజు షెడ్యూల్..
జోగి పేటలో రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తారు. ఈ యాత్రలో జహీరాబాద్, పెద్దపల్లి లోక్‌సభ పరిధిలోని నేతలు భాగస్వాములు అవుతారు.

11వ రోజు షెడ్యూల్..
రాహుల్ పాదయాత్ర శంకరం పేట ప్రాంతంలో కొనసాగనుంది.
ఆదిలాబాద్ లోక్ సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల కాంగ్రెస్ నేతలు పాల్గొంటారు.

12వ రోజు షెడ్యూల్..
తెలంగాణలో రాహుల్ యాత్ర 12వ రోజు జుక్కల్ ప్రాంతంలో జరుగుతుంది. ఈరోజు పాదయాత్రలో నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నేతలు హాజరు కానున్నారు.

13వ రోజు షెడ్యూల్..
వరుసగా రెండో రోజు జుక్కల్ లోనే రాహుల్ పాదయాత్ర కొనసాగిస్తారు. చివరిరోజు పాదయాత్రలో కరీంనగర్ లోక్ సభ లోని అసెంబ్లీ సెగ్మెంట్ నేతలతోపాటు రాష్ట్రంలోని కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొంటారు. అదేరోజు సాయంత్రం రాహుల్ పాదయాత్ర రాష్ట్రంలో ముగియనుంది.



ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Feel The Jail: నేరం చేయకుండా జైలుకెళ్లాలని ఉందా? ఖైదీగా మారాలనుందా? - డబ్బులు కట్టి ఉండొచ్చు..ఇవిగో డీటైల్స్
నేరం చేయకుండా జైలుకెళ్లాలని ఉందా? ఖైదీగా మారాలనుందా? - డబ్బులు కట్టి ఉండొచ్చు..ఇవిగో డీటైల్స్
Extramarital Affair: పదో తరగతి ప్రేమ - పెళ్లయ్యాక వివాహేతర బంధం - క్లైమాక్స్ చాలా వయోలెంట్ !
పదో తరగతి ప్రేమ - పెళ్లయ్యాక వివాహేతర బంధం - క్లైమాక్స్ చాలా వయోలెంట్ !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Bandi Sanjay Son POCSO Case: కుమారుడి పోక్సో కేసు - బండి సంజయ్ రాజకీయ ఎదుగుదలకు ఇది శాపమా?
కుమారుడి పోక్సో కేసు - బండి సంజయ్ రాజకీయ ఎదుగుదలకు ఇది శాపమా?

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget