అన్వేషించండి

Breaking News Live: విశాఖ ఏజెన్సీలో నాటుతుపాకీతో బావను కాల్చి చంపిన బావమరుదులు 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live: విశాఖ ఏజెన్సీలో నాటుతుపాకీతో బావను కాల్చి చంపిన బావమరుదులు 

Background

ఏపీ, తెలంగాణలో నేడు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి, హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రాల అధికారులు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. అదే సమయంలో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపారు. అమరావతిలోని వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్, యానాంలో ఈశాన్య గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణం పొడిగానే ఉండనుంది. 

ఈ ఈశాన్య గాలుల ప్రభావంతో రాగల మూడు రోజుల వరకూ ఎలాంటి వర్షం ఉండబోదని వెల్లడించారు. ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. కనిష్ణ ఉష్ణోగ్రతలు నెమ్మదిగా పెరిగే అవకాశం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇక గత 24 గంటల్లో సముద్రంలో ఏర్పడ్డ మేఘాల వల్ల నిన్న రాత్రి విశాఖపట్నంలోని ఉత్తర భాగాల్లో వర్షాలు కురిసాయని ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ తెలిపారు. రాత్రి సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయని అన్నారు.

తెలంగాణలో ఇలా..
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. రాష్ట్రమంతా ఎలాంటి వర్ష సూచన లేదు. వాతావరణం అంతా పొడిగానే ఉంటుంది. ఇలాంటి పరిస్థితే మరో మూడు నాలుగు రోజులు ఉండనుందని అంచనా వేశారు.

హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. ఉదయం సమయంలో పొగ మంచు ఏర్పడే అవకాశం ఉంది. నిర్మలంగా ఉంటుంది. ఉదయం సమయంలో కొన్ని చోట్ల పొగమంచు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 31 డిగ్రీలు, 17 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంటుంది. తూర్పు దిశ నుంచి ఉపరితల గాలులు గంటకు 4 కిలో మీటర్ల నుంచి 6 కిలో మీటర్ల వరకూ వీచే అవకాశం ఉంటుంది. ముందు రోజు గరిష్ఠ ఉష్ణోగ్రత 30.6 డిగ్రీలుగా, కనిష్ఠ ఉష్ణోగ్రత 17.6 డిగ్రీలుగా నమోదైంది.

బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర వరుసగా నేడు భారీగా పెరిగింది. గ్రాముకు రూ.100 చొప్పున ఎగబాకింది. వెండి ధర మాత్రం కిలోకు రూ.500 పెరిగింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.46,800 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.51,050 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలోకు రూ.67,400గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.

ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,800 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,050గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.67,400 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.46,800 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.51,050గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.67,400గా ఉంది.

20:30 PM (IST)  •  13 Feb 2022

విశాఖ ఏజెన్సీలో నాటుతుపాకీతో బావను కాల్చి చంపిన బావమరుదులు 

విశాఖ ఏజెన్సీలో దారుణం ఘటన చోటుచేసుకుంది. చింతపల్లి మండలం కిటుముల పంచాయతీ భూసిబంధ గ్రామంలో బామమరుదులు తుపాకీతో బావను కాల్చిచంపారు. పాత కక్షల నేపథ్యంలోనే హతమార్చినట్లు మృతుడు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాంగి సుమత్ తన భార్య రస్సుతో బంధువుల ఇంటి నుంచి తిరిగివస్తుండగా నాటు తుపాకీతో కాల్పులు జరిపారు బావమరుదులు పెంటయ్య, నాగేశ్వరరావు. సంఘటనా స్థలంలోనే పాంగి సుమత్ కుప్పకూలాడు. ఈ ఘటనపై పాంగీ సుమత్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

19:11 PM (IST)  •  13 Feb 2022

ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఎలుగుబంటి హల్ చల్ 

కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఎలుగుబంటి హల్ చల్ చేసింది. దీంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. అకాడమిక్ బిల్డింగ్ సమీపంలోని బాయ్స్ హాస్టల్ వద్ద విద్యార్థులకు ఎలుగుబంటి కనిపించింది. సమీపంలోని శేషాచలం కొండల నుంచి క్యాంపస్ లోకి ఎలుగుబంటి వచ్చినట్లు తెలుస్తోంది. క్యాంపస్‌లో దాదాపు 5000 మంది విద్యార్థులు ఉన్నారు. ట్రిపుల్ ఐటీ క్యాంపస్ కు సంబంధించిన రక్షణ గోడ కొన్నిచోట్ల దెబ్బతినడంతో  అందులోంచి ఎలుగుబంటి క్యాంపస్ లోకి వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. ట్రిపుల్ ఐటీలోకి ఎలుగుబంటి వచ్చిందన్న సమాచారం తమకు తెలియదని అటవీశాఖ అధికారులు అంటున్నారు. 

19:11 PM (IST)  •  13 Feb 2022

ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఎలుగుబంటి హల్ చల్ 

కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఎలుగుబంటి హల్ చల్ చేసింది. దీంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. అకాడమిక్ బిల్డింగ్ సమీపంలోని బాయ్స్ హాస్టల్ వద్ద విద్యార్థులకు ఎలుగుబంటి కనిపించింది. సమీపంలోని శేషాచలం కొండల నుంచి క్యాంపస్ లోకి ఎలుగుబంటి వచ్చినట్లు తెలుస్తోంది. క్యాంపస్‌లో దాదాపు 5000 మంది విద్యార్థులు ఉన్నారు. ట్రిపుల్ ఐటీ క్యాంపస్ కు సంబంధించిన రక్షణ గోడ కొన్నిచోట్ల దెబ్బతినడంతో  అందులోంచి ఎలుగుబంటి క్యాంపస్ లోకి వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. ట్రిపుల్ ఐటీలోకి ఎలుగుబంటి వచ్చిందన్న సమాచారం తమకు తెలియదని అటవీశాఖ అధికారులు అంటున్నారు. 

15:19 PM (IST)  •  13 Feb 2022

హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, కాసేపట్లో ముచ్చింతల్ ఆశ్రమానికి

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హైదరాబాద్‌ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌ గౌరవ స్వాగతం పలికారు. మరికాసేపట్లో రాష్ట్రపతి కోవింద్ ముచ్చింతల్‌ వెళ్లనున్నారు. అక్కడ సమతామూర్తి కేంద్రం, ఆలయాలు, బృహన్‌మూర్తి విగ్రహాన్ని రాష్ట్రపతి సందర్శించనున్నారు. అనంతరం రామానుజాచార్యుల స్వర్ణమూర్తి విగ్రహాన్ని రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆవిష్కరించనున్నారు. రామానుజుల స్వర్ణ విగ్రహాన్ని 120 కిలోల బంగారంతో రూపొందించారు. సమతామూర్తి కేంద్రంలోని భద్రవేది మొదటి అంతస్తులో 54 అడుగుల ఎత్తులో ఈ విగ్రహాన్ని నిర్మించారు. 

 

13:55 PM (IST)  •  13 Feb 2022

జల్లికట్టు పోటీల్లో అపశ్రుతి

చిత్తూరు జిల్లా, కుప్పం సరిహద్దు ప్రాంతమైన కోలార్ జిల్లా బంగరుపేట తాలూకా తనిమడుగులో జల్లికట్టు వేడుకలు జోరుగా సాగుతున్నాయి. జల్లికట్టులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతలను పరిశీలించేందుకు వెళ్ళిన కేజిఎఫ్ డీఎస్పి మురళీధర్ తో పాటుగా పలువురు పోలీసులకు తీవ్ర గాయాలు అయ్యాయి. భధ్రతను పర్యవేక్షిస్తున్న పోలీసుల పైకి ఎద్దు దూసుకుని రావడంతో పోలీసులకు గాయాలు అయ్యాయి. గాయపడిన పోలీసులను చికిత్స నిమిత్తం కుప్పం పి.ఈ.ఎస్ ఆస్పత్రికి తరలించారు.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ICC Champions Trophy 2025 Team India | అగార్కర్ తో డ్రెస్సింగ్ రూమ్ లో Gambhir డిష్యూం డిష్యూం | ABP DesamChhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP DesamVicky Kaushal Bollywood Super Star | Chhava తో కొత్త సూపర్ స్టార్ పుట్టాడా.? | ABP DesamMLC Candidate Aviash Jadhav Interview | పదిహేను నా లక్కీ నెంబర్ ఎందుకంటే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Hyderabad Crime News మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
First GBS Death in AP: ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
WPL Result Update: గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ బోణీ, 6 వికెట్లతో యూపీ చిత్తు
గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ బోణీ, 6 వికెట్లతో యూపీ చిత్తు
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.