అన్వేషించండి

Breaking News Live: విశాఖ ఏజెన్సీలో నాటుతుపాకీతో బావను కాల్చి చంపిన బావమరుదులు 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live: విశాఖ ఏజెన్సీలో నాటుతుపాకీతో బావను కాల్చి చంపిన బావమరుదులు 

Background

ఏపీ, తెలంగాణలో నేడు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి, హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రాల అధికారులు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. అదే సమయంలో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపారు. అమరావతిలోని వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్, యానాంలో ఈశాన్య గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణం పొడిగానే ఉండనుంది. 

ఈ ఈశాన్య గాలుల ప్రభావంతో రాగల మూడు రోజుల వరకూ ఎలాంటి వర్షం ఉండబోదని వెల్లడించారు. ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. కనిష్ణ ఉష్ణోగ్రతలు నెమ్మదిగా పెరిగే అవకాశం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇక గత 24 గంటల్లో సముద్రంలో ఏర్పడ్డ మేఘాల వల్ల నిన్న రాత్రి విశాఖపట్నంలోని ఉత్తర భాగాల్లో వర్షాలు కురిసాయని ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ తెలిపారు. రాత్రి సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయని అన్నారు.

తెలంగాణలో ఇలా..
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. రాష్ట్రమంతా ఎలాంటి వర్ష సూచన లేదు. వాతావరణం అంతా పొడిగానే ఉంటుంది. ఇలాంటి పరిస్థితే మరో మూడు నాలుగు రోజులు ఉండనుందని అంచనా వేశారు.

హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. ఉదయం సమయంలో పొగ మంచు ఏర్పడే అవకాశం ఉంది. నిర్మలంగా ఉంటుంది. ఉదయం సమయంలో కొన్ని చోట్ల పొగమంచు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 31 డిగ్రీలు, 17 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంటుంది. తూర్పు దిశ నుంచి ఉపరితల గాలులు గంటకు 4 కిలో మీటర్ల నుంచి 6 కిలో మీటర్ల వరకూ వీచే అవకాశం ఉంటుంది. ముందు రోజు గరిష్ఠ ఉష్ణోగ్రత 30.6 డిగ్రీలుగా, కనిష్ఠ ఉష్ణోగ్రత 17.6 డిగ్రీలుగా నమోదైంది.

బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర వరుసగా నేడు భారీగా పెరిగింది. గ్రాముకు రూ.100 చొప్పున ఎగబాకింది. వెండి ధర మాత్రం కిలోకు రూ.500 పెరిగింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.46,800 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.51,050 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలోకు రూ.67,400గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.

ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,800 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,050గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.67,400 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.46,800 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.51,050గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.67,400గా ఉంది.

20:30 PM (IST)  •  13 Feb 2022

విశాఖ ఏజెన్సీలో నాటుతుపాకీతో బావను కాల్చి చంపిన బావమరుదులు 

విశాఖ ఏజెన్సీలో దారుణం ఘటన చోటుచేసుకుంది. చింతపల్లి మండలం కిటుముల పంచాయతీ భూసిబంధ గ్రామంలో బామమరుదులు తుపాకీతో బావను కాల్చిచంపారు. పాత కక్షల నేపథ్యంలోనే హతమార్చినట్లు మృతుడు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాంగి సుమత్ తన భార్య రస్సుతో బంధువుల ఇంటి నుంచి తిరిగివస్తుండగా నాటు తుపాకీతో కాల్పులు జరిపారు బావమరుదులు పెంటయ్య, నాగేశ్వరరావు. సంఘటనా స్థలంలోనే పాంగి సుమత్ కుప్పకూలాడు. ఈ ఘటనపై పాంగీ సుమత్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

19:11 PM (IST)  •  13 Feb 2022

ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఎలుగుబంటి హల్ చల్ 

కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఎలుగుబంటి హల్ చల్ చేసింది. దీంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. అకాడమిక్ బిల్డింగ్ సమీపంలోని బాయ్స్ హాస్టల్ వద్ద విద్యార్థులకు ఎలుగుబంటి కనిపించింది. సమీపంలోని శేషాచలం కొండల నుంచి క్యాంపస్ లోకి ఎలుగుబంటి వచ్చినట్లు తెలుస్తోంది. క్యాంపస్‌లో దాదాపు 5000 మంది విద్యార్థులు ఉన్నారు. ట్రిపుల్ ఐటీ క్యాంపస్ కు సంబంధించిన రక్షణ గోడ కొన్నిచోట్ల దెబ్బతినడంతో  అందులోంచి ఎలుగుబంటి క్యాంపస్ లోకి వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. ట్రిపుల్ ఐటీలోకి ఎలుగుబంటి వచ్చిందన్న సమాచారం తమకు తెలియదని అటవీశాఖ అధికారులు అంటున్నారు. 

19:11 PM (IST)  •  13 Feb 2022

ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఎలుగుబంటి హల్ చల్ 

కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఎలుగుబంటి హల్ చల్ చేసింది. దీంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. అకాడమిక్ బిల్డింగ్ సమీపంలోని బాయ్స్ హాస్టల్ వద్ద విద్యార్థులకు ఎలుగుబంటి కనిపించింది. సమీపంలోని శేషాచలం కొండల నుంచి క్యాంపస్ లోకి ఎలుగుబంటి వచ్చినట్లు తెలుస్తోంది. క్యాంపస్‌లో దాదాపు 5000 మంది విద్యార్థులు ఉన్నారు. ట్రిపుల్ ఐటీ క్యాంపస్ కు సంబంధించిన రక్షణ గోడ కొన్నిచోట్ల దెబ్బతినడంతో  అందులోంచి ఎలుగుబంటి క్యాంపస్ లోకి వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. ట్రిపుల్ ఐటీలోకి ఎలుగుబంటి వచ్చిందన్న సమాచారం తమకు తెలియదని అటవీశాఖ అధికారులు అంటున్నారు. 

15:19 PM (IST)  •  13 Feb 2022

హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, కాసేపట్లో ముచ్చింతల్ ఆశ్రమానికి

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హైదరాబాద్‌ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌ గౌరవ స్వాగతం పలికారు. మరికాసేపట్లో రాష్ట్రపతి కోవింద్ ముచ్చింతల్‌ వెళ్లనున్నారు. అక్కడ సమతామూర్తి కేంద్రం, ఆలయాలు, బృహన్‌మూర్తి విగ్రహాన్ని రాష్ట్రపతి సందర్శించనున్నారు. అనంతరం రామానుజాచార్యుల స్వర్ణమూర్తి విగ్రహాన్ని రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆవిష్కరించనున్నారు. రామానుజుల స్వర్ణ విగ్రహాన్ని 120 కిలోల బంగారంతో రూపొందించారు. సమతామూర్తి కేంద్రంలోని భద్రవేది మొదటి అంతస్తులో 54 అడుగుల ఎత్తులో ఈ విగ్రహాన్ని నిర్మించారు. 

 

13:55 PM (IST)  •  13 Feb 2022

జల్లికట్టు పోటీల్లో అపశ్రుతి

చిత్తూరు జిల్లా, కుప్పం సరిహద్దు ప్రాంతమైన కోలార్ జిల్లా బంగరుపేట తాలూకా తనిమడుగులో జల్లికట్టు వేడుకలు జోరుగా సాగుతున్నాయి. జల్లికట్టులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతలను పరిశీలించేందుకు వెళ్ళిన కేజిఎఫ్ డీఎస్పి మురళీధర్ తో పాటుగా పలువురు పోలీసులకు తీవ్ర గాయాలు అయ్యాయి. భధ్రతను పర్యవేక్షిస్తున్న పోలీసుల పైకి ఎద్దు దూసుకుని రావడంతో పోలీసులకు గాయాలు అయ్యాయి. గాయపడిన పోలీసులను చికిత్స నిమిత్తం కుప్పం పి.ఈ.ఎస్ ఆస్పత్రికి తరలించారు.

11:54 AM (IST)  •  13 Feb 2022

అరెస్ట్

ఘనశ్యామ్‌దాస్ జెమ్స్ అండ్ జ్యువెల్స్ యజమాని సంజయ్ అగర్వాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. మనీలాండరింగ్ చట్టం(పీఎమ్‌ఎల్‌ఏ) కింద ఫిబ్రవరి 11న సంజయ్‌ను అదుపులోకి తీసుకుంది అరెస్ట్ చేసింది. 67 కోట్ల రుణం తీసుకుని ఎస్బీఐని మోసం చేసినట్లు ఈడీ పేర్కొంది. 

11:47 AM (IST)  •  13 Feb 2022

హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింగ్ హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనకు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలికారు. రాష్ట్రపతి నేడు ముచ్చింతల్‌ శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్న సంగతి తెలిసిందే. అక్కడ ఆశ్రమంలోని స్వర్ణ మూర్తి విగ్రహాన్ని లోకార్పణం చేయనున్నారు.

11:42 AM (IST)  •  13 Feb 2022

ఘన్ శ్యాందాస్ జెమ్స్ అండ్ జ్యువెల్స్ యజమాని సంజయ్ అగర్వాల్ అరెస్ట్

* ఘన్ శ్యాందాస్ జెమ్స్ అండ్ జ్యువెల్స్ యజమాని సంజయ్ అగర్వాల్ అరెస్ట్
* రుణాల పేరిట ఎస్బీఐని మోసం చేశారన్న కేసులో సంజయ్ అగర్వాల్‌ను అరెస్ట్ చేసిన ఈడీ
* సంజయ్ అగర్వాల్‌ను ఇటీవలే మరో కేసులో అరెస్టు చేసిన కోల్‌కతా ఈడీ అధికారులు
* కోల్‌కతా జైలు నుంచి తీసుకొచ్చి నాంపల్లి కోర్టులో హాజరు పరచిన ఈడీ
* సంజయ్ అగర్వాల్‌కు 15 రోజుల విధించిన కోర్టు, చంచల్ గూడ జైలుకు తరలింపు

11:39 AM (IST)  •  13 Feb 2022

Jagityal: పెళ్లి ఇంట్లో విషాదం

జగిత్యాలలో విషాద సంఘటన చోటు చేసుకుంది. పెళ్లి బాజా మోగాల్సిన ఇంట్లో చావు డప్పు మోగింది. జగిత్యాల రవీంద్రనాథ్ ఠాగూర్ నగర్ కు చెందిన బందెల ఆంజనేయులు అనే ఆర్టీసీ రిటైర్డ్ డ్రైవర్ తన కుమారుడి వివాహం ఈ రోజు జరగాల్సి ఉండగా, తెల్లవారుజామున తమ ఇంట్లో పెళ్లి కార్యక్రమాలు జరుగుతుండగా అకస్మాత్తుగా గుండె పోటు రావడంతో మృతి చెందాడు. గత సంవత్సరమే తన చిన్న కుమారుడు ఎస్సారెస్పీ కెనాల్ లో సెల్ఫీ దిగుతూ ప్రమాదవశాత్తు మరణించాడు. తాజాగా ఈ రోజు తండ్రి మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

09:52 AM (IST)  •  13 Feb 2022

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు

తిరుమల శ్రీవారిని ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో కుటుంబ సమేతంగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. బిష్మ ఏకాదశి సందర్భంగా స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహించిన ఆంతర్జాతీయ తెలుగు సంబరాలు దిగ్విజయంగా జరిగి.. తెలుగు వారి గౌరవాన్ని, ఆంధ్రామేవ జయతే నినాదంతో ముందుగు సాగి అద్భుతమైన విజయాన్ని సాధించడంతో స్వామి వారికీ మొక్కులు చెల్లించుకున్నానని అన్నారు. శంకర్ మహాదేవన్ గారి గాత్రంతో.. తాత్పర్యం తాను చెపుతూ భగవత్ గీత ప్రాజెక్ట్ రిహార్సల్స్ తిరుమలలో చేస్తున్నామని తెలిపారు. యూకే విశ్వనాథ్ ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నారని అన్నారు. స్వామి వారి పాదాల చెంత ఈ రిహార్శల్స్ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. మార్చి 25 నుంచి 28వరకు ఢిల్లీ వేదికగా నమో సద్భావన సమితి ఆధ్వర్యంలో శక్తి పంచాయతన ధన్వంతరి విశ్వశాంతి మహా యజ్ఞం నిర్వహించనున్నామని అన్నారు.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

CM Revanth Reddy on PM Modi | రాజ్యాంగాన్ని మార్చే కుట్ర బీజేపీ చేస్తుందన్న రేవంత్ రెడ్డి | ABPPawan Kalyan From Pithapuram | Public Opinion | పిఠాపురం గుండె చప్పుడు ఏంటీ..? | ABP DesamPithapuram MLA Candidate Tamanna Simhadri | పవన్ పై పోటీకి ట్రాన్స్ జెండర్ తమన్నాను దింపింది ఎవరు.?Thatikonda Rajaiah vs Kadiyam Sri hari | కడియం కావ్య డమ్మీ అభ్యర్థి... నా యుద్ధం శ్రీహరిపైనే | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Chandragiri Tension : చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత  - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Chandrababu Vs Jagan : తోబుట్టువు కట్టుకున్న చీరపైనా  విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
తోబుట్టువు కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
Embed widget