అన్వేషించండి

Telangana Congress: వర్కింగ్ ప్రెసిడెంట్‌ పోస్టు కోసం కాంగ్రెస్‌లో పోటీ- నేతల జోరుగా లాబీయింగ్‌

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో ఈ పదవి కోసం సీనియర్ నేతల నుంచి గట్టి పోటీ ఉంది. ఈ పోస్టు దక్కితే ఇక తమ పంట పండినట్లేనన్న భావనలో నేతలు ఉన్నారు.

Telangana Congress: రేపో మాపో తెలంగాణ కాంగ్రెస్ కమిటీల నియామకం పూర్తి చేసే దిశగా ఏఐసీసీ కసరత్తు చేస్తోంది. అయితే   వర్కింగ్ ప్రెసిడెంట్  పదవి పైనే సీనియర్లంతా దృష్టి సారించినట్లు హస్తం నేతలు చెబుతున్నారు. ఇప్పటికే ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ వద్ద వివిధ మార్గాల ద్వారా పదవీ పొందేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. తమకు తెలిసిన కాంగ్రెస్ పెద్దల ద్వారా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కోసం పైరవీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి కొందరు తాము కోరుకున్నట్లు వర్కింగ్ ప్రసిడెంట్ పదవి ఇవ్వకపోతే తమ దారి తాము చూసుకుంటామన్న సంకేతాలు  కాంగ్రెస్ హైకమాండ్ కు పంపుతున్నట్లు చెబుతున్నారు. అయితే వర్కింగ్ ప్రసిడెంట్ పదవిపైనే ఎందుకు ఇంత డిమాండ్ ఉందో తెలుసుకోవాలంటే ఈ కథనం పూర్తిగా చదవండి.

 వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలా స్టార్ట్ అయిందంటే..?

తెలంగాణ ర్పడిన నాటి నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి  బాగా డిమాండ్ ఏర్పడిందని చెప్పాలి. తెలంగాణ ఏర్పడిన తర్వాత టీపీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్య నియమితులయ్యారు. ఆయన హయాంలోనే పార్టీ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డిని  వర్కింగ్ ప్రసిడెంట్ గా పార్టీ నియమించింది. ఆ తర్వాత 2015 మార్చి లో  ఉత్తమ్ కుమార్ రెడ్డి పదోన్నతి పొంది టీపీసీసీకి ప్రెసిడెంట్ అయ్యారు.  ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, మల్లు భట్టి విక్రమార్కను హై కమాండ్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించింది. ఈ ముగ్గురిలో ఒకరైన రేవంత్ రెడ్డి 2021, జూన్ లో తెలంగాణ కాంగ్రెస్ ప్రసిడెంట్ గా ఎన్నికయ్యారు.  ఆయన హయాంలో ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. అందులో ప్రస్తుతం పార్టీ పగ్గాలు స్వీకరించిన మహేశ్ కుమార్ గౌడ్, గీతా రెడ్డి, అజారుద్ధీన్, అంజన్ కుమార్ యాదవ్, జగ్గారెడ్డిని పార్టీ అధిష్టానం వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించింది. వీరిలో మహేశ్ కుమార్ గౌడ్  పార్టీ సంస్థాగత వ్యవహారాలు చూసే ఆర్గనైజింగ్ బాధ్యతలను అప్పగించారు. ఆ తర్వాత 2024 సెప్టెంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడి బాధ్యతల నుంచి వైదొలగి, మహేశ్ కుమార్ గౌడ్ కు అప్పగించారు. 

వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుకు పోటీ ఎందుకంటే..?

ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకంపై హస్తినలో హస్తం నేతలు కుస్తీ పడుతున్నారు. ఇదంతా చూస్తుంటే వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఎంత ముఖ్యమైందో అర్థమవుతుంది. ఈ పదవిలో ఉన్న వారు  టీపీసీసీ అధ్యక్షులుగా ఎన్నికవడం సంప్రదాయంగా వస్తుంది. ఈ పదవిలో ఉండే వారికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. టీపీసీసీలో నంబర్ టూ స్థానం. వ్యక్తిగత పలుకుబడి పెరుగుతుంది. పార్టీ నిర్ణయాల్లో, కార్యక్రమాల్లో నేరుగా బాధ్యత వహించే అవకాశం ఉంటుంది. పార్టీలో కీలకమైన పదవిలో ఉండటం వల్ల క్రియాశీలక నేతగా ఉంటారు. మీడియా ద్వారా ప్రజలకు దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా పార్టీ హైకమాండ్ నేతలతో నిరంతరం టచ్ లో ఉండే కనెక్టివిటీ ఏర్పడుతుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు లో పని చేసిన రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అయ్యారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ మంత్రి పదవి దక్కించుకున్నారు.  బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ టీపీసీసీ చీఫ్గ్ గా పదోన్నతి పొందారు. భవిష్యత్తులో పార్టీ అధ్యక్షులు లేదా మంత్రులు అయ్యేందుకు ఇదే ప్రధాన మార్గం కాబట్టి నేతలంతా వర్కింగ్ ప్రసిడెంట్ పదవి కోసం  పట్టుబడుతున్నారు.

వర్కింగ్ ప్రెసిడెంట్ల బాధ్యతలు ఇవే..

పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే చాలా కీలక బాధ్యతలను పార్టీ హైకమాండ్ అప్పజెప్పుతుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న నేతలు పార్టీకి సంబంధించిన కార్యకలాపాలను పర్యవేక్షించే అధికారం కలుగుతుంది. వీరికి కొన్ని అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాల అమలు, పాార్టీని బలోపేతం చేసే కార్యక్రమాల బాధ్యతలను అప్పగిస్తారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా జగ్గారెడ్డికి ఖమ్మం, వరంగల్, భువనగిరి, కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ బాధ్యతలను గతంలో పార్టీ అప్పగించింది. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన వారికి పార్టీ అనుబంధ సంఘాలు అంటే  ఎన్ ఎస్ యూఐ, ఐ. ఎన్. టీ. యూసీ, లేబర్ సెల్, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ కార్యకలాపాలను పర్యవేక్షించే బాధ్యతలు అప్పగిస్తారు. పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం, పార్టీలో అంతర్గత విబేధాలను పరిష్కరించడం వంటి బాధ్యతలను వర్కింగ్ ప్రెసిడెంట్లు  నిర్వర్తించాల్సి ఉంటుంది. గతంలో వర్కింగ్ ప్రసిడెంట్ గా ఉన్నప్పుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్  పార్టీ ఆర్గనైజింగ్ బాధ్యతలను నిర్వర్తించి పార్టీలో కీలక పాత్ర పోషించారు.  కొన్ని సమయాల్లో పార్టీ ప్రచార కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే  కీలక బాధ్యతలు అప్పగిస్తారు. గతంలో వర్కింగ్ ప్రసిడెంట్లుగా పని చేసిన ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణ వ్యాప్తంగా  పాదయాత్ర నిర్వహించి పార్టీ  స్వరాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారం వంటి బాధ్యతలు  నిర్వర్తించారు,

వర్కింగ్ ప్రసిడెంట్ పోస్టు కోసం క్యూలో ఉన్నది వీరే..

 తెలంగాణ కాంగ్రెస్ లో ఈ పదవి కోసం సీనియర్ నేతల నుంచి గట్టి పోటీ ఉంది. ఈ పోస్టు దక్కితే ఇక తమ పంట పండినట్లేనన్న భావనలో నేతలు ఉన్నారు.  అయితే ఈ దఫా ఆరు వర్కింగ్ ప్రసిడెంట్ పోస్టులు  ఉంటాయని సమాచారం. రెడ్డి, మాల, మాదిగ, లంబాడా, ముస్లిం వంటి సామాజిక వర్గాల వారిని ఈ కీలక పోస్టులో నియమించి సామాజిక న్యాయం ప్రదర్శించాలన్న భావనతో పార్టీ హైకమాండ్ ఉన్నట్లు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మహబూబాద్ ఎంపీ బలరాం నాయక్, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, మల్లు రవి, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, గద్వాల జడ్పీ మాజీ ఛైర్మన్ సరితా యాదవ్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, మైనార్టీ నుంచి ఫిరోజ్ ఖాన్, ఫహీమ్ ఖురేషి, సయ్యద్ అజ్మతుల్లా హుస్సేని, ఎస్సీ వర్గం నుంచి  ఎన్. ప్రీతమ్,  ఎస్టీల నుంచి బెల్లయ్య నాయక్, ఎమ్మెల్యేలు నైని రాజేందర్ రెడ్డి,  రామ్మోహన్ రెడ్డి వంటి నేతలు తీవ్రంగా తమ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డారు. అయితే ఈ కీలక పదవి ఎవరిని వరిస్తుందో అన్న  ఉత్కంఠ కాంగ్రెస్ వర్గాల్లో నెలకొని ఉంది.

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. మొత్తం నీటితో నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
KTR News: కన్నెపల్లి పంప్‌హౌస్‌ పర్యటనకు కేటీఆర్‌.. లారీలు అడ్డుపెట్టిన పోలీసులతో బీఆర్ఎస్ నేతల వాగ్వాదం
కన్నెపల్లి పంప్‌హౌస్‌ పర్యటనకు కేటీఆర్‌.. లారీలు అడ్డుపెట్టిన పోలీసులతో బీఆర్ఎస్ నేతల వాగ్వాదం
MLC Shambhipur Raju: కేటీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు తీవ్ర గాయాలు.. కిమ్స్ ఆసుపత్రికి తరలింపు!
MLC Shambhipur Raju: కేటీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు తీవ్ర గాయాలు.. కిమ్స్ ఆసుపత్రికి తరలింపు!
Nalgonda Road Accident: హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
YouTuber Prashna Ravan: ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్: ఒకే కేసుగా విచారించాలని, సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్!
ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్: ఒకే కేసుగా విచారించాలని, సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్!
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Embed widget