అన్వేషించండి

Hyderabad News: ముత్యాలమ్మ ఆలయం వద్ద ఉద్రిక్తత - నిరసనకారులపై పోలీసుల లాఠీఛార్జ్, సికింద్రాబాద్‌లో ఇంటర్నెట్ నిలిపివేత

Secunderabad News: సికింద్రాబాద్‌లో ముత్యాలమ్మ ఆలయంపై దాడికి నిరసనగా హిందూ సంఘాల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. ఆందోళనకారులు పోలీసుల పైకి చెప్పులు, కుర్చీలు విసరగా లాఠీఛార్జ్ చేశారు.

Police Lotty Charge On Portesters: సికింద్రాబాద్‌లో (Secunderabad) తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముత్యాలమ్మ ఆలయంలో (Mutyalamma Temple) విగ్రహ ధ్వంసంపై వీహెచ్‌పీ, హిందూ సంఘాలు, బీజేపీ కార్యకర్తల ర్యాలీలో ఘర్షణ తలెత్తింది. నిరసనకారులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ర్యాలీని అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపైకి నిరసనకారులు కుర్చీలు, చెప్పులు, వాటర్ ప్యాకెట్లు విసిరారు. మహంకాళి ఆలయం వద్ద రోడ్డుపై బైఠాయించిన ఆందోళనకారులకు డీసీపీ రష్మీ పెరుమాళ్ నచ్చచెప్పినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేశారు. దీంతో ఆందోళనకారుల్లో కొందరి తలలకు, ఇతర శరీర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. లాఠీఛార్జ్‌లో తన ఎడమ చెయ్యి విరిగిందంటూ ఓ యువకుడు నేలపై కూలబడ్డాడు.

మరోవైపు, మత ఘర్షణలు తలెత్తకుండా సికింద్రాబాద్‌లో ముందు జాగ్రత్త చర్యగా ఇంటర్నెట్ నిలిపేసినట్లు తెలుస్తోంది. కాగా, ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహం ధ్వంసం చేసిన ఘటనకు నిరసనగా సికింద్రాబాద్‌లో శనివారం బంద్‌కు పిలుపునిచ్చారు. వ్యాపారులు, స్థానికులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. హిందూ సంఘాలు, స్థానికులు మహంకాళి ఆలయం నుంచి ముత్యాలమ్మ ఆలయం వరకూ ర్యాలీ చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అలర్ట్ అయిన పోలీసులు ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మహంకాళి ఆలయం వద్ద రోడ్డుపై బైఠాయించడం, అనంతరం ర్యాలీతో ఉద్రిక్తత పెరిగే క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులు నచ్చజెప్పినా వినకపోవడంతో వాగ్వాదం జరిగి లాఠీఛార్జ్‌కు దారితీసింది.

లాఠీఛార్జ్‌పై ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం

అటు, ముత్యాలమ్మ ఆలయం వద్ద హిందూ సంఘాలపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు. మతపరమైన మనోభావాలపై దాడి జరిగినప్పుడు, విగ్రహాలను అపవిత్ర చేసినప్పుడు శాంతియుతంగా నిరసన చేయడానికి కూడా అనుమతించకపోవడం తీవ్ర కలకలం రేపుతోందన్నారు. 'ఈ లాఠీఛార్జ్‌కు ఎవరు ఆదేశించారు.? ఆలయాన్ని అపవిత్రం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి తప్ప న్యాయం కోరే భక్తులపై కాదు. మా విశ్వాసంపై జరిగిన ఈ దాడికి మేము జవాబుదారీతనం, న్యాయాన్ని కోరుతున్నాం.' అని రాజాసింగ్ పేర్కొన్నారు.

అసలేం జరిగిందంటే.?

ఈ నెల 14న (సోమవారం) అర్ధరాత్రి సమయంలో సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అమ్మవారి ఆలయంలోకి చొరబడి మరీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ తతంగమంతా అక్కడి సీసీ ఫుటేజీలో నమోదైంది. ఈ ఘటనపై స్థానికులు, హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ మండిపడ్డారు. ఆనాడు పెద్ద ఎత్తున అమ్మవారి ఆలయం వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో భారీగా మోహరించిన పోలీసులు ఆందోళనకారులకు సద్దిచెప్పేందుకు యత్నించారు. పోలీసులు, నిరసనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఘటన జరిగిన వెంటనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆలయం వద్దకు చేరుకుని సీపీ సీవీ ఆనంద్‌తో కలిసి పరిశీలించారు. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. దీనిపై ఫిర్యాదు అందుకుని విచారించిన పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.

Also Read: Crime News: తెలంగాణలో దారుణం - తలపై బాది గొంతు కోసి వృద్ధ దంపతులను చంపేశారు, ఎక్కడంటే?

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KTR Slams Revanth Reddy: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?

వీడియోలు

Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Slams Revanth Reddy: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Hyderabad Old City: మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
Draupathi 2 Movie : 'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
Embed widget