అన్వేషించండి

PM Modi: 'బీఆర్ఎస్ దోచుకుంటే కాంగ్రెస్ ఏటీఎంగా మార్చుకుంది' - జగిత్యాల సభలో ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు

Jagitial News: వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కొత్త చరిత్ర సృష్టించబోతున్నారని ప్రధాని మోదీ అన్నారు. జగిత్యాల సభలో బీఆర్ఎస్, కాంగ్రెస్ లపై తీవ్ర విమర్శలు చేశారు.

PM Modi Comments in Jaitial Meeting: పదేళ్ల పాలనలో తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో బీఆర్ఎస్ ఆడుకుందని ప్రధాని మోదీ (PM Modi) మండిపడ్డారు. సోమవారం జగిత్యాలలో (Jagitial) జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తొలుత తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోదీ బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజల్లో ఉత్సాహం నింపారు. ఈ సభకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, సీనియర్ నేతలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, ఇతర కీలక నేతలు హాజరయ్యారు. రాష్ట్రంలో బీజేపీకి మద్దతు పెరిగిందన్న మోదీ.. మే 13న తెలంగాణ ప్రజలు కొత్త చరిత్ర సృష్టించబోతున్నారని అన్నారు. 'దేశంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయం. భారత్ అభివృద్ధి చెందితేనే తెలంగాణలోనూ అభివృద్ధి జరుగుతుంది. బీఆర్ఎస్ పై ప్రజలకు ఉన్న ఆగ్రహం గత అసెంబ్లీ ఎన్నికల్లో బయటపడింది. తెలంగాణ అభివృద్ధికి రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. మాకు అధికారం కంటే ప్రజా సంక్షేమమే ముఖ్యం.' అని మోదీ పేర్కొన్నారు.

'బీఆర్ఎస్ దోపిడీ.. కాంగ్రెస్ ఏటీఎం'
PM Modi: 'బీఆర్ఎస్ దోచుకుంటే కాంగ్రెస్ ఏటీఎంగా మార్చుకుంది' - జగిత్యాల సభలో ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు

ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బీఆర్ఎస్ పని అయిపోతుందని మోదీ అన్నారు. పదేళ్ల పాటు బీఆర్ఎస్ తెలంగాణను దోచుకుంటే.. ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్రాన్ని ఏటీఎంలా మార్చుకుంటోందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని దోచుకున్న వారిని తాము వదిలిపెట్టమని స్పష్టం చేశారు. 'తెలంగాణలో బీజేపీ అధికారంలో ఉంటే ఎంతో అభివృద్ధి చెంది ఉండేది. పసుపు రైతులను బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎన్నడూ పట్టించుకోలేదు. బీజేపీ ప్రభుత్వం పసుపు రైతులకు ఎంతో మేలు చేసింది. బీఆర్ఎస్ పై అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ఇప్పుడు ఆ ఫైల్స్ పక్కన పెడుతోంది. కాళేశ్వరం అవినీతిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయి. బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ దర్యాప్తు చేయడం లేదు. లిక్కర్ స్కాంలోనూ బీఆర్ఎస్ కమీషన్లు తీసుకుంది. ఢిల్లీలో కుటుంబ పార్టీల పెద్దలకు తెలంగాణ నుంచి డబ్బులు వెళ్తున్నాయి. దేశంలో ఏ దోపిడీ పరిశీలించినా.. దాని వెనుక కుటుంబ పార్టీలే ఉన్నాయి. 2జీ స్పెక్ట్రమ్ కేసులో డీఎంకే పేరు బయటకు వచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పేరు ఉంది. ఇప్పుడు అలాంటి పార్టీల జాబితాలో బీఆర్ఎస్ చేరింది.' అంటూ మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు.
PM Modi: 'బీఆర్ఎస్ దోచుకుంటే కాంగ్రెస్ ఏటీఎంగా మార్చుకుంది' - జగిత్యాల సభలో ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు

'400లకు పైగా సీట్లు ఖాయం'

దేశంలో లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైందని.. గడిచిన 3 రోజుల్లో రెండుసార్లు తెలంగాణకు వచ్చానని ప్రధాని మోదీ తెలిపారు. 'రానున్న ఎన్నికల్లో బీజేపీకి దేశవ్యాప్తంగా 400కు పైగా సీట్లు రావడం ఖాయం. తెలంగాణ ప్రజలు మార్పు కోరుతున్నారు. రాష్ట్రంలో బీజేపీకి బలం పెరుగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ తగ్గుతున్నాయి. నేను భారతమాత పూజారిని. తెలంగాణ ప్రజలు వికసిత్ భారత్ కు ఓటు వేయబోతున్నారు. ఇక్కడ బీజేపీకి ఎన్ని సీట్లు వస్తే అంత పవర్ నాకు వస్తుంది. దేశంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయం.' అని ధీమా వ్యక్తం చేశారు.

Also Read: Danam Nagendar: దానం నాగేందర్ పై అనర్హత పిటిషన్ - స్పీకర్ కు సమర్పించిన బీఆర్ఎస్ నేతలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

India vs Zimbabwe, 2nd T20I: షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India vs Zimbabwe, 2nd T20I: షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Embed widget