అన్వేషించండి

Peddapalli News : పెద్దపల్లి జిల్లాలో విషాదం, ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా!

Peddapalli News : పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నీటికుంటలో ఈతకు దిగి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు.

Peddapalli News : పెద్దపల్లి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఈత సరదా ముగ్గురి ప్రాణాలు తీసింది. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ పీకే రామయ్య కాలనీలోని నీటికుంటలో ముగ్గురు విద్యార్థులు ఈతకు దిగారు. ప్రమాదవశాత్తులో నీటికుంటలో ముగిగిపోయి విద్యార్థులు మృతి చెందారు. మృతులు విక్రమ్‌, ఉమామహేశ్, సాయిచరణ్‌గా స్థానికులు గుర్తించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

అసలేం జరిగింది? 

పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పీకే రామయ్య కాలనీలో విషాదం చోటుచేసుకుంది. పోరేట్‌పల్లికి చెందిన ముగ్గురు మిత్రులు నీటికుంటలో ఈతకు దిగారు. అయితే ప్రమాదవశాత్తు ముగ్గురూ నీటిలో మునిగి మృతిచెందారు. ముగ్గురు విద్యార్థులు పోరేటిపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నారని స్థానికులు తెలిపారు. మృతులు సాయి చరణ్, ఉమా మహేష్, విక్రమ్‌గా స్థానికులు గుర్తించారు. సాయిచరణ్, ఉమా మహేష్ చెరువులో మునిగిపోయి చనిపోయారు. విక్రమ్ ను చెరువు నుంచి బయటకు తీసిన కాసేపటికి ప్రాణాలు విడిచాడని స్థానికులు తెలిపారు. సరదాగా ఈతకు వెళ్లిన తమ బిడ్డలు విగతజీవులుగా పడిఉండడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు.. ముగ్గురు విద్యార్థులను నీటి కుంట నుంచి బయటకు తీసి గోదావరిఖని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటే వారు ప్రాణాలు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆసుపత్రి వద్ద తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోధించారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. ముగ్గురికీ ఈతరాకపోవడం వల్లే నీటికుంటలో మునిగిపోయారని తెలుస్తోంది. ముగ్గురి మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.  

ఇటీవల కడపలో

కడప జిల్లా వేంపల్లి మండలంలో ఇటీవల విషాద ఘటన చోటుచేసుకుంది. అలవలపాడులోని గాలేరు నగరి కెనాల్ లో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి చెందారు. వేముల మండలం వేల్పులకు చెందిన జ్ఞానయ్య(25), అలవపాడుకు చెందిన సాయి సుశాంత్‌(8), సాయి తేజ(11) తమ చిన్నారుల మేనమామ శశికుమార్‌ తో కలిసి గాలేరు నగరి సుజల స్రవంతి కెనాల్‌లోకి ఈతకు వెళ్లారు. కాలువ లోతు ఎక్కువగా ఉండడంతో ముగ్గురు మునిగిపోయారు. శశికుమార్ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. ఈ ప్రమాదం విషయం తెలుసుకున్న వేంపల్లి ఎస్సై తిరుపాల్‌ నాయక్‌ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ప్రకటించారు. మృతుల్లో సాయితేజ, సాయి సుశాంత్‌ అక్కాతమ్ముళ్లు కాగా బంధువైన జ్ఞానయ్య ఈస్టర్‌ పండుగకు వీరి ఇంటికి వచ్చినట్లు తెలుస్తోంది. సాయి, సుశాంత్‌ల అమ్మ చనిపోవడంతో అలవలపాడులోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నారు.  ఈ ప్రమాదంతో గ్రామంలో విషాదం నెలకొంది. 

వేసవికాలం కావడంతో విద్యార్థులు గ్రామాలకు సమీపంలోని చెరువులు, నీటికుంటల్లో ఈతకు దిగుతుంటారు. ఇలాంటి సమయాల్లో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈత రానివాళ్లు ఎట్టి పరిస్థితుల్లో చెరువుల్లో, కుంటల్లో దిగవద్దని తెలిపారు. అదేవిధంగా తల్లిదండ్రులు విద్యార్థులపై నిఘా పెట్టాలని కోరుతున్నారు.  

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PV Sunil Kumar : పీవీ సునీల్‌పై ఆర్టికల్స్ ఆఫ్ చార్జ్ -  మరోసారి నోటీసులు జారీ - నెక్ట్స్ చర్యలే !
పీవీ సునీల్‌పై ఆర్టికల్స్ ఆఫ్ చార్జ్ - మరోసారి నోటీసులు జారీ - నెక్ట్స్ చర్యలే !
Crime News: 5 కోట్లు ఇవ్వాలి ఎమ్మెల్యేకు బెదిరింపులు - యూట్యూబర్ అరెస్టు
5 కోట్లు ఇవ్వాలి ఎమ్మెల్యేకు బెదిరింపులు - యూట్యూబర్ అరెస్టు
Danam Nagender: కేసీఆర్ కోసం జనం ఎదురు చూస్తున్నారు - దానం సంచనల వ్యాఖ్యలు- హ్యాండిచ్చేసినట్లే
కేసీఆర్ కోసం జనం ఎదురు చూస్తున్నారు - దానం సంచనల వ్యాఖ్యలు- హ్యాండిచ్చేసినట్లే
Chandrababu:  చంద్రబాబుపై  తప్పుడు కేసులు పెట్టారు - తేల్చి మూసేసిన పోలీసులు
చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టారు - తేల్చి మూసేసిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RCB vs RR Match preview IPL 2025 | నేడు బెంగుళూరులో రాజస్థాన్ రాయల్స్ తో RCB ఫైట్ | ABP DesamRohit Sharma 70 Runs vs SRH IPL 2025 | సరైన సమయంలో బీభత్సమైన ఫామ్ లోకి వచ్చిన రోహిత్ శర్మ | ABP DesamMumbai Indians top 3 Position IPL 2025 | అనూహ్య రీతిలో పాయింట్స్ టేబుల్ లో దూసుకెళ్లిన ముంబై ఇండియన్స్ | ABP DesamIshan Kishan Match Fixing Trending IPL 2025 | తీవ్ర వివాదమవుతున్న ఇషాన్ కిషన్ ఔట్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PV Sunil Kumar : పీవీ సునీల్‌పై ఆర్టికల్స్ ఆఫ్ చార్జ్ -  మరోసారి నోటీసులు జారీ - నెక్ట్స్ చర్యలే !
పీవీ సునీల్‌పై ఆర్టికల్స్ ఆఫ్ చార్జ్ - మరోసారి నోటీసులు జారీ - నెక్ట్స్ చర్యలే !
Crime News: 5 కోట్లు ఇవ్వాలి ఎమ్మెల్యేకు బెదిరింపులు - యూట్యూబర్ అరెస్టు
5 కోట్లు ఇవ్వాలి ఎమ్మెల్యేకు బెదిరింపులు - యూట్యూబర్ అరెస్టు
Danam Nagender: కేసీఆర్ కోసం జనం ఎదురు చూస్తున్నారు - దానం సంచనల వ్యాఖ్యలు- హ్యాండిచ్చేసినట్లే
కేసీఆర్ కోసం జనం ఎదురు చూస్తున్నారు - దానం సంచనల వ్యాఖ్యలు- హ్యాండిచ్చేసినట్లే
Chandrababu:  చంద్రబాబుపై  తప్పుడు కేసులు పెట్టారు - తేల్చి మూసేసిన పోలీసులు
చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టారు - తేల్చి మూసేసిన పోలీసులు
BRS Meeting In Warangal: వరంగల్‌లో గులాబీ మాస్ జాతరకు భారీ ఏర్పాట్లు, కేవలం పార్కింగ్ కోసమే వెయ్యి ఎకరాలు
వరంగల్‌లో గులాబీ మాస్ జాతరకు భారీ ఏర్పాట్లు, కేవలం పార్కింగ్ కోసమే వెయ్యి ఎకరాలు
YS Sharmila: ఇంటర్నల్ టెర్రరిస్ట్ మోడీ - ఏపీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర విమర్శలు
ఇంటర్నల్ టెర్రరిస్ట్ మోడీ - ఏపీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర విమర్శలు
Rajamouli: మహేష్ బాబు సినిమా కోసం... ఆర్టీఏ ఆఫీసుకు రాజమౌళి... విదేశాల్లో జక్కన్నకు డ్రైవర్ అవసరం లేదా?
మహేష్ బాబు సినిమా కోసం... ఆర్టీఏ ఆఫీసుకు రాజమౌళి... విదేశాల్లో జక్కన్నకు డ్రైవర్ అవసరం లేదా?
Pahalgam attack:భారత్‌ జవాన్‌ను బంధించిన పాక్- రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత
భారత్‌ జవాన్‌ను బంధించిన పాక్- రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత  
Embed widget