అన్వేషించండి

Peddapalli News : పెద్దపల్లి జిల్లాలో విషాదం, ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా!

Peddapalli News : పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నీటికుంటలో ఈతకు దిగి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు.

Peddapalli News : పెద్దపల్లి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఈత సరదా ముగ్గురి ప్రాణాలు తీసింది. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ పీకే రామయ్య కాలనీలోని నీటికుంటలో ముగ్గురు విద్యార్థులు ఈతకు దిగారు. ప్రమాదవశాత్తులో నీటికుంటలో ముగిగిపోయి విద్యార్థులు మృతి చెందారు. మృతులు విక్రమ్‌, ఉమామహేశ్, సాయిచరణ్‌గా స్థానికులు గుర్తించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

అసలేం జరిగింది? 

పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పీకే రామయ్య కాలనీలో విషాదం చోటుచేసుకుంది. పోరేట్‌పల్లికి చెందిన ముగ్గురు మిత్రులు నీటికుంటలో ఈతకు దిగారు. అయితే ప్రమాదవశాత్తు ముగ్గురూ నీటిలో మునిగి మృతిచెందారు. ముగ్గురు విద్యార్థులు పోరేటిపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నారని స్థానికులు తెలిపారు. మృతులు సాయి చరణ్, ఉమా మహేష్, విక్రమ్‌గా స్థానికులు గుర్తించారు. సాయిచరణ్, ఉమా మహేష్ చెరువులో మునిగిపోయి చనిపోయారు. విక్రమ్ ను చెరువు నుంచి బయటకు తీసిన కాసేపటికి ప్రాణాలు విడిచాడని స్థానికులు తెలిపారు. సరదాగా ఈతకు వెళ్లిన తమ బిడ్డలు విగతజీవులుగా పడిఉండడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు.. ముగ్గురు విద్యార్థులను నీటి కుంట నుంచి బయటకు తీసి గోదావరిఖని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటే వారు ప్రాణాలు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆసుపత్రి వద్ద తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోధించారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. ముగ్గురికీ ఈతరాకపోవడం వల్లే నీటికుంటలో మునిగిపోయారని తెలుస్తోంది. ముగ్గురి మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.  

ఇటీవల కడపలో

కడప జిల్లా వేంపల్లి మండలంలో ఇటీవల విషాద ఘటన చోటుచేసుకుంది. అలవలపాడులోని గాలేరు నగరి కెనాల్ లో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి చెందారు. వేముల మండలం వేల్పులకు చెందిన జ్ఞానయ్య(25), అలవపాడుకు చెందిన సాయి సుశాంత్‌(8), సాయి తేజ(11) తమ చిన్నారుల మేనమామ శశికుమార్‌ తో కలిసి గాలేరు నగరి సుజల స్రవంతి కెనాల్‌లోకి ఈతకు వెళ్లారు. కాలువ లోతు ఎక్కువగా ఉండడంతో ముగ్గురు మునిగిపోయారు. శశికుమార్ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. ఈ ప్రమాదం విషయం తెలుసుకున్న వేంపల్లి ఎస్సై తిరుపాల్‌ నాయక్‌ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ప్రకటించారు. మృతుల్లో సాయితేజ, సాయి సుశాంత్‌ అక్కాతమ్ముళ్లు కాగా బంధువైన జ్ఞానయ్య ఈస్టర్‌ పండుగకు వీరి ఇంటికి వచ్చినట్లు తెలుస్తోంది. సాయి, సుశాంత్‌ల అమ్మ చనిపోవడంతో అలవలపాడులోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నారు.  ఈ ప్రమాదంతో గ్రామంలో విషాదం నెలకొంది. 

వేసవికాలం కావడంతో విద్యార్థులు గ్రామాలకు సమీపంలోని చెరువులు, నీటికుంటల్లో ఈతకు దిగుతుంటారు. ఇలాంటి సమయాల్లో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈత రానివాళ్లు ఎట్టి పరిస్థితుల్లో చెరువుల్లో, కుంటల్లో దిగవద్దని తెలిపారు. అదేవిధంగా తల్లిదండ్రులు విద్యార్థులపై నిఘా పెట్టాలని కోరుతున్నారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Aadhaar Card: ఆధార్ కార్డు ఉన్నవారికి 90 వేల రూపాయలు ఇస్తుంది; ఎలాగో తెలుసుకోండి?
ఆధార్ కార్డు ఉన్నవారికి 90 వేల రూపాయలు ఇస్తుంది; ఎలాగో తెలుసుకోండి?
US President Donald Trump : 'కోటి మంది ప్రాణాలను కాపాడా' భారత్-పాక్ కాల్పుల విరమణపై మళ్లీ ట్రంప్ కామెంట్స్
'కోటి మంది ప్రాణాలను కాపాడా' భారత్-పాక్ కాల్పుల విరమణపై మళ్లీ ట్రంప్ కామెంట్స్
Sanya Malhotra: సినిమా కలెక్షన్స్ 2000 కోట్లు... కానీ హీరోయిన్ హ్యాపీగా లేదు - బాధ ఎందుకంటే?
సినిమా కలెక్షన్స్ 2000 కోట్లు... కానీ హీరోయిన్ హ్యాపీగా లేదు - బాధ ఎందుకంటే?
Mana Shankara Vara Prasad Garu Box Office Collection Day 5: 200 కోట్ల క్లబ్బులో వరప్రసాద్... ఐదు రోజుల్లో చిరంజీవి సినిమా గ్రాస్ ఎంతంటే?
200 కోట్ల క్లబ్బులో వరప్రసాద్... ఐదు రోజుల్లో చిరంజీవి సినిమా గ్రాస్ ఎంతంటే?

వీడియోలు

WPL 2026 RCB vs GG Highlights | హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు!
Ashwin about India vs New Zealand | టీమ్ సెలక్షన్ పై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Manoj Tiwari about Rohit Sharma Captaincy | రోహిత్ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
Ind vs NZ Rohit Sharma Records | మరో రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ
Spirit Release Date Confirmed | ప్రభాస్ స్పిరిట్ రిలీజ్ డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aadhaar Card: ఆధార్ కార్డు ఉన్నవారికి 90 వేల రూపాయలు ఇస్తుంది; ఎలాగో తెలుసుకోండి?
ఆధార్ కార్డు ఉన్నవారికి 90 వేల రూపాయలు ఇస్తుంది; ఎలాగో తెలుసుకోండి?
US President Donald Trump : 'కోటి మంది ప్రాణాలను కాపాడా' భారత్-పాక్ కాల్పుల విరమణపై మళ్లీ ట్రంప్ కామెంట్స్
'కోటి మంది ప్రాణాలను కాపాడా' భారత్-పాక్ కాల్పుల విరమణపై మళ్లీ ట్రంప్ కామెంట్స్
Sanya Malhotra: సినిమా కలెక్షన్స్ 2000 కోట్లు... కానీ హీరోయిన్ హ్యాపీగా లేదు - బాధ ఎందుకంటే?
సినిమా కలెక్షన్స్ 2000 కోట్లు... కానీ హీరోయిన్ హ్యాపీగా లేదు - బాధ ఎందుకంటే?
Mana Shankara Vara Prasad Garu Box Office Collection Day 5: 200 కోట్ల క్లబ్బులో వరప్రసాద్... ఐదు రోజుల్లో చిరంజీవి సినిమా గ్రాస్ ఎంతంటే?
200 కోట్ల క్లబ్బులో వరప్రసాద్... ఐదు రోజుల్లో చిరంజీవి సినిమా గ్రాస్ ఎంతంటే?
Indian Navy:ప్రపంచంలోనే నాల్గో శక్తివంతమైదిగా భారత్‌నేవీ! బ్రిటన్, ఫ్రాన్స్ వెనక్కి! టాప్‌లో అమెరికా, చైనా
ప్రపంచంలోనే నాల్గో శక్తివంతమైదిగా భారత్‌నేవీ! బ్రిటన్, ఫ్రాన్స్ వెనక్కి! టాప్‌లో అమెరికా, చైనా
Bluetooth Earphones Cancer Risk: బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్‌తో క్యాన్సర్ వస్తుందా? రిస్క్ ఎంతో తెలుసుకోండి?
బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్‌తో క్యాన్సర్ వస్తుందా? రిస్క్ ఎంతో తెలుసుకోండి?
Govinda Wife Sunita Ahuja: అమ్మాయితో ఎఫైర్... హీరో అక్రమ సంబంధంపై భార్య సంచలన వ్యాఖ్యలు
అమ్మాయితో ఎఫైర్... హీరో అక్రమ సంబంధంపై భార్య సంచలన వ్యాఖ్యలు
Phone Expiry Date: ఫోన్‌కి కూడా ఎక్స్‌పెయిరీ డేట్ ఉంటుంది! తెలుసుకోవడం ఎలా? వాడితో జరిగే నష్టమేంటీ?
ఫోన్‌కి కూడా ఎక్స్‌పెయిరీ డేట్ ఉంటుంది! తెలుసుకోవడం ఎలా? వాడితో జరిగే నష్టమేంటీ?
Embed widget