అన్వేషించండి

Peddapalli News : పెద్దపల్లి జిల్లాలో విషాదం, ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా!

Peddapalli News : పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నీటికుంటలో ఈతకు దిగి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు.

Peddapalli News : పెద్దపల్లి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఈత సరదా ముగ్గురి ప్రాణాలు తీసింది. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ పీకే రామయ్య కాలనీలోని నీటికుంటలో ముగ్గురు విద్యార్థులు ఈతకు దిగారు. ప్రమాదవశాత్తులో నీటికుంటలో ముగిగిపోయి విద్యార్థులు మృతి చెందారు. మృతులు విక్రమ్‌, ఉమామహేశ్, సాయిచరణ్‌గా స్థానికులు గుర్తించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

అసలేం జరిగింది? 

పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పీకే రామయ్య కాలనీలో విషాదం చోటుచేసుకుంది. పోరేట్‌పల్లికి చెందిన ముగ్గురు మిత్రులు నీటికుంటలో ఈతకు దిగారు. అయితే ప్రమాదవశాత్తు ముగ్గురూ నీటిలో మునిగి మృతిచెందారు. ముగ్గురు విద్యార్థులు పోరేటిపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నారని స్థానికులు తెలిపారు. మృతులు సాయి చరణ్, ఉమా మహేష్, విక్రమ్‌గా స్థానికులు గుర్తించారు. సాయిచరణ్, ఉమా మహేష్ చెరువులో మునిగిపోయి చనిపోయారు. విక్రమ్ ను చెరువు నుంచి బయటకు తీసిన కాసేపటికి ప్రాణాలు విడిచాడని స్థానికులు తెలిపారు. సరదాగా ఈతకు వెళ్లిన తమ బిడ్డలు విగతజీవులుగా పడిఉండడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు.. ముగ్గురు విద్యార్థులను నీటి కుంట నుంచి బయటకు తీసి గోదావరిఖని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటే వారు ప్రాణాలు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆసుపత్రి వద్ద తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోధించారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. ముగ్గురికీ ఈతరాకపోవడం వల్లే నీటికుంటలో మునిగిపోయారని తెలుస్తోంది. ముగ్గురి మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.  

ఇటీవల కడపలో

కడప జిల్లా వేంపల్లి మండలంలో ఇటీవల విషాద ఘటన చోటుచేసుకుంది. అలవలపాడులోని గాలేరు నగరి కెనాల్ లో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి చెందారు. వేముల మండలం వేల్పులకు చెందిన జ్ఞానయ్య(25), అలవపాడుకు చెందిన సాయి సుశాంత్‌(8), సాయి తేజ(11) తమ చిన్నారుల మేనమామ శశికుమార్‌ తో కలిసి గాలేరు నగరి సుజల స్రవంతి కెనాల్‌లోకి ఈతకు వెళ్లారు. కాలువ లోతు ఎక్కువగా ఉండడంతో ముగ్గురు మునిగిపోయారు. శశికుమార్ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. ఈ ప్రమాదం విషయం తెలుసుకున్న వేంపల్లి ఎస్సై తిరుపాల్‌ నాయక్‌ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ప్రకటించారు. మృతుల్లో సాయితేజ, సాయి సుశాంత్‌ అక్కాతమ్ముళ్లు కాగా బంధువైన జ్ఞానయ్య ఈస్టర్‌ పండుగకు వీరి ఇంటికి వచ్చినట్లు తెలుస్తోంది. సాయి, సుశాంత్‌ల అమ్మ చనిపోవడంతో అలవలపాడులోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నారు.  ఈ ప్రమాదంతో గ్రామంలో విషాదం నెలకొంది. 

వేసవికాలం కావడంతో విద్యార్థులు గ్రామాలకు సమీపంలోని చెరువులు, నీటికుంటల్లో ఈతకు దిగుతుంటారు. ఇలాంటి సమయాల్లో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈత రానివాళ్లు ఎట్టి పరిస్థితుల్లో చెరువుల్లో, కుంటల్లో దిగవద్దని తెలిపారు. అదేవిధంగా తల్లిదండ్రులు విద్యార్థులపై నిఘా పెట్టాలని కోరుతున్నారు.  

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో పాటు మరో ఇద్దరు నిందితులు అరెస్ట్
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో పాటు మరో ఇద్దరు నిందితులు అరెస్ట్
KTR GHMC Elections Strategy: గ్రేటర్ ఎన్నికల కోసం మైక్రో లెవల్ ప్లానింగ్ - స్పెషల్ వార్ రూమ్ - కేటీఆర్ ఇజ్జత్‌కా సవాల్ !
గ్రేటర్ ఎన్నికల కోసం మైక్రో లెవల్ ప్లానింగ్ - స్పెషల్ వార్ రూమ్ - కేటీఆర్ ఇజ్జత్‌కా సవాల్ !
Pawan Kalyan Letter to Revanth Reddy: పోక్సో చట్టం అమలుపై కీలక సూచనలు - సీఎం రేవంత్‌కు పవన్ కల్యాణ్ ఐదు పేజీల లేఖ
పోక్సో చట్టం అమలుపై కీలక సూచనలు - సీఎం రేవంత్‌కు పవన్ కల్యాణ్ ఐదు పేజీల లేఖ
Breaking News:ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో పాటు మరో ఇద్దరు నిందితులు అరెస్ట్
Breaking News: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో పాటు మరో ఇద్దరు నిందితులు అరెస్ట్
YS Jagan New Political Strategist: జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
AP Govt Employees: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
IRCTC New Website: IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
Eluru ZPHS School: బూట్లు వేసుకురాలేదని విద్యార్థినిపై పీఈటీ దాష్టీకం.. స్పృహ కోల్పోయిన బాలిక- ఏలూరు జిల్లాలో ఘటన
బూట్లు వేసుకురాలేదని విద్యార్థినిపై పీఈటీ దాష్టీకం.. స్పృహ కోల్పోయిన బాలిక- ఏలూరు జిల్లాలో ఘటన
Medikonduru Police Station: తనిఖీలకు వెళ్లిన ఏపీ సమాచార కమిషనర్‌కు చేదు అనుభవం, బాధ్యులపై చర్యలకు డీజీపీకి లేఖ
తనిఖీలకు వెళ్లిన ఏపీ సమాచార కమిషనర్‌కు చేదు అనుభవం, బాధ్యులపై చర్యలకు డీజీపీకి లేఖ
India UK CETA Trade Agreement: తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
Pawan Kalyan Doctor: పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
Embed widget