అన్వేషించండి

NPS Sanchay Scheme: అసంఘటిత కార్మికులకు నెల నెలా పెన్షన్.. NPS సంచయ్ స్కీమ్ కు అర్హతలు, దరఖాస్తు విధానం ఎలా?

NPS Sanchay Scheme: తక్కువ పెట్టుబడితో అసంఘటిత రంగాల్లోని కార్మికులు సైతం పెన్షన్ పొందేందుకు కేంద్ర ఎన్పీఎస్ సంచయ్ స్కీమ్ ను ప్రారంభించింది.

NPS Sanchay Scheme: NPS సంచయ్ పదవీ విరమణ పెట్టుబడి స్కీమ్. నేషనల్ పెన్షన్ స్కీమ్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీ్మ్ లో చందాదారులు పెట్టుబడి మాన్యువల్‌గా ఎంచుకోవాల్సిన అవసరం లేకుండా, డిఫాల్ట్ పెట్టుబడి పెట్టే సదుపాయం ఇందులో అందుబాటులో ఉంది. ఈ స్కీమ్  చేరడం ద్వారా తక్కువ పెట్టుబడితో నెలకు రూ.1 లక్షకు పైగా పెన్షన్ పొందవచ్చు. 

NPS సంచయ్ అంటే ఏమిటి?

ఎన్‌పీఎస్ సంచయ్  జాతీయ పింఛన్ వ్యవస్థలోని మల్టీ స్కీ్మ్ ఫ్రేమ్‌వర్క్ (MSF) కింద ప్రారంభించిన పెన్షన్ స్కీమ్. 'సంచయ్' అనే పదానికి పొదుపు అని అర్థం. పదవీ విరమణ పొదుపు కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అన్ ఆర్గనైజ్డ్ సెక్టార్ వర్కర్లు, గిగ్ వర్కర్లు, స్వయం ఉపాధి కార్మికులు, రోజువారీ కూలీలు, చిరు వ్యాపారులు  ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. PFRDAలో రిజిస్టర్ అయిన అన్ని పెన్షన్ ఫండ్‌లు మల్టీ స్కీమ్ ఫ్రేమ్‌వర్క్ కింద NPS సంచయ్‌ స్కీమ్ కు అర్హులు. పెట్టుబటి ఆప్షన్లను చాలా సులభంగా ఎంచుకునేందుకు, అసెట్ కేటాయింపులను సైతం ఎంచుకునే వీలు కల్పిస్తున్నారు.మే 6, 2026న  పీఎఫ్ఆర్‌డీ ఈ మేరకు సర్క్యూలర్ జారీ చేసింది. మే 6 నుంచే ఈ పథకం అమలులోకి వస్తుందని పేర్కొంది. 

ముఖ్యాంశాలు  

18 - 85 ఏళ్ల మధ్య వయస్సు గలవారు అర్హులు 
టైర్-I అకౌంట్ కు ప్రతి విరాళానికి రూ.500, ఏడాదికి రూ.1,000
eNPS, ఫిన్ టెక్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో, పీవోపీ కేంద్రాల ద్వారా ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.   

పెట్టుబడి ఎలా?

ఈ పథకంలో పెట్టుబడి.. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS)/NPS/అటల్ పెన్షన్ యోజన వంటి ప్రభుత్వ రంగ పథకాలకు ప్రస్తుతం ఉన్న పెట్టుబడి మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటుంది. జాతీయ పింఛను పథకం మాదిరిగానే నిబంధనలు ఉంటాయి. ఇందులో కనీస పెట్టుబడి రూ.1000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ స్కీమ్ లో మార్కెట్ ఆధారంగా రిటర్న్స్ ఉంటాయి. కనీసం 10 శాతం రాబడి అంచనా వేయవచ్చు. 

20 ఏళ్ల వయసులోని వ్యక్తి నెలకు రూ.5000.. 60 ఏళ్ల వయసు వరకు పెట్టుబడి పెడితే రూ.3.1 కోట్ల మెచ్యూరిటీ పొందతారు. అదే 30 ఏళ్ల వ్యక్తి అయితే రూ.1.1 కోట్లు, 40 ఏళ్ల వ్యక్తి అయితే రూ.38 లక్షలు మెచ్యూరిటీ మొత్తం పొందవచ్చు. అందులో నుంచి 40 శాతం యాన్యుటీ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 20 ఏళ్ల వ్యక్తి తనకు 60 ఏళ్లు వచ్చిన తర్వాత ఎన్‌పీఎస్ కార్పస్ నుంచి 40 శాతం అంటే రూ. 1,27,000 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పెట్టుబడి దానిపై వచ్చే రాబడి ఆధారంగా నెల నెలా పెన్షన్ వస్తుంది.  

NPS సంచయ్‌ అర్హతలు 

  1. భారత పౌరుడై ఉండాలి. 
  2. వయోపరిమితి 18- 85 సంవత్సరాలు
  3. పౌరులందరూ, ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికులు అర్హులు
  4. NPS ఖాతా తప్పనిసరి కాదు
  5.  సబ్‌స్క్రైబర్ రిజిస్ట్రేషన్ ఫారం తప్పనిసరి

NPS సంచయ్ అకౌంట్ ఎలా తెరవాలి?

ఆన్‌లైన్ పద్ధతి

ప్రోటీన్ (eNPS)

Step 1: eNPS హోంపేజీలోని '  ఇండివిడ్యువల్ సబ్‌స్క్రైబర్' , 'రెసిడెంట్ ఇండియన్' సెలెక్ట్ చేసుకోవాలి.

Step 2:  ఇ-కేవైసీ కోసం  ఆధార్ లేదా  పాన్ సెలెక్ట్ చేసుకోవచ్చు.

Step 3: ఆల్ సిటిజన్ మోడల్ ను ఎంచుకోండి. మల్టీ స్కీమ్ ఫ్రేమ్‌వర్క్ లో 'NPS సంచయ్' ఆప్షన్ ఎంచుకోండి.  

Step 4: మీ వివరాలను పొందేందుకు  ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి.

Step 5 : మీ వ్యక్తిగత, బ్యాంకు వివరాలను ధృవీకరించి, డిజిటల్ సైన్ కాపీని అప్‌లోడ్ చేయండి.

Step 6: మీ శాశ్వత పదవీ విరమణ ఖాతా సంఖ్య (PRAN)ను రూపొందించడానికి కనీసం  రూ.500 కనీస చందా. 

ఆఫ్‌లైన్ పద్ధతి

  • రిజిస్టర్ అయితే పాయింట్ ఆఫ్ ప్రెసెన్స్  సర్వీస్ ప్రొవైడర్ ద్వారా ఆఫ్ లైన్ లో ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు.  
  • సబ్‌స్క్రైబర్ రిజిస్ట్రేషన్ ఫారంలో వివరాలు నమోదు చేసి, KYC పత్రాలు, ఫొటో, బ్యాంక్ అకౌంట్ వివరాలు సమర్పించండి. 
  • మొదటి చందా అందించి, PRAN నెంబర్ పొందవచ్చు.  

విత్ డ్రా రూల్స్  

  • చందాదారులు పాక్షిక విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.  
  • ఈ పెట్టుబడి విత్ డ్రాకు 3 సంవత్సరాలు లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. 
  • చందాదారుడి సబ్ స్క్రిప్షన్ లో  25% వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. 
  • ఉన్నత విద్య, వివాహం, అనారోగ్యం, ఇంటి కొనుగోలు, వ్యాపారానికి విత్ డ్రా చేసుకోవచ్చు.  

ఎగ్జిట్ రూల్స్ 

  • ఎన్పీఎస్ సంచయ్ ను ఎగ్జిట్ అవ్వడానికి చందాదారుడికి  60 సంవత్సరాలు నిండిన లేదా  15 సంవత్సరాల పెట్టుబడిని పూర్తి చేసుకుంటే.. ఏది ముందుగా జరిగితే అది... సాధారణ ఎగ్జిట్ కు అవకాశం కల్పిస్తుంది.  
  • 60 ఏళ్ల వయసులో ఈ స్కీమ్ నుంచి బయటకు రావాలనుకుంటే 40% కార్పస్‌ను యాన్యుటీ కొనుగోలుకు ఉపయోగించాలి. మిగిలిన 60%ను ఒకేసారి విత్‌డ్రా చేసుకోవచ్చు.
  • 60 ఏళ్ల లోపే ఎగ్జిట్ అయితే కనీసం 80% కార్పస్‌ను యాన్యుటీ కొనుగోలుకు ఉపయోగించాలి.  20%ను ఒకేసారి విత్‌డ్రా చేసుకోవచ్చు.
  • చందాదారుడు మరణిస్తే నామినీ/చట్టబద్ధమైన వారసులకు మొత్తం సేవింగ్స్ చెల్లిస్తారు.  

Frequently Asked Questions

NPS సంచయ్ పథకం అంటే ఏమిటి?

NPS సంచయ్ అనేది నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెన్షన్ పథకం. 'సంచయ్' అంటే పొదుపు, ఇది పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రతను అందించే లక్ష్యంతో రూపొందించబడింది.

NPS సంచయ్ పథకంలో ఎవరు చేరవచ్చు?

18 నుండి 85 సంవత్సరాల మధ్య వయస్సు గల భారత పౌరులు ఈ పథకంలో చేరవచ్చు. ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికులు, గిగ్ వర్కర్లు, స్వయం ఉపాధి పొందుతున్నవారు, రోజువారీ కూలీలు, చిరు వ్యాపారులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

NPS సంచయ్ పథకంలో పెట్టుబడి ఎలా పెట్టాలి?

ఈ పథకంలో కనీసం రూ.1000 తో పెట్టుబడి ప్రారంభించవచ్చు. పెట్టుబడి మార్కెట్ పనితీరుపై ఆధారపడి ఉంటుంది, సుమారు 10% రాబడిని అంచనా వేయవచ్చు.

NPS సంచయ్ పథకం నుండి డబ్బును ఎప్పుడు తీసుకోవచ్చు?

సాధారణంగా 60 సంవత్సరాల వయస్సు నిండిన తర్వాత లేదా 15 సంవత్సరాల పెట్టుబడి పూర్తయిన తర్వాత డబ్బును తీసుకోవచ్చు. 60 ఏళ్ల తర్వాత 60% వరకు, అంతకుముందు 20% వరకు ఒకేసారి విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

SIR పై అప్రమత్తంగా ఉండాలి, ఒక్క ఓటు కూడా గల్లంతు కాకూడదు: Jupally Krishna Rao
SIR పై అప్రమత్తంగా ఉండాలి, ఒక్క ఓటు కూడా గల్లంతు కాకూడదు: Jupally Krishna Rao
Breaking News: రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Advertisement

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Embed widget