అన్వేషించండి

Kaleshwaram Project Enquiry: మాజీ సీఎంను విచారించేంతగా కాళేశ్వరంలో ఏం జరిగింది? కేసీఆర్‌ను ఎందుకు విచారిస్తున్నట్టు?

Kaleshwaram Project Enquiry: మాజీ సీఎం కేసీఆర్‌ను కాళేశ్వరంపై నియమించిన పీసీ ఘోష్ కమిషన్ విచారిస్తోంది. అసలు ప్రాజెక్టు నిర్మాణంలో ఏం జరిగింది? ఎందుకు విచారణ చేస్తున్నారో పూర్వాపరాలు ఓసారి చూద్దాం.

Kaleshwaram Project Enquiry: తెలంగాణలోని కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివాదం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టు నిర్మాణం జరిగిందన్న ఆరోపణలపై మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్)ను విచారిస్తున్నారు. ఈ ఆరోపణలపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు ఆయన హాజరయ్యారు. హైదరాబాద్‌లోని బీఆర్‌కే భవన్‌లో విచారణ సాగుతోంది. 

ఇది తెలంగాణ గతిని మార్చిన ప్రాజెక్టుగా బీఆర్‌ఎస్ చెబుతుంటే దీన్ని కేసీఆర్‌ ఫ్యామిలీ మెంబర్స్‌ ఎంటీఎంలా మార‌్చుకున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇలా రాష్ట్ర రైతులకు నీరు అందించేందుకు రూపొందిన ఒక పెద్ద ప్రాజెక్టు నుంచి ఆర్థిక ఇబ్బందులు, నిర్మాణ లోపాల వరకు ఈ వివాదం విస్తరించి ఉంది.  

కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు?
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును 2016లో తెలంగాణ ప్రభుత్వం స్టార్ట్ చేసింది. గోదావరి నది నీటిని ఎత్తిపోతల ద్వారా తెలంగాణలోని లక్షల ఎకరాల సాగు భూములకు అందించాలని సంకల్పించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో బ్యారేజీలు నిర్మించారు. కరవు బాధిత ప్రాంతాల్లో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే లక్ష్యంతో వీటి నిర్మాణం చేపట్టారు. రూ. 80,000 కోట్ల డీపీఆర్‌తో మొదలైన ప్రాజెక్టు ఖర్చు చివరకు రూ. 1.27 లక్షల కోట్లకు చేరుకుంది.  

వివాదం ఎప్పుడు మొదలైంది?
అప్పటి వరకు ఖర్చు, ఇతర అంశాలపై మాత్రమే తరచూ విమర్శలు వినిపించేవి. కానీ 2023లో కాళేశ్వరం ప్రాజెక్టు అంశం కొత్త మలుపు తిరిగింది. మేడిగడ్డ బ్యారేజీలో ఐదు పిల్లర్‌లు కుంగిపోవడ సంచలనంగా మారింది. నీటిని నిల్వ చేసేందుకు ముఖ్యమై బ్యారేజీలోని పిల్లర్లకు బీటలు రావడం ఆందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. 

నిర్మాణ, ఆర్థిక నిర్వహణ లోపాలు కారణంగానే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని ప్రభుత్వం ప్రకటించింది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం కాసుల కోసం నిర్మించరాని ఆరోపిస్తూ వచ్చింది. కేవలం మేడిగడ్డలోనే కాకుండా అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో లీకేజీలు గుర్తించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. జరుగుతున్న పరిణామాలు మొత్తం ప్రాజెక్టు రక్షణపై సందేహాలు పెంచింది. 

ప్రాజెక్టు భద్రత, జరిగిన లోపాలు, అక్రమాలు వెలికి తీసేందుకు 2023లోనే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన తప్పులపై దర్యాప్తు ప్రారంభించాలని కమిషన్‌కు గడవు విధించింది. నిజాలు నిగ్గుతేల్చేందుకు బాధ్యత తీసుకున్న గోష్ కమిషన్ అధికారులు, ఇంజినీర్‌లు, మాజీ మంత్రులను విచారించింది. ఇప్పుడు కేసీఆర్‌ను విచారిస్తోంది.  

జరిగిన నష్టాలు ఏంటి?
కాళేశ్వరం ప్రాజెక్టుతో జరిగిన నష్టం అంతా ఇంతా కాదని ప్రభుత్వం తరచూ ఆరోపిస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్‌ల కుంగిపోవడం, అనుకున్నట్టుగా లక్షల ఎకరాల నీరు అందకపోవడం, ఏటా ప్రభుత్వ ఖజానాపై భారం. ిలా చాలా అంశాలను తెరపైకి తీసుకొస్తోంది. లీకేజీలు కారణంగా నీరు కూడా వృథా అవుతోందని చెబుతున్నారు. ప్రాజెక్టు ఖర్చు రూ. 1.27 లక్షల కోట్లకు చేరడం, అదనంగా రూ. 47,000 కోట్ల రుణం తీసుకోవడం లాంటి విధానాలతో ఆర్థిక భారాన్ని పెంచిందని చెబుతున్నారు.  

కేసీఆర్‌ను ఎందుకు విచారిస్తున్నట్టు?
కేసీఆర్‌ను విచారణకు పిలవడానికి చాలా కారణాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టును కేసీఆర్ తన హయాంలో నిర్మించారు. రైతులకు నీరు అందించే "జీవనాడి"గా పేర్కొన్నారు. నిర్మాణంలో జరిగిన తప్పులు, ఆర్థిక నిర్వహణలో అవకతవకలు దాచి పెట్టడంలో ఆయన పాత్రపై సందేహాలు వ్యక్తం చేస్తోంది ప్రభుత్వం. అందుకే కమిషన్ ఆయన నుంచి ఈ ప్రాజెక్టు గురించి కీలకాంశాలు రాబట్టే ప్రయత్నం చేస్తోంది. నిర్ణయాలు, ఆర్థిక ఖర్చులు, నిర్మాణ ప్రక్రియపై ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి హరీశ్ రావు, ఈటల రాజేందర్ వంటి వారిని విచారించింది. అధికారులు, మాజీ మంత్రులు చెప్పిన వివరాలు ప్రకారం కేసీఆర్‌పై దృష్టి పెట్టారు. 

ఈ విచారణ రాజకీయం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇదో కక్షపూరిత చర్యగా బీఆర్‌ఎస్ విమర్శిస్తోంది. కాళేశ్వరం రైతులకు ఇచ్చిన వరంంగా చెబుతోంది. హరీశ్ రావు ఇటీవల ఒక పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో ఈ ప్రాజెక్టు రైతులకు ఎలా ఉపయోగపడిందో తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ ప్రాజెక్టును విఫలమైనట్టు చెబుతోంది. దీనికి కేసీఆర్, హరీశ్ రావును బాధ్యులుగా చేస్తోంది. నిర్మాణ లోపాలు, ఆర్థిక నష్టాలు ఈ వాదనలను సవాలు చేస్తున్నాయి. ఈ విచారణ రాజకీయ పోట్లాటలకు కారణమవుతోంది, ఎందుకంటే బీఆర్‌ఎస్ ఈ రోజు హైదరాబాద్‌లో బలప్రదర్శన చేయాలని నిర్ణయించింది.

టాప్ హెడ్ లైన్స్

Corona Cases: ఆంధ్రప్రదేశ్ నుంచి యూపీ వరకు వెలుగులోకి కరోనా కేసులు! కోవిడ్-19 తిరగబెట్టిందా?
ఆంధ్రప్రదేశ్ నుంచి యూపీ వరకు వెలుగులోకి కరోనా కేసులు! కోవిడ్-19 తిరగబెట్టిందా?
Andhra Pradesh RTGS: భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
Shabad Mass Murder Accused Selfie Video:
"అమ్మాయి కుటుంబం మోసం చేసింది -నన్ను అనాథలా కాల్చేయండి" షాబాద్ సైకో కిల్లర్ రాజ్‌కుమార్ సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు
Seediri Appalaraju Son Arav Arrest: పలాస హిట్ అండ్ రన్ కేసు - కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ లొంగుబాటు!
పలాస హిట్ అండ్ రన్ కేసు - కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ లొంగుబాటు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Corona Cases: ఆంధ్రప్రదేశ్ నుంచి యూపీ వరకు వెలుగులోకి కరోనా కేసులు! కోవిడ్-19 తిరగబెట్టిందా?
ఆంధ్రప్రదేశ్ నుంచి యూపీ వరకు వెలుగులోకి కరోనా కేసులు! కోవిడ్-19 తిరగబెట్టిందా?
Andhra Pradesh RTGS: భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
Shabad Mass Murder Accused Selfie Video:
"అమ్మాయి కుటుంబం మోసం చేసింది -నన్ను అనాథలా కాల్చేయండి" షాబాద్ సైకో కిల్లర్ రాజ్‌కుమార్ సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు
Seediri Appalaraju Son Arav Arrest: పలాస హిట్ అండ్ రన్ కేసు - కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ లొంగుబాటు!
పలాస హిట్ అండ్ రన్ కేసు - కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ లొంగుబాటు!
INDW vs ENGW: లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఉమెన్ ఘన విజయం! అబ్బాయిల ఒటమికి అమ్మాయిల ప్రతీకారం!
లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఉమెన్ ఘన విజయం! అబ్బాయిల ఒటమికి అమ్మాయిల ప్రతీకారం!
Jr NTR Political Entry: జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
One Nation One Election Bill: దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
virat Kohli Records: 6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
Embed widget