అన్వేషించండి

Adilabad News: అటవీ భూమి కబ్జా చేసి విక్రయించిన బీజేపీ నేతలపై మరో రెండు కేసులు నమోదు 

Adilabad Latest News: ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ పత్రాలు సృష్టించి అటవీ భూమి కబ్జా చేయడంతో పాటు పలువురికి విక్రయించిన కేసులో బిజెపి నేతపై ఆదిలాబాద్ రూరల్ పోలీసులు మరో రెండు కేసులు నమోదు చేశారు. 

Adilabad Crime News | ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ పత్రాలు, ఫోర్జరీలతో భూ కబ్జాకు ప్రయత్నించిన బీజేపీ నేత వకుళాభరణం ఆదినాథ్ మరిన్ని చిక్కుల్లో పడ్డారు. ఆయనపై మరో 2 కేసులు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ రూరల్ సీఐ ఫణిధర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన బాధితుడు తులసివ స్వామికి 2007 లో సర్వే నెం.68/59 లో నకిలీ పత్రాలు సృష్టించి రూ.83,500కు ఒక ప్లాట్ ను నిందితుడు వకుళాభరణం ఆదినాథ్ అమ్మినట్లుగా బాధితుడు ఫిర్యాదు చేశాడు. 

ఫేక్ డాక్యుమెంట్లతో కబ్జా, ప్లాట్లు చేసి విక్రయాలు

మరో బాధితుడు చల్లా రవీందర్ అనే వ్యక్తి 2018 లో ప్రకాష్ జైస్వాల్ అనే వ్యక్తి వద్ద నుండి సర్వే నెం.68 లో 3 ప్లాట్లను కొనుగోలు చేశాడు. ఈ 3 ప్లాట్ లను నరేందర్, ఆదినాథ్ లు కలిసి ప్లాట్లకు ఉన్న సరిహద్దును చెరిపేసి ఆ ప్లాట్లకు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జాకు ప్రయత్నం చేసినట్లు బాధితుడు ఫిర్యాదు చేశాడని సీఐ ఫణిదర్ తెలిపారు. ఈ మేరకు వకుళాభరణం ఆదినాథ్ పై ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో మరో రెండు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

పలు సెక్షన్ల కింద కేసులు

ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి కొన్ని ప్లాట్లు, భూములు కబ్జాకు ప్రయత్నించడంతో పాటు ఫోర్జరీ సంతకాలతో కొన్ని ప్లాట్లను విక్రయించిన కేసులో వకుళాభరణం ఆదినాథ్ నిందితుడిగా ఉన్నారు. ప్రజలను మోసం చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న విషయంలో బీజేపీ నేతలపై ఆదిలాబాద్ జిల్లా పోలీస్ యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది. తప్పు చేసిన వారిని ఉపేక్షించేది లేదని, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని రూరల్ సీఐ ఫణిదర్ హెచ్చరించారు. అతనిపై ఇదివరకే ఐపీసీ సెక్షన్లు 420, 467, 468, 471, 290, 506, 34 కింద కేసు నమోదు చేశారు. కేసుతో సంబంధం ఉన్న వకుళాభరణం ఆదినాథ్ భార్య రజని ప్రస్తుతం పరారీలో ఉన్నారు.

మరిన్ని చిక్కుల్లో బీజేపీ నేత

అటవీశాఖ భూములను సైతం కబ్జా చేయడంతో పాటు వాటిని అమాయకులను అంటగట్టి సొమ్ము చేసుకున్నాడని బీజేపీ నేత వకుళాభరణం ఆదినాథ్ పై కేసులు నమోదు చేసిన పోలీసులు శనివారం నాడు అరెస్ట్ చేశారు. న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్‌కు పంపించారు. ఆయన భార్య రజని పరారీలో ఉన్నారని, ఆమె ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 2010లో జిల్లా కేంద్రంలోని ఖానాపూర్ శివారులోని ఫారెస్ట్ భూమిని ఆదినాథ్ విక్రయించారు. ఆ భూమి తనదని, ఫేక్ డాక్యుమెంట్లతో నమ్మించి ఏకంగా  ప్లాట్లు చేసి విక్రయించారు. నాలుగు ప్లాట్లు సర్వే నంబర్స్ 57, 58, 59, 60ను రూ.3.30 లక్షలకు బాధితురాలు కొనుగోలు చేశారు. 2022లో ఫారెస్ట్ అధికారులు ఆ భూమిని స్వాధీనం చేసుకోగా, అది ఫారెస్ట్ భూమి అని ఫోర్జరీ డాక్యుమెంట్లతో తమకు విక్రయించాడని బాధితులు గుర్తించారు. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని, ఫారెస్ట్ భూమిని ఎలా అమ్ముతారని నిలదీశారు. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో బాధితులు ఒక్కొక్కరు పోలీసులను ఆశ్రయించడంతో వకుళాభరణం ఆదినాథ్ చీటింగ్, కబ్జా కేసులు బయటకు వస్తున్నాయి. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
Bandi Sanjay vs Etala Rajender: తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం! బండి, ఈటల మధ్య సయోధ్య చర్చలు! లక్ష్మణ్‌ ఇంట్లో భేటీ!
తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం! బండి, ఈటల మధ్య సయోధ్య చర్చలు! లక్ష్మణ్‌ ఇంట్లో భేటీ!
BRS Yuva Sangrama Sadassu: బీఆర్‌ఎస్ యువ సంగ్రామ సదస్సుకు భారీగా తరలి వస్తున్న నేతలు! కీలక నేతల అరెస్టుతో టెన్షన్‌!
బీఆర్‌ఎస్ యువ సంగ్రామ సదస్సుకు భారీగా తరలి వస్తున్న నేతలు! కీలక నేతల అరెస్టుతో టెన్షన్‌!
Cement Corporation of India: ఆదిలాబాద్‌లో సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణపై జోగు రామన్న అల్టిమేటం - ఆగస్టు 31లోగా తేల్చకపోతే ఆమరణ నిరాహార దీక్ష!
ఆదిలాబాద్‌లో సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణపై జోగు రామన్న అల్టిమేటం - ఆగస్టు 31లోగా తేల్చకపోతే ఆమరణ నిరాహార దీక్ష!

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ENG Record Score VS IND In 3rd ODI: లార్డ్స్ లో ఇంగ్లాండ్ పరుగుల వరద.. డకెట్ సెంచరీ, స‌త్తా చాటిన బెతెల్, రూట్, బ‌ట్ల‌ర్.. 387 రన్స్ రికార్డ్ టార్గెట్!
లార్డ్స్ లో ఇంగ్లాండ్ పరుగుల వరద.. డకెట్ సెంచరీ, స‌త్తా చాటిన బెతెల్, రూట్, బ‌ట్ల‌ర్.. 387 రన్స్ రికార్డ్ టార్గెట్!
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
CM Revanth Reddy: ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026.. భారత ఫుట్‌బాల్ జట్టుపై తెలంగాణ సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026.. భారత ఫుట్‌బాల్ జట్టుపై తెలంగాణ సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Hyderabad Traffic Diversions: ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Normal Fever vs Dengue: ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
Visakha Road Accident: విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
Embed widget