అన్వేషించండి

Adilabad News: అటవీ భూమి కబ్జా చేసి విక్రయించిన బీజేపీ నేతలపై మరో రెండు కేసులు నమోదు 

Adilabad Latest News: ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ పత్రాలు సృష్టించి అటవీ భూమి కబ్జా చేయడంతో పాటు పలువురికి విక్రయించిన కేసులో బిజెపి నేతపై ఆదిలాబాద్ రూరల్ పోలీసులు మరో రెండు కేసులు నమోదు చేశారు. 

Adilabad Crime News | ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ పత్రాలు, ఫోర్జరీలతో భూ కబ్జాకు ప్రయత్నించిన బీజేపీ నేత వకుళాభరణం ఆదినాథ్ మరిన్ని చిక్కుల్లో పడ్డారు. ఆయనపై మరో 2 కేసులు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ రూరల్ సీఐ ఫణిధర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన బాధితుడు తులసివ స్వామికి 2007 లో సర్వే నెం.68/59 లో నకిలీ పత్రాలు సృష్టించి రూ.83,500కు ఒక ప్లాట్ ను నిందితుడు వకుళాభరణం ఆదినాథ్ అమ్మినట్లుగా బాధితుడు ఫిర్యాదు చేశాడు. 

ఫేక్ డాక్యుమెంట్లతో కబ్జా, ప్లాట్లు చేసి విక్రయాలు

మరో బాధితుడు చల్లా రవీందర్ అనే వ్యక్తి 2018 లో ప్రకాష్ జైస్వాల్ అనే వ్యక్తి వద్ద నుండి సర్వే నెం.68 లో 3 ప్లాట్లను కొనుగోలు చేశాడు. ఈ 3 ప్లాట్ లను నరేందర్, ఆదినాథ్ లు కలిసి ప్లాట్లకు ఉన్న సరిహద్దును చెరిపేసి ఆ ప్లాట్లకు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జాకు ప్రయత్నం చేసినట్లు బాధితుడు ఫిర్యాదు చేశాడని సీఐ ఫణిదర్ తెలిపారు. ఈ మేరకు వకుళాభరణం ఆదినాథ్ పై ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో మరో రెండు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

పలు సెక్షన్ల కింద కేసులు

ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి కొన్ని ప్లాట్లు, భూములు కబ్జాకు ప్రయత్నించడంతో పాటు ఫోర్జరీ సంతకాలతో కొన్ని ప్లాట్లను విక్రయించిన కేసులో వకుళాభరణం ఆదినాథ్ నిందితుడిగా ఉన్నారు. ప్రజలను మోసం చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న విషయంలో బీజేపీ నేతలపై ఆదిలాబాద్ జిల్లా పోలీస్ యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది. తప్పు చేసిన వారిని ఉపేక్షించేది లేదని, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని రూరల్ సీఐ ఫణిదర్ హెచ్చరించారు. అతనిపై ఇదివరకే ఐపీసీ సెక్షన్లు 420, 467, 468, 471, 290, 506, 34 కింద కేసు నమోదు చేశారు. కేసుతో సంబంధం ఉన్న వకుళాభరణం ఆదినాథ్ భార్య రజని ప్రస్తుతం పరారీలో ఉన్నారు.

మరిన్ని చిక్కుల్లో బీజేపీ నేత

అటవీశాఖ భూములను సైతం కబ్జా చేయడంతో పాటు వాటిని అమాయకులను అంటగట్టి సొమ్ము చేసుకున్నాడని బీజేపీ నేత వకుళాభరణం ఆదినాథ్ పై కేసులు నమోదు చేసిన పోలీసులు శనివారం నాడు అరెస్ట్ చేశారు. న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్‌కు పంపించారు. ఆయన భార్య రజని పరారీలో ఉన్నారని, ఆమె ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 2010లో జిల్లా కేంద్రంలోని ఖానాపూర్ శివారులోని ఫారెస్ట్ భూమిని ఆదినాథ్ విక్రయించారు. ఆ భూమి తనదని, ఫేక్ డాక్యుమెంట్లతో నమ్మించి ఏకంగా  ప్లాట్లు చేసి విక్రయించారు. నాలుగు ప్లాట్లు సర్వే నంబర్స్ 57, 58, 59, 60ను రూ.3.30 లక్షలకు బాధితురాలు కొనుగోలు చేశారు. 2022లో ఫారెస్ట్ అధికారులు ఆ భూమిని స్వాధీనం చేసుకోగా, అది ఫారెస్ట్ భూమి అని ఫోర్జరీ డాక్యుమెంట్లతో తమకు విక్రయించాడని బాధితులు గుర్తించారు. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని, ఫారెస్ట్ భూమిని ఎలా అమ్ముతారని నిలదీశారు. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో బాధితులు ఒక్కొక్కరు పోలీసులను ఆశ్రయించడంతో వకుళాభరణం ఆదినాథ్ చీటింగ్, కబ్జా కేసులు బయటకు వస్తున్నాయి. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Adilabad Crime News: పార్క్ చేసిన వాహనాలను క్షణాల్లో మాయం చేసే ముఠా అరెస్టు! ఛేజ్ చేసి పట్టుకున్న ఆదిలాబాద్ పోలీసులు!
పార్క్ చేసిన వాహనాలను క్షణాల్లో మాయం చేసే ముఠా అరెస్టు! ఛేజ్ చేసి పట్టుకున్న ఆదిలాబాద్ పోలీసులు!
Breaking News:సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా, మంత్రిమండలి రద్దు: సిద్ధరామయ్య ప్రకటన
సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా, మంత్రిమండలి రద్దు: సిద్ధరామయ్య ప్రకటన
Revanth Reddy CM Change Rumors: తెలంగాణపై కర్ణాటక ఎఫెక్ట్! కాంగ్రెస్ అధిష్ఠానం కార్యాచరణ సిద్ధం చేస్తోందా?
తెలంగాణపై కర్ణాటక ఎఫెక్ట్! కాంగ్రెస్ అధిష్ఠానం కార్యాచరణ సిద్ధం చేస్తోందా?
Mancherial Crime News: రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijay TVK party Tamil Nadu 2026: విజయ్ ఆపరేషన్ అన్నాడీఎంకే - సొంత మెజార్టీ కోసం దళపతి స్కెచ్.. మిత్రపక్షాలు తిరగబడతాయా?
విజయ్ ఆపరేషన్ అన్నాడీఎంకే - సొంత మెజార్టీ కోసం దళపతి స్కెచ్.. మిత్రపక్షాలు తిరగబడతాయా?
Hypersonic Travel:6 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే...! హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీలో జపాన్ సంచలనం!
6 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే...! హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీలో జపాన్ సంచలనం!
Janasena vs Nageshwar: మా రక్తం మరుగుతోంది ! పవన్ కళ్యాణ్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్! ABP దేశంతో తెలంగాణ జనసేన అధ్యక్షుడు
మా రక్తం మరుగుతోంది ! పవన్ కళ్యాణ్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్! ABP దేశంతో తెలంగాణ జనసేన అధ్యక్షుడు
YS Jagan national politics shift: SIRపై వ్యతిరేకత- ఇండీ కూటమి వాదనకే సపోర్ట్ - జగన్ డిసైడ్ అవుతున్నారా?
SIRపై వ్యతిరేకత- ఇండీ కూటమి వాదనకే సపోర్ట్ - జగన్ డిసైడ్ అవుతున్నారా?
Heatwave In AP And Telangana: వర్షాలు కురుస్తున్నా తగ్గని భానుడి ప్రతాపం.. తెలంగాణలో 12 జిల్లాల్లో, ఏపీలో 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
వర్షాలు కురుస్తున్నా తగ్గని భానుడి ప్రతాపం.. తెలంగాణలో 12 జిల్లాల్లో, ఏపీలో 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
Saravanan Leader OTT: ఓటీటీలోకి 'లీడర్'... లెజెండ్ శరవణన్ యాక్షన్ ఫిల్మ్ స్ట్రీమింగ్ షురూ - ఎందులోనంటే?
ఓటీటీలోకి 'లీడర్'... లెజెండ్ శరవణన్ యాక్షన్ ఫిల్మ్ స్ట్రీమింగ్ షురూ - ఎందులోనంటే?
Telangana govt land monetization: భాగ్యనగరంలో ప్రభుత్వ వేలం వెర్రి సామాన్యుడికి శాపం - హైదరాబాద్ ఇక సామాన్యుడికి దూరమేనా?
భాగ్యనగరంలో ప్రభుత్వ వేలం వెర్రి సామాన్యుడికి శాపం - హైదరాబాద్ ఇక సామాన్యుడికి దూరమేనా?
Pre Diabetic Care : ప్రీ-డయాబెటిస్, మధుమేహం ఉన్నవారు తినకూడని పండ్లు ఇవే.. షుగర్ పెరగవచ్చు జాగ్రత్త
ప్రీ-డయాబెటిస్, మధుమేహం ఉన్నవారు తినకూడని పండ్లు ఇవే.. షుగర్ పెరగవచ్చు జాగ్రత్త
Embed widget