Viral Video: వాంకిడిలో రైతును బురిడీ కొట్టించి 75 వేలు చోరీ.. పట్టపగలే సినిమా సీన్ తరహాలో
Robbery in Wankidi Watch Video | కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో రైతును బురిడీ కొట్టించిన నలుగురు దుండగులు 75 వేలు దోచుకెళ్లారు. ఈ చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

Robbery in Wankidi | వాంకిడి: దొంగలు తెలివి మీరిపోతున్నారు. ప్లాన్ ప్రకారం నగలు, డబ్బు, ఖరీదైన వస్తువులు కొట్టేస్తున్నారు. కొందరు ఏకంగా టెక్నాలజీతో సైబర్ క్రైమ్ చేసి లక్షల నుంచి కోట్ల వరకు కొల్లగొడుతూ సామాన్యులకు మోసం చేస్తున్నాయి. క్షణం ఏమరపాటున ఉన్నా మన వద్ద ఉన్న నగదు దోచేస్తారు. సరిగ్గా అలాంటి ఘటనే కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలో జరిగింది.
ప్లాన్ చేసి రైతు డబ్బు కొట్టేసిన కేటుగాళ్లు
పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టించారు. తపసే శ్యామ్ రావు అనే రైతును లక్ష్యంగా చేసుకుని, నలుగురు దుండగులు పథకం ప్రకారం రెక్కీ నిర్వహించారు. ఆయన వద్ద ఉన్న ₹75,000 నగదును దోచుకెళ్లారు. రైతు శ్యామ్ రావు బ్యాంకు నుండి నగదు డ్రా చేసుకుని తన బైక్పై తిరిగి వెళ్తున్నారు. ముందుగానే ఆయన వద్ద నగదు ఉన్న విషయాన్ని పసిగట్టిన దొంగలు ఆ నగదు కొట్టేయాలని ప్లాన్ చేసి, ఆయనను ఫాలో అయ్యారు.
ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలో బైక్ నుంచి రూ.75 వేలు నగదును దుండగులు చోరీ చేశారు. శ్యామ్ రావు అనే రైతు బ్యాంక్ నుంచి నగదు తీసుకొని వస్తుండగా.. బైక్లో నుంచి నగదు పడ్డాయని నమ్మించి, డబ్బులు దోచుకొని బైక్పై నలుగురు దుండగులు పరారయ్యారు.#Asifabad #crimenews… pic.twitter.com/J648BK1AH4
— ABP Desam (@ABPDesam) May 6, 2026
తక్కువ రద్దీ ఉన్న ప్రాంతంలో ఆయనను గమనించిన దొంగలు, బైక్ నుండి ఏదో కింద పడిపోయిందని నమ్మించారు. రైతు తన బైక్ దిగి చూసుకునేందుకు అటువైపు వెళ్లగా, పక్కనే ఉన్న దొంగ ా బైక్ కవర్లో ఉన్న నగదు బ్యాగును లాక్కుని క్షణాల్లో పరారయ్యాడు. మొత్తం రెండు బైకులపై నలుగురు దొంగలు ఈ చోరీకి ప్లాన్ చేశారు. మొదట ఓ వ్యక్తి ఏదో కవర్ పడిపోయిందని చెప్పాడు.. అప్పటికే మరో బైకుతో పికప్ చేసుకునేందుకు ఓ వ్యక్తి సిద్ధంగా ఉన్నాడు. బాధిత రైతు నగదు కోసం ఓవైపు వెళ్లగా అటు నుంచి వచ్చిన మరో దొంగ ఇంకో బైక్ ఎక్కి పరారయ్యారు.
నలుగురు నిందితులు ఈ చోరీకి పాల్పడినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు. ఈ చోరీకి సంబంధించిన మొత్తం దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు ఎవరికీ అనుమానం రాకుండా ముఖానికి వైట్ క్లాత్ కట్టుకున్నారని పోలీసులు తెలిపారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















