అన్వేషించండి

Adilabad Crime News: జన్నారం సైబర్ నేరాల వెనుక అసలు సూత్రధారి జాక్! కోటి రూపాయల లావాదేవీలు, షాకింగ్ విషయాలు!

Adilabad Crime News: మంచిర్యాల కేంద్రంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారిస్తే కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. కాంబోడియా నుంచి ఆపరేట్ చేస్తున్నట్టు వెల్లడైంది.

Adilabad Crime News: మంచిర్యాలలోని జన్నారంలో వెలుగులోకి తీసుకొచ్చిన  సైబర్ క్రైమ్‌లో మరిన్ని సంచలనాల విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాంబోడియా, మయన్మార్‌ కేంద్రంగా పని చేస్తున్న సైబర్‌ నేరగాళ్లు ఈ మొత్తం తతంగం నడిపిస్తూ అమాయకులను మోసం చేస్తున్నారు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు లేటెస్ట్ టెక్నాలజీని వాడుతున్నారు. రోడ్డు పక్కనే అమ్మే వారి వద్ద మొబైల్ సిమ్‌లు కొని వందల మందిని ముంచేశారు. 

జన్నారం కేంద్రంగా సాగుతున్న సైబర్ మోసాలకు రామగుండం పోలీసులు చెక్ పెట్టారు. నలుగురిని అరెస్టు చేశారు. వారిని విచారించిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. ఫోన్ లొకేషన్ గుర్తు పట్టకుండా ఉండేందుకు నేరగాళ్లు ఈ జన్నారాన్ని ఎంచుకున్నట్టు తేలింది. ఒకవేళ ఐఎంఈఐ నెంబర్ గుర్తు పట్టినా అది అడవులు, చెట్లు మధ్య చూపిస్తుందని గ్రహించారు. అందుకే జన్నారాన్ని ఎంచుకొని కాంబోడియా, మయన్మార్‌ నుంచి రాకెట్‌ నడిపించారు. 

ఈ మోసాల కోసం సిమ్ కార్డులను ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డు పక్కనే అమ్మే వారి వద్ద విక్రయించే వాళ్లు. వీళ్లకు జాక్ అలియాస్ రాజు అనే విశాఖ వాసి సహకరించాడు. ఈ సైబర్ కుట్రలో అతనే కింగ్‌పిన‌గా భావిస్తున్నారు. ఒక వ్యక్తికి ఫోన్ చేయడానికి ఒక సిమ్ మాత్రమే వాడతారు. తర్వాత దాన్ని నాశనం చేస్తున్నారు. ఆ సిమ్ కార్డు నుంచి ఎవరికి ఫోన్ చేశారు. ఆ వ్యక్తి నుంచి ఎంత వసూలు చేశారో రికార్డు చేశారు. వాటిని బుక్స్‌లో రాసేవారు. 

పరారీలో ఉన్న జాక్‌ బ్యాంకు ఖాతాలో భారీగా నగదు గుర్తించారు. కోటి రూపాయల లావాదేవీలు జరిగినట్టు తేల్చారు. అతనికి సహకరించిన వాళ్లకు లక్షల్లో నగదు పంచినట్టు తేలింది. ఎలా ఎక్కడికక్కడ టీంలను ఏర్పాటు చేసుకొని క్రైమ్‌ను విస్తరించినట్టు పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. 

ఫోన్‌లో మాట్లాడిన సిమ్ కార్డు లొకేషన్ వివిధ ప్రాంతాల్లో చూపించి కన్ ఫ్యూజ్ చేయడానికి కొత్త ఎత్తుగడ వేశారు సైబర్ నేరగాళ్లు. లేటెస్ట్ సాంకేతిక పరికరాన్ని కొనుగోలు చేశారు. ఓ బాక్స్‌లో వందల సిమ్‌ కార్డులు పెట్టి ఫోన్‌లు చేసే వాళ్లు. ఇలా చేయడం వల్ల అన్ని ఒకే మిషన్‌లో ఉండడంతో అసలు వ్యక్తులు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారనే విషయం గుర్తు పట్టలేరు. అందులోనూ జన్నారం లాంటి అటవీ ప్రాంతంలో ఇది మరింత కష్టంగా మారుతుంది. అందుకే ఈ ప్రాంతాన్ని ఆపరేషన్‌కు ఎంచుకున్నారు.  

జాక్ అనే వ్యక్తిని పట్టుకుంటే ఈ కుట్రలో ఇంకా ఎంత మంది ఉన్నారో అర్థమవుతుందని రామగుండం పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికి చిక్కిన నిందితులను జైలుకు తరలించారు. పరారీలో ఉన్న వారి కోసం లుక్‌అవుట్  నోటీసులు జారీ చేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget