అన్వేషించండి

Gussadi Kanaka Raju: గుస్సాడీ కనకరాజు మృతిపై రేవంత్, కేసీఆర్, కేటీఆర్ సంతాపం- గిరిజన సంస్కృతిని చాటి చెప్పిన కళాకారుడిగా గుర్తింపు 

Telangana News: పద్మశ్రీ కనకరాజు మృతి గిరిజన ప్రజలకు పూడ్చుకోలేని లోటుగా నేతలు అభిప్రాయపడ్డారు. సీఎం, ప్రధాని సహా ప్రముఖులు తమ సంతాప సందేశాన్ని అందించారు.

Adilabad News: గుస్సాడీ నృత్యాన్ని విస్తృత పరిచిన 94ఏళ్ల పద్మశ్రీ కనకరాజు కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు. గిరిజన బిడ్డల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే గుస్సాడీ నృత్యంతో  కనకరాజు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సొంతూరు కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని  జైనూర్‌ మండలం మార్లవాయి గ్రామం. ఈయన గత కొంత కాలంగా అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అనేక ఆసుపత్రుల్లో చూపించిన ప్రయోజనం లేకపోయింది. 

గుస్సాడీ నృత్యాన్ని కాపాడుతూ వచ్చిన వ్యక్తిగా పేరు ఉన్న కనకరాజుకు కేంద్ర ప్రభుత్వం 2021లో ప్రకటించింది. అప్పటి రాష్ట్రపతి కోవింద్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును నవంబర్‌ 9న అందుకున్నారు. వందల మంది యువకులు ఆయన వద్ద గుస్సాడీ నృత్యం నేర్చుకొని శిష్యులుగా మారారు. 

గిరిజన బిడ్డలకు ఎంతో ఇష్టమైన గుస్సాడీ నృత్యానికి వన్నెత తేవడమే కాకుండా పద్మశ్రీ అందుకొని తెలంగాణ ఖ్యాతిని మరింత పెంచిన కనకరాజు మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలియజేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు చేస్తామని ప్రకటించారు. 

కనకరాజు అద్భుతమైన నృత్యకారుడు సాంస్కృతిక దిగ్గజం అని ప్రధానమంత్రి కొనియాడారు. అలాంటి వ్యక్తి మరణించినందుకు విచారం వ్యక్తం చేశారు. గుస్సాడీ నృత్యాన్ని పరిరక్షించడంలో ఆయన అందించిన గొప్ప సహకారం రాబోయే తరాలను ఎల్లప్పుడూ చైతన్యవంతం చేస్తుందన్నారు. ఆయన అంకితభావం, అభిరుచి సాంస్కృతిక వారసత్వం ముఖ్యమైన అంశాలు వాటి ప్రామాణికమైన రూపంలో వృద్ధి చెందేలా చూసిందని అభిప్రాయపడ్డారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతి అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు ప్రధానమంత్రి.

గిరిజన సాంప్రదాయ నృత్యమైన ‘గుస్సాడి’కి ప్రత్యేక గుర్తింపు తీసుకుకొచ్చిన పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు ఇకలేరని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలోని మారుమూల ప్రాంతమైన ఆసిఫాబాద్ కుమురం భీం జిల్లా నుంచి వచ్చి.. గుస్సాడికి గుర్తింపు తీసుకురావడం కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన కనకరాజు మృతి తెలంగాణకు మరీ ముఖ్యంగా గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు తీరని లోటుగా అభివర్ణిచంచారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. కుటుంబసభ్యులకు, గిరిజన సమాజానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

కనకరాజు మృతికి బీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌, వరింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇతర నేతలు తీవ్ర సంతాపం తెలియజేశారు. కనకరాజు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఎర్రకోటపై నృత్యాన్ని ప్రదర్శించి తెలంగాణ ఆదివాసీ సంస్కృతిని తెలియజేశారని అన్నారు కేటీఆర్. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget