అన్వేషించండి

మరింత ముదురుతున్న బాసర ట్రిపుల్‌ ఐటీ వివాదం- తమ గొంతు నొక్కుతున్నారని విద్యార్థుల ఆందోళన

బాసర ట్రిపుల్ ఐటీలో చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన తీవ్రమవుతోంది. దీనిపై చర్చించేందుకు విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ హైదరాబాద్‌లో భేటీ అయింది.

చదువుల తల్లి ఒడిలో ఏర్పాటైన బాసర ట్రిపుల్ ఐటీ ప్రస్తుతం వివాదాలకు నిలయంగా మారింది. విద్యార్థులు సరైన వసతులు లేక నిత్యం నిరసనల బాట పడుతున్నారు. కనీస మౌలిక వసతుల కోసం పోరాటం చేస్తున్నారు. జులైలో ఏడు రోజుల పాటు శాంతి యుత నిరసన కార్యక్రమాలు చేపట్టారు. విద్యార్థుల ఆందోళనలకు విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీల మద్దతు లభించింది. దీంతో ప్రభుత్వం దిగివచ్చింది. 

డిమాండ్లు ఒప్పుకున్న ప్రభుత్వం

మంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో స్వయంగా మాట్లాడి సర్ది చెప్పారు. విద్యార్థులు పెట్టిన 12 డిమాండ్లను ఒప్పుకున్నారు. కానీ రోజులు గడుస్తున్నా తమ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని విద్యార్థులు మరోసారి ఆందోళన బాట పట్టారు. 

మౌలిక సదుపాయలు సున్న

నిరసనలు విరమించిన కొద్ది రోజులకే ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్‌తో 300 మందికిపైగా అనారోగ్యానికి గురయ్యారు. మొన్నటికి మొన్న ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థి చనిపోయాడని వివిధ రాజకీయ పార్టీలు సైతం ఆందోళనలు చేశాయి. అయినా ట్రిపుల్ ఐటీలో ఎలాంటి మార్పు రావటం లేదన్నది ప్రధాన ఆరోపణ. నిత్యం మెస్‌లో సరైన భోజనం లేక విద్యార్థులు ఆందోళనకు దిగుతున్నారు. రెండ్రోజుల క్రితం కూడా ఇదే పరిస్థితి నెలకొంది. 

ప్రశ్నిస్తే షోకాజ్ నోటీసులు

ఇన్ని జరుగుతున్నా సరే విద్యార్థుల సమస్యలను ట్రిపుల్ ఐటీ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవటం లేదన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. అందుకే విద్యార్థులు మరో ఉద్యమానికి సిద్ధమయ్యారు. దీంతో రంగ ప్రవేశం చేసిన అధికారులు విద్యార్థుల నిరసనలు అణచివేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆందోళన చేసే విద్యార్థులు, చదువుకునే విద్యార్థులను అడ్డుకుంటే షోకాజ్ నోటీసులు అందిస్తామన్నారు. షోకాజ్ నోటీసుల తర్వాత విద్యార్థుల తీరు మారకుంటే మాత్రం బర్తరఫ్ చేసే ఆలోచనలో ఉన్నారు ట్రిపుల్ ఐటీ అధికారులు. 

తల్లిదండ్రులు ఆందోళనల

అధికారుల తీరు ఇలా ఉంటే... బాసర ట్రిపుల్ ఐటీలో చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన తీవ్రమవుతోంది. దీనిపై చర్చించేందుకు విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ హైదరాబాద్‌లో భేటీ అయింది. ఎల్బీనగర్‌లోని ఓ కమిటీ హాల్‌లో తల్లిదండ్రులు సమావేశమయ్యారు. చలో బాసరకు పిలుపునిచ్చే యోచనలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటికి ర్యాలీగా వెళ్లాలని తల్లిదండ్రుల కమిటీ నిర్ణయం తీసుకుంది. సబిత ఇంటి ముందు మౌనదీక్ష చేస్తామని పేరెంట్స్ కమిటీ వెల్లడించింది. 

విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లల భవిష్యత్‌పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో ట్రిపుల్ ఐటీలో జరుగుతున్న బాగోతంపై పేరెంట్స్ ఆందోళన చేశారు. అయినా ప్రభుత్వంలో చలనం రావటం లేదని వారు వాపోతున్నారు. అందుకే తల్లిదండ్రులు తమ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామంటున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
Telangana Latest News: సంక్షేమ పథకాలకు ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి! కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి
సంక్షేమ పథకాలకు ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి! కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి
BRS vs Congress: అన్నారం బ్యారేజీపై రేవంత్ ప్రభుత్వం కుట్రలు.. కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసే పన్నాగం? కేటీఆర్ వీడియో పోస్ట్
అన్నారం బ్యారేజీపై రేవంత్ ప్రభుత్వం కుట్రలు.. కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసే పన్నాగం? కేటీఆర్ వీడియో పోస్ట్
Fake Note Racket: మంచిర్యాల జిల్లాలో దొంగ నోట్ల ముఠా అరెస్ట్, ఏపీ నుంచి తెచ్చి చెలామణి చేస్తున్న గ్యాంగ్
మంచిర్యాల జిల్లాలో దొంగ నోట్ల ముఠా అరెస్ట్, ఏపీ నుంచి తెచ్చి చెలామణి చేస్తున్న గ్యాంగ్

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
US Shooting: అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
Palamaner Latest News:తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
Kerala BJP: కేరళలో కమలం లక్ష్యం కింగ్ మేకర్ - మోదీ, అమిత్ షా వ్యూహాలు వర్కవుట్ అవుతాయా?
కేరళలో కమలం లక్ష్యం కింగ్ మేకర్ - మోదీ, అమిత్ షా వ్యూహాలు వర్కవుట్ అవుతాయా?
Hyderabad Fire Accident: బాచుపల్లిలో అగ్ని ప్రళయం- 35దుకాణాలు బుగ్గి- రోడ్డున పడ్డ వ్యాపారులు!
బాచుపల్లిలో అగ్ని ప్రళయం- 35దుకాణాలు బుగ్గి- రోడ్డున పడ్డ వ్యాపారులు!
Vijayawada- Visakha High Speed Rail: విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
Embed widget