అన్వేషించండి

Nizamabad: మాధవనగర్ రైల్వే గేట్ పనులకు మోక్షమెప్పుడో..?

నిజామాబాద్ మాధవనగర్ రైల్వే గేట్ వద్ద ప్రయాణికులకు తిప్పలు తప్పడంలేదు. ట్రాఫిక్ పెరగటంతో గేటు పడితే వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

నిజామాబాద్‌ రైల్వే జంక్షన్‌ మీదుగా నిత్యం 11 పాసింబర్ రైళ్లు, 3 గూడ్స్‌ రైళ్లు నడుస్తాయి. దీంతో మాధవనగర్‌ రైల్వే గేటును రోజుకు సగటున 26 సార్లు వేస్తుంటారు. నిజామాబాద్‌ - హైదరాబాద్‌ వెళ్లే ప్రధాన రహదారి కావడంతో రోజుకు 75 వేల వాహనాలు  ఈ మార్గంలో తిరుగుతుంటాయి. అటు కామారెడ్డి, హైదరాబాద్, ఇటువైపు మహారాష్ట్రలోని నాందేడ్‌, నాగ్‌పూర్‌, ఉమ్మడి ఆదిలాబాద్‌కు వెళ్లే వారికి ఇదే కీలకమైన రోడ్డు. గేటు పడిన ప్రతిసారి ఇరువైపులా కిలోమీటరు మేర ట్రాఫిక్‌ నిలుస్తోంది. ఇందులో అత్యవసర వైద్యం కోసం వెళ్లే అంబులెన్సులు ఇరుక్కుపోవడంతో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మాధవనగర్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి నిధుల విడుదల్లో జరుగుతున్న జాప్యంతో వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఏళ్ల తరబడిగా ఉన్న ఈ సమస్య పరిష్కారానికి ప్రజాప్రతినిధులు చొరవ చూపాల్సిన అవసరం ఉంది. యంత్రాంగం పరంగా జరగాల్సిన పనులు దాదాపు పూర్తయ్యాయి. ప్రభుత్వ పరంగా రావాల్సిన నిధులు తీసుకొచ్చేలా నేతలు చొరవ చూపాలని స్థానికులు కోరుతున్నారు. 

గేటు పడితే గుండె దడే

నిజామాబాద్‌ - హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై మాధవనగర్‌ రైల్వేగేటు ఉంది. సికింద్రాబాద్‌ - ముంబయి మార్గంలో పలు రైళ్లు నగరం మీదుగా ప్రయాణిస్తుంటాయి. రైలొచ్చిన ప్రతిసారి వాహనదారులు గేటు వద్ద 15 నిమిషాలు వేచి చూస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోతుండటంతో ఇక్కడి నుంచి కదలడానికి మొత్తంగా అరగంటకు పైగా సమయం వృథా అవుతోంది. ప్రాణాపాయ స్థితిలో రోగులను హైదరాబాద్‌కు తరలించే అంబులెన్సులూ ఇందులో చిక్కుకుంటున్నాయి.  ఈ సమస్య పరిష్కారానికి ఉమ్మడి రాష్ట్రంలో రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు వెళ్లగా ఆమోదించారు. తర్వాత ఫోర్ లైన్ రోడ్డుగా అభివృద్ధి చెందిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఫోర్ లైన్ బ్రిడ్జ్ కోసం ప్రతిపాదించారు. దానికీ అనుమతులు లభించాయి. ఆర్వోబీ అనేక అడ్డంకులను అధిగమిస్తూ తుది దశకు చేరింది. రైల్వేశాఖ తన వాటా కింద రూ.30 కోట్లు ఇచ్చేందుకు అంగీకారం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇంతకాలం భూసేకరణ సమస్య పూర్తికాక రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టత లేకుండా ఉంది. రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ సంయుక్తంగా సర్వే చేసి 3.30 ఎకరాలు అవసరమని తేల్చారు. నిర్వాసితులకు అందించే పరిహారం అంచనాలతో కూడిన నివేదికలు ప్రభుత్వానికి పంపించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరయ్యేలా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు. లేదంటే ప్రయాణికులకు నిత్యం తిప్పలు తప్పనట్లే.

 

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Indiramma Family Life Insurance Scheme : తెలంగాణ ప్రజలందరికీ టెర్మ్‌ ఇన్సూరెన్స్‌! రేవంత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తారా !
తెలంగాణ ప్రజలందరికీ టెర్మ్‌ ఇన్సూరెన్స్‌! రేవంత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తారా !
Telangana Budget 2026-27: తెలంగాణ బడ్జెట్‌ 2026-27లో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం! 
తెలంగాణ బడ్జెట్‌ 2026-27లో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం! 
Telangana Indiramamma Kutumba Jeevita Beema Scheme : తెలంగాణలో ప్రజలకు ఆర్థిక భరోసా! జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం! ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల రక్షణ!
తెలంగాణలో ప్రజలకు ఆర్థిక భరోసా! జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం! ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల రక్షణ!
Telangana Budget 2026-27 Live Updates: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం... వారికి 2 వేల స్కాలర్షిప్
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం... వారికి 2 వేల స్కాలర్షిప్

వీడియోలు

Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
Negative Campaign on SRH | IPL 2026 కి ముందు సన్ రైజర్స్ పై ఫేక్ పోస్టులు | ABP Desam
CSK Video on Shivam Dube | IPL 2026 కి ముందు చెన్నైలో క్రికెట్ బాల్స్ ఆందోళన | ABP Desam
Virat Kohli Home Coming RCB | IPL 2026 యుద్ధానికి తిరిగొచ్చిన మహారాజు | ABP Desam
Ishan Kishan Interim Captain SRH | ఇషాన్ వైపే ఆరెంజ్ ఆర్మీ మొగ్గు చూపింది అందుకే | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Praedesh News: ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
Harish Rao: శ్రమ మాది.. శిలాఫలకం రేవంత్ రెడ్డిది - సిద్దిపేట పర్యటనపై హరీశ్ రావు బహిరంగలేఖ
శ్రమ మాది.. శిలాఫలకం రేవంత్ రెడ్డిది - సిద్దిపేట పర్యటనపై హరీశ్ రావు బహిరంగలేఖ
Fire Cracker Lorry Catches Fire: హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
Anand Mahindra: గంటన్నర ముచ్చట్లే మహింద్రా గ్రూపును నిడిపే లీడర్లను తయారు చేస్తాయి - ఆనంద్ మహింద్రా విజయరహస్యం ఇదే!
గంటన్నర ముచ్చట్లే మహింద్రా గ్రూపును నిడిపే లీడర్లను తయారు చేస్తాయి - ఆనంద్ మహింద్రా విజయరహస్యం ఇదే!
Chandrababu Tirumala: సాంకేతికతతో ఆధ్యాత్మిక వైభవం - తిరుమలలో సీఎం చంద్రబాబు సరికొత్త మార్పులు
సాంకేతికతతో ఆధ్యాత్మిక వైభవం - తిరుమలలో సీఎం చంద్రబాబు సరికొత్త మార్పులు
Karimnagar SI Chandrasekhar Suicide : కరీంనగర్‌ టూటౌన్‌ ఎస్సై చంద్రశేఖర్‌ సూసైడ్‌- ఐదు రోజుల క్రితమే భార్య ఆత్మహత్య 
కరీంనగర్‌ టూటౌన్‌ ఎస్సై చంద్రశేఖర్‌ సూసైడ్‌- ఐదు రోజుల క్రితమే భార్య ఆత్మహత్య 
Trump Iran War:ఇరాన్ యుద్ధం ముగింపు దిశగా అడుగులు! అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన!
ఇరాన్ యుద్ధం ముగింపు దిశగా అడుగులు! అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన!
రైలులో భోజనం తాజాదో కాదో తెలుసుకునేందుకు ఈ పని చేయండి, చిటికెలో మీకు సమాధానం వచ్చేస్తుంది!
రైలులో భోజనం తాజాదో కాదో తెలుసుకునేందుకు ఈ పని చేయండి, చిటికెలో మీకు సమాధానం వచ్చేస్తుంది!
Embed widget