అన్వేషించండి

తెలంగాణ యూనివర్సిటీలో కీలక పరిణామాలు, వీసీపై విజిలెన్స్‌, ఏసీబీకి ఫిర్యాదు

తెలంగాణ యూనివర్సిటీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పాలనను గాడిలో పెట్టేందుకు సర్కార్ చర్యలు చేపట్టింది.

- ఆ ముగ్గురు రిజిస్ట్రార్లపై క్రిమినల్‌ కేసులకు సిఫార్సు..
- మళ్లీ టీయూ రిజిస్ట్రార్‌గా యాదగిరి
తెలంగాణ యూనివర్సిటీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పాలనను గాడిలో పెట్టేందుకు సర్కార్ చర్యలు చేపట్టింది. శుక్రవారం హైదరాబాద్‌లో ఎగ్జిక్యూటివ్‌ కమిటీ (ఈసీ) కీలక భేటీ జరిగింది. దీంట్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుని తీర్మానాలు చేశారు. ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం టీయూను గాడిలో పెట్డడంలో భాగంగానే ఈసీ మీటింగు, తీర్మానాలు చేయించినట్టు తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా వీసీ రవీందర్‌ గుప్తాపై ఏసీబీకి, విజిలెన్స్‌ ఎన్ఫోర్స్‌మెంట్‌కు ఫిర్యాదు చేయాలని తీర్మానం చేశారు.

గత కొంత కాలంగా నిత్యం యూనివర్సిటీ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. వీసీ చేసిన అవినీతి, అక్రమాలపై విచారణ చేయాలని తీర్మానం చేయడంతో పాటు ..వీసీ అనధికారికంగా నియమించుకున్న ముగ్గురు రిజిస్ట్రార్లు శివశంకర్‌, విద్యావర్ధిని, నిర్మలాదేవీ లపై క్రిమినల్ కేసులకు చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. గతంలో నియమించిన రిజిస్ట్రార్‌ ఏడాది గడువు కాలం పూర్తికాకముందే అతన్ని తొలగించినందున.. మళ్లీ అతన్నే రిజిస్ట్రార్‌గా నియమించాలని ప్రభుత్వాన్ని కోరింది ఈసీ. దీంతో ప్రభుత్వం ఆ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈసీ మీటింగులో మారయ్య గౌడ్‌, నసీం, హారతి, రవీందర్‌ రెడ్డి, వసుంధర, గంగాధర్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ యూనివర్సిటీలో వివాదాలు సద్దుమణగుతాయా? 

అధికారుల మధ్య సమన్వయం లోపించి ఏడాదిన్నర కాలంగా సమావేశాలు లేక వర్సిటీలో ఏం జరిగిందో తెలియని పరిస్థితి. వారం కింద జరిగిన భేటీలో అనూహ్య నిర్ణయాలతో అందరిని ఆశ్చర్య పరిచింది పాలక మండలి. తాజాగా మరోమారు జరిపిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. వీసీపైనే విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరాలని తీర్మానించడం, ఇన్ఛార్జి రిజిస్ట్రార్ గా ఉన్న ప్రొఫెసర్ విద్యా వర్ధినిని సస్పెండ్ చేశారు. వీసీపై ఏసీబీ విచారించాలని నిర్ణయించడం సంచలన నిర్ణయమే. అకడమిక్ కన్సల్టెంట్ విధుల్లో నుంచి తొలగింపు నిర్ణయంతో పాటు వారం రోజుల్లోనే పదోన్నతుల రద్దు, అడ్వాన్సులు తీసుకున్న వారికి రికవరీ నోటీసుల జారీ వంటి నిర్ణయాలు జరిగిపోయాయి.

2022-23 ఆర్థిక సంవత్సరం ముగిసినా ఇంకా బడ్జెట్ ఆమోదం పొందలేదు. రెండు సమావేశాల్లో దీనిపై చర్చించినా చేసిన ఖర్చులకు సరైన లెక్కలు లేవని అధికారులు సమాధానం ఇచ్చారు. గడిచిన 8 నెలల కాలంలో వివిధ కార్యక్రమాల పేరిట పెద్ద మొత్తంలో వ్యయాలు చేసినట్లు వివరించారు. ఎక్కువ మొత్తం నోట్ ఫైల్ లేకుండా డబ్బులు డ్రా చేయటం జరిగిందని చెప్పారు. వీటిని ఏ ప్రాతిపదికన చేశారు? ఇప్పుడెలా లెక్క చూపాలి? అన్నది తేలాల్సి ఉందన్నారు. చెల్లింపుల విషయంలో నిబంధనలు పాటించలేదని వివరించారు. దీంతో మళ్లీ బడ్జెట్ పక్కకు పెట్టారు. దీనికి ఆమోదం లభిస్తేనే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24 పద్దు ప్రతిపాదనల ఆమోదంపై ముందుకెళ్లాల్సి ఉంటుంది. దీంతో రెండు బడ్జెట్లపై పీటముడి వీడలేదు. సమస్యను అధిగమించేందుకు నిధుల దుర్వినియోగం అంశంపై విచారణ పూర్తిచేయాలని నిర్ణయించింది.

నిబంధనలకు విరుద్ధంగా చేసిన ఖర్చులపై విచారించేందుకు ఐదుగురి సభ్యుల కమిటీ వర్సిటీకి రానుంది. బడ్జెట్ ఆమోదం లేకుండా ఎంత ఆర్థిక వ్యయాలు చేశారు? అందులో నోట్ ఫైల్ లేకుండా ఎన్ని ఉన్నాయి? వాటిని ఎందుకు చేశారో? పరిశీలించనున్నారు. ఆర్థిక శాఖ డిప్యూటీ కార్యదర్శి చంద్రకళ నేతృత్వంలో కమిటీ ఆయా అంశాలు పరిశీలించనుంది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఫైళ్ల ఆధారంగా సిద్ధం చేయాలని ఇప్పటికే రిజిస్ట్రార్ కు సూచించింది. సిబ్బంది ద్వారా కొంత సమాచారం సిద్ధం చేసినట్లు సమాచారం. వీటిల్లో కీలకంగా ఉత్తర్వులు లేకుండా జరిపిన చెల్లింపులు, వర్సిటీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలకు చేసిన ఖర్చులున్నాయి. వీటిపై వివరాలు సేకరించి చెక్కులు తయారు చేయటానికి ఉన్న నిబంధనలు పాటించారా? ఆ చెక్కును అనుమతిస్తూ సంతకాలు చేసేప్పుడు సరి చూశారా? అనే విషయాలు కీలకం కానున్నాయి.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Adilabad Aatram Suguna Face To Face: ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న ఆత్రం సుగుణTDP Sankar | Srikakulam | పదవి ఉంటే ఒకమాట.. లేదంటే మరో మాట... ధర్మాన ఎప్పుడూ అంతేElections 2024 Tirupati Public Talk: తిరుపతి ఓటర్ల మదిలో ఏముంది..? ఎవరికి ఓటేస్తారు..?KTR on Phone Tapping Case | దొంగలవి ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు..నీకేం భయం రేవంత్..? అంటూ కేటీఆర్ ప్రశ్న

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
CJI: సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
Telangana BJP :   తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ -  కొన్ని చోట్ల  తప్పదా ?
తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ - కొన్ని చోట్ల తప్పదా ?
Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
Embed widget