అన్వేషించండి

MP Dharmapuri Arvind: సుగంధ ద్రవ్యాల బోర్డు సభ్యునిగా బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్

స్పైస్ బోర్డు సభ్యులుగా లోక్ సభ ఎంపీలు అర్వింద్ ధర్మపురి, బాలశౌరి వల్లభనేని లు ఎన్నికైనట్లు పార్లమెంట్ బులిటెన్ విడుదల చేసింది.

సుగంధ ద్రవ్యాల బోర్డు సభ్యునిగా బీజేపీ నేత, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి ఎన్నికయ్యారు. దీనికి సంబంధించి స్పైస్ బోర్డు సభ్యులుగా లోక్ సభ ఎంపీలు అర్వింద్ ధర్మపురి, బాలశౌరి వల్లభనేని లు ఎన్నికైనట్లు పార్లమెంట్ బులిటెన్ విడుదల చేసింది. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ.. స్పైస్ బోర్డు సభ్యునిగా ఎన్నికవ్వడంపై ఎంపీ అర్వింద్ సంతోషం వ్యక్తం చేశారు. తాజా నియామకంతో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని పసుపు రైతులకు మరింత సేవ చేసే అవకాశం లభించిందని అన్నారు. పసుపు, మిర్చి రైతుల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తానని ఎంపీ అర్వింద్ హామీ ఇచ్చారు. తన ఎన్నికకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు. 

పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన 8 నెలల కాలంలోనే మోదీ ప్రభుత్వం నిజామాబాద్ కేంద్రంగా రీజినల్ ఆఫీస్ కం ఎక్స్టెన్షన్ సెంటర్  మంజూరు చేసిందన్నారు. దీని ద్వారా బోర్డు 30 కోట్ల బడ్జెట్ ను 2022-2025 మధ్య మూడేళ్ల కాలానికి ఆమోదించిందని చెప్పారు. 1986 నుండి 2020 వరకు 35 ఏళ్లలో కూడా రానటువంటి బడ్జెట్ ను ఈ మూడేళ్ల కాలానికే తీసుకొచ్చామని, అందులో ఇదివరకే 9 కోట్ల రూపాయల నిధులు విడుదల అయ్యాయని బీజేపీ ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు.

గతంలో కవిత ఏమన్నారంటే.. 
ఎంపీ అర్వింద్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గతంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి విమర్శించడం తెలిసిందే. మోసపూరిత హామీలతో అర్వింద్‌ ఎంపీగా గెలిచారని అన్నారు. ఎన్నికలకు ముందు చెప్పిన పసుపు బోర్డు ఏమైందని ప్రశ్నించారు. హామీ నిలబెట్టుకోకపోతే గ్రామాల్లో అడ్డుకుంటామని హెచ్చరించారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో 2016 లోనే పసుపు బోర్డు గురించి ప్రధానమంత్రి మోదీని కలిశానని, 2017 లో తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఉత్తరం కూడా రాసిందని కవిత గుర్తు చేశారు.

పసుపు ఎక్కువగా పండించే నిజామాబాద్ పరిధిలో 2018 ఎన్నికలకు ముందు పసుపు బోర్డు అంశం కీలకం అయింది. అప్పటి ఎంపీ కవిత పసుపు బోర్డు తేలేదని నిరసన వ్యక్తం చేస్తూ 178 మంది రైతులు ఆమెకు వ్యతిరేకంగా నామినేషన్లు వేశారు. ఆ ఎన్నికల హామీల్లోనే బీజేపీ ఎంపీగా గెలిచిన తరువాత పసుపు బోర్డును తీసుకురాకపోతే రాజీనామా చేస్తానంటూ ధర్మపురి అర్వింద్ బాండ్ పేపర్‌పై రాసిచ్చారు. అన్న మాట అది నిలబెట్టుకోలేకపోవడంతో ఆయనపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా సుగంధ ద్రవ్యాల బోర్డు సభ్యునిగా ఎంపీ అరవింద్ ఛాన్స్ కొట్టేశారు.

నిజామాబాద్ లో పసుపు రైతులు ఆగ్రహం
ఎంపీ ధర్మపురి అరవింద్ గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీపై పలుమార్లు బీఆర్ఎస్ నేతలు అరవింద్‌ను ప్రశ్నించారు. ఎంపీ అర్వింద్ పసుపు రైతులను మోసం చేశారంటూ ఆర్మూర్ మండలం పెర్కిట్ లోని ఎంపీ అర్వింద్ నివాసం ముందు పసుపు కొమ్ముల పంటను కుప్పగా పోసి పలుమార్లు నిరసన తెలిపారు. ఇటీవల ఎమ్మెల్సీ కవిత ఎంపీ అరవింద్ పసుపు రైతులకు చేసిన ద్రోహాన్ని ఆర్టీఐ సమాచారంతో బట్టబయలు చేశారు. దీంతో అరవింద్ ఓట్ల కోసం తమ మనోభావాలతో ఆడుకున్నాడని పసుపు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Budget 2026-27: నేడు .36 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ 2026-27; అభివృద్ధి సంక్షేమ రంగాలకు అధిక ప్రాధాన్యం!
నేడు .36 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ 2026-27; అభివృద్ధి సంక్షేమ రంగాలకు అధిక ప్రాధాన్యం!
Kavitha Party Telangana Praja Jagruti: తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో కవిత కొత్త పార్టీ! నమోదు ప్రక్రియలో కీలక అడుగు!
తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో కవిత కొత్త పార్టీ! నమోదు ప్రక్రియలో కీలక అడుగు!
Revanth Reddy: 2029లో మళ్లీ తొక్కకపోతే చూడు! అసెంబ్లీ వేదికగా బీఆర్‌ఎస్‌కు రేవంత్ రెడ్డి సవాల్!
2029లో మళ్లీ తొక్కకపోతే చూడు! అసెంబ్లీ వేదికగా బీఆర్‌ఎస్‌కు రేవంత్ రెడ్డి సవాల్!
Weather in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం! ఉరుములు పిడుగులతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ!
తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం! ఉరుములు పిడుగులతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ!

వీడియోలు

Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
Negative Campaign on SRH | IPL 2026 కి ముందు సన్ రైజర్స్ పై ఫేక్ పోస్టులు | ABP Desam
CSK Video on Shivam Dube | IPL 2026 కి ముందు చెన్నైలో క్రికెట్ బాల్స్ ఆందోళన | ABP Desam
Virat Kohli Home Coming RCB | IPL 2026 యుద్ధానికి తిరిగొచ్చిన మహారాజు | ABP Desam
Ishan Kishan Interim Captain SRH | ఇషాన్ వైపే ఆరెంజ్ ఆర్మీ మొగ్గు చూపింది అందుకే | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Budget 2026-27: నేడు .36 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ 2026-27; అభివృద్ధి సంక్షేమ రంగాలకు అధిక ప్రాధాన్యం!
నేడు .36 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ 2026-27; అభివృద్ధి సంక్షేమ రంగాలకు అధిక ప్రాధాన్యం!
Assam Congress troubles: అస్సాం కాంగ్రెస్ అస్సాం - సీనియర్ నేతలంతా బీజేపీ గూటికి - రాహుల్, ప్రియాంక చేతులెత్తేశారా?
అస్సాం కాంగ్రెస్ అస్సాం - సీనియర్ నేతలంతా బీజేపీ గూటికి - రాహుల్, ప్రియాంక చేతులెత్తేశారా?
Rashmika Mandanna : ఒకప్పుడు ట్రోలింగ్... ఇప్పుడు అవార్డ్ - తమ ఊరి కోడలికి అవార్డ్ అందించిన సీఎం రేవంత్
ఒకప్పుడు ట్రోలింగ్... ఇప్పుడు అవార్డ్ - తమ ఊరి కోడలికి అవార్డ్ అందించిన సీఎం రేవంత్
Chiranjeevi : ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి - ఏపీ ప్రభుత్వానికి రిక్వెస్ట్
ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి - ఏపీ ప్రభుత్వానికి రిక్వెస్ట్
Eating Eggs vs Egg Hair Mask : జుట్టు పెరగాలంటే గుడ్డు తింటే మంచిదా? లేక మాస్క్ వేస్తేనా? నిపుణుల సూచనలివే
జుట్టు పెరగాలంటే గుడ్డు తింటే మంచిదా? లేదా హెయిర్ మాస్క్‌ వేస్తే ఒత్తుగా పెరుగుతుందా?
Honda Activa February Sales: స్కూటర్ల అమ్మకాల్లో హోండా యాక్టివా జోరు – ఫిబ్రవరి 2026 టాప్ మోడల్స్ ఇవే!
స్కూటర్ల అమ్మకాల్లో హోండా యాక్టివా జోరు – ఫిబ్రవరి 2026 టాప్ మోడల్స్ ఇవే!
Telangana Gaddar Awards 2026 : తెలంగాణ గద్దర్ అవార్డ్స్ 2026 - విజేతలకు పురస్కారాలు
తెలంగాణ గద్దర్ అవార్డ్స్ 2026 - విజేతలకు పురస్కారాలు
Okra Water : బెండకాయలు నీటిలో నానబెట్టి ఉదయాన్నే తాగితే షుగర్ తగ్గుతుందా? నెలరోజులు తాగితే కలిగే లాభాలు ఇవే
బెండకాయలు నీటిలో నానబెట్టి ఉదయాన్నే తాగితే షుగర్ తగ్గుతుందా? నెలరోజులు తాగితే కలిగే లాభాలు ఇవే
Embed widget