అన్వేషించండి

Nirmal News: పెళ్లి బరాత్ లో డాన్స్ చేస్తూ కుప్పకూలిన యువకుడు, కన్నీరు పెట్టించేలా ఘటన - వీడియో

Nirmal News: స్నేహితుడి పెళ్లికి వచ్చిన ఓ యువకుడు బరాత్ లో పాల్గొన్నాడు. అప్పటి వరకు హాయిగా డ్యాన్స్ చేశాడు. కానీ ఒక్కసారిగా కుప్పకూలిపోయి కిందపడిపోయాడు. క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోయాడు. 

Nirmal News: పెళ్లి రిసెప్షన్ వేడుకల్లో బరాత్ లో డ్యాన్స్ చేస్తూ.. ఓ యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడికక్కడే క్షణాల్లో ప్రాణాలు కోల్పోయాడు. అప్పటి వరకు హాయిగా డ్యాన్స్ చేసిన ఆయన నిమిషాల్లో ప్రాణాలు కోల్పోవడంతో అక్కడున్న వారంతా షాక్ కు గురయ్యారు. మృతుడి కుటుంబ సభ్యులు విషయం తెలుసుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. 

అసలేం జరిగిందంటే..?

నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పార్డీ (కే) గ్రామానికి చెందిన కిష్టయ్య కుమారుని వివాహం శుక్రవారం జరిగింది. శనివారం పార్డి(కె)లో వివాహ వేడుకకు సంబంధించిన విందు జరిగింది. ఇందులో పెళ్లి కుమారుని సమీప బంధువు... మిత్రుడైన మహారాష్ట్రలోని శివ్ ని గ్రామానికి చెందిన 19 ఏళ్ల ముత్యం అనే యువకుడు కూడా విందుకు హాజరయ్యాడు. అయితే బరాత్ లో డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. గమనించిన స్థానికులు యువకుడిని లేపి పరిశీలించగా ఆపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో హుటహూటిన వైద్య సేవల కోసం బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే యువకుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పెళ్లి కోసం వచ్చి బంధువులు, స్నేహితులు కూడా తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. 

గతేడాది డిసెంబర్ లో యూపీలోనూ ఇలాంటి ఘటనే

 ఓ వివాహ వేడుకలో విషాదం జరిగింది. ఉత్సాహంగా డ్యాన్స్ వేస్తున్న ఓ వ్యక్తి ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది. వారణాసిలో జరిగిన ఓ వివాహ వేడుకలో డాన్స్ చేస్తూ గుండె పోటుతో ఓ వ్యక్తి నేలపై కుప్పకూలిపోయి చనిపోయాడు. ఈ  ఘటనలో చనిపోయిన వ్యక్తిని మనోజ్ విశ్వకర్మ గా గుర్తించారు. వివాహ వేడుకలో పాల్గొనేందుకు నవంబర్ 25న చేట్గాంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పిపలని కట్రాకూ అతను వచ్చినట్లు పోలీసులు తెలిపారు. వేడుకలో డాన్స్ చేస్తూ గుండె పోటుతో ప్రాణాలు కోల్పోయాడని పేర్కొన్నారు.

వేడుకల్లో డాన్స్ చేస్తూ గుండె పోటుతో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఇంతక ముందు తన వదిన పెళ్ళిలో డాన్స్ చేస్తూ రాజస్థాన్ లోని పాలి జిల్లాకు చెందిన వ్యక్తి మరణించాడు. అలాంటి ఘటనే దహోడ్ జిల్లాలోని దేవగాడ్ బరియాలో 'రాస్' కార్యక్రమం నిర్వహించేటప్పుడు 51 ఏళ్ల వ్యక్తి మరణించాడు.

సెప్టెంబర్ లో కూడా ఉత్తర్‌ప్రదేశ్ లోని మణిపూరిలో గణపతి మంటపంలో హనుమంతుడి వేషధారణలో ఉన్న రాజీవ్ శర్మ అనే వ్యక్తి స్పృహ కోల్పోయి కిందపడగా, ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మరణించాడు. గత నెలలో ఇలాంటిదే మరో ఘటన జరిగింది. జమ్ము కాశ్మీర్ లోని బిష్ణా లో గణేష్ పూజ కార్యక్రమంలో డాన్స్ చేస్తూ యోగేష్ గుప్తా అనే 20 ఏళ్ల వ్యక్తి మరణించాడు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Minister Peddireddy: నా జీవితంలో జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు: మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
నా జీవితంలో జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు: మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Cantonment Bypoll: కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
Akhanda 2: ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
Thota Trimurtulu Case :  అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Nirai Mata Temple | గర్భగుడిలో దేవత ఉండదు... కానీ ఉందనుకుని పూజలు చేస్తారుSiricilla Gold Saree | Ram Navami | మొన్న అయోధ్య.. నేడు భద్రాద్రి సీతమ్మకు... సిరిసిల్ల బంగారు చీరVijayawada CP On CM Jagan Stone Attack:ప్రాథమిక సమాచారం ప్రకారం సీఎంపై దాడి వివరాలు వెల్లడించిన సీపీRCB IPL 2024: చేతిలో ఉన్న రికార్డ్ పోయే.. చెత్త రికార్డ్ వచ్చి కొత్తగా చేరే..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Minister Peddireddy: నా జీవితంలో జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు: మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
నా జీవితంలో జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు: మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Cantonment Bypoll: కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
Akhanda 2: ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
Thota Trimurtulu Case :  అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
Andhra News : ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి బదిలీ - ఎన్నికల విధుల నుంచి తప్పించిన ఈసీ
ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి బదిలీ - ఎన్నికల విధుల నుంచి తప్పించిన ఈసీ
IPL 2024: ఇక నా వల్ల కాదు గుడ్‌ బై! మ్యాక్స్‌వెల్‌ సంచలన ప్రకటన
ఇక నా వల్ల కాదు గుడ్‌ బై! మ్యాక్స్‌వెల్‌ సంచలన ప్రకటన
CM Jagan: సీఎంపై రాయి దాడి ఘటనలో ఊహించని ట్విస్ట్ - సంచలనం రేపుతోన్న లోకేష్ ట్వీట్
సీఎంపై రాయి దాడి ఘటనలో ఊహించని ట్విస్ట్ - సంచలనం రేపుతోన్న లోకేష్ ట్వీట్
Embed widget