అన్వేషించండి

Telangana Cabinet scraps GO 111: ట్రిపుల్ వన్ జీవో ఎత్తివేత వెనుక లక్షల కోట్ల మహా స్కాం దాగి ఉంది - బండి సంజయ్ ఆరోపణలు

ట్రిపుల్ వన్ జీవో ఎత్తివేత వెనుక లక్షల కోట్ల మహా స్కాం దాగి ఉందిపేదల వద్ద కారుచౌకగా ఎకరాల చొప్పున కొట్టేసిన కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నేతలు

- 111 జీవో ఎత్తేసిన తరువాత గజాల లెక్క రియల్ ఎస్టేట్ పేరుతో లక్షల కోట్ల దందా చేస్తున్న కేసీఆర్ ఫ్యామిలీ 
- బీఆర్ఎస్ అక్రమాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదు... 
- కోకాపేట భూముల కేటాయింపు ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలి 
- ఆ స్థలంలో పేదలకు ఇండ్లు కట్టివ్వాలి, లేనిపక్షంలో తీవ్ర ఎత్తున ఉద్యమిస్తాం 
- రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ హెచ్చరిక

‘‘కోకాపేట భూమి మీ అయ్య జాగీరనుకున్నరా? ఆ ప్రాంతంలో గజం లక్షకుపైగా పలుకుతుంటే రూ.7,500 చొప్పున 11 ఎకరాల భూమిని బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా కట్టబెడతారు? అదే ప్రాంతంలో సర్కారు భూమిని హెచ్ఎండీఏ అధికారులు గజానికి లక్ష పదివేలకు చొప్పున మార్కెట్ లో అమ్మకానికి పెడుతూ పత్రికల్లో నోటిఫికేషన్ ఇచ్చారు. మరి అదే ప్రాంతంలో రూ.550 కోట్ల విలువైన భూమిని 40 కోట్లలోపే బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా కట్టబెడతారు?’’అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రత్యేకంగా కేబినెట్ మీటింగ్ పెట్టి ఆమోదించుకున్నారు
వాస్తవానికి ఓపెన్ మార్కెట్ లో కోకాపేటలో ఎకరం ధర వంద కోట్ల రూపాయలకుపైగా పలుకుతోందని, ఈ లెక్కన బీఆర్ఎస్ కు కట్టబెట్టిన భూముల విలువ 1100 కోట్ల రూపాయలకు పైమాటేనని అన్నారు. ఈ భూమిని ధారాదత్తం చేసుకునేందుకు ప్రత్యేకంగా కేబినెట్ మీటింగ్ పెట్టి ఆమోదించుకున్నారని, అయినప్పటికీ మీడియాకు మాత్రం ఈ వివరాలను వెల్లడించకుండా రహస్యంగా దాచి  ప్రజల ఆస్తులను కొట్టేశారని మండిపడ్డారు. పేదలు తలదాచుకోవడానికి స్థలాలే లేవని చెబుతున్న కేసీఆర్... సొంత పార్టీకి కేటాయించుకునేందుకు భూములెక్కడినుండి వస్తున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. 
సర్కార్ భూ భాగోతాన్ని ప్రజల్లో ఎండగడతాం
ఇప్పటికే పార్టీ రాష్ట్ర కార్యాలయంతోపాటు 33 జిల్లాల్లో పార్టీ కార్యాలయాల ఏర్పాటు కోసం అత్యంత కారు చౌకగా భూమిని కొట్టేసిన కేసీఆర్... ఆ భూములు చాలవని ‘‘ఇన్ స్టిట్యూట్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలెప్ మెంట్’’ పేరుతో వందల కోట్ల విలువైన భూమిని కాజేయడం దుర్మార్గమన్నారు. ట్రిపుల్ వన్ జీవో ఎత్తివేత వెనుక లక్షల కోట్ల మహా స్కాం ఉందని బండి సంజయ్ ఆరోపించారు. ఆ జీవో పరిధిలోని పేదల వంద కారు చౌకగా ఎకరాల చొప్పున భూములను కొనుగోలు చేసిన కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నేతలు... ట్రిపుల్ వన్ జీవోను ఎత్తేసుకుని గజాల చొప్పున అమ్ముకుంటూ లక్షల కోట్ల రియల్ దందాకు తెరదీశారని ధ్వజమెత్తారు. ఈ విషయాలను ఇంతటితో వదిలిపెట్టే ప్రసక్తే లేదని, పెద్ద ఎత్తున ఉద్యమించి సర్కార్ భూ భాగోతాన్ని ప్రజల్లో ఎండగడతామని చెప్పారు. బీజేపీ సోయం బాపూరావు కుమారుడి పెళ్లికి హాజరయ్యేందుకు ఆదివారం ఆదిలాబాద్ వచ్చిన బండి సంజయ్ పార్టీ జిల్లా అధ్యక్షులు పాయల శంకర్, నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్ లతో కలిసి మీడియాతో మాట్లాడారు.

ఎన్నికలు గుర్తొచ్చినప్పుడే సీఎం కేసీఆర్ కు పేదలు గుర్తుకొస్తారు.. ఎన్నికలైపోంగనే పేదల భూములను గుంజుకుంటున్నారు. పేదల స్థలాల్లోనే కలెక్టరేట్లు, ఫైర్ స్టేషన్లు, కాలేజీలు కడతామంటున్నరు.  ధరణి పేరుతో ఎట్లా రైతులను మోసం చేస్తున్నారో.. బీఆర్ఎస్ నాయకులు ఎట్లా లాభపడ్డారో జగమెరిగిన సత్యమే అన్నారు బండి సంజయ్. బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాల పేరుతో గజానికి వంద రూపాయల చొప్పున ఒక్కో జిల్లాలో ఎకరానికి పైగా స్థలాలు తీసుకుంటూ 33 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. అట్లాగే భూములమ్మి పైసలు దోచుకుంటున్నరు అని ఆరోపించారు.

మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్ అనంతరం వివరాలు వెల్లడించిన మంత్రి హరీష్ రావు అసలు విషయాన్ని మాత్రం దాచి వేశారు. హైదరాబాద్ లోని కోకాపేటలోని 11 ఎకరాల విలువైన భూమిని ఇన్ స్టిట్యూట్ పేరుతో బీఆర్ఎస్ కు పార్టీకి ధారాదత్తం చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దీనివిలువ రూ.40 కోట్లు మాత్రమే చెల్లించి ఆ భూమిని కొనేలా ఉత్తర్వులు జారీ చేశారు. దీని కోసమే కేబినెట్ మీటింగ్ పెట్టారు. కానీ ఈ విషయం మాత్రమ చెప్పలేదు. ఈ ఉత్తర్వులను రహస్యంగా ఉంచారు.  

‘ఇదే కోకాపేట ప్రాంతంలో ప్రభుత్వ భూమిని అమ్మడానికి హెచ్ఎండీఏ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. ఇది పత్రికల్లో వచ్చింది. కోకాపేటలో ఒక గజం విలువ ఒక లక్షా 10 వేల చొప్పున ప్రభుత్వ భూమిని హెచ్ఎండీఏ అమ్మకానికి పెట్టింది. కానీ అదే ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీకి కేటాయించిన స్థలానికి సంబంధించి ఒక్క గజానికి 7,500 రూపాయల చొప్పున మాత్రమే చెల్లించి కొనేందుకు సిద్ధమైంది. వాస్తవానికి ఈ స్థలం మార్కెట్ విలువ రూ.550 కోట్ల పైమాటే.. ఓపెన్ మార్కెట్ లో అక్కడ ఒక్క ఎకరానికి రూ.వంద కోట్ల విలువ చేస్తోంది. ఈ లెక్క ప్రకారం చూస్తే 11 వందల కోట్లు.. మరి అంత తక్కువకు బీఆర్ఎస్ ఎట్లా కొంటది? ఎవడయ్య జాగీరనుకుంది? ప్రభుత్వ అమ్మే రేటుకు, పార్టీకి ఇచ్చే రేటు విషయంలో నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఓపెన్ మార్కెట్ లో 11 వందల కోట్లు ఉంటే... 40 కోట్లే చెల్లించి కొంటారా?’ అని బండి సంజయ్ ప్రశ్నించారు.

గతంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా  2008లో హైదరాబాద్ లోని బోయినిపల్లిలో 10 ఎకరాల పైగా స్థలాన్ని కాంగ్రెస్ కు కట్టబెట్టిందన్నారు. ఈరోజు బీఆర్ఎస్ ఆ పనిచేసింది. ఇంతకంటే దారుణం, మోసం ఇంకోటి లేదు. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వడానిక స్థలం లేదంటారు... జీతాలివ్వడానికి పైసల్లేవంటారు.. దోపిడీలో మాత్రం కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయ్. ఇది భరించలేకే ఏలేటి, రామారావు కాంగ్రెస్ ను వీడి బీజేపీలోకి వచ్చారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందే. ఇద్దరూ కలిసి ఏ విధంగా ప్రజల ఆస్తులను దోచుకుంటున్నారో దీనినిబట్టే అర్ధం చేసుకోవచ్చు. ప్రభుత్వ ఆదాయానికి తీవ్రంగా గండి కొడుతోంది. వాస్తవానికి ఆ రెండు పార్టీలు ఒక్కటే. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసే పనిచేస్తున్నారు. కలిసే దోచుకుంటున్నారనడానికి ఇదే నిదర్శనం. పేదలకు ఇండ్లు ఇవ్వడానికి ఎందుకు ముందుకు రావడం లేదు? బీఆర్ఎస్ నేతలు దొడ్డిదారిన దోచుకోవడానికి భూములు ఎట్లా వస్తున్నాయో సంగతి తేలుస్తాం. వెంటనే ప్రభుత్వం వెంటనే ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి. ఆ స్థలాల్లో పేదలకు ఇండ్లు ఇవ్వాలి. వెంటనే సీఎం కేసీఆర్ ఈ భూ దందాను బంద్ చేయాలని బండి సంజయ్ సూచించారు.

ట్రిపుల్ వన్ జీవో ఎత్తివేత లక్షల కోట్ల విలువైన మహా స్కాం. ఎంత దుర్మార్గమంటే...  ఆ ప్రాంతంలోని పేదల దగ్గర అత్యంత తక్కువ ధరకు ఎకరాల చొప్పున కొని ఇప్పుడు ఈ జీవోను ఎత్తివేసి గజాల చొప్పున అమ్ముకుంటూ భూ దందా చేస్తున్నయ్. ఈ భూముల్లో 90 శాతం కేసీఆర్ కుటుంబానివి, బీఆర్ఎస్ కుటుంబానివే అని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Vijayamma Birthday : తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు -   షర్మిలారెడ్డి ఎమోషనల్ -  సీఎం జగన్ కూడా !
తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు - షర్మిలారెడ్డి ఎమోషనల్ - సీఎం జగన్ కూడా !
Brs Mla: బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
Allu Arjun: బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Kiran Kumar reddy on Peddireddy | పెద్దిరెడ్డిపై మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి షాకింగ్ కామెంట్స్Annamalai Reaction 1000Crores Google Pay | కోయంబత్తూరులో డీఎంకే వెయ్యికోట్లు పంచిందా..? | ABP DesamRohit Sharma on Impact Player | IPL 2024 లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై హిట్ మ్యాన్ గుస్సా | ABP DesamLoksabha Elections 2024 | Tamil Nadu సహా 21రాష్ట్రాల్లో మొదలైన పోలింగ్ పండుగ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Vijayamma Birthday : తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు -   షర్మిలారెడ్డి ఎమోషనల్ -  సీఎం జగన్ కూడా !
తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు - షర్మిలారెడ్డి ఎమోషనల్ - సీఎం జగన్ కూడా !
Brs Mla: బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
Allu Arjun: బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
Hyderabad News: సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
ఉదయం 11 గంటల సమయానికి 24.5% పోలింగ్, కొనసాగుతున్న తొలి విడత ఓటింగ్
ఉదయం 11 గంటల సమయానికి 24.5% పోలింగ్, కొనసాగుతున్న తొలి విడత ఓటింగ్
నెలకు లక్ష రూపాయల స్కాలర్‌షిప్‌- తెలుగు విద్యార్థులకు స్వీట్ న్యూస్ చెప్పిన జపాన్‌
నెలకు లక్ష రూపాయల స్కాలర్‌షిప్‌- తెలుగు విద్యార్థులకు స్వీట్ న్యూస్ చెప్పిన జపాన్‌
Heavy Temparatures: నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
Embed widget