By: ABP Desam | Updated at : 12 Feb 2023 08:13 PM (IST)
గ్రామ పంచాయతీ ఆఫీసు కరెంట్ బిల్లు
సాధారణంగా కరెంట్ బిల్లు వచ్చే సమయంలో గత నెల అంత వస్తే చాలు, యూనిట్లు పెరిగి ఎక్కువ బిల్లు వస్తే జేబుకు చిల్లు అని అనుకుంటాం. కానీ విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఓ గ్రామ పంచాయతీ ఆఫీసుకు ఏకంగా రూ.11.41 కోట్ల కరెంట్ బిల్లు రావడంతో షాకవడం ఉద్యోగులు, సర్పంచి, కార్యదర్శి వంతయింది. ఆ వివరాలిలా ఉన్నాయి.
కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలంంలో కొత్తపల్లి గ్రామ పంచాయతీ ఉంది. ఆ పంచాయతీ కార్యాలయానికి ప్రతినెల తరహాలోనే జనవరి నెల కరెంట్ బిల్లు వచ్చింది. కానీ ఆ బిల్లు చూసిన సర్పంచ్, కార్యదర్శికి మాత్రం గుండె ఆగినంత పనైంది. ఎందుకంటే కొత్తపల్లి గ్రామ పంచాయతీకి జనవరి నెలకుగానూ రూ.11,41,63,672 (11 కోట్ల 41 లక్షల 63 వేల 6 వందల 72 రూపాయలు) విద్యుత్ బిల్లు వేశారు. వందలు, వేలల్లో రావాల్సిన కరెంట్ బిల్లు కోట్ల రూపాయల్లో రావడంతో గ్రామానికే షాక్ కొట్టినట్లు అయింది. వామ్మో ఇదేంది.. ఈ రేంజ్ లో కరెంట్ బిల్లులు వసూలు చేస్తున్నారా అంటూ గ్రామస్తులు షాక్ అయ్యారు.
విద్యుత్ శాఖ అధికారులను నిలదీసిన గ్రామస్తులు
వందలు, వేల రూపాయల్లో రావాల్సిన కరెంట్ బిల్లు రికార్డు స్థాయిలో కోట్ల రూపాయల్లో పంచాయతీ ఆఫీసుకు జనవరి నెల కరెంట్ బిల్లు రావడంతో విద్యుత్ అధికారులను పంచాయతీ పాలక వర్గం, కార్యదర్శి, సర్పంచి నిలదీశారు. గ్రామాన్ని డెవలప్ చేయడానికి నిధులు లేక మేం సతమతం అవుతుంటే, ఎనర్జీ ఛార్జీలు 11 కోట్ల రూపాయలు వేశారని, ఇతరత్రా ఛార్జీలు కలిపితే మొత్తం రూ.11.41 కోట్ల బిల్లు వచ్చిందని మాచారెడ్డి ఏఈ వెంకటరమణను వివరణ కోరారు. సాంకేతిక సమస్య కారణంగా బిల్లు కోట్ల రూపాయల్లో వచ్చిందని, మీటర్ రీడింగ్ చెక్ చేసి బిల్లును పునరుద్ధరిస్తామని ఏఈ చెప్పడంతో గ్రామ సర్పంచ్, కార్యదర్శి ఊపిరి పీల్చుకున్నారు. కానీ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా భారీ బిల్లులు వస్తున్నాయని, బిల్లు చూసి ఎవరికైనా అకస్మాత్తుగా ఏమైనా జరిగితే ఎవరూ బాధ్యత వహిస్తారని సంబంధిత శాఖ ఉన్నతాధికారులను గ్రామస్తులు, అధికారులు ప్రశ్నిస్తున్నారు.
కాకా హోటల్ కు రూ.కోట్లలో కరెంట్ బిల్లు...
కాకా హోటల్ కు కోట్ల రూపాయల కరెంట్ బిల్లు వచ్చిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో గతంలో చోటుచేసుకుంది. బిల్లు చూసి నిర్వాహకులు షాక్ తిన్నారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి కొత్త బస్టాండు సమీపంలో ఉన్న చిన్నపాటి టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నారు ముళ్లగిరి మంగమ్మ. సెప్టెంబర్ నెలకు సంబంధించి రూ.కోట్లలో విద్యుత్తు బిల్లు రావడంతో ఆమె అధికారులకు ఫిర్యాదుచేశారు. సాధారణంగా ప్రతి నెలా రూ.700 వరకు బిల్లు వస్తుండేది. కానీ గత రెండు నెలలుగా వేల రూపాయల్లో బిల్లు వస్తుంది. ఆగస్టులో రూ.47,148 బిల్లు రావడంతో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. మీటరులో లోపం ఉందంటూ విద్యుత్తు సిబ్బంది కొత్త మీటర్ బిగించారు. ఈసారి ఏకంగా కోట్లలో బిల్లు వచ్చింది. సెప్టెంబరులో రూ.21,48,62,224 బిల్లు రావడంతో మంగమ్మ మళ్లీ అధికారులకు మొరపెట్టుకున్నారు. సాంకేతిక లోపంతో ఇంత బిల్లు వచ్చి ఉంటుందని, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని విద్యుత్ అధికారులు తెలిపారు.
TS SSC Exams: తెలంగాణలో రేపట్నుంచి 'టెన్త్ క్లాస్' ఎగ్జామ్స్, విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం!
Inter Academic Calender: ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల, ఈ ఏడాది వచ్చే సెలవులివే!
కొత్త విధానంలో ఇంటర్ మూల్యాంకనం, ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?
TS Constable Technical Papers: నేడే కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ టెక్నికల్ పరీక్షలు!
TS Police SI Exam: ఏప్రిల్ 3 నుంచి ఎస్ఐ, ఏఎస్ఐ తుదిపరీక్ష హాల్టికెట్లు, పరీక్షలు ఎప్పుడంటే?
Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్
SRH Vs RR: టాస్ రైజర్స్దే - బౌలింగ్కు మొగ్గు చూపిన భువీ!
KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ
MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం