అన్వేషించండి

Kamareddy News: పగలు క్లాస్ రూం- రాత్రి హాస్టల్- కామారెడ్డిలో వింత పరిస్థితి

నత్తనడకన కేజీబీవీ భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. రూ. కోటి 50 లక్షల నిధులు కేటాయించినా పనులు ముందుకు సాగడం లేదు.

ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారింది. విద్యార్థులకు చదువుకునేందుకు సరైన తరగతి గదుల్లేవు. తరగతి గదుల్లోనే హాస్టల్ రూంలు ఇవ్వటంలో కేజీబీవి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మద్నూర్‌లో 8 ఏళ్ల క్రితం కేజీబీవీ నూతన భవనం మంజూరు చేసింది ప్రభుత్వం. జుక్కల్ వెనుకబడిన నియోజకవర్గం కావటంతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న ఉద్దేశంతో కేజీబీవీ భవన నిర్మాణం కోసం సుమారు కోటి 50 లక్షల రూపాయలతో శ్రీకారం చుట్టారు.

రోజులు గడుస్తున్నా భవన నిర్మాణం పనులు పూర్తి కావడం లేదు. మాత్రం నత్తనడకన కొనసాగుతున్నాయి. గత ఎనిమిదేళ్లుగా కేజీవీబీ భవన నిర్మాణం పనులు నడుస్తూనే ఉన్నాయ్. భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలని స్థానికులు ఇటు ప్రజా ప్రతినిధులకు, అధికారుల దృష్టికి ఎన్ని సార్లు తీసుకొచ్చిన ఫలితం లేకుండా పోయింది. 8 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ భవన నిర్మాణం పూర్తి కాలేదు. మద్నూర్‌లోని కేజీబీవీలో దాదాపు 250 మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. వారికి తరగతి గదులు, హాస్టల్ పాత భవనంలోనే నిర్వహిస్తున్నారు. క్లాస్ రూంలో పగలు చదువుకోవటం రాత్రికి అవే గదుల్లో నిద్రపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో విద్యార్థినిలు చాలా ఇబ్బంది పడుతున్నారు.

ఇప్పటికే తమ సమస్యలను విద్యార్థులు అధికారుల దృష్టికి చాలా సార్లు తీసుకువచ్చారు. అయినా ఫలితం లేదని వాపోతున్నారు. 8 సంవత్సరాల నుంచి ఒక చిన్న భవనంలో పాఠశాల, వసతి గృహం ఒక్కటే ఉండటంతో విద్యార్థులు చదువులు సరిగ్గా సాగటం లేదని అంటున్నారు. ఇబ్బందులు ఎదురైనా విద్యార్థినిలు అడ్జెస్ట్ అవుతున్నారు.

సరైన భవనం లేక విద్యార్థులు, బోధన సిబ్బంది ఆవేదన చెందుతున్నారు.. ప్రజా ప్రతినిధులు నియోజకవర్గానికి వస్తున్నప్పుడు విద్యార్థుల ఇక్కట్లు చూసి వెళ్తున్నారే తప్ప కేజీబీవీ కోసం నిర్మిస్తున్న కొత్త భవనం నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు మాత్రం తీసుకోవటం లేదుని... తాము పడుతున్న ఇబ్బందులు ఏ మాత్రం పట్టించుకోవటం లేదని విద్యార్థులు చెబుతున్నారు.

ఈ విషయంపై విద్యార్థినుల తల్లిదండ్రులు కూడా చాలా సార్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. తమ పిల్లలు కేజీబీవీ పాఠశాలలో నాణ్యమైన విద్య అందిస్తారని ఎంతో ఆశతో చేర్పిస్తే... ఇక్కడ మాత్రం కనీస వసతులు లేక ఆడపిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా కేజీబీవీ భవన నిర్మాణం పనులను వేగవంతం చేసి ఈ వర్షాకాలంలో విద్యార్థులు పడే బాధలను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. తరగతి గదులు, హాస్టల్ ఒకే గదుల్లో ఉండేటంతో స్టడీ మీద దృష్టి పెట్టలేక పోతున్నామని విద్యార్థులు అంటున్నారు. కనీసం మరుగుదొడ్ల వసుతులు కూడా సరిగ్గా లేవు. మంచి నీటి ఇబ్బందులు ఉన్నాయని విద్యార్థులు చెబుతున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Vedma Bojju Patel: ఎమ్మెల్యేగా ఉన్నా, ఏం జరుగుతుందో తెలియడం లేదు: వెడ్మ బొజ్జు పటేల్
ఎమ్మెల్యేగా ఉన్నా, ఏం జరుగుతుందో తెలియడం లేదు: వెడ్మ బొజ్జు పటేల్
SIR పై అప్రమత్తంగా ఉండాలి, ఒక్క ఓటు కూడా గల్లంతు కాకూడదు: Jupally Krishna Rao
SIR పై అప్రమత్తంగా ఉండాలి, ఒక్క ఓటు కూడా గల్లంతు కాకూడదు: Jupally Krishna Rao
Breaking News: రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
Kakinada KIET College Invitation To CM Vijay: కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
Patancheru Real Estate: ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
NBK111 Update : బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
AIADMK MLA MR Vijayabhaskar Resigns: టీవీకే విజయ్ ప్లాన్‌కు అల్లాడిపోతున్న అన్నాడీఎంకే - మరో ఎమ్మెల్యే రాజీనామా - లైన్‌లో ఇంకా ఉన్నారా?
టీవీకే విజయ్ ప్లాన్‌కు అల్లాడిపోతున్న అన్నాడీఎంకే - మరో ఎమ్మెల్యే రాజీనామా - లైన్‌లో ఇంకా ఉన్నారా?
Kodangal Duplicate Votes: కొడంగల్‌లో 11 వేల కర్ణాటక వాసుల ఓట్లు - కవిత సంచలన ఆరోపణలు
కొడంగల్‌లో 11 వేల కర్ణాటక వాసుల ఓట్లు - కవిత సంచలన ఆరోపణలు
ENE Sequel Release Date : ఓవైపు కుర్రాళ్లు రెడీ... మరోవైపు నవ్వుల తుపాన్ - ఈ నగరానికి ఏమైంది? సీక్వెల్ రిలీజ్ డేట్ ఫిక్స్
ఓవైపు కుర్రాళ్లు రెడీ... మరోవైపు నవ్వుల తుపాన్ - ఈ నగరానికి ఏమైంది? సీక్వెల్ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget