News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Kamareddy News: పగలు క్లాస్ రూం- రాత్రి హాస్టల్- కామారెడ్డిలో వింత పరిస్థితి

నత్తనడకన కేజీబీవీ భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. రూ. కోటి 50 లక్షల నిధులు కేటాయించినా పనులు ముందుకు సాగడం లేదు.

FOLLOW US: 
Share:

ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారింది. విద్యార్థులకు చదువుకునేందుకు సరైన తరగతి గదుల్లేవు. తరగతి గదుల్లోనే హాస్టల్ రూంలు ఇవ్వటంలో కేజీబీవి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మద్నూర్‌లో 8 ఏళ్ల క్రితం కేజీబీవీ నూతన భవనం మంజూరు చేసింది ప్రభుత్వం. జుక్కల్ వెనుకబడిన నియోజకవర్గం కావటంతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న ఉద్దేశంతో కేజీబీవీ భవన నిర్మాణం కోసం సుమారు కోటి 50 లక్షల రూపాయలతో శ్రీకారం చుట్టారు.

రోజులు గడుస్తున్నా భవన నిర్మాణం పనులు పూర్తి కావడం లేదు. మాత్రం నత్తనడకన కొనసాగుతున్నాయి. గత ఎనిమిదేళ్లుగా కేజీవీబీ భవన నిర్మాణం పనులు నడుస్తూనే ఉన్నాయ్. భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలని స్థానికులు ఇటు ప్రజా ప్రతినిధులకు, అధికారుల దృష్టికి ఎన్ని సార్లు తీసుకొచ్చిన ఫలితం లేకుండా పోయింది. 8 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ భవన నిర్మాణం పూర్తి కాలేదు. మద్నూర్‌లోని కేజీబీవీలో దాదాపు 250 మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. వారికి తరగతి గదులు, హాస్టల్ పాత భవనంలోనే నిర్వహిస్తున్నారు. క్లాస్ రూంలో పగలు చదువుకోవటం రాత్రికి అవే గదుల్లో నిద్రపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో విద్యార్థినిలు చాలా ఇబ్బంది పడుతున్నారు.

ఇప్పటికే తమ సమస్యలను విద్యార్థులు అధికారుల దృష్టికి చాలా సార్లు తీసుకువచ్చారు. అయినా ఫలితం లేదని వాపోతున్నారు. 8 సంవత్సరాల నుంచి ఒక చిన్న భవనంలో పాఠశాల, వసతి గృహం ఒక్కటే ఉండటంతో విద్యార్థులు చదువులు సరిగ్గా సాగటం లేదని అంటున్నారు. ఇబ్బందులు ఎదురైనా విద్యార్థినిలు అడ్జెస్ట్ అవుతున్నారు.

సరైన భవనం లేక విద్యార్థులు, బోధన సిబ్బంది ఆవేదన చెందుతున్నారు.. ప్రజా ప్రతినిధులు నియోజకవర్గానికి వస్తున్నప్పుడు విద్యార్థుల ఇక్కట్లు చూసి వెళ్తున్నారే తప్ప కేజీబీవీ కోసం నిర్మిస్తున్న కొత్త భవనం నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు మాత్రం తీసుకోవటం లేదుని... తాము పడుతున్న ఇబ్బందులు ఏ మాత్రం పట్టించుకోవటం లేదని విద్యార్థులు చెబుతున్నారు.

ఈ విషయంపై విద్యార్థినుల తల్లిదండ్రులు కూడా చాలా సార్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. తమ పిల్లలు కేజీబీవీ పాఠశాలలో నాణ్యమైన విద్య అందిస్తారని ఎంతో ఆశతో చేర్పిస్తే... ఇక్కడ మాత్రం కనీస వసతులు లేక ఆడపిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా కేజీబీవీ భవన నిర్మాణం పనులను వేగవంతం చేసి ఈ వర్షాకాలంలో విద్యార్థులు పడే బాధలను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. తరగతి గదులు, హాస్టల్ ఒకే గదుల్లో ఉండేటంతో స్టడీ మీద దృష్టి పెట్టలేక పోతున్నామని విద్యార్థులు అంటున్నారు. కనీసం మరుగుదొడ్ల వసుతులు కూడా సరిగ్గా లేవు. మంచి నీటి ఇబ్బందులు ఉన్నాయని విద్యార్థులు చెబుతున్నారు.

Published at : 04 Jul 2022 05:37 PM (IST) Tags: Kamareddy Kamareddy News Kamareddy News Update Kamareddy Latest News

ఇవి కూడా చూడండి

LAWCET: లాసెట్‌ సీట్ల కేటాయింపు, తొలి విడతలో 5912 మందికి ప్రవేశాలు

LAWCET: లాసెట్‌ సీట్ల కేటాయింపు, తొలి విడతలో 5912 మందికి ప్రవేశాలు

Telangana Polling 2023 LIVE Updates: తెలంగాణలో గెలిచేది ఎవరు.? నిలిచేది ఎవరు.? - ఏబీపీ సీ ఓటర్ సర్వే ఫలితాలు

Telangana Polling 2023 LIVE Updates:  తెలంగాణలో గెలిచేది ఎవరు.? నిలిచేది ఎవరు.? - ఏబీపీ సీ ఓటర్ సర్వే ఫలితాలు

Telangana Elections 2023: స్వల్ప ఉద్రిక్తతలతో ముగిసిన తెలంగాణ ఎన్నికలు, 70 దాటిన పోలింగ్ శాతం

Telangana Elections 2023: స్వల్ప ఉద్రిక్తతలతో ముగిసిన తెలంగాణ ఎన్నికలు, 70 దాటిన పోలింగ్ శాతం

Telangana Assembly Election 2023: కన్ఫ్యూజన్ వద్దు వందశాతం గెలుపు BRS దే, కేటీఆర్ కామెంట్స్ వైరల్

Telangana Assembly Election 2023: కన్ఫ్యూజన్ వద్దు వందశాతం గెలుపు BRS దే, కేటీఆర్ కామెంట్స్ వైరల్

Telangana Assembly Election 2023: సాయంత్రం 5 గంటలకు తెలంగాణ వ్యాప్తంగా 63.94 శాతం పోలింగ్, ముగిసిన పోలింగ్ సమయం

Telangana Assembly Election 2023: సాయంత్రం 5 గంటలకు తెలంగాణ వ్యాప్తంగా 63.94 శాతం పోలింగ్, ముగిసిన పోలింగ్ సమయం

టాప్ స్టోరీస్

Telangana Elections 2023 : తెలంగాణలో హంగ్ వస్తే బీఆర్ఎస్ పార్టీతో కలిసేదెవరు ? - బీజేపీనా ? మజ్లిస్ పార్టీనా ?

Telangana Elections 2023 :  తెలంగాణలో హంగ్ వస్తే బీఆర్ఎస్ పార్టీతో కలిసేదెవరు ? -  బీజేపీనా ? మజ్లిస్ పార్టీనా ?

Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో కాస్త తగ్గిన చలి, ఏపీకి మాత్రం వర్ష సూచన!

Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో కాస్త తగ్గిన చలి, ఏపీకి మాత్రం వర్ష సూచన!

Dhootha Web Series Review - దూత రివ్యూ: అమెజాన్‌లో నాగ చైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ - బావుందా? బాలేదా?

Dhootha Web Series Review - దూత రివ్యూ: అమెజాన్‌లో నాగ చైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ - బావుందా? బాలేదా?

Nagarjuna Sagar Dam Issue: నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద మరోసారి ఉద్రిక్తత, జేసీబీలతో చేరుకుంటున్న టీఎస్ పోలీసులు

Nagarjuna Sagar Dam Issue: నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద మరోసారి ఉద్రిక్తత, జేసీబీలతో చేరుకుంటున్న టీఎస్ పోలీసులు