అన్వేషించండి

Kamareddy District News: ఇంఛార్జీ ఎమ్మార్వో, ధరణి ఆపరేటర్ కుమ్మక్కు- లంచం ఇస్తే గాని పని జరగదు!

Kamareddy District News: రైతు వద్ద నుంచి నాలుగు వేల రూపాయల లంచం తీసుకుంటూ రామారెడ్డి ఇంఛార్జీ తహసీల్దార్ మానస ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు.  

Kamareddy District News: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల ఇంఛార్జీ తహసీల్దార్, ధరణి ఆపరేటర్.. లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. అయితే చనిపోయిన తన పెద్దమ్మ పేరిట ఉన్న భూమిని అతడి పేరు మీదకు మార్చాలంటూ ఆర్జీ పెట్టుకోగా.. సదదు ఇంఛార్జీ ఎమ్మార్వో పది వేల రూపాయల లంచం అడిగారు. అంత ఇచ్చుకోలేనని బతిమాలగా.. చివరకు నాలుగు వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలోనే అతడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 

అసలేం జరిగిందంటే..?

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలానికి చెందిన రైతు బలరాం తన పెద్దమ్మ పేరున ఉన్న భూమిని తన పేరు మీదకు మార్చాలని రామారెడ్డి తహసీల్దార్ కార్యాలయంలోని ధరణి ఆపరేటర్ ను కలిశాడు. తన పెద్దమ్మకు ఎవరూ లేకపోవడంతో బాగోగులు తనే చూసుకునేవాడినని.. అయితే ఆమె రెండేళ్ల క్రితం చనిపోయిందని తెలిపాడు. ఆమె పేరిట ఉన్న 37 గుంటల భూమిని త పేరు మీదకు మార్చాలని ఆర్జీ పెట్టుకున్నాడు. దీంతో ధరణి ఆపరేటర్ లక్ష్మణ్ ఆన్ లైన్ ఫీజు రూ. 3 వేలు, దాని తర్వాత లంచం రూపంలో 10 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. నేను సాధారణ రైతును.. నేను అంత లంచం ఇచ్చుకోలేనని బలరాం చెప్పగా.. నాలుగు వేలు అయినా సరే ఇవ్వాల్సిందేనని ఇంఛార్జీ తహసీల్దార్ మానస అన్నారు. ఇష్టం లేకపోయినా సరే అని చెప్పి బయటకు వచ్చాడు రైతు బలరాం. 

తన పెద్దమ్మ పేరిట భూమిని మార్చేందుకు తానెందుకు లంచం ఇవ్వాలని భావించిన బలరాం.. నిజామాబాద్ లోని ఏసీబీ అధికారుల దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. గురువారం మధ్యాహ్నం బలరాం ఇంఛార్జీ తహసీల్దార్ మానసకు.. నాలుగు వేల లంచం అస్తుండగా... ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ విషయాన్ని నిజామాబాద్ ఏసీబీ డీఎస్ప ఆనందర్ కుమార్, ఇన్స్ పెక్టర్లు నగేష్, శ్రీనివాస్ లు తెలిపారు. అయితే లంచం తీసుకున్న ధరణి ఆపరేటర్ మానసపై తదుపరి విచారణ చేస్తున్నామని, ఆమెపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వెల్లడించారు. 

ఇటీవలే ఏపీలో 8 సార్లు కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా 20 లక్షల లంచం అడగిన ఏమ్మార్వో..

అనంతపురం జిల్లా డి.హీరేహాల్లో 40 ఎకరాల భూమిని పట్టా చేయడానికి ఏకంగా రూ. 25 లక్షల రూపాయలు లంచం అడుగుతున్నాడని బాధితుడు చెబుతున్నారు. ఎమ్మార్వో ఇలా రూ. 25 లక్షలు లంచం అడుగుతున్నారని బాధితుడు కలెక్టర్ వద్దకు వెళ్లి తన గోడు వెళ్లబోసుకున్నాడు. స్పందించిన కలెక్టర్.. భూమికి పట్టా చేసివ్వాలని సదరు ఎమ్మార్వోకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ చెప్పిన తర్వాత పని కాకుండా ఉంటుందా అని బాధితుడు సంతోషపడ్డాడు. కలెక్టర్ చెబితే చేయాలా.. రూ. 25 లక్షలు ముట్టిన తర్వాతే పనిచేస్తానని భీష్మించుకు కూర్చున్నాడు ఆ ఎమ్మార్వో. భూమికి పట్టా చేసేది లేదు.. ముందు రూ. 25 లక్షలు కట్టు తర్వాతే పని చేస్తానని తెగేసి చెప్పాడని బాధితుడు తెలిపారు. ఎమ్మార్వో తీరుతో విసిగిపోయిన ఆ బాధితుడు మరోసారి కలెక్టర్ దగ్గరకు వెళ్లి తన ఆవేదన తెలిపాడు.

8 సార్లు కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన బాధితుడు.. 

ఈ సారి కూడా కలెక్టర్ సేమ్ టు సేమ్ ఆదేశాలు ఇచ్చారు. భూమిని పట్టా చేయాలని ఆదేశించారు. చెప్పగానే మారిపోతే తను ఎమ్మార్వో ఎలా అవుతాడు, అది రెవెన్యూ విభాగం ఎందుకు అవుతుంది. కలెక్టర్ రెండో సారి చెప్పినా.. ఎమ్మార్వో కాసింత అయినా దిగి రాలేదు. ఇక లాభం లేదనుకుని మరో సారి కలెక్టర్ వద్దకు వెళ్లాడు బాధితుడు. కలెక్టర్ వద్దకు వెళ్లి కలవడం అంటే మాటలు కాదు. ఆయన అపాయింట్ మెంట్ కావాలంటే ఒక్కోసారి కొన్ని రోజులు ఆగాల్సి ఉంటుంది. వారి వీరి కాళ్ల మీద పడితే కానీ కొందరికి కలెక్టర్ అపాయింట్మెంట్ దొరకదు. బాధితుడు కలెక్టర్ వద్దకు వెళ్లిన ప్రతి సారీ ఇదంతా దాటుతూ కలెక్టర్ ను కలిసి తన బాధను వెళ్లగక్కేవాడు. అలా ఇప్పటికి 8 సార్లు కలెక్టర్ వద్దకు వెళ్లాడు. అయినా ఎమ్మార్వో మాత్రం తన భూమికి పట్టా చేసి ఇవ్వడం లేదని చెబుతున్నాడు బాధితుడు స్థిరాస్తి వ్యాపారి అయిన వెంకటరమణ.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నేడు శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ జగన్‌ పర్యటన-సీదిరి అప్పలరాజుతో ములాఖత్‌
నేడు శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ జగన్‌ పర్యటన-సీదిరి అప్పలరాజుతో ములాఖత్‌
Adilabad Rains News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Pallaburusu Teaser Review : టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
Ramayana Trailer Review : రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
US Iran War: ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
Adilabad Rains News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Commonwealth Games 2026: CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
Embed widget