అన్వేషించండి

Nizamabad News: దూకుడు పెంచిన నిజామాబాద్‌ జిల్లా బీజేపీ లీడర్లు- కేంద్ర ప్రభుత్వ సంక్షేమాలపై స్పెషల్ ఫోకస్

నిజామాబాద్ జిల్లాలో దూకుడు పెంచారు బీజేపీ నేతలు. రాష్ట్ర, కేంద్ర నాయకులతో ఉమ్మడి జిల్లాల్లో సభలు నిర్వహించి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో బీజేపీ తమ సత్తా చాటేందుకు సిద్ధమైంది. అవకాశం ఉన్న చోటల్లా తమ గళం విప్పుతున్నారు బీజేపీ నాయకులు. పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. కమలం పార్టీ ప్రధాన నాయకులు కార్యకర్తల్లో జోష్ నింపేలా కామెంట్స్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పథకాల్లో కేంద్రం వాటా ఎంత అనేది ప్రజలకు స్పష్టంగా తెలుపుతున్నారు.

నిజామాబాద్ జిల్లా బీజేపీ నాయకత్వం పార్టీని బలోపేతం దిశగా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి నరేంధ్రనాథ్ పాండే రప్పించిన జిల్లా ఎంపీ అరవింద్ ఆయన్ని రెండ్రోజుల పాటు జిల్లాలోనే ఉంచి ప్రజలతో మాట్లాడించారు. ఆర్మూర్‌లోని పెర్కిట్‌లో సభ ఏర్పాటు చేయించి కేంద్రప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు వివరించేలా చేశారు.

జిల్లా నాయకత్వం సైతం సభల్లో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధుల అంశాన్ని ఎక్కువగా లేవనెత్తున్నారు. కేంద్రమంత్రి నరేంధ్రనాథ్ పాండే జిల్లాలో రెండు రోజులు మకాం వేసి జిల్లాలో పార్టీ పరిస్థితిని తెలుసుకున్నట్లు సమాచారం. పార్టీ బలోపేతం కోసం జిల్లాలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రస్తావించినట్లు సమాచారం. జిల్లాలోని ముఖ్యనాయకులంతా కేంద్రమంత్రిని కలిసి తమ తమ నియోజకవర్గాల్లోని పరిస్థితిని వివరించినట్లు తెలుస్తోంది. పార్టీని ప్రజల్లోకి మరింత ముందుకు తీసుకెళ్లేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపైనా సూచనలు చేసినట్లు సమాచారం.

దూకుడు పెంచిన బీజేపీ జిల్లా నాయకత్వం

కేంద్రమంత్రి నరేంధ్రనాథ్ పాండే వెళ్లిన మరుసటి రోజే కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం బీర్కూర్ లో బీజేపీ నాయకులు బహిరంగ సభను ఏర్పాటు చేశారు. జిల్లా ఆధ్యక్షురాలు అరుణతార ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఇందులో బాన్సువాడ ఇంఛార్జ్ మల్యాద్రి రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకత్వంలోని పలువురు నేతలు హాజరయ్యారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నేతలు బాన్సువాడ నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిని ఎండగట్టారు. అధికార పార్టీ నేతలు సాగిస్తున్న దందాలను ఎండగట్టారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అవశ్యకతపై ప్రజలకు వివరించే ప్రయత్నం చేసారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాల్లో కేంద్ర ఇస్తున్న వాటా ఎంతో వివరించారు. పేద ప్రజలకు బీజేపీ చేస్తున్న మేలును వివరించారు. స్థానిక నాయకులు అధికార పార్టీ నేతలపై స్వరం పెంచారు. కార్యకర్తల్లో జోష్ వచ్చేలా ప్రసంగాలు సాగాయి. గతానికి భిన్నంగా బీజేపీ నాయకులు దూకుడుగా ప్రజలను, కార్యకర్తలను అట్రాక్ట్ చేసే విధంగా స్పీచ్ లు ఇస్తున్నారు. 

ఆకట్టుకున్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్  స్పీచ్

బీర్కూర్ బహిరంగ సభ ద్వారా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తమ గళం వినిపించారు. తాను టీఆర్ఎస్ పార్టీలో ఉన్న సమయంలో జరిగిన అనుభవాలను ప్రజలకు తెలిపారు. సీఎం కేసీఆర్ వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు ఏ మాత్రం విలువ ఉండదని ఆయన ఓ రాజులాగా ఫీల్ అవుతారంటూ ప్రసంగం మొదలు పెట్టి సామాన్య ప్రజానికానికి అర్ధమయ్యే విధంగా ప్రభుత్వ తీరును ఎండగట్టే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాల వెనుక దాగి ఉన్న నిజాలివే అంటూ ప్రజలకు వివరించారు. వ్యక్తుల పరంగా దూషణలకు పోకుండా బీజేపీ పార్టీ కేంద్రంలో సాగిస్తున్న పాలన గురించి చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకొచ్చారు. ఈటెల స్పీచ్ ను ప్రజలు, కార్యకర్తలు ఆసక్తిగా విన్నారు.

వరుసగా జిల్లా బీజేపీ కీలక నేతలు ప్రజల్లోకి వెళుతూ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన అరవింద్ ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలను గెలుచుకంటామన్న ధీమాను వ్యక్తం చేస్తూ... నియోజకవర్గాల్లోని బీజేపీ నాయకులను యాక్టివ్ చేస్తున్నారు. పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రణాళిక బద్దంగా ముందుకెళ్తున్నారని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. పార్టీ సీనియర్, జూనియర్ నాయకులను కలుపుకుని పోతూ... కార్యక్రమాలను రూపకల్పన చేస్తున్నారని... దీంతో సెకండ్ క్యాడర్, కార్యకర్తల్లో పార్టీ నాయకత్వంపై నమ్మకం పెరుగుతోందని లోకల్‌గా టాక్ వినిపిస్తోంది. బీజేపీ జిల్లా నాయకులు దూకుడు చూస్తుంటే ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధమే అన్నట్లు సంకేతాలిస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Suravaram Sudhakar Reddy Passes Away: సీపీఐ కురువృద్ధుడు సుర‌వరం సుధాక‌ర్ రెడ్డి క‌న్నుమూత‌.. రెండుసార్లు ఎంపీగా సేవ‌లు.. జాతీయ స్థాయి నేతల సంతాపం
సీపీఐ కురువృద్ధుడు సుర‌వరం సుధాక‌ర్ రెడ్డి క‌న్నుమూత‌.. రెండుసార్లు ఎంపీగా సేవ‌లు.. జాతీయ స్థాయి నేతల సంతాపం
Kumuram Bheem Asifabad Latest News:సిర్పూర్ ఎమ్మెల్యే దీక్ష విరమణ- నిమ్మరసం తాగించి విరమించిన బీజేపీ ఎమ్మెల్యేలు
సిర్పూర్ ఎమ్మెల్యే దీక్ష విరమణ- నిమ్మరసం తాగించి విరమించిన బీజేపీ ఎమ్మెల్యేలు
Narayana Swamy no arrest: మాజీ మంత్రి నారాయణ స్వామికి తప్పిన అరెస్ట్ ముప్పు - 6  గంటల పాటు ప్రశ్నించిన సిట్
మాజీ మంత్రి నారాయణ స్వామికి తప్పిన అరెస్ట్ ముప్పు - 6 గంటల పాటు ప్రశ్నించిన సిట్
Nara Lokesh:  ప్రతిఏటా డిఎస్సీ - స్కూళ్ల అభివృద్ధికి దత్తత ఆలోచన - లోకేష్ కీలక నిర్ణయాలు
ప్రతిఏటా డిఎస్సీ - స్కూళ్ల అభివృద్ధికి దత్తత ఆలోచన - లోకేష్ కీలక నిర్ణయాలు
Advertisement

వీడియోలు

Kukatpally Sahasra Child Murder Case | కూకట్ పల్లి బాలిక హత్య కేసులో నిందితుడి అరెస్ట్ | ABP Desam
Mana Shankar Varaprasad Garu Glimpse Review | మెగా 157 టైటిల్ గ్లింప్స్ రిలీజ్ | ABP Desam
Shreyas Iyer Father on Asia Cup Team | ఆసియ కప్ సెలక్షన్ పై స్పందించిన శ్రేయస్ తండ్రి
Shreyas Iyer Re - Entry In Cricket Team | శ్రేయస్ అయ్యర్ రీ ఎంట్రీకి ఎదురు చూపులు తప్పవా ?
What is Bronco Test ? | బ్రాంకో టెస్ట్ అంటే ఏంటి ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Suravaram Sudhakar Reddy Passes Away: సీపీఐ కురువృద్ధుడు సుర‌వరం సుధాక‌ర్ రెడ్డి క‌న్నుమూత‌.. రెండుసార్లు ఎంపీగా సేవ‌లు.. జాతీయ స్థాయి నేతల సంతాపం
సీపీఐ కురువృద్ధుడు సుర‌వరం సుధాక‌ర్ రెడ్డి క‌న్నుమూత‌.. రెండుసార్లు ఎంపీగా సేవ‌లు.. జాతీయ స్థాయి నేతల సంతాపం
Kumuram Bheem Asifabad Latest News:సిర్పూర్ ఎమ్మెల్యే దీక్ష విరమణ- నిమ్మరసం తాగించి విరమించిన బీజేపీ ఎమ్మెల్యేలు
సిర్పూర్ ఎమ్మెల్యే దీక్ష విరమణ- నిమ్మరసం తాగించి విరమించిన బీజేపీ ఎమ్మెల్యేలు
Narayana Swamy no arrest: మాజీ మంత్రి నారాయణ స్వామికి తప్పిన అరెస్ట్ ముప్పు - 6  గంటల పాటు ప్రశ్నించిన సిట్
మాజీ మంత్రి నారాయణ స్వామికి తప్పిన అరెస్ట్ ముప్పు - 6 గంటల పాటు ప్రశ్నించిన సిట్
Nara Lokesh:  ప్రతిఏటా డిఎస్సీ - స్కూళ్ల అభివృద్ధికి దత్తత ఆలోచన - లోకేష్ కీలక నిర్ణయాలు
ప్రతిఏటా డిఎస్సీ - స్కూళ్ల అభివృద్ధికి దత్తత ఆలోచన - లోకేష్ కీలక నిర్ణయాలు
Ganesh Chaturthi 2025: హైదరాబాద్‌లో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ- మీ ప్రాంతంలో ఎక్కడ ఇస్తారో తెలుసుకోండి!
హైదరాబాద్‌లో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ- మీ ప్రాంతంలో ఎక్కడ ఇస్తారో తెలుసుకోండి!
Chiru Bobby2: ఇది కదా అసలైన మాస్ పంచ్ - బాబీ చిరు న్యూ మూవీ కాన్సెప్ట్ వేరే లెవల్
ఇది కదా అసలైన మాస్ పంచ్ - బాబీ చిరు న్యూ మూవీ కాన్సెప్ట్ వేరే లెవల్
YS Jagan Congress: కాంగ్రెస్ అధ్యక్షుడితో వైసీపీ ఎంపీ భేటీ - జగన్ డబుల్ గేమ్ ఆడుతున్నారా ?
కాంగ్రెస్ అధ్యక్షుడితో వైసీపీ ఎంపీ భేటీ - జగన్ డబుల్ గేమ్ ఆడుతున్నారా ?
Kukatpalli Sahasra Murder Case: కూకట్‌పల్లి బాలికను హత్య చేసిందిపక్కింటి పిల్లోడే -  కానీ ఎన్నో అనుమానాలు
కూకట్‌పల్లి బాలికను హత్య చేసిందిపక్కింటి పిల్లోడే - కానీ ఎన్నో అనుమానాలు
Embed widget