అన్వేషించండి

Nizamabad News: నిజామాబాద్ జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలు, తీర్పులిస్తున్న పెదరాయుళ్లు!

Nizamabad News: నిజామాబాద్ జిల్లాలో నేటికీ పెదరాయుళ్ల తీర్పులు కొనసాగుతున్నాయి. మాట వినకుంటే కుల బహిష్కరణలు, సామాజిక, గ్రామ బహిష్కరణలు చేస్తూ తెగ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. 

Nizamabad News: ఒకప్పుడు రాజులు.. ఆ తర్వాత గ్రామంలోని పెద్ద కులస్తులు, ఆ తర్వాత వీడీసీలు.. ఇలా ఒకరు పోతే ఒకరు వస్తూ గ్రామ ప్రజలకు తీర్పులిస్తున్నారు. చెప్పినట్టు వినకపోతే కుల బహిష్కరణలు, సామాజిక బహిష్కరణ, గ్రామ బహిష్కరణలు చేస్తూ తమ ఇష్టారీతిగా ప్రవర్తిస్తున్నారు. ప్రజలు కూడా ఊళ్లో ఎవరూ మాట్లాడరనే ఉద్దేశంతో వారు చెప్పినట్లుగా చేయడం, జరిమానాలు కట్టడం వంటివి చేస్తున్నారు. ఇంతటి సాంకేతిక యుగంలోనూ... న్యాయాలు, చట్టాలను కాదని తాము చెప్పిందే వేదమని రెచ్చిపోతున్నాయ్ గ్రామాభివృద్ధి కమిటీలు. ఒకప్పుడు గ్రామాభివృద్ధి కోసం వి.డి.సి(విలేజ్ డెవలప్ మెంట్ కమిటీ)లు ఏర్పడ్డాయి. నాడు మంచి ఉద్దేశంతో ఏర్పడ్డ కమిటీలు రాను రాను రాచరికపు పోకడలకు పోతున్నాయి. న్యాయ వ్యవస్థలు, చట్టాలను కాదని వారు ఇచ్చిన తీర్పే వేదమని శాసిస్తున్నారు. 

200 మంది బీడీ కార్మికుల ఉపాధికి అడ్డుకట్ట వేసిన వి.డి.సి

నిజామాబాద్ జిల్లా బాల్కొండ, ఆర్మూర్ నియోజక వర్గాల్లో వీడీసీల ఆగడాలు ఎక్కువ అయ్యాయి. కమ్మర్ పల్లి మండలం అసకొత్తూర్‌లో గ్రామాభివృద్ధి కమిటీ 200 మంది బీడీ కార్మికుల ఉపాధికి గండి కొట్టింది. గ్రామంలో బీడీలు చుట్టొద్దని ఆంక్షలు విధించింది. వారికి గ్రామంలోని బ్యాంకులో లావాదేవీలు నడపకూడదని, బీడీ కమిషన్ దారులు గ్రామంలో బీడీలు కొనవద్దని, బీడీ ఆకులు, తంబాకు అమ్మకూడదని గ్రామాభివృద్ధి కమిటీ హుకుం జారీ చేసింది. అలా చేసిన వారికి 10 వేల రూపాయలు జరిమానా విధించింది. దీంతో గ్రామంలోని 200 మందికి పైగా బీడీ కార్మికులు ఉపాధి కోల్పోయారు. బీడీలు చుట్టి తమ పిల్లలను చదివిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారికి జీవనం లేకుండా వీడీసీ అన్యాయం చేస్తోందని బీడీ కార్మికులు మండిపడుతున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని బీడీ కార్మికులు పోలీసులను ఆశ్రయించారు. వామపక్షాలు వారికి మద్దతుగా నిలిచాయి. 

81 మంది గౌడ కులస్తుల గ్రామ బహిష్కరణ

జక్రాన్ పల్లి మండల కేంద్రంలో 81 మంది గౌడ కులస్తులను గ్రామాభివృద్ధి కమిటీ సాంఘిక బహిష్కరణ చేసింది. గ్రామాభివృద్ధి కమిటీ అడిగినంత డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసింది. గౌడ కులస్తులు అంత డబ్బు ఇవ్వటం కుదరదని చెప్పటంతో వారి కుల వృత్తిపై ఆంక్షలు విధించింది. గత 10 రోజులుగా వారు వృత్తికి దూరంగా ఉంటున్నారు. వారికి గ్రామంలో ఎలాంటి సహకారం అందించవద్దని వీడీసీ తీర్పు చెప్పింది. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకుండా ఆంక్షలు విధించింది. దీంతో గౌడ కులస్తులు న్యాయ పోరాటానికి దిగారు. వీడీసీల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. ఇలా కొన్నేళ్ల నుంచి బాల్కొండ, ఆర్ముర్ నియోజక వర్గాల్లో గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలు శృతి మించి పోతున్నాయి. రాజకీయ నాయకులు సైతం వీరికి భయపడాల్సి వస్తోంది. గ్రామంలో సర్పంచ్, ఎంపీటీసీలు, పోలీసులు ఉన్నా.... వీడీసీ చెప్పిందే వేదంగా మారింది. ఇకనైనా ఇలాంటి రాచరిక ధోరణికి అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు ఆయా గ్రామాల ప్రజలు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
The Raja Saab Live Updates: 'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్

వీడియోలు

Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam
WPL 2026 Mumbai Indians | ముంబై ఇండియన్స్ లో కీలక మార్పులు | ABP Desam
India vs South Africa Vaibhav Suryavanshi | మూడో వన్డేలో 233 పరుగుల తేడాతో విజయం
Shreyas Iyer Fitness Update Ind vs NZ | టీమ్ ఇండియాకు గుడ్‌న్యూస్!
Robin Uthappa about Team India | ఉత‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
The Raja Saab Live Updates: 'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Seethakka Surekha meets KCR: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
Jagan: రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
Geetu Mohandas: ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్
ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... ఫిమేల్ డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్!
Cheekatilo OTT Release Date: ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget