అన్వేషించండి

నిజామాబాద్ జిల్లాపై ఓవైసీ గురి- రెండు చోట్ల పోటీ చేసే ఆలోచన!

నిజామాబాద్ జిల్లాపై ఒవైసీ కన్ను వేసినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల బరిలో దిగాలని ఎంఐఎం ప్లాన్లు వేస్తోంది. ఇప్పటికే నియోజకవర్గాలు కూడా ఫైనల్ అయినట్టు సమాచారం.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా జిల్లాల్లో కూడా బరిలోకి దిగేందుకు రెడీ అవుతోంది మజ్లీస్‌ పార్టీ. తెలంగాణలో డే బై డే ఛేంజ్ అవుతున్న పాలిటిక్స్ కి అనుగుణంగా మజ్లిస్ పార్టీ ఫ్యూచర్ పై దృష్టి సారించింది. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను బేరీజు వేసుకుంటూ... ఇతర జిల్లాల్లో మైనార్టీలు ప్రభావితం చూపే స్థానాల్లో పోటీ చేసేందుకు ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో వచ్చే 2023 ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి ఎఐఎంఐఎం పోటీ చేసేందుకు డిసైడ్ అయ్యింది. దీనిపై ఇటీవలే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రకటన చేశారు. దీంతో నిజామాబాద్ జిల్లాలో ఎంఐఎం శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయ్. పార్టీ యాక్టివిటీస్ పెంచుతున్నాయ్.

అసదుద్దీన్ ప్రకటనతో నిజామాబాద్ అర్బన్, బోధన్ నియోజకవర్గాల్లోని ఎంఐఎం నాయకులు ఒక్కతాటిపైకి వస్తున్నారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటనతో జిల్లాలోని అర్బన్, బోధన్ నియోజకవర్గం పావులు కదుపుతున్నారు. నిజామాబాద్ అర్బన్ నుంచి 2014 ఎన్నికల్లో ఎంఐఎం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీర్ మజాజ్ అలీ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా ఉన్నప్పటికీ ఎంఐఎం క్యాండిడేట్ ఎలాంటి ప్రచారం చేయకుండానే రెండో స్థానంలో నిలిచారు. బీజేపీ, కాంగ్రెస్ ను వెనక్కి నెట్టారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బిగాల గణేష్ గుప్తా 42 వేల 148 ఓట్లతో గెలిచారు. అంటే 31.15 శాతం ఓట్లు వచ్చాయ్. ఎంఐఎం అభ్యర్థి మీర్ మజాజ్ అలీ సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు. అతనికి 31 వేల 840 ఓట్లు అంటే 23.53 శాతం ఓట్లు వచ్చాయ్. ఒక్కసారిగా అర్బన్ పోలిటికల్ స్ట్రీట్‌లో ఈ అనూహ్య మార్పు ఆశ్చర్యానికి గురిచేసింది.

నిజామాబాద్ కార్పోరేషన్‌లో మొత్తం 60 డివిజన్లు ఉంటాయ్. ఇందులో గత కార్పోరేషన్ ఎన్నికల్లో 16 డివిజన్ల నుంచి కార్పోరేటర్లుగా ఎంఐఎం నుంచి గెలిచారు. నిజామాబాద్ అర్బన్‌లో ముస్లిం మైనార్టీల ఓట్లు ఎక్కువగా ఉంటాయ్. ఎమ్మెల్యేగా ఎవరు గెలవాలన్నా వీరి మద్దతు తప్పని సరి అవుతుంది. ముస్లిం ఓటర్లు, మున్నూరు కాపు ఓట్లు ఏ పార్టీకి పడితే ఆ పార్టీ విన్ అవుతుంది. అయితే వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ మున్నూరు కాపు సామాజిక వర్గానికి కలుపుకొని పోవాలన్న ఆలోచనలో ఒవైసీ ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే మున్నూరు కాపు సామాజికవర్గానికి ఎంఐఎం తరఫున అభ్యర్థిని బరిలో దింపేందుకు సైతం మజ్లిస్ పార్టీ పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే సీనియర్ జర్నలిస్టు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన బొబ్బిలి నర్సయ్య కూడా ఎంఐఎం టికెట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. డీఎస్ పెద్ద కొడుకు ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారు. కానీ ఆ పార్టీ నాయకులు కొందరు విభేదిస్తుండటంతో ఇంకా క్లారిటీ రాలేదు. కాంగ్రెస్ నుంచి కాకుంటే ఎంఐఎం నుంచైనా సంజయ్ బరిలో దిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ఇక బోధన్ నియోజకవర్గంలోనూ ముస్లిం మైనార్టీల ఓట్లు మెజార్టీగా ఉంటాయ్. బోధన్ పట్టణంలో గత మున్సిపల్ ఎన్నికల్లో 11 మంది ఎంఐఎం నుంచి కౌన్సిలర్లు గెలిచారు. మొత్తం 38 వార్డులుంటాయ్. బోధన్ నియోజకవర్గంలో మైనార్టీ ఓట్లు ఎటు పడితే ఆ అభ్యర్థి విజయం ఖాయంగా ఉంటుంది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ వారు టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేశారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా మజ్లిస్ పార్టీ తమ స్టాండ్ మార్చుకుంటోంది. తెలంగాణలో బీజేపీ కూడా పుంజుకుంటోంది. ఈ పరిస్థితుల్లో ఎంఐఎం ముస్లింలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపై కన్నేసింది. బోధన్ నియోజకవర్గం నుంచి గతంలో ఎంఐఎం తరఫున ఎవరూ పోటీ చేయలేదు. ఈ సారి ఒవైసీ అక్కడి నుంచి ఎంఐఎం అభ్యర్థిని పోటీలో ఉంచేందుకు డిసైడ్ అయ్యారు. 

ఒవైసీ నిజామాబాద్ అర్బన్, బోధన్ నియోజకవర్గాల్లో రాజకీయాలు రసవత్తరంగా మారబోతున్నాయ్. ఈ రెండు నియోజకవర్గాల్లో మిగతా ప్రధాన పార్టీలు ఓట్లను చీల్చుకుంటే మాత్రం ఎంఐఎం అభ్యర్థులు గెలిచే అవకాశం ఉండటంతో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

Asifabad News: భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Breaking News: ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
Bandi Sanjay vs Etala Rajender: తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం! బండి, ఈటల మధ్య సయోధ్య చర్చలు! లక్ష్మణ్‌ ఇంట్లో భేటీ!
తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం! బండి, ఈటల మధ్య సయోధ్య చర్చలు! లక్ష్మణ్‌ ఇంట్లో భేటీ!
BRS Yuva Sangrama Sadassu: బీఆర్‌ఎస్ యువ సంగ్రామ సదస్సుకు భారీగా తరలి వస్తున్న నేతలు! కీలక నేతల అరెస్టుతో టెన్షన్‌!
బీఆర్‌ఎస్ యువ సంగ్రామ సదస్సుకు భారీగా తరలి వస్తున్న నేతలు! కీలక నేతల అరెస్టుతో టెన్షన్‌!

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lenin Collections : లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
Hyderabad CURE Housing Scheme: హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
Tirumala Sarva Darshan Re Entry Facility: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
Double Murder Case : జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
Embed widget