అన్వేషించండి

Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు

Tigers in Telangana | గత ఏడాది పులులు సంచరించి ఆవులు, ఇతర జంతువులపై దాడిచేసి చంపాయి. తాజాగా మూడు పులులు తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో సంచరించడం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది.

Tigers Spotted in Adilabad District | ఆదిలాబాద్: మూడు పులుల సంచారం అటు తెలంగాణ ప్రజలతో పాటు ఇటు మహారాష్ట్ర వాసులను వణికిస్తోంది. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో పులులు సంచరిస్తున్న చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్అవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని పెన్ గంగానది పరిసర ప్రాంతాల్లో మూడు పులులు కనిపించాయి. తెలంగాణ సరిహద్దుకు కూతవేటు దూరంలో ఉన్న మహారాష్ట్ర సరిహద్దులోని రాంనగర్- సావర్గాం మార్గంలో మూడు పులులు ఓ ద్విచక్ర వాహనదారుడికి కనిపించాయి. పులుల సంచార చిత్రాలను తన సెల్ ఫోన్ లో ఫొటోలు తీసి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడంతో మొత్తం సోషల్ మీడియాలో అవి వైరల్ గా మారాయి. 

అటు నుంచి ఇటు పులుల వలసలు..

మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం పెన్ గంగానది సరిహద్దులో తెలంగాణలోని ఆయా గ్రామాలకు అతి సమీపంలో ఉండటంతో తరచూ పులులు కనిపించడం... చలికాలంలో.. వేసవిలో పెన్ గంగానది దాటి భీంపూర్ మండల వైపు సంచరించడం సర్వసాధారణంగా మారింది. గత రెండేళ్లుగా పులులు వస్తూ.. పోతూనే ఉన్నాయి. రెండేళ్ల కిందట నాలుగు పులులు.. ఓ తల్లి, దాని మూడు పిల్లలు భీంపూర్ మండలంలోని తాంసి(కే) గొల్లఘాట్, పిప్పల్ కోటి శివారులో సంచరించి ఆవాసం ఏర్పర్చుకున్నాయి. అప్పుడు పదుల సంఖ్యలో పశువులపై దాడులు చేసి హతమార్చాయి. మూడు నెలల తరువాత అవీ మళ్లీ యధావిధిగా తిప్పేశ్వర్ అభయారణ్యానికి వెళ్లిపోయాయి. 

గత ఏడాది పశువులను చంపిన పులులు

గత ఏడాది సైతం రెండు పులులు అలాగే సంచరించి పలు పశువులను హతమర్చాయి. మళ్లీ యధావిధిగా అవి తిప్పేశ్వర్ అభయారణ్యానికి వెళ్ళిపోయాయి. భీంపూర్ మండలంలోని తాంసి (కే) గొల్లఘాట్ తర్వాత తెలంగాణ సరిహద్దులోని గ్రామాలకు పెన్ గంగానదిని ఆనుకునే తిప్పేశ్వర్ అభయారణ్యం ఉండడంతో పులుల రాక సర్వసాధారణమే అవుతోంది. వాటికి ఇక్కడ ఏపుగా ఎత్తైన మహావీర మొక్కల మధ్య మంచి ఆవాసం ఉంటుంది. చలికాలంలో ఆడ,మగ పులులు కలయిక కోసం వెతుక్కుంటూ సైతం ఈ ప్రాంతానికి వస్తుంటాయి. రెండేళ్ల క్రితం ఓ తల్లి మూడు పిల్లలు మొత్తం నాలుగు పులులు భీంపూర్ మండల శివారులోకి వచ్చి ఈ ప్రాంతంలో ఏపుగా ఎత్తుగా ఉన్న మహావీర మొక్కల మద్య ఆవాసం ఏర్పరచుకొని, పులి పిల్లలకు తల్లి పులి వేటాడడం నేర్పించి తిరిగి అవి యధావిధిగా తిప్పేశ్వర్ అభయారణ్యానికి వెళ్లిపోయాయి. ఈ ప్రాంతము అంతా బఫర్ జోన్ ఏరియాలో ఉంది. ఇక్కడ దట్టమైన అటవీ అంతగా ఏమీ లేదు, కానీ.. పెన్ గంగానది సరిహద్దులో ఉండడం వల్ల వాటికి ఏపుగా పెరిగే మహావీర మొక్కలు ఈ బఫర్ జోన్ లో ఉండడం వల్ల ఇక్కడికి వాటి రాక తరచు కొనసాగుతూనే ఉంది. 

ప్రస్తుతానికి వాట్సాప్ లో వైరల్ అవుతున్న ఈ పులుల ఫోటోలను చూసి సరిహద్దు గ్రామాల ప్రజలు, వ్యవసాయ పనులకు వెళ్లే కూలీలు, రైతులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు మాత్రం ఇంకా తెలంగాణ ప్రాంతంలోకి పులులు సంచరించలేదని, అవి పెన్ గంగానది అవతలి వైపే ఉన్నాయని, ఎంతకైనా సరే సరిహద్దు గ్రామాల్లోని ప్రజలు, వ్యవసాయ పనులకు వెళ్లే కూలీలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సైతం సూచిస్తున్నారు. 
Also Read: Ganesh Festival 2024: ఉత్సాహంగా ముగిసిన గణేష్‌ వేడుకలు- ఈసారి లడ్డూలకు భారీ డిమాండ్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget