అన్వేషించండి

Adilabad News: జైనథ్ మండలం వాసులకు శుభవార్త, తర్నం బ్రిడ్జి వద్ద తాత్కాలిక రోడ్డు ప్రారంభం

Tarnam Bridge in Adilabad | ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండంలోని తర్నం బ్రిడ్జి వర్షాలకు కొట్టుకుపోయింది. అక్కడ తాత్కాలిక రోడ్డు పనులు పూర్తయినట్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు.

Tarnam Bridge Diversion Road in Adilabad | జైనథ్: తర్నం బ్రిడ్జ్ కృంగిపోవడంతో గత నాలుగైదు నెలల నుంచి ప్రజలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని తర్నం బ్రిడ్జ్ వద్ద తాత్కాలికంగా నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే సోమవారం (అక్టోబర్ 14న) పరిశీలించారు. రోడ్డు నిర్మాణం సంబంధించిన పలు విషయాలపై అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా BJP ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. తర్నం బ్రిడ్జి వద్ద రూ.4.5 కోట్లతో నిర్మిస్తున్న డైవర్షన్ రోడ్డు నిర్మాణ పనులు మరో రెండు నెలలు అయ్యే అవకాశం ఉందన్నారు. అయితే ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చూసేందుకు తాత్కాలికంగా రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు ఆయన తెలిపారు. 

ప్రస్తుతం ఉన్న బ్రిడ్జిను కూలగొట్టేసి అక్కడ కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారని తెలిపారు. అలాగే బోరాజ్ నుంచి మహారాష్ట్ర వరకు రోడ్డు నిర్మాణ పనులు జూన్, జూలై నెలలో పూర్తి చేయాలని ప్రణాళిక ప్రకారం పోతున్నామని అన్నారు. తాత్కాలికంగా తర్నం రోడ్డు పై నాలుగైదు రోజులో ప్రయాణాలు సాగించవచ్చన్నారు. ప్రభుత్వం కేటాయించిన నిధులు ఖర్చు చేసి ప్రజల అసౌకర్యాన్ని దూరం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట అధికారులు, బిజెపి నాయకులు తదితరులు ఉన్నారు.

Adilabad News: జైనథ్ మండలం వాసులకు శుభవార్త, తర్నం బ్రిడ్జి వద్ద తాత్కాలిక రోడ్డు ప్రారంభం

భారీ వర్షాలకు కొట్టుకుపోయిన తర్నం బ్రిడ్జి

ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని తర్నం బ్రిడ్జి భారీ వర్షాలతో కొట్టుకుపోయింది. అక్కడ అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోవడంతో తర్నం బ్రిడ్జి నుంచి జైనథ్, బేల, మీదుగా రాకపోకలకు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు మహారాష్ట్ర వైపు వెళ్తున్న ప్రయాణికులకు దారి మూసుకుపోయినట్లు అయిందని తెలిసిందే. దీనిపై స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ కొన్ని రోజుల నుంచి శ్రమిస్తున్నారు. 

ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల శంకర్ తర్నం బ్రిడ్జి కోసం జాతీయ రహదారి అధికారులకు ప్రతిపాదనలు పంపారు. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం తర్నం బ్రిడ్జి సమీపంలో డైవర్షన్ రోడ్డు నిర్మాణానికి రూ.4.5 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఈ విషయాన్ని  ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కొన్ని రోజుల కిందట తెలిపారు. రెండు వారాల కిందట అధికారులు, ఇంజనీర్లతో కలిసి తర్ణం బ్రిడ్జి సమీప పరిసర ప్రాంతాలను బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పరిశీలించారు.

త్వరలోనే కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం

తర్నం బ్రిడ్జి వద్ద పనులను ఎమ్మెల్యే పాయల్ శంకర్ కొన్నిరోజుల కిందట పరిశీలించారు. సాధ్యమైనంత త్వరగా రోడ్డు నిర్మాణం పూర్తి చేసి రవాణా సౌకర్యాలు మెరుగు చేస్తామన్నారు. వీలైతే రాత్రి  పగలు కష్టపడి పనులు పూర్తి చేయాలని సైతం అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. బ్రిడ్జి సమీపంలోని తాత్కాలిక రోడ్డు నిర్మాణం చేపట్టాలని, ఆ తర్వాత డైవర్షన్ నిర్మాణం పనులను పూర్తిచేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. ప్రస్తుతం లాండా సాంగ్వి, ఆడ, అర్లీ మీదుగా వాహనాలు వెళుతుండటంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాత్కాలికంగా డైవర్షన్ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తే జైనథ్ మండలం వాసులకు రోడ్డు కష్టాలు తీరతాయని భావిస్తున్నారు. మరో ఆరు నెలల్లో వర్షాలకు కుంగిపోయిన బ్రిడ్జిని కూలగొట్టేసి కొత్త బ్రిడ్జ్ నిర్మాణం పనులు మొదలుపెడతారని పాయల్ శంకర్ చెప్పారు.

Also Read: Mogilaiah Land Issue: పద్మశ్రీ మొగులయ్యకి అండగా నిలిచిన రాచకొండ కమిషనర్, సమస్య పరిష్కరిస్తానని హామీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

SLBC Tunnel Tragedy: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కథ విషాదాంతం, 8 మంది కార్మికులు మృతి, డెడ్ బాడీస్ గుర్తించిన రెస్క్యూ టీమ్
SLBC Tunnel Tragedy: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కథ విషాదాంతం, 8 మంది కార్మికులు మృతి, డెడ్ బాడీస్ గుర్తించిన రెస్క్యూ టీమ్
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ - త్వరలోనే పనులు ప్రారంభం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ - త్వరలోనే పనులు ప్రారంభం
Andhra Pradesh Budget 2025: అమరావతికి కేటాయింపులు ఎందుకు?: పయ్యావుల ఆసక్తికర కామెంట్స్
అమరావతికి కేటాయింపులు ఎందుకు?: పయ్యావుల ఆసక్తికర కామెంట్స్
Kiara Advani Pregnant: తల్లి కాబోతున్న హీరోయిన్ కియారా... జీవితంలో గొప్ప బహుమతి అంటూ!
తల్లి కాబోతున్న హీరోయిన్ కియారా... జీవితంలో గొప్ప బహుమతి అంటూ!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pastor Ajay Babu Exclusive Interview | చర్చిల విషయంలో ప్రభుత్వానికి పాస్టర్ అజయ్ సంచలన ప్రతిపాదన | ABP DesamAfg vs Eng Match Highlights | Champions Trophy 2025 | ఐసీసీ టోర్నీల్లో పనికూనల ఫేవరెట్ ఇంగ్లండ్ | ABP DesamAFG vs ENG Match Highlights | Champions Trophy 2025 లో పెను సంచలనం | ABP DesamGV Harsha Kumar on MLC Election | ఎమ్మెల్సీ ఎన్నికల తీరుపై హర్ష కుమార్ ఫైర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
SLBC Tunnel Tragedy: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కథ విషాదాంతం, 8 మంది కార్మికులు మృతి, డెడ్ బాడీస్ గుర్తించిన రెస్క్యూ టీమ్
SLBC Tunnel Tragedy: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కథ విషాదాంతం, 8 మంది కార్మికులు మృతి, డెడ్ బాడీస్ గుర్తించిన రెస్క్యూ టీమ్
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ - త్వరలోనే పనులు ప్రారంభం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ - త్వరలోనే పనులు ప్రారంభం
Andhra Pradesh Budget 2025: అమరావతికి కేటాయింపులు ఎందుకు?: పయ్యావుల ఆసక్తికర కామెంట్స్
అమరావతికి కేటాయింపులు ఎందుకు?: పయ్యావుల ఆసక్తికర కామెంట్స్
Kiara Advani Pregnant: తల్లి కాబోతున్న హీరోయిన్ కియారా... జీవితంలో గొప్ప బహుమతి అంటూ!
తల్లి కాబోతున్న హీరోయిన్ కియారా... జీవితంలో గొప్ప బహుమతి అంటూ!
EPF Interest Rate: 7 కోట్ల మందికి నిరాశ - 2024-25 ఆర్థిక సంవత్సరానికి EPF వడ్డీ రేటు ఎంతంటే?
7 కోట్ల మందికి నిరాశ - 2024-25 ఆర్థిక సంవత్సరానికి EPF వడ్డీ రేటు ఎంతంటే?
Uttarakhand : బద్రీనాథ్‌లో విరిగిపడిన మంచు చరియలు - రిస్క్‌లో 47 మంది ప్రాణాలు
బద్రీనాథ్‌లో విరిగిపడిన మంచు చరియలు - రిస్క్‌లో 47 మంది ప్రాణాలు
Andhra Pradesh Budget 2025 Highlights: రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్ - కూటమి సర్కార్ వార్షిక బడ్జెట్ హైలైట్స్ ఇవే 
రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్ - కూటమి సర్కార్ వార్షిక బడ్జెట్ హైలైట్స్ ఇవే 
Meenakshi Natarajan: మీనాక్షి నాటరాజన్ పై తెలంగాణ కాంగ్రెస్ కోటి ఆశలు! చేయిదాటిన నేతలను దారిలోకి తెస్తారా ?
మీనాక్షి నాటరాజన్ పై తెలంగాణ కాంగ్రెస్ కోటి ఆశలు! చేయిదాటిన నేతలను దారిలోకి తెస్తారా ?
Embed widget