అన్వేషించండి

Adilabad News: జైనథ్ మండలం వాసులకు శుభవార్త, తర్నం బ్రిడ్జి వద్ద తాత్కాలిక రోడ్డు ప్రారంభం

Tarnam Bridge in Adilabad | ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండంలోని తర్నం బ్రిడ్జి వర్షాలకు కొట్టుకుపోయింది. అక్కడ తాత్కాలిక రోడ్డు పనులు పూర్తయినట్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు.

Tarnam Bridge Diversion Road in Adilabad | జైనథ్: తర్నం బ్రిడ్జ్ కృంగిపోవడంతో గత నాలుగైదు నెలల నుంచి ప్రజలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని తర్నం బ్రిడ్జ్ వద్ద తాత్కాలికంగా నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే సోమవారం (అక్టోబర్ 14న) పరిశీలించారు. రోడ్డు నిర్మాణం సంబంధించిన పలు విషయాలపై అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా BJP ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. తర్నం బ్రిడ్జి వద్ద రూ.4.5 కోట్లతో నిర్మిస్తున్న డైవర్షన్ రోడ్డు నిర్మాణ పనులు మరో రెండు నెలలు అయ్యే అవకాశం ఉందన్నారు. అయితే ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చూసేందుకు తాత్కాలికంగా రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు ఆయన తెలిపారు. 

ప్రస్తుతం ఉన్న బ్రిడ్జిను కూలగొట్టేసి అక్కడ కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారని తెలిపారు. అలాగే బోరాజ్ నుంచి మహారాష్ట్ర వరకు రోడ్డు నిర్మాణ పనులు జూన్, జూలై నెలలో పూర్తి చేయాలని ప్రణాళిక ప్రకారం పోతున్నామని అన్నారు. తాత్కాలికంగా తర్నం రోడ్డు పై నాలుగైదు రోజులో ప్రయాణాలు సాగించవచ్చన్నారు. ప్రభుత్వం కేటాయించిన నిధులు ఖర్చు చేసి ప్రజల అసౌకర్యాన్ని దూరం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట అధికారులు, బిజెపి నాయకులు తదితరులు ఉన్నారు.

Adilabad News: జైనథ్ మండలం వాసులకు శుభవార్త, తర్నం బ్రిడ్జి వద్ద తాత్కాలిక రోడ్డు ప్రారంభం

భారీ వర్షాలకు కొట్టుకుపోయిన తర్నం బ్రిడ్జి

ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని తర్నం బ్రిడ్జి భారీ వర్షాలతో కొట్టుకుపోయింది. అక్కడ అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోవడంతో తర్నం బ్రిడ్జి నుంచి జైనథ్, బేల, మీదుగా రాకపోకలకు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు మహారాష్ట్ర వైపు వెళ్తున్న ప్రయాణికులకు దారి మూసుకుపోయినట్లు అయిందని తెలిసిందే. దీనిపై స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ కొన్ని రోజుల నుంచి శ్రమిస్తున్నారు. 

ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల శంకర్ తర్నం బ్రిడ్జి కోసం జాతీయ రహదారి అధికారులకు ప్రతిపాదనలు పంపారు. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం తర్నం బ్రిడ్జి సమీపంలో డైవర్షన్ రోడ్డు నిర్మాణానికి రూ.4.5 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఈ విషయాన్ని  ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కొన్ని రోజుల కిందట తెలిపారు. రెండు వారాల కిందట అధికారులు, ఇంజనీర్లతో కలిసి తర్ణం బ్రిడ్జి సమీప పరిసర ప్రాంతాలను బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పరిశీలించారు.

త్వరలోనే కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం

తర్నం బ్రిడ్జి వద్ద పనులను ఎమ్మెల్యే పాయల్ శంకర్ కొన్నిరోజుల కిందట పరిశీలించారు. సాధ్యమైనంత త్వరగా రోడ్డు నిర్మాణం పూర్తి చేసి రవాణా సౌకర్యాలు మెరుగు చేస్తామన్నారు. వీలైతే రాత్రి  పగలు కష్టపడి పనులు పూర్తి చేయాలని సైతం అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. బ్రిడ్జి సమీపంలోని తాత్కాలిక రోడ్డు నిర్మాణం చేపట్టాలని, ఆ తర్వాత డైవర్షన్ నిర్మాణం పనులను పూర్తిచేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. ప్రస్తుతం లాండా సాంగ్వి, ఆడ, అర్లీ మీదుగా వాహనాలు వెళుతుండటంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాత్కాలికంగా డైవర్షన్ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తే జైనథ్ మండలం వాసులకు రోడ్డు కష్టాలు తీరతాయని భావిస్తున్నారు. మరో ఆరు నెలల్లో వర్షాలకు కుంగిపోయిన బ్రిడ్జిని కూలగొట్టేసి కొత్త బ్రిడ్జ్ నిర్మాణం పనులు మొదలుపెడతారని పాయల్ శంకర్ చెప్పారు.

Also Read: Mogilaiah Land Issue: పద్మశ్రీ మొగులయ్యకి అండగా నిలిచిన రాచకొండ కమిషనర్, సమస్య పరిష్కరిస్తానని హామీ

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Embed widget